Saturday, June 13, 2026
32.8 C
Hyderabad

జల జగడాలు! రాజకీయ రగడాలు!!|EDITORIAL

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నదీజలాల వివాదం మళ్లీ రాజకీయ రంగు పులుముకుంటోంది. సమస్య పరిష్కారానికి బదులు, ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నాలు ప్రమాదకర స్థాయికి చేరుతున్నాయి. జీవాధారమైన జలాన్ని కూడా రాజకీయం చేయడం ప్రజాస్వామ్య, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. అందుకు పూనుకున్న పార్టీల దివాలాకోరుతనం.
నీళ్ళు, నిధులు, ఉద్యోగాల కోసమే తెలంగాణ ఉద్యమం సాగింది. సాగు, తాగునీరే ఉద్యమానికి ఇంధనంగా పని చేశాయి. సాధారణంగా నీటి అంశంపై రెండు రాష్ట్రాల ప్రజలు అత్యంత సున్నితంగా స్పందిస్తారు. కరువు కాటకాల రాయలసీమ కూడా దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురవుతోంది. వాస్తవాలను పక్కనపెట్టి, రాజకీయ పార్టీలు సామరస్యతకు పాతరేసి, పరస్పర విద్వేషాల్ని పెంచేలా వ్యవహరిస్తున్నాయి.
పవర్ లో ఉంటే పట్టించుకోకుండా, ప్రతిపక్షంలోకి రాగానే విమర్శించడం పార్టీలకు అలవాటుగా మారింది. ప్రస్తుతం ఏపీలో జగన్, తెలంగాణలో బీఆర్‌ఎస్, జలవివాదాన్ని రాజకీయ ఆయుధంగా మలుచుకుంటున్నాయి. రాయలసీమ ఎత్తిపోతలను చంద్రబాబు ఆపేశారంటూ జగన్ ఆరోపిస్తున్నారు. పోలవరం–నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్ట్ తెలంగాణకు అన్యాయమంటూ బీఆర్‌ఎస్ నేతలు విమర్శిస్తున్నారు.

ఇరు పార్టీల సొంత మీడియా, ఏపీ సీఎం చంద్రబాబును “ఆంధ్రప్రదేశ్ ద్రోహి”గా, “నీటి దొంగ”గా, తెలంగాణ సీఎం రేవంత్ ను “తెలంగాణ ద్రోహి”గా చిత్రీకరిస్తున్నది. వాస్తవాలు ఎలా ఉన్నా, ఈ ప్రచారం ప్రజల్లో పరస్పర విద్వేషాల్ని పెంచుతున్నాయి. రాష్ట్రాల మధ్య ఇప్పటికే సున్నితగా ఉన్న భావోద్వేగాలు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇది కొన్ని రాజకీయ పార్టీలకేమో గానీ, ప్రజాస్వామ్య వ్యవస్థకు మేలు చేయదు.

వాస్తవానికి పాలకులు ఎవరైనా తమ రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించలేరు. అదే సమయంలో పొరుగు రాష్ట్ర హక్కులను కాలరాయడం కూడా అంత సులువుగా సాధ్యం కాదు. నదీజలాలు కేవలం రాష్ట్రాలకు చెందినవే కాదు. అవి జాతీయ వనరులు కూడా. జలవివాదాలను పరస్పర చర్చలు, సమాఖ్య స్ఫూర్తితో పరిష్కరించాలనే రాజ్యాంగం సూచిస్తోంది. కోర్టుల చుట్టూ తిరగడం శాశ్వత పరిష్కారం కాదని, గత అనుభవాలే చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో ప్రతిపక్షాలకంటే, ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి చేసిన “జలజగడాలకన్నా పరిష్కారాలే ముఖ్యం” అన్న వారి వ్యాఖ్యలు హుందాగా కనిపిస్తున్నాయి. రాజకీయ ప్రయోజనాలకన్నా ప్రజల అవసరాలే కేంద్రంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఇది. వివాదం కొనసాగితే లాభపడేది రాజకీయ పార్టీలే తప్ప రైతులు, ప్రజలు కాదు.

పోలవరం–నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్ట్ విషయంలోనూ భావోద్వేగాలకన్నా వాస్తవాల ఆధారంగా చర్చ జరగాలి. గోదావరి నది చివరి ప్రవాహ రాష్ట్రం ఏపీ. సముద్రంలోకి వృథాగా పోతున్న వరద జలాలను వినియోగించుకోవడం సూత్రప్రాయంగా తప్పు కాదు. అయితే అది ఇతర తెలంగాణ వంటి పైరాష్ట్రాల హక్కులకు భంగం కలగకుండా, వాటి సమ్మతితో చట్ట, న్యాయబద్ధమైన అనుమతులతో జరగాల్సిందే. ఏపీ ప్రభుత్వం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. టెండర్లు ముందస్తు సన్నాహక చర్యలేనని, అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే ప్రాజెక్ట్ ప్రారంభమవుతుందని చెబుతోంది.

అయితే తెలంగాణ ప్రభుత్వం దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించడం కూడా సహజ పరిణామమే. కోర్టు పరిధిలో విషయం ఉన్నప్పుడు, ఇరు రాష్ట్రాలూ సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. న్యాయస్థానం నిర్ణయం వచ్చే వరకు ప్రజల్లో ఉద్రేకాన్ని పెంచే ప్రకటనలు, ప్రచారాలు ఆపాలి.
స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఇలాంటి అంశాలు మరింత తీవ్రంగా రాజకీయ రంగు పులుముకునే అవకాశముంది. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం మౌనం వహించడం సరికాదు. ఇరు రాష్ట్రాల జలవివాదాలపై ఉన్నతస్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి, శాస్త్రీయంగా, న్యాయబద్ధంగా పరిష్కార మార్గాలు సూచించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది.

