Friday, June 19, 2026
37.8 C
Hyderabad

వరల్డ్ కప్ మనదే|WORLD CUP|INDIA

T2O WORLD CUP|టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌లో భారత్ ఘన విజయం…|INDIA|WIN

3RD TIME|మూడోసారి ప్రపంచ ఛాంపియన్|WORLD|CHAMPION

అహ్మదాబాద్‌లో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శనతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి మూడోసారి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. మ్యాచ్ మొత్తం భారత్ ఆధిపత్యం ప్రదర్శించగా, బ్యాటింగ్‌లో టాప్ ఆర్డర్ ఆటగాళ్లు దూకుడుగా ఆడి భారీ స్కోరు నమోదు చేశారు. లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ జట్టు భారత బౌలర్ల దాడికి తట్టుకోలేక చివరికి 96 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. ఈ విజయం ద్వారా భారత్ మరోసారి టీ20 ప్రపంచ క్రికెట్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకుంది.

మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ న్యూజిలాండ్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ స్కోరు బోర్డును వేగంగా ముందుకు తీసుకెళ్లారు. సంజూ శాంసన్ అద్భుత ఫామ్‌లో కనిపిస్తూ కేవలం 46 బంతుల్లోనే 89 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో ఆకట్టుకునే ఫోర్లు, సిక్సర్లు ఉండడంతో ప్రేక్షకులను అలరించాడు. మరోవైపు అభిషేక్ శర్మ కూడా ఆగ్రెసివ్‌గా ఆడుతూ కేవలం 21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేసి అర్ధసెంచరీ నమోదు చేశాడు. ఈ ఇద్దరు కలిసి తొలి వికెట్‌కు 98 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత జట్టుకు బలమైన పునాది వేశారు.

మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఇషాన్ కిషన్ కూడా తన దూకుడును కొనసాగిస్తూ న్యూజిలాండ్ బౌలర్లను ఇబ్బంది పెట్టాడు. అతను కేవలం 25 బంతుల్లోనే 54 పరుగులు సాధించి జట్టుకు భారీ స్కోరు దిశగా దారితీశాడు. అయితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. అతను ఎదుర్కొన్న తొలి బంతికే అవుట్ అవడంతో అభిమానులకు నిరాశ కలిగింది. చివరి ఓవర్లలో శివమ్ దూబే చెలరేగి ఆడాడు. అతను కేవలం 8 బంతుల్లోనే 26 పరుగులు సాధించి భారత స్కోరు మరింత పెంచాడు. దీంతో భారత జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.

256 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టుకు ఆశించిన ఆరంభం లభించలేదు. భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ కివీస్ జట్టుపై ఒత్తిడి పెంచారు. జట్టు స్కోరు 31 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఫిన్ అలెన్ అవుట్ కావడంతో న్యూజిలాండ్ మొదటి వికెట్ కోల్పోయింది. వెంటనే 32 పరుగుల వద్ద రచిన్ రవీంద్ర కేవలం 1 పరుగుతో పెవిలియన్ చేరడంతో కివీస్‌కు మరో పెద్ద షాక్ తగిలింది.

ఈ సమయంలో ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ ఒక్కడే పోరాడే ప్రయత్నం చేశాడు. అతను కేవలం 26 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అయితే మిగతా బ్యాటర్లు భారత బౌలర్లకు ఎదురు నిలవలేక వరుసగా అవుట్ అయ్యారు. గ్లెన్ ఫిలిప్స్ 5 పరుగులు మాత్రమే చేసి అవుట్ కాగా, మార్క్ చాప్‌మన్ 3 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. చివరికి న్యూజిలాండ్ జట్టు 19 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలింది.

దీంతో భారత్ 96 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ విజయంతో భారత జట్టు మూడోసారి టీ20 ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి అభిమానులను ఆనందంలో ముంచెత్తింది.

