Friday, April 10, 2026
26.7 C
Hyderabad

TODAY|నేడే విస్తరణ!|EXPANSION

SIX|ఆరు ఖాళీల్లో ప్రస్తుతం THREE|ముగ్గురికే అవకాశం
BC|బీసీ, SC|ఎస్సీ వర్గాలకే పరిమితం
VIVEK|వివేక్‌, ADLURI LAXMAN KUMAR|అడ్లూరి, VAKITI SRIHARI|వాకిటి శ్రీహరిలకు చోటు
RAJ BHAVAN|రాజ్ భవన్ లో ఏర్పాట్లకు ఆదేశం
AFTERNOON|మధ్యాహ్నం 12.15కు ముహూర్తం
CM|సీఎంను కలిసిన మాదిగ ఎమ్మెల్యేలు
అందుబాటులో ఉండండని సీఎం ఆదేశాలు
మిగతా మూడు బెర్తులకూ ఖరారు…
కానీ, CONGRESS|కాంగ్రెస్ లో తకరారు
ఆఖరి క్షణం వరకూ చర్చోప చర్చలు… వీడని ఉత్కంఠ

హైదరాబాద్‌, జూన్‌ 7 (అడుగు న్యూస్):
తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొనసాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్‌ హై కమాండ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఆదివారం తెలంగాణ కేబినెట్‌ విస్తరణ జరుగనుంది. మంత్రివర్గంలో కొత్తగా ముగ్గురికి చోటు- దక్కనుంది. ఆరు ఖాళీల్లో ప్రస్తుతం ముగ్గురికే అవకాశం కల్పించాలని నిర్ణయించారు. బీసీ, ఎస్సీ వర్గాలకే విస్తరణను పరిమితం చేశారు. ఎస్సీ మాల సామాజికవర్గం నుంచి వివేక్‌, ఎస్సీ మాదిగ సామాజిక వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, బీసీ సామాజిక వర్గం నుంచి ముదిరాజ్ కు చెందిన వాకిటి శ్రీహరిలకు చోటు దక్కనుంది.
ఇప్పటికే రాజ్ భవన్ లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆదివారం మధ్యాహ్నం 12.45కు ముహూర్తంగా నిర్ణయించారు. మరోవైపు సీఎంను కలిసిన మాదిగ ఎమ్మెల్యేలు కలిసి తమకే అవకాశం ఇవ్వాలని అడిగారు. వాళ్ళంతా ఎవరికి అవకాశం వచ్చినా కలిసి ఉండాలని, అందుబాటులో ఉండాలని సీఎం సూచించారు. అయితే మిగతా మూడు బెర్తులకూ పేర్లు ఖరారు అయినప్పటికీ, ప్రస్తుతం ఆ మూడు ఖాళీల భర్తీతో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం పడకూడదని, రెడ్డి సామాజిక వర్గం నుంచి ఏకాభిప్రాయం కుదరకపోవడంతో తాత్కాలికంగా ఆ మూడు బెర్తుల భర్తీని నిలిపివేసినట్లు తెలిసింది. అయితే కాంగ్రెస్ తరహా రాజకీయాల్లో భాగంగా ఆఖరి క్షణం వరకూ చర్చోప చర్చలు జరిగాయి. వీడని ఉత్కంఠ నేపథ్యంలో మంత్రి వర్గ విస్తరణ ఎట్టకేలకు జరుగుతున్నది.

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో పాటు ఇప్పటి వరకు 12 మంది కేబినెట్‌లో మంత్రులుగా ఉన్నారు. మరో ఆరు స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. అయితే ఏడాదిన్నరకు పైగా కేబినెట్‌ విస్తరణ జరగలేదు. దీంతో కాంగ్రెస్‌ పార్టీలో ఆశావాహుల సంఖ్య పెరిగింది. తమకు అవకాశం ఇవ్వాలంటూ అధిష్టానం చుట్టూ నేతలు తిరుగుతున్న పరిస్థితి. ఇటీవల విూనాక్షీ నటరాజన్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జ్ గా నియమితులైన తర్వాత ఆశావాహులంతా కూడా ఆమె కలిసి మంత్రి పదవి కోసం వినతులు చేశారు. కొత్తగా ఎన్నికైన నేతలు, సీనియర్‌ నేతలు తమకు అవకాశం కల్పించాల్సిందిగా సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు-, ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ పెద్దలను కలుస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి వర్గ విస్తరణపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ సంకేతాలు ఇచ్చింది. నేడు మంత్రి వర్గ విస్తరణ జరగుతున్నది. రాజ్‌భవన్‌ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.

