Friday, July 17, 2026
26.4 C
Hyderabad

అరాచక రాజకీయాలు! అనేక డ్రామాలు!!|EDITORIAL

గతంలో నాయకులు సేవా భావంతో రాజకీయాల్లోకి వచ్చేవారు. నిస్వార్థంగా సేవ చేసేవారు. నిష్టతో నిరుపేదలని ఆదుకునేవారు. మనసా, వాచా, కర్మణ త్రికరణ శుద్ధితో నిస్వార్థ ప్రజాసేవకే వాళ్ళ జీవితాలను అంకితం చేసేవారు. అందుకే గాంధీజీని ఇంకా మనం మన జాతిపితగా, నెహ్రూని భారత నిర్మాతగా, పటేల్ ని ఉక్కు మనిషిగా, శాస్త్రిని ఆదర్శవాదిగా, అబ్దుల్ కలామ్ ని నిరాడంబర జీవిగా, తెలంగాణ కోసం పదవులను త్యాగం చేసి, బతికినంత కాలం అదే ఆశయం కోసం పోరాడిన కొండా లక్ష్మణ్ బాపూజీని కొనియాడుతున్నాం. వాళ్ళను అనుకరించే వాళ్ళు కూడా ఇంకా అక్కడో, ఇక్కడో, ఎక్కడో నూటికో కోటికో ఒక్కరు ఉన్నారు కాబట్టే రాజకీయాలు కూడా నడుస్తున్నాయనేవాళ్ళూ ఉన్నారు. రాను రాను రాజకీయాలంటే అరాచకంగా మారిపోయాయి. పార్టీలు, నేతలూ అంతా కలగలిసి దోచుకుందాం, దాచుకుందామనే పనిలోనే ఉన్నారు. ఇందుకు వాళ్ళు ఆడని అబద్ధం లేదు, చేయని తప్పు లేదు. తత్ఫలితంగా మొత్తం దేశం, రాష్ట్రాలు దివాళా తీసేస్తున్నాయి.

ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ అప్పులు విపరీతంగా పెరిగాయి. ఉద్యోగులకు జీతాలివ్వలేని దుస్థితి. ఒకరిని మించి ఒకరు అప్పులపైనే ఆధారపడుతున్నారు. ప్రజా ప్రతినిధులుగా, ప్రభుత్వానికి కేర్ టేకర్లుగా వ్యవహరించాల్సిన పీఎం, సీఎంలు రియల్ ఎస్టేట్ సీఇఓలు గా వ్యవహరిస్తున్నారు. చేసిన వేలకోట్ల అప్పులకు వడ్డీలు చెల్లిస్తున్నారు తప్ప, దుబారాను అరికట్టే ప్రయత్నం చేయడం లేదు. నేతల జీతభత్యాలు, పెట్టుబడుల కోసం దేశదేశాలు తిరగడానికి ప్రత్యేక విమానాలు, హెలీక్యాప్టర్లకయ్యే ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నాయి. ఉచిత పథకాల పద్దు ఎలాగూ ఉంది. ప్రజలు కూడా ఉచితాలకు అలవాటు పడితే, తిరిగి వారిమీదే ఆ ఆర్థిక భారం పడుతుంది. ఏ పార్టీ, ఏ నేతా వారి జేబుల్లో నుంచో, లేక వారు ఆబగా అడ్డంగా సంపాదించిన ఆస్తులమ్మో వారి పార్టీలను, ప్రభుత్వాలను నడపరు. ప్రజలు కట్టే పన్నుల నుంచే అభివృద్ధి, సంక్షేమం, ప్రభుత్వం, పాలకులు, అధికార యంత్రాంగం, సేవలు, ఆర్టీసీ అన్నీ అందులోనుంచే నడుస్తాయన్నది మరచిపోవద్దు.

