Friday, July 17, 2026
24.5 C
Hyderabad

యువ, నవ తరానిదే భవిష్యత్ భారతం!|EDITORIAL

కొత్త నీరు రావాలి. పాత నీరు పోవాలి. నీరు నిలిస్తే బురదవుతుంది. అలాగే నిత్యం పారుతున్న సెలయేరులా రాజకీయాలుండాలి. ఎప్పటికప్పుడు పాత తరం దిగిపోతూ ఉంటే, కొత్త తరం యువత ముందుకు రావాలి. అప్పుడే సమర్థవంతమైన నాయకత్వం, పాలన అందుబాటులోకి వస్తాయి. ఒకప్పుడు రాజకీయాల్లో యువత ఎక్కువగా ఉండేది. స్వాతంత్ర్యోద్యమ కాలం నుంచి కొన్ని దశాబ్దాల వరకు యువతకు అవకాశాలు లభించాయి. కానీ ఇటీవలి కాలంలో రాజకీయాలంటేనే యువత అసహ్యించుకునే పరిస్థితులు దాపురించాయి. రాజకీయాలను రాజకీయ నాయకులు అత్యంత పాపపంకిలం చేసేశారు. దీంతో రాజకీయాలకు అర్థాలు మారిపోయాయి. నిలువెల్లా స్వార్థం, అవినీతి, బంధుప్రీతి, దోపిడీ, దోచుకోవడం, దాచుకోవడమే రాజకీయ నాయకుల పనిగా మారింది.

బలహీనమైన నాయకత్వం వల్ల, నేతల్లో జాతీయ స్థాయిలో నమ్మకాన్ని కలిగించే నాయకత్వం కొరవడింది. వారి దృష్టి రాష్ట్ర రాజకీయాలకే పరిమితమవుతోంది. ప్రాంతీయ పార్టీలదే ప్రాధాన్యం. ఇవి జాతీయ రాజకీయాల్లో పెద్దగా పాల్గొనకపోవడం వల్ల మనవాళ్లు కేంద్రంలో గళాన్ని వినిపించలేకపోతున్నారు. స్థానికత, ప్రాంతీయత, కులాల ప్రాతిపదికన జరిగే రాజకీయాలు జాతీయ స్థాయిలో ఎదగడానికి అడ్డంకిగా మారుతున్నాయి. యువతకు రాజకీయాల్లో ఆసక్తి లేకుండా పోయింది. రాజకీయాలను చిల్లరగా చూస్తున్నారు. అపవిత్రమైనవిగా భావిస్తున్నారు. దీనివల్ల ప్రతిభావంతులైన యువకులు ఈ రంగాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. కనీసం ఓటు వేయడంపై కూడా ఆసక్తి చూపడం లేదంటే పరిస్థితి ఎంతగా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు.

యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. కొత్త ఆలోచనలు, సరికొత్త ఆవిష్కరణలకు ఆస్కారం కల్పిస్తాయి. యువత సమస్యల పట్ల స్పష్టమైన దృష్టితో పట్టుదలగా ఉంటారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరిపాలనలో పారదర్శకత తీసుకురాగలుగుతారు. రాజకీయాల్లో మన ప్రాతినిధ్యం పెరగాలంటే యువత ముందుకు రావాలి. వారు రాజకీయాల్లో చురుకుగా పాల్గొనాలి. కుటుంబ రాజకీయాలకు యువత విముక్తి కలిగించాలి. ప్రస్తుతం రాజకీయాల్లో కుటుంబ, వంశపారంపర్యం పెరిగిపోతోంది. రాష్ట్రాల్లో కంటే, జాతీయ స్థాయిలో అంటే లోక్ సభలోనే వారసత్వ నేతలు ఎక్కువగా ఉన్నారని ఇటీవలి ఓ సర్వే తేల్చింది. ఈ పరిస్థితిని మార్చాలంటే సామాన్య యువత రాజకీయాల్లోకి రావాలి. యువత రాజకీయాల్లోకి వస్తేనే ప్రస్తుతం పేరుకుపోతున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
ఇందుకు యువతకు రాజకీయ విద్యను అభ్యసించాలి. రాజకీయ చైతన్యం పెంచేందుకు పాఠశాల స్థాయిలోనే “రాజకీయ విద్య”ని ప్రవేశపెట్టాలి. ఇన్టర్న్ షిప్‌లు, ఫెలోషిప్‌లు పార్లమెంటులో యువతకు శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకునే అవకాశాలు కల్పించాలి. తగిన ప్రోత్సాహం లభించేలా చూడాలి. నాయకత్వ లక్షణాలున్న యువతకు రాజకీయాల్లోకి వచ్చేలా ప్రోత్సహించాలి. అందుబాటులో ఉన్న సామాజిక మాధ్యమాలను ఉపయోగించి రాజకీయ చైతన్యం పెంచాలి.
ఒకప్పుడు జాతీయ రాజకీయాల్లో దక్షిణాది నేతలదే హవాగా ఉండేది. ఇప్పుడు సర్పంచ్‌ నుంచి, ఎమ్మెల్యేలు, ఎంపీలకు కాలపరిమితి విధించుకోవాల్సి ఉంది. దేశం మూస పద్దతిలో నడవడం వల్లనే బంగ్లాదేశ్, నేపాల్‌లో తిరుగుబాట్లు వచ్చాయి. నేపాల్‌లో యువతే ముందుకు కదిలింది. రాజకీయ స్వార్థంతో తీసుకున్న నిర్ణయాలను నిరసించడం ద్వారా దేశాన్ని కదిలించారు. దేశం ఏదైనా పదవీకాంక్షతో చేస్తున్న రాజకీయాల వల్ల ఆ దేశం పురోగమించడం లేదు. మనదేశంలోనూ ఇలాంటి సమస్యలే ఉన్నాయి. వీటిని నిలువరంచాల్సి ఉంది.

