Tuesday, June 30, 2026
24.4 C
Hyderabad

Komuravelli|కొమురెల్లి మల్లన్న కొంటెతనమా!? Konda Surekha

-పట్నాలు తొక్కిప పాపగుణమా!?
-ఎప్పటికైనా శాంతి పూజ తప్పదా?
-అప్పటి వరకు ఈ అశాంతి వీడదా?
-సెంటి ‘మెంటలై’పోతున్న అనుచరులు!
-మంత్రి కొండా సురేఖకు వరుస వివాదాలు అందుకేనా!

కొమురెల్లి మల్లన్న కొంటెతనమో!? ‘పట్నాలు’ తొక్కిన పాపగుణమో!? కానీ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ, అటవీశాఖల మంత్రి కొండా సురేఖ వివాదం మీద వివాదంగా తీవ్ర వివాదాల్లో కూరుకుపోతున్నారు. గత ఏడాదిగా ఆమె మాటలు మంటలు రేపుతున్నాయి. ఆమె వ్యాఖ్యలు ఆమెపైనే వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నాయి. ఎప్పటికైనా శాంతి పూజ తప్పదన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. అప్పటి వరకు ఈ అశాంతి వీడే అవకాశమే లేదని, భక్తి సెంటిమెంటుతో రగిలిపోతున్న ఆమె అనుచరులు సెంటి ‘మెంటలై’ పోతున్నారట! మంత్రి కొండా సురేఖకు వరుస వివాదాలు అందుకేనంటూ చెయ్యెత్తి జై కొడుతున్నారట! మరి ఈ వివాదాల నుంచి బయటపడటానికి కొండా దంపతులు ఏం చేస్తారన్నది ఆసక్తిగానే కాదు ఉత్కంఠగా మారింది.!

Konda Surekha| కొండా సురేఖ మంత్రి హోదాలో గత ఏడాది జనవరిలో చేర్యాల సమీపంలోని కొమురెల్లి మల్లన్నను దర్శించుకున్నారు. ఆ సందర్భంగా కొమురెల్లిలో ఎంతో భక్తి శ్రద్ధలతో, నిష్టతో వేసే పట్నాలను అనుకోకుండా పొరపాటుగా తన మనవడిని ఎత్తుకుని మంత్రి తొక్కారట. ఆ తర్వాత ఆ చర్యను సరిదిద్దుకున్నారు. అయితే, కొమురెల్లిలో పట్నాలను పిల్లలు, శివసత్తులు, ఒగ్గుపూజారులు మాత్రమే వాటిని తొక్కువచ్చని భక్తుల నమ్మిక. పట్నాలు కొమురెల్లి పట్నాలు మల్లన్న ఆలయంలో నిర్వహించే ఒక ప్రత్యేకమైన సాంప్రదాయం. మల్లన్న ని ఆరాధించే ఒక భాగం. భక్తులు తమ కోరికలు, నమ్మకాలను స్వామికి తెలియజేసే ఒక మార్గం. భక్తులు పసుపు, కుంకుమ, ఇతర రంగుల పొడితో రంగోలి గీస్తారు. ఆలయం లోపల, వెలుపల వరండాలో మల్లన్న స్వామికి ముందు పట్నాలు వేస్తారు.

అయితే, ఆనాటి నుండి వరసగా ఏదో ఒక వివాదంలో మంత్రి సురేఖ ఉంటున్నారట. ఆమె ఏం మాట్లాడినా అదొక వివాదాస్పదం అవుతోందట. సాటి మహిళ, హీరోయిన్ సమంత విషయంలో నోరు జారి అక్కినేని నాగార్జున వేసిన పరువు నష్టం కేసులో మంత్రి స్థాయిలో కోర్టు మెట్లు ఎక్కారు.

ఆ మధ్య ఓ ఫోన్ ఆడియోలో ఆమె సంబాషణలు అన్ పార్లమెంటరీ భాషతో వివాదాస్పదమయ్యాయి. మొన్న ఒక ప్రెస్ మీట్ తర్వాత, అక్కడ మైకులు ఆన్ లో ఉన్నాయని కూడా చూసుకోకుండా, ‘మా అన్నయ్య వాళ్ళ మనుమడు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివాడు, ఉద్యోగం ఇప్పంచండి’ అని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబును అడిగి వైరల్ అయ్యారు. నిన్న వరంగల్ లో ప్రపంచ సుందరీమణుల ముందు వచ్చీ రాని ఇంగ్లీష్ లో మాట్లాడి నవ్వుల పాలయ్యారు.

