Saturday, April 11, 2026
26.7 C
Hyderabad

సంచలన వ్యాఖ్యలు చేసిన టిపిసిసి|TPCC చీఫ్|CHIEF మహేష్ కుమార్ గౌడ్|MAHESH KUMAR GOUD

BRS|బిఆర్ఎస్ లో అంతర్గత కలహాలు భగ్గుమన్నాయి

KAVITHA|కవిత-కేటీఆర్|KTR మధ్య విభేదాలతో పార్టీ భవితవ్యం ప్రశ్నార్థకం

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీపై విపక్షాల దాడులు ముదురుతున్నాయి. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఇంట్లోనే కుంపటి తట్టుకోలేక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడని ఆయన పేర్కొన్నారు. పార్టీపై తన ఆధిపత్యానికి భంగం కలిగేలా మరో పవర్ సెంటర్‌ రూపంలో కవిత ఎదగడంతో, కేటీఆర్ మతిభ్రమించి CM|సీఎం REVANTH REDDY|రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేశారని ఆయన విమర్శించారు.|TPCC|CHIEF|MAHESH KUMAR GOUD|BRS|KAVITHA|KTR|

ఇటీవలి కాలంలో కవితపై వచ్చిన విమర్శలు, కేసులు, నోటీసుల వ్యవహారాలను మరల్చేందుకు కేటీఆర్ జాతీయ రాజకీయాల్లో రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారన్నది మహేష్ గౌడ్ ఆరోపణ. ముందుగా తన ఇంట్లోనే రగులుతున్న అగ్ని అణుచుకోవాలి. పది సంవత్సరాల పాలనలో జరిగిన టీఆర్ఎస్ తప్పిదాలను ప్రజలకు కవితే గుర్తు చేస్తోంది, అని మహేష్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు.|TPCC|CHIEF|MAHESH KUMAR GOUD|BRS|KAVITHA|KTR|

కల్వకుంట్ల కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరినట్లు పార్టీ నాయకుల మౌనమే స్పష్టంగా చెబుతోందని ఆయన అన్నారు. తాజాగా కవిత చేసిన వ్యాఖ్యలు, బీఆర్ఎస్‌కు, బీజేపీకి స్పష్టమైన అవగాహన ఉందని చెప్పిన మాటలు, పార్టీని మరింత అస్థిరతవైపు నడిపిస్తున్నాయని మహేష్ కుమార్ గౌడ్ అభిప్రాయపడ్డారు. వీటన్నింటి కారణంగా బీఆర్ఎస్ మూడు ముక్కలవుతుందని, కవిత, కేటీఆర్ మధ్య అంతర్గత పోటీ తీవ్రమవుతున్న నేపథ్యంలో హరీష్ రావు ఎప్పుడైనా తన అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని గౌడ్ విమర్శించారు.|TPCC|CHIEF|MAHESH KUMAR GOUD|BRS|KAVITHA|KTR|

ఇక పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం కేసీఆర్ పూర్తిగా ఒంటరిగా ఫామ్‌హౌస్‌కి పరిమితమయ్యారని, ఆయన చుట్టూ ఉన్న మానవ రూప దయ్యాలు ఎవరో ప్రజలకు తెలుసుకోవాల్సిన సమయం వచ్చిందని మహేష్ కుమార్ గౌడ్ అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై కేంద్ర నోటీసులు వస్తుండటంతో కేటీఆర్ భయంతో చెమటలు పడుతున్నారని అన్నారు.|TPCC|CHIEF|MAHESH KUMAR GOUD|BRS|KAVITHA|KTR|

పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఏం అందించలేకపోయిందని, పంపకాల్లో తేడాల కారణంగానే కవిత కూడా ఇప్పుడు తిరుగుబాటు జెండా ఎగరవేసిందని మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే భవిష్యత్తులో తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో బీఆర్ఎస్ అనే పార్టీ ఉండకపోవచ్చని ఆయన హెచ్చరించారు.|TPCC|CHIEF|MAHESH KUMAR GOUD|BRS|KAVITHA|KTR|

Latest News

గా మట్టిని సాప్ చేయిండ్లిట్ల!?|ADUGU TRENDS

రాను రాను ఆనలు తక్కువైతానయి. ఎండలెక్కువైతానయి. మోటర్లు ఎక్కువై రోడ్ల మీద గిర్రగిర్ర తిరుగుతానయి. ఇగ దుమ్ము, దుమ్ములేస్తుందనుకోండ్రి. గీ దమ్ముతోటి మస్తు రోగాలొత్తయి. మన దగ్గరున్న వస్తువులు దుమ్ముకొట్టుకపోతయి. ఇగ మనం...