గతంలో పీవీ నరసింహారావు, జైపాల్‌ రెడ్డి, సీతారాం ఏచూరి, సురవరం సుధాకర్‌ రెడ్డి లాంటి నేతల మరణం తరవాత అంతగా ప్రభావితం చేయగలిగిన నేతలు రావడం లేదు. వెంకయ్యనాయుడు పదవీ విరమణ తరవాత రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. పూర్వపు ఎన్‌డిఎలో ఎన్టీఆర్, చంద్రబాబు కన్వీనర్లుగా రాణించారు. ఒకప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ, నీలం సంజీవరెడ్డి, కోట్ల విజయ భాస్కర్‌ రెడ్డి, వెంకటస్వామి, సత్యనారాయణరావు, మల్లు అనంతరాములు వంటి ఉద్దండులు జాతీయ రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు. తరవాత జైపాల్‌ రెడ్డి, విద్యాసాగర్‌ రావు, వెంకయ్యనాయుడు, సురవరం సుధాకర్‌ రెడ్డి, సీతారాం ఏచూరిలు కనిపించేవారు.

నిజానికి కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో కొనసాగివుంటే మంచి నేతగా రాణించేవారు. ఆయన కూతురు కవితను జాతీయ రాజీయాల్లో కొనసగించినా ఆమె మంచి పట్టు సాధించేవారు. కవిత మంచి ఇంగ్లీష్‌, హిందీ, ఉర్దూలలో మాట్లాడగలిగే సత్తా ఉన్న నేత. కేసీఆర్‌ ఎందుకనో ఆ వైపుగా ఆలోచించినట్లు లేదు. ఇవాళ కవిత ఢిల్లీ రాజకీయాల్లో ఉండివుంటే బిఆర్‌ఎస్‌కు ఇప్పుడీ దుర్గతి పట్టివుండేది కాదు.
కేసీఆర్ స్వార్థ, కుటుంబ రాజకీయాలను పక్కన పెట్టివుంటే, అద్భుతంగా రాణించే వారు. భాషాపటిమ, వాక్చాతుర్యం కూడా అద్భుతంగా ఉన్న నేతగా కేసీఆర్‌ దేశ ప్రజలకు సుపరిచితం. ఆయన తనకున్న ఇమేజ్‌ను డ్యామేజీ చేసుకున్నారు. కవిత లిక్కర్‌ స్కామ్‌, ఆమె రాజకీయ ప్రస్థానంపై మాయని మచ్చగా మారింది.

మొత్తంగా ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో తెలుగువారు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. దీనిని పూడ్చాల్సిన బాధ్యత యువతపైనే ఉంది. ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు అవకాశాలు కల్పిచాలి.

Latest News

కరువు కోరలు!|Fangs of drought

ఇప్పటికి 33శాతమే వర్షం నమోదు!! రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రం అడుగంటుతున్న జలాశయాలు జీవ నదుల్లోనూ జల జీవమే లేదు రిజర్వాయర్లలోనూ ఇదే పరిస్థితి సాగుకు తొందరొద్దంటున్న నిపుణులు ప్రత్యామ్నాయ పంటలపై కార్యాచరణ 20వ తేదీ తర్వాత పత్తి విత్తనాలేయొద్దు బోరుబావుల కింద వరి...

మొక్క నాటుండ్రి.. డిస్కౌంట్లు పొందుండ్రి!?|ADUGU TRENDS

పర్యావరణానికి మూలం మొక్కే. గా మొక్కే చెట్టై, మహా మానై మనల్ని రచ్చిత్తది. గీ భూమి, వాతావరణం మొత్తం గా మొక్కల మీదనే ఆధారపడ్డది. కనీ, మనమేం చేత్తానం? ఏడికాడికి శెట్లని తెగ...