డారిల్ మిచెల్‌కు క్షమాపణలు చెప్పిన అర్ష్‌దీప్ సింగ్

మ్యాచ్ సందర్భంగా న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో భారత బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ బంతిని వికెట్ల వైపు విసరగా అది మిచెల్‌కు బలంగా తాకింది. తన బౌలింగ్‌లో వరుసగా సిక్స్‌లు బాదడంతో అర్ష్‌దీప్ సింగ్ కొంత అసహనానికి గురై బంతిని వికెట్ల వైపు కొట్టినట్టు కనిపించింది. దీంతో డారిల్ మిచెల్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఇద్దరి మధ్య మైదానంలో కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సమయంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జోక్యం చేసుకుని పరిస్థితిని చల్లార్చాడు. మిచెల్‌కు క్షమాపణలు చెప్పగా, ఫీల్డ్ అంపైర్ కూడా అర్ష్‌దీప్ సింగ్‌ను మందలించాడు. అనంతరం ఆ ఓవర్ ముగిసిన వెంటనే అర్ష్‌దీప్ సింగ్ స్వయంగా డారిల్ మిచెల్‌కు క్షమాపణలు చెప్పడంతో వివాదం ముగిసింది.

మ్యాచ్ అనంతరం బ్రాడ్‌కాస్టర్ హోస్ట్ హర్షా భోగ్లే ఈ ఘటనపై ప్రశ్నించగా అర్ష్‌దీప్ సింగ్ తన వివరణ ఇచ్చాడు. తాను ఉద్దేశపూర్వకంగా బంతిని మిచెల్‌పైకి విసరలేదని స్పష్టం చేశాడు. బంతి రివర్స్ స్వింగ్ కావడంతో అతనికి తగిలిందని తెలిపాడు. ఇప్పటికే మిచెల్‌కు క్షమాపణలు చెప్పినట్లు పేర్కొన్నాడు. ఈ విజయం తమ జట్టుకు ఎంతో ప్రత్యేకమని, కానీ ఈ ఆనందాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఇంకా కొన్ని రోజులు పడుతుందని అన్నాడు. జట్టులో చాలా మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారని, ఈ విజయం తమకు చిరస్మరణీయమైన తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుందని అర్ష్‌దీప్ సింగ్ పేర్కొన్నాడు.

Latest News

ఎక్కువ కాలం ఎవలు బత్కుతరు?!|ADUGU TRENDS

పుట్టిన పతి ప్రాణీ గిట్టక మానది. గట్లనే ఒక్కో జీవికి ఒక్కో ఆయుర్ధాయం ఉంటది. జెల్లీ ఫిష్ కి ఏకంగా అమరత్వమే ఉందంట. గిది వయసైపోయినంక, మళ్ళీ శైశవ దశకు చేరుకుని జీవితాన్ని...

సంకల్పంతోనే కామన్ స్కూల్ విజయవంతం!|EDITORIAL

విద్యారంగంలో నిజమైన సంస్కరణలు రావాలంటే ప్రభుత్వ పాఠశాలల నాణ్యతను పెంచడం, కామన్ స్కూల్ విధానాన్ని దశలవారీగా అమలు చేయడం, ప్రైవేట్ విద్యాసంస్థలపై సమర్థవంతమైన నియంత్రణ విధించడం ఒకేసారి అమలు చేయాలి. తెలంగాణ పబ్లిక్...

జూన్ 19, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు పంచమి రాత్రి 10.13 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఆశ్లేష మధ్యాహ్నం 03.30 వరకు ఉపరి ముఖ యోగం హర్షణ రాత్రి 08.30 వరకు ఉపరి వజ్ర కరణం బవ ఉదయం 11.06...

అంతా ‘పత్తి’త్తులే!?|COTTON|CCI|SCAM

సీసీఐ పత్తి కొనుగోల్ మాల్! తప్పెవరిది? శిక్షలెవరికి? మిల్లర్లు, అధికారుల అనుబంధమేంటి? దళారుల ప్రమేయం నిజం కాదా? మార్కెటింగ్ శాఖదే బాధ్యతా? కేంద్రం ఎందుకు స్పందించదు? వరంగల్ జేడీఎం సప్పెన్షన్! 7గురు మార్కెట్ కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు 84మంది మార్కెటింగ్ అధికారులకు నోటీసులు సీసీఐ పత్తి...

