Sunday, June 14, 2026
28.9 C
Hyderabad

విలీనమా? విమోచనమా? విద్రోహమా?|EDITORIAL

చెరిపేస్తే చెరిగిపోనిది, మసకేస్తే మాసిపోనిది చరిత్ర. దాన్ని ఎవరూ చెరిపేయలేరు. మసిపూసి మారేడుకాయ చేసినా, కాలం పేజీలోంచి తీసేయలేరు. ఎవరి మనోభావాలను కించపరుస్తుందనో, దెబ్బ తీస్తుందనో, మరెవరి స్వప్రయోజనాలు, ఓట్ల బ్యాంకు కోసమో తాత్కాలికంగా వక్రీకరింప చూసినా, అది నిక్కచ్చిగా నిలబడి, కచ్చితంగా నిలదీసి, నిగ్గదీస్తుంది. నాడు నిజాం నుంచి విముక్తి కోసం ప్రజలు 1946 నుంచి 1948 మధ్య వీరోచిత పోరాటం చేశారు. ఆత్మ బలిదానాలు చేశారు. దీన్ని తెలంగాణ విమోచనోద్యమంగానే పిలుస్తారు. దీన్నే ఒకరు విలీన దినంగా, మరొకరు జాతీయ సమైక్య దినోత్సవంగా, ఇప్పుడు ప్రజాపాలన దినోత్సవంగా జరుపుతున్నారు. అంతా కలిసి ఓ చారిత్రాత్మక సత్యానికి విద్రోహం చేస్తున్నారు.
స్వాతంత్రానంతరం దేశంలోని 540కి పైగా సంస్థానాలన్నీ భారత దేశంలో విలీనమైనప్పటికీ, హైదరాబాద్ స్టేట్, కశ్మీర్, జునాగఢ్ లు నిరాకరించాయి. దీంతో, జనరల్ చౌదరి నేతృత్వంలోని భారత బలగాలు ‘ఆపరేషన్ పోలో’ను 1948 సెప్టెంబర్ 13న ప్రారంభించాయి. భారత్ సైన్యం హైదరాబాద్ కు 115 కిలోమీటర్ల దూరంలోని జహీరాబాద్ కు చేరుకోవడంతో, ఇక తప్పని పరిస్థితిలో నిజాం లొంగిపోయాడు. సెప్టెంబర్ 17న, నిజాం తన రేడియో కేంద్రానికి వెళ్లి భారత యూనియన్ లో హైదరాబాద్ స్టేట్ ను విలీనం చేస్తున్నట్టు ప్రకటించాడు. సెప్టెంబర్ 18న, అధికారికంగా విలీన ప్రక్రియ పూర్తైంది.
విమోచన దినోత్సవం జరపడం అంటే ఆనాటి దాష్టీకాలను ఎండగట్టడం, త్యాగాలను సర్మించుకోవడం మాత్రమే. నాటి అరాచాకాలను గుర్తు చేసుకుంటూ, ఆనాటి ఘటనల్లో మరణించిన ప్రజలకు నివాళి అర్పించడం. ప్రపంచ చరిత్రలో పోరాటాలన్నీ నిరంకుశత్వం మీద జరిగినవే. వాటిని స్వాతంత్య్ర దినాలుగానే జరుపుకుంటున్నారు. తెలంగాణ విముక్తం కూడా ఒక స్వాతంత్య్ర దినోత్సవమే.
తెలంగాణలో రజాకార్లు చేసిన ఘాతుకాలు రక్తచరిత్రకు తార్కాణాలు. నిజాంకాలంలో భూస్వామ్యం పడగలెత్తి, గ్రామాలను దోపిడీ చేసి పీడిస్తున్నందున ప్రజలు తిరగబడ్డారు. పోరాడారు. భూములు ఆక్రమించుకుని పంచుకున్నారు, మరోవైపు నిజాంను కీలుబొమ్మ చేసుకున్న రజాకార్లు కమ్యూనిస్టులపై, కొన్ని చోట్ల కాంగ్రెస్‌ వారిపై, ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడ ఉంటే అక్కడ దౌర్జన్యాలు చేశారు. భూస్వాముల గడీల్లో ఆశ్రయం పొందుతూ వారి తరఫున దాడులు చేశారు. పెద్ద ఎత్తున రక్తపాతం జరిగింది. పరకాలలో నరమేథం మరో జలియన్ బాగ్ లాగా సాగింది. బైరాన్‌పల్లిలో ఆడవాళ్లను నగ్నంగా బతుకమ్మ ఆడించారు. ధాన్యాన్ని తరలించారు. క్రూరంగా హింసించారు. దేశ చరిత్రలో ఇంతటి దారుణాలు జరిగినా, స్వాతంత్య్ర పోరాటం కారణంగా అవన్నీ మరుగున పడిపోయాయి. మరోవైపు నిజాం, భారత, పాకిస్థాన్‌ దేశాలు రెంటితోనూ తాను కలవబోనని, స్వతంత్రంగా ఉంటానని ప్రకటించాడు. ఓ దశలో పాక్‌లో కలవడానికి కూడా సంసిద్ధత ప్రకటించాడు. భారత ప్రభుత్వంతో ఆ విషయమై చర్చలు, వాదాలు సాగుతూ ఉండగానే, మరో వైపు కమ్యూనిస్టుల పోరాటం సాగుతూ ఉన్న దశలోనే, భారత ప్రభుత్వం సైనికచర్య జరిపింది. నిజాం లొంగిపోయాడు. నిజాం లొంగుబాటు సాజావుగా సాగలేదు. ఆనాటి హోంమంత్రి వల్లభాయ్‌ పటేల్‌ సైనిక చర్య తీసుకుని ఉండకపోతే హైదారాబాద్‌ సంస్థానం చరిత్ర కశ్మీర్ లా ఉండేది.
