Wednesday, August 5, 2026
26.2 C
Hyderabad

వరల్డ్ కప్ మనదే|WORLD CUP|INDIA

T2O WORLD CUP|టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌లో భారత్ ఘన విజయం…|INDIA|WIN

3RD TIME|మూడోసారి ప్రపంచ ఛాంపియన్|WORLD|CHAMPION

అహ్మదాబాద్‌లో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శనతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి మూడోసారి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. మ్యాచ్ మొత్తం భారత్ ఆధిపత్యం ప్రదర్శించగా, బ్యాటింగ్‌లో టాప్ ఆర్డర్ ఆటగాళ్లు దూకుడుగా ఆడి భారీ స్కోరు నమోదు చేశారు. లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ జట్టు భారత బౌలర్ల దాడికి తట్టుకోలేక చివరికి 96 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. ఈ విజయం ద్వారా భారత్ మరోసారి టీ20 ప్రపంచ క్రికెట్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకుంది.

మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ న్యూజిలాండ్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ స్కోరు బోర్డును వేగంగా ముందుకు తీసుకెళ్లారు. సంజూ శాంసన్ అద్భుత ఫామ్‌లో కనిపిస్తూ కేవలం 46 బంతుల్లోనే 89 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో ఆకట్టుకునే ఫోర్లు, సిక్సర్లు ఉండడంతో ప్రేక్షకులను అలరించాడు. మరోవైపు అభిషేక్ శర్మ కూడా ఆగ్రెసివ్‌గా ఆడుతూ కేవలం 21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేసి అర్ధసెంచరీ నమోదు చేశాడు. ఈ ఇద్దరు కలిసి తొలి వికెట్‌కు 98 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత జట్టుకు బలమైన పునాది వేశారు.

మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఇషాన్ కిషన్ కూడా తన దూకుడును కొనసాగిస్తూ న్యూజిలాండ్ బౌలర్లను ఇబ్బంది పెట్టాడు. అతను కేవలం 25 బంతుల్లోనే 54 పరుగులు సాధించి జట్టుకు భారీ స్కోరు దిశగా దారితీశాడు. అయితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. అతను ఎదుర్కొన్న తొలి బంతికే అవుట్ అవడంతో అభిమానులకు నిరాశ కలిగింది. చివరి ఓవర్లలో శివమ్ దూబే చెలరేగి ఆడాడు. అతను కేవలం 8 బంతుల్లోనే 26 పరుగులు సాధించి భారత స్కోరు మరింత పెంచాడు. దీంతో భారత జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.

256 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టుకు ఆశించిన ఆరంభం లభించలేదు. భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ కివీస్ జట్టుపై ఒత్తిడి పెంచారు. జట్టు స్కోరు 31 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఫిన్ అలెన్ అవుట్ కావడంతో న్యూజిలాండ్ మొదటి వికెట్ కోల్పోయింది. వెంటనే 32 పరుగుల వద్ద రచిన్ రవీంద్ర కేవలం 1 పరుగుతో పెవిలియన్ చేరడంతో కివీస్‌కు మరో పెద్ద షాక్ తగిలింది.

ఈ సమయంలో ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ ఒక్కడే పోరాడే ప్రయత్నం చేశాడు. అతను కేవలం 26 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అయితే మిగతా బ్యాటర్లు భారత బౌలర్లకు ఎదురు నిలవలేక వరుసగా అవుట్ అయ్యారు. గ్లెన్ ఫిలిప్స్ 5 పరుగులు మాత్రమే చేసి అవుట్ కాగా, మార్క్ చాప్‌మన్ 3 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. చివరికి న్యూజిలాండ్ జట్టు 19 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలింది.

దీంతో భారత్ 96 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ విజయంతో భారత జట్టు మూడోసారి టీ20 ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి అభిమానులను ఆనందంలో ముంచెత్తింది.

డారిల్ మిచెల్‌కు క్షమాపణలు చెప్పిన అర్ష్‌దీప్ సింగ్

మ్యాచ్ సందర్భంగా న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో భారత బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ బంతిని వికెట్ల వైపు విసరగా అది మిచెల్‌కు బలంగా తాకింది. తన బౌలింగ్‌లో వరుసగా సిక్స్‌లు బాదడంతో అర్ష్‌దీప్ సింగ్ కొంత అసహనానికి గురై బంతిని వికెట్ల వైపు కొట్టినట్టు కనిపించింది. దీంతో డారిల్ మిచెల్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఇద్దరి మధ్య మైదానంలో కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సమయంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జోక్యం చేసుకుని పరిస్థితిని చల్లార్చాడు. మిచెల్‌కు క్షమాపణలు చెప్పగా, ఫీల్డ్ అంపైర్ కూడా అర్ష్‌దీప్ సింగ్‌ను మందలించాడు. అనంతరం ఆ ఓవర్ ముగిసిన వెంటనే అర్ష్‌దీప్ సింగ్ స్వయంగా డారిల్ మిచెల్‌కు క్షమాపణలు చెప్పడంతో వివాదం ముగిసింది.