అనేక ఊహాగానాలు, మంత్రులుగా పదవులకు రేసులో నిల్చిన వాళ్ల పేర్లను కాంగ్రెస్‌ అధిష్టానం పరిశీలించి చివరకు వడపోసింది. రేవంత్‌ రెడ్డి క్యాబినెట్లోకి మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు పదవులు కల్పించేందుకు నిర్ణయం తీసుకుంది. ఇక ముగ్గురిలో ఇద్దరు దళిత సామాజికవర్గానికి చెందిన వారు కాగా..ఒకరు బీసీ నేతకు క్యాబినెట్‌ ర్యాంక్‌ కల్పిస్తోంది. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌తో పాటు ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ రావు తో పాటు బీసీ సామాజికవర్గానికి చెందిన మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రిపదవులు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఆదివారం మధ్యాహ్నం ఈ క్యాబినెట్‌ విస్తరణ ప్రక్రియ అధికారికంగా ప్రకటిస్తారు. తెలంగాణలో సీఎం రేవంత్‌ రెడ్డి మంత్రివర్గంలో మరో ముగ్గురికి కొత్త మంత్రులుగా చోటు దక్కింది. పదేళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి రావడంతో ఇప్పటి వరకు ఉన్న మంత్రులతో పాటు మరికొందరికి అవకాశం కల్పించింది పార్టీ హైకమాండ్‌. సామాజిక సమీకరణాలు, ప్రాంతాల వారిగా ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని దళిత, వెనుకబడిన సామాజికవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలను కొత్త మంత్రి పదవులకు ఎంపిక చేసింది. ఇక చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ను మాల సామాజికవర్గం నుంచి మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ(మాదిగ)తో పాటు అడ్లూరి లక్ష్మణ్ రావు పేర్లు పరిశీలించిన అధిష్ఠానం చివరకు లక్ష్మణ్ పేరే ఖరారైనట్లు తెలిసింది. బీసీ నేత ముదిరాజ్‌ సామాజికవర్గానికి చెందిన మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని కూడా కొత్త మంత్రుల జాబితాలో చేర్చింది. కాగా కాంగ్రెస్‌ పార్టీ దిగ్గజ నేతల్లో ఒకరు అయిన కాకా వెంకటస్వామి కుమారుడు గడ్డం వివేక్‌ . చెన్నూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు. %వీదీదీూ% చదివిన వివేక్‌, విశాఖ ఇండస్ట్రీస్‌ ను స్థాపించారు. అలాగే మీడియా సంస్థనూ నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, పలుమార్లు అరెస్టయ్యారు. 2009లో పెద్దపల్లి నుండి ఎంపీగా గెలిచారు. కాంగ్రెస్‌, %దీRూ, దీజీూ%లలో పనిచేసి, 2023లో కాంగ్రెస్‌లోకి తిరిగి చేరారు. విద్య, సామాజిక సేవ, సమాజ సాధికారత కోసం విశాఖ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా రూ.100 కోట్లకు పైగా వెచ్చించారు. మాల వర్గానికి చెందిన ఆయనకు కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్‌ ఆశీస్సులు ఉండటంతో పదవి లభించింది. వివేక్‌ సోదరుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. కుమారుడు ఎంపీగా ఉన్నారు. కవ్వంపల్లి సత్యనారాయణ మానకొండూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. 1965లో కరీంనగర్‌ జిల్లాలో జన్మించిన ఆయన, కాకతీయ మెడికల్‌ కాలేజీ నుండి %వీదీదీూ, వీూ% పూర్తి చేశారు. వైద్యుడిగా సుదీర్ఘ కెరీర్‌లో, ఆయన అనేక గ్రామాల్లో మెడికల్‌ క్యాంపులు నిర్వహించి, సామాజిక సేవలో తనదైన ముద్ర వేశారు. 2023 ఎన్నికల్లో రసమయి బాలకిషన్‌ను 32,365 ఓట్ల తేడాతో ఓడిరచారు. ఎమ్మెల్యేగా, ఆయన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, రెవెన్యూ సదస్సులు, క్రీడా టోర్నమెంట్‌లు వంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. మాదిగ వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆ వర్గ ఎమ్మెల్యేలంతా పోరాడారు. ఆ వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి అవకాశాన్ని హైకమాండ్‌ ఇస్తోంది. లక్ష్మణ్ కుమార్ అప్పటి మంత్రి కొప్పుల ఈశ్వర్ పై గెలిచారు. ముదిరాజ్‌ వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించడంతో వాకిటి శ్రీహరికి అవకాశం లభిస్తోంది. ఆయన నారాయణపేట జిల్లా మక్తల్‌ నియోజకవర్గం నుండి 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. భారత రాష్ట్ర సమితి అభ్యర్థి చిట్టెం రామ్మోహన్‌ రెడ్డిని 17,525 ఓట్ల తేడాతో ఓడిరచారు. ఆయన తండ్రి వాకిటి నరసింహులు రైతు. 2001-2006 మధ్య మక్తల్‌ గ్రామ సర్పంచ్‌గా, 2014-2018 మధ్య జెడ్పిటిసి సభ్యుడిగా పనిచేశారు. 2024లో సమగ్ర కుటుంబ సర్వే, బీసీ కుల గణన వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రోత్సహించారు. తెలంగాణ మంత్రివర్గంలో మరో మూడు మంత్రి పదవులు ఖాళీగా ఉంటాయి. రెడ్డి సామాజికవర్గం నుంచి చాలా మంది సీనియర్‌ నేతలు పోటీ పడుతున్నారు. వారిలో ఒకరికి ఇచ్చి మరొకరికి ఇవ్వకపోతే సమస్యలు వస్తాయని పూర్తిగా ఖాళీగా ఉంచుతున్నారు. ఆ ఖాళీలను ఎప్పుడు భర్తీ చేస్తారో .. కానీ వాటికి రేస్‌ కొనసాగే అవకాశాలు ఉన్నాయి.

