Thursday, June 4, 2026
29.5 C
Hyderabad

నాయకుల మాటలకు అర్థాలే వేరులే!|EDITORIAL

రాజకీయ నాయకుల మాటలకు అర్థాలు వేరే ఉంటాయి. ప్రసంగాలు, మాటలు, విమర్శలకు వాడే భాషతోపాటు, అర్థాలు వేర్వేరుగా ఉంటాయి. వారి భాష హద్దు దాటుతోంది. హుందాగా ఉండాల్సిన నేతల ప్రవర్తనలు కూడా నీచంగా దిగజారుతున్నాయి. విమర్శల కోసం ఏది పడితే అది మాట్లాడుతున్నారు. తాము అధికారంలో ఉంటే ఓ తీరు. అది చేజారితే మరోతీరు. ఎవరినైనా ‘అధికారాంతమున చూడవలె’ అన్నట్లుగా ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు వారి ప్రవర్తనను గమనిస్తే, అధికారం పోయిన తర్వాత వారి నిజస్వరూపం బయటపడుతుంది. పదేళ్లు అధికారం చెలాయించిన బీఆర్‌ఎస్‌ నేతలు, ఐదేళ్లు పవర్ లో ఉన్న వైకాపా నేతలు ఇప్పుడు ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్నారు. ఉన్నదున్నట్లు పత్రికలు రాస్తున్నాయి. ఛానళ్లు కూడా వీటిని యధాతథంగా ప్రసారం చేస్తున్నాయి. నాయకుల విమర్శల్లో నిజానిజాలను నిగ్గుతేల్చే సాహసాన్ని ప్రసార, ప్రచార సాధనాలు చేయడంలేదు. ఒకందుకు సామాజిక మాధ్యమాలే నయం. వాటి భాష, అతి, అబద్ధాలను పక్కనపెడితే, ఎంతోకొంత వాస్తవాలు వెలుగు చూస్తున్నవి. ఒకవైపు వారు వాడే భాషను, మరోవైపు వారు ఆడే అబద్ధాల ప్రచారాన్ని కట్టడి చేయలేమా? ఏది మాట్లాడినా చెల్లుతుందనే పద్ధతికి బ్రేకులు పడవా? అలా మాట్లాడేవాళ్లకు తగిన శిక్షలుంటాయన్న భయం లేకుండా వారి అబద్ధాలపై ఆంక్షలుండక్కరలేదా? కాంగ్రెస్ బీజేపీ ఒక్కటేనని బీఆర్ఎస్ విమర్శిస్తుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటేనని బీజేపీ విమర్శిస్తుంది. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్ విమర్శిస్తుంది. మూడు పార్టీలు ఒకరినొకరు ఒక్కటే అంటే మరి వేరు పార్టీ ఏది? అయితే మూడు పార్టీలు ఒక్కటై అబద్ధాలు ఆడుతుండాలి. వారి మధ్య లేని వేర్పాటు ప్రజల మధ్య ఎందుకు? పైగా వారాడే అబద్ధాలని ఎంతకాలమని భరిస్తారు? ప్రజలు కూడా వేడుక చూస్తున్నారు. ఎంజాయ్ చేస్తున్నారని అనుకోవాలా? లేక వారి మాయలో పడి ఏది నిజమో? ఏది అబద్ధమో తేల్చుకోలేకపోతున్నారా?