గాంధీతో సహా కాంగ్రెస్‌ ఆనాడు ఇక్కడి ప్రజల గురించి పట్టించు కోలేదు. ఇక కమ్యూనిస్టులు చేసింది భూస్వామ్యానికి వ్యతిరేకంగా భూమికోసం విముక్తి పోరాటం మాత్రమే. అయితే రజాకార్ల దాష్టీకంపై ప్రజలు సాయుధులై సమాయత్తం అయినప్పుడు అంతా కలసి కదిలారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఏడాదికి జరిగిన విముక్తి పోరాటం కావడంతో ప్రజల్లో సహజంగానే ఆనందం వెల్లి విరిసింది. బానిస సంకెళ్లు తెగినందుకు సంతోషించారు.
అయితే ఏకు మేకై తన మాటని కూడా ఖాతరు చేయని కాసిం రజ్వీ, రజాకార్లను అణచివేయడానికి తప్పనిసరి పరిస్థితుల్లో నిజాం కూడా భారత ప్రభుత్వానికి సహకరించాడు. రజాకార్లు తీవ్రంగా వ్యతిరేకించినా హైదరాబాద్ న్యాయ సలహాదారుగా సర్ వాల్టర్ మాంక్‌టన్‌ని కొనసాగించడమే ఇందుకు నిదర్శనం. ఇక రజాకార్లలోనూ ముస్లింలతో పాటు శ్యామ్ సుందర్, బి.ఎస్.వెంకటరావు, పీసరి వీరన్న లాంటి దళిత నాయకుల ప్రభావంతో ముస్లింలుగా మారిన దళితులు, దొరలు, భూస్వాములు వారి అనుచరగణం కూడా ఉన్నారు. అయితే, ఇప్పుడు ఏ కులాన్ని, ఏ మతాన్ని, ఏ వర్గాన్ని తప్పుపడతారు? అప్పటి పరిస్థితులను బట్టి సాగిన చరిత్ర అది. అంతే! దాన్ని వక్రీకరించే అర్హత, హక్కు ఎవరికీ లేదు.
పార్టీలు, ప్రభుత్వాలు, తెలంగాణ విమోచన అనగానే ఉలిక్కిపడుతున్నారు. ఏదో పేరు పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని కూడా జరుపుకోవడానికి జంకుతున్న నేతలు ఉన్నందుకు మనం సిగ్గుపడాలి. మనిషన్నాక, పాలన అన్నాక మంచీ, చెడూ ఉంటుంది. నిజాం చేసిన మంచిని కీర్తించినట్లే, చెడును కూడా చీల్చి చెండాడాల్సిందే. ఒక్క హైదరాబాద్ నగరానికే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, హుస్సేన్ సాగర్ జలాశయాలు, యూనివర్సిటీ, హాస్పిటల్స్ ఇలా ఆయన చేసిన మంచిని ఎవరూ కాదనలేరు. ఆనాడు నిజాం నిరంకుశాలను, రజాకార్ల ఆగడాలను ఎదరించడానికి జరిగిన సాయుధ పోరాటం ముమ్మాటికి తిరుగబాటు చరిత్రే. చైనా సాంస్కృతిక, రష్యా బోల్షివిక్ పోరాటలకు ఇది ఏమాత్రం తక్కువ కాదు.
తెలంగాణకు విముక్తి జరిగిన సెప్టెంబర్‌ 17న విమోచన ఉత్సవాలు జరుపుకోవాలన్న ఆకాంక్షలను గత ప్రభుత్వాలతో పాటు, ప్రస్తుత ప్రభుత్వం కూడా విస్మరించడం ద్వారా చరిత్రను అపహాస్యం చేస్తూ వస్తున్నారు. తెలంగాణ విమోచన దినం అన్నింటికీ అతీతంగా మనమంతా కలిసి జరుపుకోవాల్సిన స్వాతంత్ర్యదినోత్సవం. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం. గర్వకారణం. చారిత్రక వాస్తవం. మన చరిత్రను మన భవిష్యత్తు తరాలకు చదువు, పాఠ్యాంశాలు, బోధనలు, పుస్తకాలు వంటి ప్రక్రియల ద్వారా అందించడం మనందరి బాధ్యత.

