బాబుకు ధన్యవాదాలు తెలిపిన సతీష్ బాబు|CHANDRABABU|CM
రాష్ట్ర రాజకీయాల్లో, సామాజిక సేవలో, క్రీడా రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, తెలుగుదేశం పార్టీ నేత సానా సతీష్ బాబు రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా ఎంపికై ప్రజాసేవలో సరికొత్త మైలురాయిని అధిరోహించారు. సామాన్య కుటుంబం నుండి అసామాన్య స్థాయికి ఎదిగిన ఆయన ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం. 1972లో కాకినాడలో జన్మించిన సతీష్ బాబు, మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఏపీ ఎలక్ట్రిసిటీ బోర్డులో సబ్ ఇంజనీర్గా ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం సమాజంలో మార్పు తేవాలనే తపనతో వ్యాపార, సామాజిక సేవా రంగాల్లోకి అడుగుపెట్టారు. “సానా సతీష్ బాబు ఫౌండేషన్” ద్వారా సొంత నిధులతో విద్య, వైద్య, ఉపాధి రంగాల్లో విశేష సేవలు అందిస్తున్నారు. కాకినాడ జి జి హెచ్ ఆసుపత్రి సామర్థ్యాన్ని 2500 పడకలకు పెంచడంతో పాటు, ఓఎన్జిసి నిధులతో ₹16 కోట్ల విలువైన అత్యాధునిక క్యాన్సర్ చికిత్స పరికరాలను సమకూరుస్తున్నారు. యువత ఉపాధి కోసం ₹15 కోట్లతో శాశ్వత స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని నిర్మిస్తూ, ఏలూరు జిల్లాలో ‘చిన్నారి నేత్రాలు’ కార్యక్రమం ద్వారా వేలాది మంది విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు చేయించారు. కాపు సామాజిక వర్గ సమస్యలపై, భవనాల నిర్మాణాలపై ఆయన ప్రత్యేక కృషి చేశారు. రాజకీయాల్లో నారా లోకేష్ గారి ‘యువగళం’ పాదయాత్రను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతం చేయడంలోను, ఎన్నికల కోఆర్డినేటర్గా 21 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలను కూటమి క్లీన్ స్వీప్ చేయడంలోను ఆయన కీలక పాత్ర పోషించారు. విపత్తుల సమయంలోనూ ఆయన ముందుంటారు. నేపాల్ భూకంప సంక్షోభంలో చిక్కుకున్న 236 మంది తెలుగువారిని సొంత ఖర్చులతో చార్టర్డ్ విమానంలో రక్షించారు. ఇటీవలి ‘మొంథా’ తుఫాన్ సమయంలో వాలంటీర్ల సైన్యంతో సహాయక చర్యలు అందించి సీఎం చేతుల మీదుగా మంథా వారియర్ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఎసిఎ) గౌరవ సెక్రటరీగా విశాఖ స్టేడియం రూపురేఖలు మార్చడమే కాకుండా, ఏడాదిలోనే 9 అంతర్జాతీయ మ్యాచ్లు నిర్వహించి ఏపీ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేశారు. వేదిక ఏదైనా లక్ష్యం ప్రజా సంక్షేమమే అని నిరూపిస్తున్న సతీష్ బాబు గారి సేవలను గుర్తించి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎన్డీఏ జాతీయ పెద్దల ప్రోద్బలంతో ఆయనను మరోసారి రాజ్యసభకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా తనను రాజ్యసభకు మరోసారి ఎంపిక చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం చంద్రబాబు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్, రాష్ట్ర నాయకత్వానికి సానా సతీష్ బాబు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు.