పిల్లలతో ఓ స్కూల్ మీటింగులో ‘అటవీశాఖ మంత్రిగా ఉన్నాను. కాబట్టి నా దగ్గరకు కొన్ని కంపెనీల ఫైళ్ళ క్లియరెన్స్ కోసం వస్తాయి. మమూలుగా అలాంటి ఫైళ్ళు వచ్చినప్పుడు మంత్రులు డబ్బులు తీసుకుని క్లియర్ చేస్తారు. అప్పుడు వాళ్ళతో నేను అన్నా… మాకు ఒక్క నయాపైసా ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు సమాజ సేవ చేయండి. మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి. మీ పేరు గుర్తుండి పోతుందని చెప్పా. అప్పుడు మా చేతుల్లో లేదు. పై వాళ్ళతో మాట్లాడతామని అరబిందో ఫార్మాకుచెందిన సదానందరెడ్డి చెప్పారు. చివరకు సిఎస్ఆర్ నిధులు రూ.4.5 కోట్లతో కాలేజీ భవనం కడతామని చెప్పినప్పుడు నాకు సంతోషం కలిగింది.’ అన్నారు.

ఆ వివాదాన్నుంచి తప్పించుకోవడానికి నోరు విప్పి మరో వివాదంలోకి కూరుకుపోయారు. ‘నిన్న వరంగల్‌లో నేను చేసిన వ్యాఖ్యలపై కొంతమంది పనిగట్టుకుని తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారు. నేను గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, అప్పటి మంత్రులు ఏ పని చేయాలన్నా పైసలు తీసుకునేవారని మాత్రమే అన్నాను. ఇది అక్షర సత్యం. నా ఆ వ్యాఖ్యలకు నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను.’ అన్నారు.

మొత్తంగా మంత్రి సురేఖ, రాష్ట్ర కేబినెట్ లోనే కాంట్రవర్సీ లకు కేరాఫ్ గా మారారు. సురేఖ వ్యవహారంపై గతంలోనే ఎఐసీసీ అసహనం వ్యక్తం చేసింది. తాజా ఇష్యూతో తోటి మంత్రులు తల పట్టుకుంటున్నారట. మరోవైపు ఆమె మాటలు CM|సీఎం రేవంత్ రెడ్డికి ఇబ్బందిగా మారుతున్నాయట.

అయితే, మల్లన్న పట్నం తొక్కినప్పటి నుండే ఇలా జరుగుతోందని ఆమె అనుచరులు తెగబాధ పడుతున్నారట. శివ సత్తులు, చిన్న పిల్లలు , ఒగ్గుపూజారులు మాత్రమే పట్నం తొక్కాలి కానీ తన మనువడితో పట్నం తొక్కిన మంత్రి సురేఖ పరేషాన్ అవుతోందని అమె అనుచరులు లోలోన కుమిలిపోతున్నారట. శాంతిపూజ చేస్తే తప్ప దోషం పోదని ఒగ్గుపూజారులు అంటున్నారట. మంత్రి కొండా సురేఖ అనుచరులు ఈ విషయాన్ని ఆమెకు ఎలా చెప్పాలో తెలియక లోలోన మథనపడుతున్నారట. పోనీ కొండా మురళీకి చెబుతామన్నప్పటికీ ఆయన వినిపించుకుంటారో లేదోనని ఆవేదన పడుతున్నారట. అందుకే ఒగ్గు పూజారుల ద్వారా Minister|మంత్రి కొండా సురేఖ దంపతులకైతే చేరవేయగలిగారట. ఇప్పటికే ఈ విషయాన్ని కొండా దంపతులకు ఒగ్గుపూజారులు చెప్పి చూశారట. ఇంకా నిర్ణయం తీసుకోలేకపోతున్న కొండా దంపతులు మాత్రం దీర్ఘాలోచనలో పడ్డారట!? మరి వివాదాల నుంచి బయటపడటానికి కొండా దంపతులు ఏం చేస్తారన్నది ఆసక్తిగానే కాదు ఉత్కంఠగా మారింది!

Latest News

పురుగుల శాక్లేట్లు!?|ADUGU TRENDS

శాకిలేట్లంటే ఎవ్వలికైనా ఇట్టమే.! శిన్న పిల్లలైతే నాక్కుంట, శీక్కుంట మరీ ఇట్టంగ తింటరు. గా శాకిలేట్ శేతికిత్తిమా శెప్పినట్టింటరు. అన్నం తింటరు. ఏడుపాపుతరు. శెప్పింది చేత్తరు. గందుకే పిల్లలకు బాజర్ల శాకిలేట్లు కొనిపిచ్చుడు...