యుద్ధం వాస్తవాలు: చర్చల్లో కీలకాంశాలు!|EDITORIAL

పశ్చిమాసియా యుద్ధ తీవ్రత చర్చల అంకానికి చేరుకుంది. రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన తర్వాత నేటి నుంచే ఇస్లామాబాద్ లో చర్చలు ప్రారంభం కానున్నాయి. యుద్ధం ప్రారంభం కంటే విరమణే విపరీతంగా...

10-04-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ అష్టమి రాత్రి 07.23 వరకు ఉపరి నవమి నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 08.12 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం శివ మధ్యాహ్నం 03.34 వరకు ఉపరి సిద్ద కరణం బాలవ ఉదయం 06.38...

నారీ శక్తికి పట్టం కడదాం|WOMEN|NARENDRA MODI|ESSAY

మహిళా సాధికారతను సాధిద్దాం ఏప్రిల్ 16న మనమంతా మహిళలకు అండగా నిలుద్దాం మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాసం రానున్న రోజుల్లో దేశంలో పండుగ వాతావరణం పరిఢవిల్లనుంది. వివిధ రాష్ట్రాల్లో జరిగే ఈ పర్వదినాల...

పసువుల గడ్డికి పక్కా రచ్చణ!?|ADUGU TRENDS

పసువులను మనుసులతోటి సమానంగ సూత్తం. పసువు శేసే పని, మనిసి గూడ సేయడు. గా పసువులు గడ్డి తిని పాలిత్తయి. మరి గీ మనుసులే పాలు తాగి విసం అయితరు. కనీ, గా...

యుద్ధోన్మాదం మిగిల్చిన ప్రపంచ సంక్షోభం!|EDITORIAL

ప్రపంచ ఇటీవలి రాజకీయ పరిణామాలు మానవాళికి మరో చేదు అనుభవాన్ని మిగిల్చాయి. శక్తివంతమైన దేశాల యుద్ధోన్మాదం, ఆధిపత్య పోరాటాలు చివరకు సామాన్య ప్రజల జీవన విధానాన్ని ఎలా దెబ్బతీస్తాయో ప్రస్తుత పరిస్థితులు గుణపాఠాలు...

09-04-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ సప్తమి సాయంత్రం 05.48 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మూల ఉదయం 05.53 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం పరిఘ మధ్యాహ్నం 03.19 వరకు ఉపరి శివ కరణం బవ సాయంత్రం 05.46...

ఎరుపెక్కిన కర్రె గుట్టల్లో.. శాంతి గీతం!|POLICE|MAOIST

తెలంగాణలో ముగిసిన మావోల శకం|TELANGANA పలు అభివృద్ధి పనులకు డీజీపీ శ్రీకారం|DEVELOPMENT|DGP తెలంగాణలో మావోయిస్టుల శకం ముగిసిందని డిజిపి శివధర్ రెడ్డి అన్నారు. ఒకప్ప్పుడు తుపాకుల మోతతో, అశాంతితో నిండిన తెలంగాణ అటవీ ప్రాంతాల్లో ఇప్ప్పుడు...

‘మామ’ నుంచి భూమి! |MOON|EARTH

మామకు అత్యంత చేరువగా మన వ్యోమగాములు నాసా ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ II మిషన్ వ్యోమగాములు సోమవారం (ఏప్రిల్ 6, 2026) చంద్రుడికి అత్యంత చేరువగా వెళ్లారు. ఓరియన్ క్యాప్సూల్ నుంచి చంద్రుడి ఉపరితలాన్ని చూసిన...

మడ్డి పట్టిన నూనె మంచిగైతది!?|ADUGU TRENDS

ఒకప్పుడు కాపిష్కెడు నూనె పోసి కిల కూర ఒండాల్నంటే గగనమయ్యేది. ఉప్పు, కారం, మసాల, ఇంత నూనె యేసి కలిపి పొయ్యి మీద పెడితే ఒంటయ్యేది. కూర గూడ కమ్మగుండేది. కిల నూనె...

అభివృద్ధి నిరోధకంగా పార్టీలు, నేతలు!|EDITORIAL

ప్రజాస్వామ్యానికి రాజకీయాలు ప్రాణం అయితే, అభివృద్ధి ఆత్మ. ఈ రెండింటి మధ్య సన్నని విభజన రేఖను చెరిపేస్తూ, విస్మరిస్తూ, వాటిని కలగలిపి స్వార్థపూరితంగా ఉపయోగిస్తే రాష్ట్రాల పురోగతే కాదు, ప్రజల భవిష్యత్తు కూడా...

08-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి సప్తమి నక్షత్రం మూల పూర్తిగా ఉంది యోగం వరీయాన్ మధ్యాహ్నం 02.51 వరకు ఉపరి పరిఘ కరణం వణజి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి భద్ర రాహుకాలం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News