బాలీవుడ్ ‘భాయ్’ సల్మాన్ ఖాన్ ఇంటి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే సల్మాన్ ఖాన్కు బెదిరింపులు, కాల్పుల ఘటనల నేపథ్యంలో ఆయన నివాసమైన గ్యాలక్సీ అపార్ట్మెంట్స్ వద్ద బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఏర్పాటు చేశారు. ఈ చర్యకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కృష్ణ జింక వేట కేసులో కోర్టు సల్మాన్కు ఉపశమనం ఇచ్చినప్పటికీ, బిష్ణోయ్ గ్యాంగ్ మాత్రం సల్మాన్ను వదలబోమని హెచ్చరించింది. కృష్ణ జింకను పవిత్రమైందిగా భావించే బిష్ణోయ్ గ్యాంగ్ గతంలో కూడా సల్మాన్పై కాల్పులకు పాల్పడింది. గత సంవత్సరం సల్మాన్ ఫామ్హౌస్కు వెళ్తున్న సమయంలో జరిగిన కాల్పుల్లో ఎవరికీ ప్రమాదం జరగలేదు. ఆ కాల్పులకు సంబంధించి హర్యానాలో బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు సుక్ఖాను పోలీసులు అరెస్టు చేశారు.
ఇదే సమయంలో సల్మాన్ కొత్త సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఏఆర్ మురుగుదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న “సికందర్” చిత్రంలో సల్మాన్ హీరోగా నటిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుండగా, సత్యరాజ్, ప్రతీక్ బబ్బర్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సాజిద్ నదియావాలా నిర్మాణంలో దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రం మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