యుద్ధం ముగిసిందా? ఎగసిందా!?|EDITORIAL

యుద్ధం ఎప్పుడూ విజేతలను కాకుండా, మరింత విధ్వంసాన్ని మాత్రమే మిగులుస్తుందనే చారిత్రక సత్యం. పశ్చిమాసియాలో శాంతి నెలకొనడం కేవలం ఆ ప్రాంత దేశాలకే కాదు, ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి కూడా అత్యంత అవసరం....

జూన్ 30, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి పాడ్యమి పూర్తిగా రోజంత నక్షత్రం పూర్వాషాఢ పూర్తిగా రోజంత యోగం బ్రహ్మ మధ్యాహ్నం 03.33 వరకు ఉపరి ఐంద్ర కరణం బాలవ సాయంత్రం 05.07 వరకు ఉపరి కౌలవ రాహుకాలం పగలు 03.00 నుండి 04.30...

జూన్ 29, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి తెల్ల 04.12 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం మూల రాత్రి తెల్ల 03.31 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం శుక్ల మధ్యాహ్నం 02.53 వరకు ఉపరి బ్రహ్మ కరణం భద్ర మధ్యాహ్నం...

దంటగాడు!?|ADUGU TRENDS

రక్త సంబంధీకులు, కుటుంబ సభ్యులకంటే గూడా దంటగాల్లే ఎక్కువ అంటరు. ఎవలికీ శెప్పుకోలేనివి గా దంటగాల్లకు శెప్పుకుంటరు. గవాల్లు గూడా బాగా సూసుకుంటరు. నీ గురించి అన్నీ తెలిసి కూడా నిన్ను ప్రేమించేవాడు,...

ప్రశ్నార్థకంగా ప్రశ్నించే సంస్కృతి!?|EDITORIAL

అధికారాన్ని నియంత్రించేది చట్టం. చట్టాన్ని సజీవంగా ఉంచేది ప్రజల అప్రమత్తత. ఈ రెండింటి మధ్య వంతెనగా నిలిచేది ప్రశ్నించే సంస్కృతి. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి అన్యాయం జరగడం కాదు. అన్యాయం జరిగినా సమాజం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూన్ 28 నుండి జూలై 04 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే...

ఆఖరి మజిలీ అదే!?|ADUGU TRENDS

స్టీవెన్ స్పీల్ బర్గ్ తీసిన ‘ది టర్నినల్’ సినిమా చూసిండ్రా? గా సినిమాకు అసల్ కథ గీయినదే! మనిసి మనుగడ, జీవిత మజిలీలకు గీయినె జీవితమే ఉదాహరణ. గందుకే గా స్పీల్ బర్గ్...

వెనెజువెలా ప్రపంచానికి హెచ్చరిక!?|EDITORIAL

వెనెజువెలా విషాదం ప్రపంచానికి మరో కీలక సందేశాన్ని అందిస్తోంది. ప్రకృతి విపత్తులను ఆపలేకపోయినా, శాస్త్రీయ ప్రణాళిక, భూకంప నిరోధక నిర్మాణాలు, విపత్తు నిర్వహణలో సాంకేతికత వినియోగం, ప్రజల్లో అవగాహన, అంతర్జాతీయ సహకారంతో ప్రాణనష్టాన్ని...

జూన్ 27, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు త్రయోదశి రాత్రి 12.14 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం అనురాధ రాత్రి 10.29 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం సాధ్య మధ్యాహ్నం 01.38 వరకు ఉపరి శుభ కరణం కౌలవ ఉదయం 11.20...

మిగిలేదంతా మట్టే! మరు భూమిల మసే!!|ADUGU TRENDS

గంజి నీల్లు తాగినోడు మట్టిలోనే..! బెంజి కార్ల తిరిగినోడు మట్టిలోనే..!! మనతో తెచ్చిందేమీ లేదు. తీసుకపోయేదేమీ లేదు. మిగిలేదంతా మట్టే! మరు భూమిల మసే!! గీ సూత్రం తెలిసినోల్లు గీ భూమ్మీద మనుసుల్లెక్క...

చమురుకు చలువ పరిణామాలు!?|EDITORIAL

ఇరాన్‌తో చమురు వాణిజ్యానికి మళ్లీ అవకాశం కనిపించడం భారత్‌కు సానుకూల పరిణామమే. చమురు ధరల తగ్గుదల, హర్ముజ్ మార్గంలో స్థిరత్వం, ఇంధన సరఫరా భద్రత వంటి అంశాలు దేశ ఆర్థిక వ్యవస్థకు ఊరటనివ్వగలవు....

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News