Latest News

గా మట్టిని సాప్ చేయిండ్లిట్ల!?|ADUGU TRENDS

రాను రాను ఆనలు తక్కువైతానయి. ఎండలెక్కువైతానయి. మోటర్లు ఎక్కువై రోడ్ల మీద గిర్రగిర్ర తిరుగుతానయి. ఇగ దుమ్ము, దుమ్ములేస్తుందనుకోండ్రి. గీ దమ్ముతోటి మస్తు రోగాలొత్తయి. మన దగ్గరున్న వస్తువులు దుమ్ముకొట్టుకపోతయి. ఇగ మనం...

యుద్ధం వాస్తవాలు: చర్చల్లో కీలకాంశాలు!|EDITORIAL

పశ్చిమాసియా యుద్ధ తీవ్రత చర్చల అంకానికి చేరుకుంది. రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన తర్వాత నేటి నుంచే ఇస్లామాబాద్ లో చర్చలు ప్రారంభం కానున్నాయి. యుద్ధం ప్రారంభం కంటే విరమణే విపరీతంగా...

10-04-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ అష్టమి రాత్రి 07.23 వరకు ఉపరి నవమి నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 08.12 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం శివ మధ్యాహ్నం 03.34 వరకు ఉపరి సిద్ద కరణం బాలవ ఉదయం 06.38...