తెలంగాణలో పదేళ్లు పాలన చేసిన కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ యాసను, భాషను సాధనంగా వాడుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ కొడుకు కేటీఆర్‌, అల్లుడు హరీశ్ రావు, బిడ్డ కవితలతో పాటు ఇతర నేతలు కూడా హద్దు పద్దు లేకుండా మాట్లాడుతున్నారు. వీరి తరహాలోనే సీఎం రేవంత్ రెడ్డి అంతకంతకూ రెచ్చగొడుతున్నారు. ఏపీలో జగన్ ఆయన అనుచరులు కూడా ఇలాగే తెగించారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కేసీఆర్ కుటుంబ సభ్యులంతా అధికారం అనుభవించారు. వారి చుట్టాలు, పక్కాలు, కులమైతే చాలన్నట్లుగా పదవులను చేపట్టారు. ఉద్యమంలో ప్రాణత్యాగాలు చేసిన కుటుంబాలను, ఉద్యమకారులను కేసీఆర్‌ గడ్డి పరకల్లా తీసి అవతల పడేశారు. ప్రొపెసర్‌ కోదండరామ్‌ లాంటి వారిని కూడా కరివేపాకులా వాడి పడేశారు. జర్నలిస్టులనైతే, గంజిలో ఈగల్లాగా చూశారు. ప్రజల్ని ఓటర్లుగా మాత్రమే గుర్తించారు. ఓటర్లు వారిని ఓడిస్తే, తప్పు చేసినట్లుగా చిత్రీకరించారు. ఇప్పుడు అధికారం దూరమయ్యే సరికి వారి మాట, ప్రవర్తన పూర్తిగా మారిపోయాయి. ఉచ్ఛ నీచాలు మరచి విమర్శలు చేస్తున్నారు. పోలీసులు, ఇతర అవినీతి అధికారుల అండదండలతో ప్రజాధనాన్ని, హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న వేలాది ఎకరాల భూములను వారు, వారి కుటుంబ సభ్యులు కొల్లగొట్టారనడానికి అనేక అవినీతి కుంభకోణాలు వెలుగు చూస్తున్నాయి. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి చూస్తుంటే ఇంతగా తెగించారా? అన్న అనుమానాలు కలగకమానవు. ఏసీబీ దాడులు, ఇడి విచారణల్లో, కొనసాగుతున్న దర్యాప్తుల్లో వెలుగు చూస్తున్న నిజాలు కళ్లు బైర్లు కమ్మేలా చేస్తున్నాయి. అధికారులే వందల, వేల కోట్లు వెనకేసుకుంటే, ఇక అసలు నాయకులు ఎంత వెనకేసుకున్నారో ఊహించవచ్చు. అంతెందుకు ఈ ఫార్మూలా కారు కేసులో ఆర్థికశాఖ అనుమతులు లేకుండా కేవలం మంత్రిగా డబ్బులు నేరుగా దేశం దాటించానని ఒప్పుకున్న కేటీఆర్‌ మాట్లాడుతున్న తీరు అందరినీ విస్మయానికి గురి చేస్తున్నది. ‘లొట్టపీసు కేసు, లొట్టపీసు సీఎం అని, ఏం పీక్కుంటారో పీక్కోండి’ అని అనడం వెనుక ధైర్యమేంటి? ఇది ఏ ప్రజాస్వామిక విలువలకు లోబడి మాట్లాడుతున్నట్లు?

ఏపీలో జగన్‌ కూడా ఇలాగే ‘నా వెంట్రుక కూడా పీకలేరు’ అని అంటున్నారు. ఇలా మంత్రులుగా, సీఎంగా పని చేసిన వ్యక్తులు మాట్లాడాల్సిన భాషేనా? బుకాయించే తీరు ఇదేనా? అని ప్రజలు విచిత్రపోతున్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రజలపై మీడియా సంస్థలపై ప్రతిపక్షాలపై నిఘా, నియంత్రణ, ఫోన్ ట్యాపింగ్, అణచివేత కొనసాగించిన విషయం కేటీఆర్‌ మర్చి పోయి ఉంటారా? అధికారం ఉన్నప్పుడు తెలంగాణ నీళ్లు పంపిణీ చేసి రాయలసీమను రతనాల సీమను చేస్తామని ప్రకటించారు. ఇప్పుడేమో తెలంగాణ హక్కులను చంద్రబాబు పాదాల వద్ద పెట్టారని విమర్శలు చేస్తున్నారు. మేడిగడ్డ మీద చర్చ పెడతామంటారు. సవాళ్లు విసరుతారు. రచ్చ తప్ప చర్చే ఉండదు. ఆనాటి ఏపీ సీఎం జగన్‌ని కాళేశ్వరం ప్రారంభోత్సవానికి పిలవడం చూశాం. ఆయన ప్రమాణస్వీకారానికి అమరావతి వెళ్ళడాన్ని చూశాం. మంత్రి రోజా ఆహ్వానాన్ని అందుకొని నగరి సందర్శించి ఆతిథ్యం పుచ్చుకోవడం కూడా చూశాం. ఇవన్నీ అబద్ధాలైనట్లు కేటీఆర్‌, హరీష్‌ రావులు ఇప్పుడు ఇష్టానుసరాంగా మాట్లాడుతున్నారు.

ఇకనైనా చేసిన తప్పులు ఒప్పుకోండి. లేదా బుకాయించడమైనా మానండి. జగన్‌ కూడా తన తండ్రి వైఎస్‌ లాగా హుందాగా ఉండడం నేర్చుకోవాలి. ఇరు పార్టీల నేతలు హుందాగా ప్రతిపక్ష బాధ్యతలు నెరవేర్చాలి. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపాలి. ప్రజలకు మేలుచేసేలా చర్యలు ఉండాలి. ప్రతిపక్ష పాత్రను క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా నిర్వర్తించినప్పుడే ప్రజలు ఆదరిస్తారని గుర్తించాలి.
…..

