KCR|కేసీఆర్ వద్దకు వెళ్ళి నమస్కారం
సంస్కారం చాటుకున్న సీఎం|CM
ఆరోగ్యం ఎలా ఉందంటూ ఆరా!
ఔరా! అనిపించుకున్న REVANTHREDDY|రేవంత్ చర్య
తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాల తొలి రోజున చోటుచేసుకున్న ఒక దృశ్యం రాజకీయాలకు మించిన మానవీయ విలువలను గుర్తుచేసింది. సభా సంప్రదాయాల్లో ఒక కొత్త ఒరవడిని ఏర్పరిచింది.
రాజకీయంగా తీవ్ర ప్రత్యర్థులైన సీఎం రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నేత మాజీ సీఎం కేసీఆర్ను స్వయంగా ఆయన సీటు వద్దకు వెళ్లి నమస్కరించడం, ఆరోగ్యాన్ని అడగడం అందరినీ ఆకట్టుకుంది. సమావేశాలకు ముందు ఇరువురి మధ్య ఘాటు వ్యాఖ్యలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఈ చర్య మరింత ప్రత్యేకంగా నిలిచింది. కేసీఆర్ కూడా లేచి నమస్కారం చేసి కరచాలనం చేయడం పరస్పర గౌరవాన్ని ప్రతిబింబించింది. రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం ఉండదన్న మాటకు ఇది ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. అధికారం, పదవులు తాత్కాలికమైనవైనా, మానవత్వం మాత్రం శాశ్వతమన్న సందేశాన్ని ఈ సంఘటన ఇచ్చింది. సంస్కారం అనేది మాటల్లో కాదు, అనవసర ఆడంబరాల్లో కాదు, ఎవరూ ఆశించనప్పుడు చూపే చిన్న చర్యలోనే కనిపిస్తుందని రేవంత్ రెడ్డి నిరూపించారు.
ఈ పరామర్శ రాజకీయ సమీకరణాలను మార్చకపోయినా, రాజకీయ మాటలు, విలువల స్థాయిని పెంచే అవకాశాన్ని కల్పించింది.