నారీ శక్తికి పట్టం కడదాం|WOMEN|NARENDRA MODI|ESSAY

మహిళా సాధికారతను సాధిద్దాం ఏప్రిల్ 16న మనమంతా మహిళలకు అండగా నిలుద్దాం మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాసం రానున్న రోజుల్లో దేశంలో పండుగ వాతావరణం పరిఢవిల్లనుంది. వివిధ రాష్ట్రాల్లో జరిగే ఈ పర్వదినాల...

పసువుల గడ్డికి పక్కా రచ్చణ!?|ADUGU TRENDS

పసువులను మనుసులతోటి సమానంగ సూత్తం. పసువు శేసే పని, మనిసి గూడ సేయడు. గా పసువులు గడ్డి తిని పాలిత్తయి. మరి గీ మనుసులే పాలు తాగి విసం అయితరు. కనీ, గా...

యుద్ధోన్మాదం మిగిల్చిన ప్రపంచ సంక్షోభం!|EDITORIAL

ప్రపంచ ఇటీవలి రాజకీయ పరిణామాలు మానవాళికి మరో చేదు అనుభవాన్ని మిగిల్చాయి. శక్తివంతమైన దేశాల యుద్ధోన్మాదం, ఆధిపత్య పోరాటాలు చివరకు సామాన్య ప్రజల జీవన విధానాన్ని ఎలా దెబ్బతీస్తాయో ప్రస్తుత పరిస్థితులు గుణపాఠాలు...

09-04-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ సప్తమి సాయంత్రం 05.48 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మూల ఉదయం 05.53 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం పరిఘ మధ్యాహ్నం 03.19 వరకు ఉపరి శివ కరణం బవ సాయంత్రం 05.46...

ఎరుపెక్కిన కర్రె గుట్టల్లో.. శాంతి గీతం!|POLICE|MAOIST

తెలంగాణలో ముగిసిన మావోల శకం|TELANGANA పలు అభివృద్ధి పనులకు డీజీపీ శ్రీకారం|DEVELOPMENT|DGP తెలంగాణలో మావోయిస్టుల శకం ముగిసిందని డిజిపి శివధర్ రెడ్డి అన్నారు. ఒకప్ప్పుడు తుపాకుల మోతతో, అశాంతితో నిండిన తెలంగాణ అటవీ ప్రాంతాల్లో ఇప్ప్పుడు...

‘మామ’ నుంచి భూమి! |MOON|EARTH

మామకు అత్యంత చేరువగా మన వ్యోమగాములు నాసా ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ II మిషన్ వ్యోమగాములు సోమవారం (ఏప్రిల్ 6, 2026) చంద్రుడికి అత్యంత చేరువగా వెళ్లారు. ఓరియన్ క్యాప్సూల్ నుంచి చంద్రుడి ఉపరితలాన్ని చూసిన...

మడ్డి పట్టిన నూనె మంచిగైతది!?|ADUGU TRENDS

ఒకప్పుడు కాపిష్కెడు నూనె పోసి కిల కూర ఒండాల్నంటే గగనమయ్యేది. ఉప్పు, కారం, మసాల, ఇంత నూనె యేసి కలిపి పొయ్యి మీద పెడితే ఒంటయ్యేది. కూర గూడ కమ్మగుండేది. కిల నూనె...

అభివృద్ధి నిరోధకంగా పార్టీలు, నేతలు!|EDITORIAL

ప్రజాస్వామ్యానికి రాజకీయాలు ప్రాణం అయితే, అభివృద్ధి ఆత్మ. ఈ రెండింటి మధ్య సన్నని విభజన రేఖను చెరిపేస్తూ, విస్మరిస్తూ, వాటిని కలగలిపి స్వార్థపూరితంగా ఉపయోగిస్తే రాష్ట్రాల పురోగతే కాదు, ప్రజల భవిష్యత్తు కూడా...

08-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి సప్తమి నక్షత్రం మూల పూర్తిగా ఉంది యోగం వరీయాన్ మధ్యాహ్నం 02.51 వరకు ఉపరి పరిఘ కరణం వణజి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి భద్ర రాహుకాలం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News