Monday, August 3, 2026
31.5 C
Hyderabad

యువ, నవ తరానిదే భవిష్యత్ భారతం!|EDITORIAL

కొత్త నీరు రావాలి. పాత నీరు పోవాలి. నీరు నిలిస్తే బురదవుతుంది. అలాగే నిత్యం పారుతున్న సెలయేరులా రాజకీయాలుండాలి. ఎప్పటికప్పుడు పాత తరం దిగిపోతూ ఉంటే, కొత్త తరం యువత ముందుకు రావాలి. అప్పుడే సమర్థవంతమైన నాయకత్వం, పాలన అందుబాటులోకి వస్తాయి. ఒకప్పుడు రాజకీయాల్లో యువత ఎక్కువగా ఉండేది. స్వాతంత్ర్యోద్యమ కాలం నుంచి కొన్ని దశాబ్దాల వరకు యువతకు అవకాశాలు లభించాయి. కానీ ఇటీవలి కాలంలో రాజకీయాలంటేనే యువత అసహ్యించుకునే పరిస్థితులు దాపురించాయి. రాజకీయాలను రాజకీయ నాయకులు అత్యంత పాపపంకిలం చేసేశారు. దీంతో రాజకీయాలకు అర్థాలు మారిపోయాయి. నిలువెల్లా స్వార్థం, అవినీతి, బంధుప్రీతి, దోపిడీ, దోచుకోవడం, దాచుకోవడమే రాజకీయ నాయకుల పనిగా మారింది.

బలహీనమైన నాయకత్వం వల్ల, నేతల్లో జాతీయ స్థాయిలో నమ్మకాన్ని కలిగించే నాయకత్వం కొరవడింది. వారి దృష్టి రాష్ట్ర రాజకీయాలకే పరిమితమవుతోంది. ప్రాంతీయ పార్టీలదే ప్రాధాన్యం. ఇవి జాతీయ రాజకీయాల్లో పెద్దగా పాల్గొనకపోవడం వల్ల మనవాళ్లు కేంద్రంలో గళాన్ని వినిపించలేకపోతున్నారు. స్థానికత, ప్రాంతీయత, కులాల ప్రాతిపదికన జరిగే రాజకీయాలు జాతీయ స్థాయిలో ఎదగడానికి అడ్డంకిగా మారుతున్నాయి. యువతకు రాజకీయాల్లో ఆసక్తి లేకుండా పోయింది. రాజకీయాలను చిల్లరగా చూస్తున్నారు. అపవిత్రమైనవిగా భావిస్తున్నారు. దీనివల్ల ప్రతిభావంతులైన యువకులు ఈ రంగాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. కనీసం ఓటు వేయడంపై కూడా ఆసక్తి చూపడం లేదంటే పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు.

యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. కొత్త ఆలోచనలు, సరికొత్త ఆవిష్కరణలకు ఆస్కారం కల్పిస్తాయి. యువత సమస్యల పట్ల స్పష్టమైన దృష్టితో పట్టుదలగా ఉంటారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరిపాలనలో పారదర్శకత తీసుకురాగలుగుతారు. రాజకీయాల్లో మన ప్రాతినిధ్యం పెరగాలంటే యువత ముందుకు రావాలి. వారు రాజకీయాల్లో చురుకుగా పాల్గొనాలి. కుటుంబ రాజకీయాలకు యువత విముక్తి కలిగించాలి. ప్రస్తుతం రాజకీయాల్లో కుటుంబ, వంశపారంపర్యం పెరిగిపోతోంది. రాష్ట్రాల్లో కంటే, జాతీయ స్థాయిలో అంటే లోక్ సభలోనే వారసత్వ నేతలు ఎక్కువగా ఉన్నారని ఇటీవలి ఓ సర్వే తేల్చింది. ఈ పరిస్థితిని మార్చాలంటే సామాన్య యువత రాజకీయాల్లోకి రావాలి. యువత రాజకీయాల్లోకి వస్తేనే ప్రస్తుతం పేరుకుపోతున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
ఇందుకు యువతకు రాజకీయ విద్యను అభ్యసించాలి. రాజకీయ చైతన్యం పెంచేందుకు పాఠశాల స్థాయిలోనే “రాజకీయ విద్య”ని ప్రవేశపెట్టాలి. ఇన్టర్న్ షిప్‌లు, ఫెలోషిప్‌లు పార్లమెంటులో యువతకు శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకునే అవకాశాలు కల్పించాలి. తగిన ప్రోత్సాహం లభించేలా చూడాలి. నాయకత్వ లక్షణాలున్న యువతకు రాజకీయాల్లోకి వచ్చేలా ప్రోత్సహించాలి. అందుబాటులో ఉన్న సామాజిక మాధ్యమాలను ఉపయోగించి రాజకీయ చైతన్యం పెంచాలి.
ఒకప్పుడు జాతీయ రాజకీయాల్లో దక్షిణాది నేతలదే హవాగా ఉండేది. ఇప్పుడు సర్పంచ్‌ నుంచి, ఎమ్మెల్యేలు, ఎంపీలకు కాలపరిమితి విధించుకోవాల్సి ఉంది. దేశం మూస పద్దతిలో నడవడం వల్లనే బంగ్లాదేశ్, నేపాల్‌లో తిరుగుబాట్లు వచ్చాయి. నేపాల్‌లో యువతే ముందుకు కదిలింది. రాజకీయ స్వార్థంతో తీసుకున్న నిర్ణయాలను నిరసించడం ద్వారా దేశాన్ని కదిలించారు. దేశం ఏదైనా పదవీకాంక్షతో చేస్తున్న రాజకీయాల వల్ల ఆ దేశం పురోగమించడం లేదు. మనదేశంలోనూ ఇలాంటి సమస్యలే ఉన్నాయి. వీటిని నిలువరంచాల్సి ఉంది.

గతంలో పీవీ నరసింహారావు, జైపాల్‌ రెడ్డి, సీతారాం ఏచూరి, సురవరం సుధాకర్‌ రెడ్డి లాంటి నేతల మరణం తరవాత అంతగా ప్రభావితం చేయగలిగిన నేతలు రావడం లేదు. వెంకయ్యనాయుడు పదవీ విరమణ తరవాత రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. పూర్వపు ఎన్‌డిఎలో ఎన్టీఆర్, చంద్రబాబు కన్వీనర్లుగా రాణించారు. ఒకప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ, నీలం సంజీవరెడ్డి, కోట్ల విజయ భాస్కర్‌ రెడ్డి, వెంకటస్వామి, సత్యనారాయణరావు, మల్లు అనంతరాములు వంటి ఉద్దండులు జాతీయ రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు. తరవాత జైపాల్‌ రెడ్డి, విద్యాసాగర్‌ రావు, వెంకయ్యనాయుడు, సురవరం సుధాకర్‌ రెడ్డి, సీతారాం ఏచూరిలు కనిపించేవారు.

నిజానికి కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో కొనసాగివుంటే మంచి నేతగా రాణించేవారు. ఆయన కూతురు కవితను జాతీయ రాజీయాల్లో కొనసగించినా ఆమె మంచి పట్టు సాధించేవారు. కవిత మంచి ఇంగ్లీష్‌, హిందీ, ఉర్దూలలో మాట్లాడగలిగే సత్తా ఉన్న నేత. కేసీఆర్‌ ఎందుకనో ఆ వైపుగా ఆలోచించినట్లు లేదు. ఇవాళ కవిత ఢిల్లీ రాజకీయాల్లో ఉండివుంటే బిఆర్‌ఎస్‌కు ఇప్పుడీ దుర్గతి పట్టివుండేది కాదు.
కేసీఆర్ స్వార్థ, కుటుంబ రాజకీయాలను పక్కన పెట్టివుంటే, అద్భుతంగా రాణించే వారు. భాషాపటిమ, వాక్చాతుర్యం కూడా అద్భుతంగా ఉన్న నేతగా కేసీఆర్‌ దేశ ప్రజలకు సుపరిచితం. ఆయన తనకున్న ఇమేజ్‌ను డ్యామేజీ చేసుకున్నారు. కవిత లిక్కర్‌ స్కామ్‌, ఆమె రాజకీయ ప్రస్థానంపై మాయని మచ్చగా మారింది.