Latest News

నల్లా దానంతటదే బందైతది!|ADUGU TRENDS

నల్లా పెట్టుడే కాదుల్లా, బంజేసుడు కూడా పెద్ద పనే. నల్లా తిప్పితే నీళ్లొత్తయి. కనీ, నల్లా బంజేయాల్నంటే, గాడ కావలి కాయాలె. లేకపోతే, నా నీల్లన్నీ తొణికి, బయటకి కారిపోతయి. గట్ల కావొద్దని...

‘మమత’ల కోవెలలో వేరుకుంపట్ల కలతలు|EDITORIAL

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మూడు దశాబ్దాలకుపైగా కొనసాగిన వామపక్ష పాలనకు ముగింపు పలికి, 2011లో అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా మార్చేశారు. గత పదిహేనేళ్లుగా...

04-06-2026, గురువారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:44 సంకల్ప తిథి: కృష్ణ-చవితి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-చవితి తిథి : కృష్ణ-చవితి రాత్రి 11:30 వరకు, తదుపరి...

ట్రాక్టర్ ట్రాలే స్విమ్మింగ్ పూల్!?|ADUGU TRENDS

ఎన్కటికి శేద బాయిలు, ఈత బాయిలుండేయి. శేద బాయిలు మంచినీల్లకు, ఈత బాయిలు ఎండాకాలం పిల్లలు, పెద్దలు ఈదడాన్కే ఉండేటియి. ఊరు ఊరంతా గా బాయిల్లనే ఉండేది. ఈత మీద మోజు తగ్గనోల్లు,...

ఇంధన రేషనింగ్ విధానమే మేలు!|EDITORIAL

ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సవాల్ కేవలం పెట్రోల్ ధరల పెరుగుదల మాత్రమే కాదు. అది ఇంధన భద్రత, ఆర్థిక స్థిరత్వం, ప్రజల జీవన ప్రమాణాలకు సంబంధించిన అంశం. ధరలను పెంచి భారాన్ని ప్రజలపై...

03-06-2026, బుధవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:44 సంకల్ప తిథి: కృష్ణ-చవితి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-చవితి తిథి : కృష్ణ-చవితి రాత్రి 11:30 వరకు, తదుపరి కృష్ణ-పంచమి నక్షత్రము...

పెండ్లంటే, గిదే పొండ్లి!?|ADUGU TRENDS

ఇగో పెండ్లంటే గిదే.. గిట్లనే.. అబ్బో గట్లనా? అన్నట్లుగా శేసుకుంటాండ్లు. లచ్చలు, కోట్లు కర్సు పెడ్తాండ్లు. పెండ్లి పిల్ల, పిల్లగాండ్ల మీద కోట్లు కుమ్మరిస్తాండ్లు. కట్న కానుకలతోటి పని లేకుండ, పెండ్లి కర్సునే...

తెలంగాణ ఆవిర్భావం-ప్రజల ఆశలు, ఆశయాలు!|EDITORIAL

మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అప్పుల కుప్పగా తెర్లైంది. ప్రస్తుతం రాష్ట్ర రుణభారం రూ.7 లక్షల కోట్లకు పైగా చేరింది. అప్పులు తీసుకోవడం తప్పు కాదు. కానీ ఆ అప్పులు ఉత్పాదక ఆస్తులుగా...

03-06-2026|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు https://www.instagram.com/reel/DZDc5uGy3Lk/?igsh=ZWtxaG1ka3BwOWd2 సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:43 సంకల్ప తిథి: కృష్ణ-తదియ శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-తదియ తిథి : కృష్ణ-తదియ...

ఐపీఎల్ లో 5 అవార్డులు గెలుచుకున్న వైభవ్|IPL|VAIBHAV SURYAVANSHI

అవార్డుల వర్షం కురిపించిన స్టార్ ఆటగాళ్లు! ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ అభిమానులకు ఎన్నో ఉత్కంఠభరిత క్షణాలను అందించింది. యువ ఆటగాళ్ల సత్తా, సీనియర్ క్రికెటర్ల అనుభవం, చివరి బంతి వరకు సాగిన...

ఈ సాలా కప్ నమ్దే రీలోడెడ్|RCB|IPL|CUP|FINAL

గుజరాత్‌ను మట్టి కరిపించిన RCB ఐపీఎల్ 2026 మకుటాన్ని ముద్దాడిన బెంగళూరు! ఐపీఎల్ 2026 ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరోసారి చరిత్ర సృష్టించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్...

01-06-2026|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:43 సంకల్ప తిథి: కృష్ణ-పాడ్యమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-పాడ్యమి తిథి : కృష్ణ-పాడ్యమి సాయంత్రం 4:39 వరకు, తదుపరి కృష్ణ-విదియ నక్షత్రము...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News