Latest News

అత్యధిక బ్లడ్ డోనర్ మోటివేటర్ డా. రాజేశ్వర్ రావు|INTERNATIONAL|BLOOD|DONORS

రక్తదాన సేవలకు గుర్తింపుగా గవర్నర్ సత్కారం|BLOOD DONATION|GOVERNOR హైదరాబాద్, జూన్ 14 (అడుగు న్యూస్): రక్తదానం పట్ల సమాజంలో విస్తృత ప్రచారం, చైతన్యం కలిగిస్తూ, స్వచ్ఛంద రక్త దానాన్ని విశేషంగా ప్రోత్సహిస్తూ, విశిష్ట సేవలందిస్తున్న ...

బరంతి ఇకమతు భలేగుందే!|ADUGU TRENDS

ఇల్లు కట్టుడంటే అట్లిట్ల కాదు. నెలలు, సంవత్సరాలు పడతయి. ఒక్కో కట్టడం దగ్గర ఒక్కో జాగర్త తీసుకోవాలె. లేకపోతే ఇల్లు గుల్లైతది. గట్ల ఇంటికి బరంతి నింపుతం కద. గదాంట్ల మనమైతే ఏం...

భూమి పునరుద్ధరణకే ఎల్ నినో హెచ్చరిక!|EDITORIAL

ఎల్‌నినోను కేవలం ప్రకృతి వైపరీత్యంగా మాత్రమే చూడడం సరైంది కాదు. వాతావరణ మార్పులు, అటవీ నిర్మూలనం, భూమి క్షీణత, ప్లాస్టిక్ కాలుష్యం, జలవనరుల నాశనం వంటి మానవ చర్యలు కూడా ఈ సంక్షోభాలను...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూన్ 14 నుండి జూన్ 21 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీలో కొత్త ఉత్సాహం పెరుగుతుంది. పనుల విషయంలో ముందడుగు వేయడానికి మంచి అవకాశాలు కనిపిస్తాయి. కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం...

మియా జాకీ మాయ!|ADUGU TRENDS

పండంటే మామిడి పండే! పండ్లండ్ల మధురమైన పండ్లంటే కూడా మామిడి పండ్లే!! గందుకే గా పండ్లకు గంత గిరాకీ. గీ పండ్లల్ల మస్తు గిరాకీ ఉన్న పండ్లు మియా జాకీ రకమట. గీ...

బడే భవిష్యత్తుకు పునాది?!|EDITORIAL

దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది. ఒక మంచి పాఠశాల కేవలం విద్యార్థిని మాత్రమే కాదు, కుటుంబాలని, గ్రామాలని, సమాజాన్ని మార్చగలదు. అందుకే విద్యను వ్యయంగా కాకుండా పెట్టుబడిగా చూడాలి. నీతి ఆయోగ్...

జూన్ 13, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం మాస శివరాత్రి శని త్రయోదశి తిధి బ త్రయోదశి మధ్యాహ్నం 01.55 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం కృత్తిక రాత్రి 12.17 వరకు ఉపరి రోహిణి యోగం సుకర్మ సాయంత్రం 04.30 వరకు ఉపరి ధృతి కరణం వణజి...

నచ్చత్రాల ఇల్లు!|ADUGU TRENDS

ఆకాసంల నచ్ఛత్రాలన్నీ మన ఇంటిమీదకే వత్తే ఎట్లుంటది!? గట్లనే ఓ ఇల్లు కట్టుకుంటే ఇంకెట్లుంటది!? మబ్బుల్ల తేలాడినట్లే ఉంటది కదా? ఇది కలేం కాదుల్లా? దాన్ని నిజం చేసేటట్లు ఇప్పుడు ఇండ్లు కడతుండ్రు.!...

టీఎంసీ భవితవ్యమేంటి?!|EDITORIAL

టీఎంసీలో గందరగోళానికి బీజేపీ కారణమా? బెంగాల్ లో కాంగ్రెస్‌కు పునరుజ్జీవం లభిస్తుందా? కాంగ్రెస్ లో టీఎంసీ విలీనంపై వస్తున్న ఊహాగానాలు నిజమేనా? రాజకీయాల్లో ఏ పార్టీకైనా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నంత కాలమే మనుగడ....

జూన్ 12, శుక్రవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి సాయంత్రం 04.06 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం భరణి రాత్రి 01.46 వరకు ఉపరి కృత్తిక యోగం అతిగండ రాత్రి 07.20 వరకు ఉపరి సుకర్మ కరణం తైతుల సాయంత్రం 04.06...

గీ కోతి మనుసులకే ఆదర్శం!|ADUGU TRENDS

నిజం కాకపోయినా, కోతి నుండే మనిసి వచ్చాడంటరు. కోతులకు మనుసులకు గంత పోలికన్నట్లు. గా కోతుల బుద్ధులు, శేట్టలు మనుసులకు కూడా ఉంటయి. కొందరిల బయట పడ్తయి. మరికొందరిల బయట పడయి గంతే....

నిరంతరాయ ప్రధానిగా మోదీ రికార్డు!|EDITORIAL

మోదీ, నెహ్రూ రికార్డును అధిగమించడం కేవలం ఒక గణాంక ఘట్టం మాత్రమే కాదు. ఇది భారత ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ద్వారా వరుసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చిన నాయకుడి రాజకీయ ప్రయాణానికి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News