మొత్తంగా ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో తెలుగువారు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. దీనిని పూడ్చాల్సిన బాధ్యత యువతపైనే ఉంది. ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు అవకాశాలు కల్పిచాలి.

Latest News

ఆగస్టు 03, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి రాత్రి 08.18 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 08.37 వరకు ఉపరి రేవతి యోగం సుకర్మ రాత్రి 08.54 వరకు ఉపరి ధృతి కరణం కౌలవ ఉదయం 08.40...

అవుమల్లా! కడుపుల బిడ్డ స్పందిత్తదా!?|ADUGU TRENDS

తల్లి గర్భంల ఉండంగనే బిడ్డలకి బయటియి యినబడ్తయా? గవాటికి గా పిల్లలు గూడ స్పందిత్తరా? యెన్కటికి కడుపుల ఉండంగనే అర్జునుడి కొడుకు అభిమన్యుడు పద్మవ్యూహంలకెట్ల పోవాల్నో తెలుసుకున్నడట. గిది నిజమో కాదో కనీ,...

ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ గా భోగాపురం!?|EDITORIAL

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఒక కొత్త అవకాశాన్ని తెరిచింది. ఈ అవకాశాన్ని స్థిరమైన అభివృద్ధిగా మలచడం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్థానిక ప్రజల సమిష్టి కృషిపైనే ఆధారపడి ఉంటుంది. మౌలిక వసతుల...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 02 నుండి ఆగస్టు 08 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీరు చేపట్టే పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో...

యిధి యిసిత్రమైందంటే గిదే మరి!?|ADUGU TRENDS

యిధి శాల యిసిత్రమైంది. ఒకపాలి కలిసున్నోల్లను సిడెంల యిడదీత్తది. యిడిపోయినోల్లని శిటికెల కలిపేత్తది. గసొంటిదే గీ ముచ్చట. గదేందో సూద్దాం పాండ్రి. తమిళనాడు రాస్ట్రం విరుదు నగర్ జిల్లా తిరుచూలి పూమాలై పట్టీకి శెందిన...

పోలీసింగ్ పై పార్లమెంటులో సమీక్షేది!?|EDITORIAL

పార్లమెంట్ వరుసగా వాయిదాలు పడుతూ స్తంభిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ప్రతిష్ఠంభనల వల్ల ఉభయ సభల్లో కీలక అంశాలపై అసలు చర్చే జరగడం లేదు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు కూడా అత్యవసరం....

ఆగస్టు 01, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ తదియ రాత్రి 09.20 వరకు ఉపరి చవితి నక్షత్రం శతభిషం రాత్రి 08.09 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శోభ రాత్రి 11.43 వరకు ఉపరి అతిగండ కరణం వణజి ఉదయం 09.10...

తెలంగాణ ‘పెద్ద’న్న అస్తమయం!|TELANGANA|PEDDI SUDHARSHAN REDDY

ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు హనుమకొండలో గుండెపోటు మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు 5రోజులు మృత్యువుతో పోరాటం కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ...

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమవుతోందా!?|EDITORIAL

ప్రతిపక్షం బలహీనంగా ఉంటే ప్రజాస్వామ్యం కూడా బలహీనపడుతుంది. అధికార పక్షం తప్పులను ఎత్తిచూపే శక్తి లేకపోతే ప్రభుత్వ జవాబుదారీతనం తగ్గుతుంది. అందుకే, కాంగ్రెస్ బలపడటం కేవలం ఆ పార్టీ అవసరం మాత్రమే కాదు....

జూలై 31, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ విదియ రాత్రి 09.03 వరకు ఉపరి తదియ నక్షత్రం ధనిష్ఠ రాత్రి 07.09 వరకు ఉపరి శతభిషం యోగం సౌభాగ్య రాత్రి 12.33 వరకు ఉపరి శోభ కరణం తైతుల ఉదయం 08.40...

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News