మందుబాబులకో శుభవార్త!|ADUGU TRENDS

ఇగిప్పుడు యేడ సూసినా, తాగి పడేసిన బీరు, విస్కీ సీసాలెనాయె.! పార్కుల్ల, బస్సు స్టాపుల్ల, స్టాండ్లల్ల, రైల్వే స్టేషన్లల్ల, రోడ్ల పక్కల, శెట్ల కింద, ఆకరికి ఏర్గ పోయేకాడ, ఉచ్చ పోసే కాడా...

‘నీట్‌’గా నిర్వహించలేమా?!|EDITORIAL

లక్ష్యం ఎంత గొప్పదైనా, దాన్ని అమలు చేసే వ్యవస్థ సమర్థంగా, విశ్వసనీయంగా లేకపోతే నమ్మకం దెబ్బతింటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, ఎన్‌టీఏ ‘నీట్’ లోపాలను సరిదిద్దాలి. లేకపోతే ప్రతి ఏటా పరీక్షల కంటే...

జూన్ 18, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు చవితి రాత్రి 11.58 వరకు ఉపరి పంచమి నక్షత్రం పుష్యమి సాయంత్రం 04.32 వరకు ఉపరి ఆశ్లేష యోగం వ్యాఘాత రాత్రి 10.54 వరకు ఉపరి హర్షణ కరణం వణజి మధ్యాహ్నం 12.59 వరకు...

గోడలకంటే, గీ ఇకమతు మస్తుగుందే!|ADUGU TRENDS

ఇగిప్పుడు ఇండ్లు కట్టుడంటే గోడలే కాదుల్లా...! గోడల్లెక్కనే అద్దాలు పెట్టుడు, ఇనుప సువ్వలతోటి గ్రిల్స్ పెట్టుడు, రకరకాల డిజైన్లతోటి శేత్తాండ్రు. గోడలు మాత్రం పెడ్తలేరు. గవాటితోటి ఎల్తురుకు ఎల్తురు, గాలికి గాలి వత్తాంది....

పంటల సాగుకు శాశ్వత పరిష్కారమేది?!|EDITORIAL

వ్యవసాయం శాస్త్రీయ ప్రణాళిక, నాణ్యమైన ఇన్‌పుట్లు, సమర్థవంతమైన మార్కెటింగ్, ధరల భరోసా, ప్రభుత్వ మద్దతు అనే ఐదు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ప్రతి ఖరీఫ్‌కు ముందు రైతులు విత్తనాలు, ఎరువులు, రుణాల కోసం...

జూన్ 17, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు తదియ రాత్రి 02.00 వరకు ఉపరి చవితి నక్షత్రం పునర్వసు సాయంత్రం 05.51 వరకు ఉపరి పుష్యమి యోగం వృద్ధి రాత్రి 01.35 వరకు ఉపరి వ్యాఘాత కరణం తైతుల మధ్యాహ్నం 03.06 వరకు...

48 ఏండ్ల తర్వాత?!|ADUGU TRENDS

ఏడడుగులు, మూడు ముల్లతోటి పెండ్లైతది. ఇగ గీ ఏడు రోజులు, మూడు నెలల్లోనే యిడుపుకాయితం అయితున్న జంటలెన్నో? కనీ గీ జంట గివీటికి అతీతం.! అదెట్లనో మీరే సూడుండ్రి. బీహార్ రాస్ట్రంల పాట్నా జిల్లాకు...

విలీనమే పరిష్కారమా?!|EDITORIAL

ప్రాంతీయ పార్టీలన్నీ కాంగ్రెస్‌లో విలీనం కావాలనడం సరైన పరిష్కారమేనా? అదే బీజేపీ దూకుడుకు కళ్లెం వేయగలదా? ఒకవేళ బీజేపీలోనే ప్రాంతీయ పార్టీలు విలీనమైతే సరిపోతుందా? ప్రాంతీయ పార్టీల తరహాలోనే జాతీయ పార్టీల్లోనూ అధికారం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News