అధికార వ్యామోహానికి వ్యసనంగా అలవాటు పడ్డ మన నేతలు ఆ పదవులను కాపాడుకోవడానికి, తిరిగి పొందడానికి ఎన్ని వేషాలైనా వేస్తున్నారు. ఏపీలో చంద్రబాబు అమరావతి, పి-4 అంటూ పరుగులు తీస్తున్నారు. ఉన్న భూమి చాలదన్నట్లు మరో 45 వేల ఎకరాలకు టెండర్‌ పెట్టారు. జగన్‌ను విమర్శిస్తూనే, మరిన్ని అప్పులు చేసేస్తున్నారు. వడ్డీల భారం ప్రజలకు తప్పడం లేదు. తెలంగాణలోనూ ఇదే పరిస్థితి. మరోవైపు రాజకీయంగా ఎదురుదాడితో నిరంతరం విమర్శలకు దిగుతున్నారు. సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు చేశామంటున్నారు సరే, వాటికి నిధులేవీ? అంటే తిరిగి అప్పులే. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికను ఎజెండా చేసుకుని అధికార, ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. జగన్‌ అధికారంలో ఉండగా అంతకుమించి అన్నట్లుగా వ్యవహరించారు. ఇప్పుడు టీడీపీ కూటమికి సమయం వచ్చింది. అంతే. సింగపూర్‌ పర్యటనను కూడా రాజకీయం చేసేశారు. ఇంతకూ ఎవరి మీద ఎవరు కేసులు పెడతామన్నారనేది త్వరలో ప్రజలకు తెలుస్తుంది. ఏపీలో జగన్‌ వర్సెస్‌ కూటమిగా రాజకీయం నడుస్తుంటే, చెల్లి షర్మిల సమయం చిక్కినప్పుడల్లా అన్న జగన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.
తెలంగాణలో ప్రస్తుతం 42శాతం బీసీ రిజర్వేషన్ల రాజకీయం నడుస్తోంది. ముడు ప్రధాన పార్టీల ఒకరిని ఒకరు నిందించుకుంటున్నాయి. వేర్వేరుగా ఏ ఒక్క పార్టీ కానీ, కలిసి మూడు పార్టీలు కానీ బీసీల రిజర్వేషన్ల కోసం చిత్తశుద్ధిగా పని చేయడం లేదు. ఈ డ్రామా స్థానిక ఎన్నికల తర్వాత కూడా కొనసాగేలా ఉంది. మరో విచిత్రం ఏమంటే, మూడు పార్టీలు మిగతా రెండు పార్టీలను కుమ్మక్క అయ్యాయని పరస్పరం నిందించుకుంటున్నాయి. రాజకీయ మైలేజీ కోసం నానా తంటాలు పడుతున్నాయి.
ఇక తెలంగాణ రాజకీయాల్లో మరో తమాషా నడుస్తోంది. బీజేపీలో కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్‌లు మూడు శిబిరాలైతే, ఈటలకు పదవి రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కుకుండా మిగతా రెండు శిబిరాలు కలిసి అడ్డుకున్నాయి. బీఆర్‌ఎస్‌లో కేసీఆర్‌, కేటీఆర్‌, కవిత, హరీశ్‌ల మధ్య ప్రత్యక్ష పోటీ బయటకు కనిపిస్తుంది. కానీ లోలోన అంతా ఒక్కటే. బీఆర్ఎస్, బీజేపీ విలీనాన్ని తాను జైల్లో ఉండి ఆపానని కవిత అంటుంటే, ఆమె వెనక అదృశ్య శక్తులు చేరాయని విధేయ నేతలతో ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్‌ది ఓ కలహాల కాపురం అనేక గ్రూపులుగా అంతా కలిసే వున్నారు. పానకంలో పుడకలా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి మంత్రి పదవి ఎపిసోడ్ నడుస్తూనే ఉంది.
ఒకప్పుడు కుటుంబానికో రాజకీయ నేతలుంటే మహా ఎక్కువ. ఇవ్వాళ అన్నీ కుటుంబ రాజకీయాలే! రాజకీయాలు లాభసాటి వ్యాపారంగా మారాయి. అందుకే అన్ని పార్టీల రాజకీయ నేతలూ నాటకాలు ఆడుతున్నారు. పార్టీలు కూడా కొన్ని కులాలు, కుటుంబాలు, వ్యక్తులు, వర్గాల చేతుల్లో బందీగా మారాయి. ఇప్పుడు ప్రజలకు ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. ‘వాడు పోతే వీడు, వీడు పోతే వాడు, వాడి…’ అనే సినిమా డైలాగ్ లాగా, పరిస్థితి దాపురించడంతో అన్నీ పార్టీలు అడిందే ఆట, వేసిందే డ్రామాలా మారిపోయింది. ప్రజలు అన్నీ గమనిస్తుంటారు. సమయం వచ్చినప్పుడే స్పందిస్తారన్నది మరచిపోవద్దు.

Latest News

కరువు కోరలు!|Fangs of drought

ఇప్పటికి 33శాతమే వర్షం నమోదు!! రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రం అడుగంటుతున్న జలాశయాలు జీవ నదుల్లోనూ జల జీవమే లేదు రిజర్వాయర్లలోనూ ఇదే పరిస్థితి సాగుకు తొందరొద్దంటున్న నిపుణులు ప్రత్యామ్నాయ పంటలపై కార్యాచరణ 20వ తేదీ తర్వాత పత్తి విత్తనాలేయొద్దు బోరుబావుల కింద వరి...

మొక్క నాటుండ్రి.. డిస్కౌంట్లు పొందుండ్రి!?|ADUGU TRENDS

పర్యావరణానికి మూలం మొక్కే. గా మొక్కే చెట్టై, మహా మానై మనల్ని రచ్చిత్తది. గీ భూమి, వాతావరణం మొత్తం గా మొక్కల మీదనే ఆధారపడ్డది. కనీ, మనమేం చేత్తానం? ఏడికాడికి శెట్లని తెగ...