మ్యాచ్ అనంతరం బ్రాడ్‌కాస్టర్ హోస్ట్ హర్షా భోగ్లే ఈ ఘటనపై ప్రశ్నించగా అర్ష్‌దీప్ సింగ్ తన వివరణ ఇచ్చాడు. తాను ఉద్దేశపూర్వకంగా బంతిని మిచెల్‌పైకి విసరలేదని స్పష్టం చేశాడు. బంతి రివర్స్ స్వింగ్ కావడంతో అతనికి తగిలిందని తెలిపాడు. ఇప్పటికే మిచెల్‌కు క్షమాపణలు చెప్పినట్లు పేర్కొన్నాడు. ఈ విజయం తమ జట్టుకు ఎంతో ప్రత్యేకమని, కానీ ఈ ఆనందాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఇంకా కొన్ని రోజులు పడుతుందని అన్నాడు. జట్టులో చాలా మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారని, ఈ విజయం తమకు చిరస్మరణీయమైన తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుందని అర్ష్‌దీప్ సింగ్ పేర్కొన్నాడు.

Latest News

బీజేపీ-ఆత్మపరిశీలనకు సరైన సమయం! EDITORIAL

ప్రజాస్వామ్యంలో ప్రతి ఎన్నిక ఒక సందేశం! ప్రతి ఉప ఎన్నిక ఒక హెచ్చరిక!! ప్రతి ప్రజా ఉద్యమం పాలకుల పాలనకు అద్దం. ఇప్పటిదాకా అప్రతిహతంగా అధికారం చెలాయిస్తున్న బీజేపీ అనూహ్యంగా ఈ మూడింటినీ...

ఆగస్టు 05 బుధవారం 2026|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, దక్షిణాయణం, గ్రీష్మ ఋతువు , ఆషాఢ మాసము-కృష్ణపక్షం తిథి కృష్ణ-సప్తమి ఈ రోజు (05) రాత్రి 8:42 వరకు, తదుపరి కృష్ణ-అష్టమి నక్షత్రము అశ్విని ఈ రోజు (05) రాత్రి 9:18 వరకు,...

ఇగ పోను అన్ లాక్ శేసుడు అల్కన!!?|ADUGU TRENDS

ఇగో గిప్పుడు గా పోన్ల వాడుడు అందరికీ అల్కగైపోయింది. సంటి పోరగాండ్ల కానుంచి, పండు ముసలోల్ల దాకా పోను వాడుతనే ఉన్నరు. ఇగ గీ వాడుట్ల అప్పుడప్పుడు గా పోన్ల లాకుల నెంబర్ల...

ఆగస్టు 04, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి రాత్రి 07.06 వరకు ఉపరి సప్తమి నక్షత్రం రేవతి రాత్రి 08.09 వరకు ఉపరి అశ్విని యోగం ధృతి రాత్రి 06.53 వరకు ఉపరి శూల కరణం గరజి ఉదయం 07.45...

గీ అవుడియ అదిరింది!?|ADUGU TRENDS

ఒక అవుడియ జీవితాన్నే మారుస్తదంటే గిదేనేమో మరి! ఏదైనా ఆలోశన శేత్తే, ఏదో ఒకటి జర్గుతది. లేకపోతే ఊదు కాలది పిల్లి గూడ లేవది? గది సరే గనీ గా పిల్లగాడు శేసిందేంటో...

అధికారం రాగానే హామీలు హుష్ కాకీ!?

ప్రజలు ఇప్పుడు రాజకీయ పార్టీల ప్రకటనలను కాకుండా వాటి పనితీరును కొలుస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కాలపరిమితి నిర్ణయించి, వాటి అమలుపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి శ్వేతపత్రం విడుదల చేయడం...

ఆగస్టు 03, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి రాత్రి 08.18 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 08.37 వరకు ఉపరి రేవతి యోగం సుకర్మ రాత్రి 08.54 వరకు ఉపరి ధృతి కరణం కౌలవ ఉదయం 08.40...

అవుమల్లా! కడుపుల బిడ్డ స్పందిత్తదా!?|ADUGU TRENDS

తల్లి గర్భంల ఉండంగనే బిడ్డలకి బయటియి యినబడ్తయా? గవాటికి గా పిల్లలు గూడ స్పందిత్తరా? యెన్కటికి కడుపుల ఉండంగనే అర్జునుడి కొడుకు అభిమన్యుడు పద్మవ్యూహంలకెట్ల పోవాల్నో తెలుసుకున్నడట. గిది నిజమో కాదో కనీ,...

ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ గా భోగాపురం!?|EDITORIAL

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఒక కొత్త అవకాశాన్ని తెరిచింది. ఈ అవకాశాన్ని స్థిరమైన అభివృద్ధిగా మలచడం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్థానిక ప్రజల సమిష్టి కృషిపైనే ఆధారపడి ఉంటుంది. మౌలిక వసతుల...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 02 నుండి ఆగస్టు 08 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీరు చేపట్టే పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో...

యిధి యిసిత్రమైందంటే గిదే మరి!?|ADUGU TRENDS

యిధి శాల యిసిత్రమైంది. ఒకపాలి కలిసున్నోల్లను సిడెంల యిడదీత్తది. యిడిపోయినోల్లని శిటికెల కలిపేత్తది. గసొంటిదే గీ ముచ్చట. గదేందో సూద్దాం పాండ్రి. తమిళనాడు రాస్ట్రం విరుదు నగర్ జిల్లా తిరుచూలి పూమాలై పట్టీకి శెందిన...

పోలీసింగ్ పై పార్లమెంటులో సమీక్షేది!?|EDITORIAL

పార్లమెంట్ వరుసగా వాయిదాలు పడుతూ స్తంభిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ప్రతిష్ఠంభనల వల్ల ఉభయ సభల్లో కీలక అంశాలపై అసలు చర్చే జరగడం లేదు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు కూడా అత్యవసరం....

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News