‘ఢీ’లిమిటేషన్ రాజకీయాలు!?|EDITORIAL

డీలిమిటేషన్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ సంస్కరణలలో ఒకటిగా నిలవనుంది. ఇది కేవలం సీట్ల సంఖ్య మార్చే ప్రక్రియ కాదు, భవిష్యత్ రాజకీయ ప్రాబల్య సమీకరణాలను నిర్ణయించే కీలక ఘట్టం....

జూలై 17, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం దక్షిణాయణం ప్రారంభం తిధి తదియ ఉదయం 09.54 వరకు ఉపరి చవితి నక్షత్రం మఖ రాత్రి 10.51 వరకు ఉపరి పుబ్బ యోగం సిద్ది ఉదయం 05.00 వరకు ఉపరి వ్యతీపాత కరణం గరజి ఉదయం 09.54...

సింధు నాగరికత|ADUGU|SPECIAL|COMPITITIVE|EXAMS

నాగరికత మరియు సంస్కృతికి తేడా నాగరికత పూర్తిగా అభివృద్ధి చెందిన మరియు ఉన్నతమైన జీవనాన్ని గడిపినట్లయితే మరియు ప్రజలు పట్టణ, శాస్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రణాళికాబద్ధంగా ఉంటే దానిని నాగరికత అంటారు. సంస్కృతి సంస్కృతి అనేది ప్రతీ ఒక్కరికీ...

‘ప్రభంజన’ పథం ప్రజ్వరిల్లాలి|ESSAY|SPECIAL

జూలై 16, 2025. సరిగ్గా ఏడాది క్రితం జర్నలిస్టు, వక్త, కవి, రచయిత, మేధావి, అభ్యుదయవాది, వివేకశీలి, చైతన్యవంతుడు, నిరంతర పోరాట శీలి అయిన ప్రొఫెసర్ యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ పరమపదించారు....

రోడ్లకు కూడా ఆపరేషన్లు!?|ADUGU TRENDS

గిప్పటి దాకా మనం మనుసులకు, జంతువులకు ఆపరేషన్లు సేసుడే సూసినం. కనీ, గీ యింతను ఎక్కడా సూడలే.! గా బిహార్ రాస్ట్రంల కొత్తగ, ఎక్కడా లేని లెక్కల, రోడ్లకు కూడా ఆపరేషన్లు సేత్తాండ్రు....

నదుల అనుసంధానమే జల భద్రతకు శాశ్వత మార్గం!|EDITORIAL

ఎల్‌నినో ప్రభావాన్ని ఆపడం మన చేతుల్లో లేదు. కానీ, దాని వల్ల కలిగే నష్టాన్ని శాస్త్రీయ ప్రణాళికలు, సమర్థమైన జల నిర్వహణ, నదుల అనుసంధానం, నీటి సంరక్షణ, వాతావరణ అనుకూల వ్యవసాయం ద్వారా...

జూలై 16, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం పూరి జగన్నాధ రధోత్సవం తిధి శు విదియ ఉదయం 11.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఆశ్లేష రాత్రి 11.40 వరకు ఉపరి మఖ యోగం వజ్ర ఉదయం 08.20 వరకు ఉపరి సిద్ది కరణం కౌలవ...

ఆషాఢమాసం రహస్యాలు|ASHADAM|SECRETS

ఆచారాలు, శాస్త్రం, సంప్రదాయాల వెనుక నిజాలు ఆషాఢమాసం విశేషాలు – ఆధ్యాత్మికత, ప్రకృతి, సంప్రదాయాలు, కుటుంబ బంధాల వెనుక అసలు కథ ప్రతి ఆచారం వెనుక ఒక అర్థం... ప్రతి సంప్రదాయం వెనుక ఒక జీవన...

ఉడుతా మిడతా!?|ADUGU TRENDS

మనం మన సుట్టుముట్టు ఉడుతల్ని సూత్తనే ఉంటం. పొలాలల్ల, రోడ్ల మీద అటిటుపోతనే ఉంటయి. సిడెం సేపట్లనే కనబడ్తయి, ఆడ్తయి. ఉరుకుతయి. ఎన్కట గా రాముడికి వారధి కట్టుట్ల గీ ఉడుత సాయం...

ఓటర్ల సవరణకు శాశ్వత పరిష్కారం లేదా!?|EDITORIAL

గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు, పట్టణాల్లో వార్డు కార్యాలయాలు, మీ సేవ వంటి పౌర సేవా కేంద్రాలను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తే ప్రజలకు సౌలభ్యం పెరుగుతుంది. బీఎల్‌వోలపై పూర్తిగా ఆధారపడకుండా బహుళస్థాయి ధ్రువీకరణ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News