‘ఢీ’లిమిటేషన్ రాజకీయాలు!?|EDITORIAL

డీలిమిటేషన్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ సంస్కరణలలో ఒకటిగా నిలవనుంది. ఇది కేవలం సీట్ల సంఖ్య మార్చే ప్రక్రియ కాదు, భవిష్యత్ రాజకీయ ప్రాబల్య సమీకరణాలను నిర్ణయించే కీలక ఘట్టం....

జూలై 17, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం దక్షిణాయణం ప్రారంభం తిధి తదియ ఉదయం 09.54 వరకు ఉపరి చవితి నక్షత్రం మఖ రాత్రి 10.51 వరకు ఉపరి పుబ్బ యోగం సిద్ది ఉదయం 05.00 వరకు ఉపరి వ్యతీపాత కరణం గరజి ఉదయం 09.54...

సింధు నాగరికత|ADUGU|SPECIAL|COMPITITIVE|EXAMS

నాగరికత మరియు సంస్కృతికి తేడా నాగరికత పూర్తిగా అభివృద్ధి చెందిన మరియు ఉన్నతమైన జీవనాన్ని గడిపినట్లయితే మరియు ప్రజలు పట్టణ, శాస్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రణాళికాబద్ధంగా ఉంటే దానిని నాగరికత అంటారు. సంస్కృతి సంస్కృతి అనేది ప్రతీ ఒక్కరికీ...

‘ప్రభంజన’ పథం ప్రజ్వరిల్లాలి|ESSAY|SPECIAL

జూలై 16, 2025. సరిగ్గా ఏడాది క్రితం జర్నలిస్టు, వక్త, కవి, రచయిత, మేధావి, అభ్యుదయవాది, వివేకశీలి, చైతన్యవంతుడు, నిరంతర పోరాట శీలి అయిన ప్రొఫెసర్ యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ పరమపదించారు....

రోడ్లకు కూడా ఆపరేషన్లు!?|ADUGU TRENDS

గిప్పటి దాకా మనం మనుసులకు, జంతువులకు ఆపరేషన్లు సేసుడే సూసినం. కనీ, గీ యింతను ఎక్కడా సూడలే.! గా బిహార్ రాస్ట్రంల కొత్తగ, ఎక్కడా లేని లెక్కల, రోడ్లకు కూడా ఆపరేషన్లు సేత్తాండ్రు....

నదుల అనుసంధానమే జల భద్రతకు శాశ్వత మార్గం!|EDITORIAL

ఎల్‌నినో ప్రభావాన్ని ఆపడం మన చేతుల్లో లేదు. కానీ, దాని వల్ల కలిగే నష్టాన్ని శాస్త్రీయ ప్రణాళికలు, సమర్థమైన జల నిర్వహణ, నదుల అనుసంధానం, నీటి సంరక్షణ, వాతావరణ అనుకూల వ్యవసాయం ద్వారా...

జూలై 16, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం పూరి జగన్నాధ రధోత్సవం తిధి శు విదియ ఉదయం 11.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఆశ్లేష రాత్రి 11.40 వరకు ఉపరి మఖ యోగం వజ్ర ఉదయం 08.20 వరకు ఉపరి సిద్ది కరణం కౌలవ...

ఆషాఢమాసం రహస్యాలు|ASHADAM|SECRETS

ఆచారాలు, శాస్త్రం, సంప్రదాయాల వెనుక నిజాలు ఆషాఢమాసం విశేషాలు – ఆధ్యాత్మికత, ప్రకృతి, సంప్రదాయాలు, కుటుంబ బంధాల వెనుక అసలు కథ ప్రతి ఆచారం వెనుక ఒక అర్థం... ప్రతి సంప్రదాయం వెనుక ఒక జీవన...

ఉడుతా మిడతా!?|ADUGU TRENDS

మనం మన సుట్టుముట్టు ఉడుతల్ని సూత్తనే ఉంటం. పొలాలల్ల, రోడ్ల మీద అటిటుపోతనే ఉంటయి. సిడెం సేపట్లనే కనబడ్తయి, ఆడ్తయి. ఉరుకుతయి. ఎన్కట గా రాముడికి వారధి కట్టుట్ల గీ ఉడుత సాయం...

ఓటర్ల సవరణకు శాశ్వత పరిష్కారం లేదా!?|EDITORIAL

గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు, పట్టణాల్లో వార్డు కార్యాలయాలు, మీ సేవ వంటి పౌర సేవా కేంద్రాలను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తే ప్రజలకు సౌలభ్యం పెరుగుతుంది. బీఎల్‌వోలపై పూర్తిగా ఆధారపడకుండా బహుళస్థాయి ధ్రువీకరణ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News