జలవివాదాలు రాజకీయ యుద్ధంగా మారితే నష్టపోయేది ప్రజలే. నీరును రాజేసి, నిప్పును పుట్టిద్దామని చూసే రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ఈ నిజాన్ని గ్రహించాలి. సంయమనం, చర్చలు, పరస్పర గౌరవం ఇవే జలవివాదాలకు శాశ్వత పరిష్కారం.

Latest News

మియా జాకీ మాయ!|ADUGU TRENDS

పండంటే మామిడి పండే! పండ్లండ్ల మధురమైన పండ్లంటే కూడా మామిడి పండ్లే!! గందుకే గా పండ్లకు గంత గిరాకీ. గీ పండ్లల్ల మస్తు గిరాకీ ఉన్న పండ్లు మియా జాకీ రకమట. గీ...

బడే భవిష్యత్తుకు పునాది?!|EDITORIAL

దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది. ఒక మంచి పాఠశాల కేవలం విద్యార్థిని మాత్రమే కాదు, కుటుంబాలని, గ్రామాలని, సమాజాన్ని మార్చగలదు. అందుకే విద్యను వ్యయంగా కాకుండా పెట్టుబడిగా చూడాలి. నీతి ఆయోగ్...

జూన్ 13, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం మాస శివరాత్రి శని త్రయోదశి తిధి బ త్రయోదశి మధ్యాహ్నం 01.55 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం కృత్తిక రాత్రి 12.17 వరకు ఉపరి రోహిణి యోగం సుకర్మ సాయంత్రం 04.30 వరకు ఉపరి ధృతి కరణం వణజి...

నచ్చత్రాల ఇల్లు!|ADUGU TRENDS

ఆకాసంల నచ్ఛత్రాలన్నీ మన ఇంటిమీదకే వత్తే ఎట్లుంటది!? గట్లనే ఓ ఇల్లు కట్టుకుంటే ఇంకెట్లుంటది!? మబ్బుల్ల తేలాడినట్లే ఉంటది కదా? ఇది కలేం కాదుల్లా? దాన్ని నిజం చేసేటట్లు ఇప్పుడు ఇండ్లు కడతుండ్రు.!...

టీఎంసీ భవితవ్యమేంటి?!|EDITORIAL

టీఎంసీలో గందరగోళానికి బీజేపీ కారణమా? బెంగాల్ లో కాంగ్రెస్‌కు పునరుజ్జీవం లభిస్తుందా? కాంగ్రెస్ లో టీఎంసీ విలీనంపై వస్తున్న ఊహాగానాలు నిజమేనా? రాజకీయాల్లో ఏ పార్టీకైనా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నంత కాలమే మనుగడ....

జూన్ 12, శుక్రవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి సాయంత్రం 04.06 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం భరణి రాత్రి 01.46 వరకు ఉపరి కృత్తిక యోగం అతిగండ రాత్రి 07.20 వరకు ఉపరి సుకర్మ కరణం తైతుల సాయంత్రం 04.06...

గీ కోతి మనుసులకే ఆదర్శం!|ADUGU TRENDS

నిజం కాకపోయినా, కోతి నుండే మనిసి వచ్చాడంటరు. కోతులకు మనుసులకు గంత పోలికన్నట్లు. గా కోతుల బుద్ధులు, శేట్టలు మనుసులకు కూడా ఉంటయి. కొందరిల బయట పడ్తయి. మరికొందరిల బయట పడయి గంతే....

నిరంతరాయ ప్రధానిగా మోదీ రికార్డు!|EDITORIAL

మోదీ, నెహ్రూ రికార్డును అధిగమించడం కేవలం ఒక గణాంక ఘట్టం మాత్రమే కాదు. ఇది భారత ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ద్వారా వరుసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చిన నాయకుడి రాజకీయ ప్రయాణానికి...

జూన్ 11-గురువారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి సాయంత్రం 06.03 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం అశ్విని రాత్రి తెల్ల 03.02 వరకు ఉపరి భరణి యోగం శోభ రాత్రి 10.00 వరకు ఉపరి అతిగండ కరణం బవ ఉదయం...

శెట్టు కిందే ఊరు!|ADUGU TRENDS

ఎండా కాలమొస్తే మనమేం శేత్తానం? ప్యాన్లు, ప్రిజ్జీలు, కూలర్లు, ఏసీలను సిద్ధం చేసుకుంటానం. మండే కాలం వత్తాందనంగనే గవాటన్నింటినీ మరమ్మతులు చేసి పెట్టుకుంటానం. ఎండ మండుతనే ఉండె, కరెంటు కాల్తనే ఉండె. ఇగ...

ట్రంప్ కు బోస్టన్ తీర్పు దెబ్బ!|EDITORIAL

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలస విధానాలపై, హెచ్-1బీ వీసాలపై విధించిన లక్ష డాలర్ల ఫీజును బోస్టన్ ఫెడరల్ కోర్టు చట్టవిరుద్ధమని ప్రకటించింది. ఆ తీర్పు భారతీయ వృత్తి నిపుణులకు తక్షణ ఊరటనిచ్చినా, అంతిమ...

జూన్ 10-బుధవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ దశమి రాత్రి 07.41 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం రేవతి రాత్రి తెల్ల 04.00 వరకు ఉపరి అశ్విని యోగం సౌభాగ్య రాత్రి 12.20 వరకు ఉపరి శోభ కరణం వణజి ఉదయం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News