Trending News
Friday, March 6, 2026
35.9 C
Hyderabad
Trending News

దహించుకుపోతున్న దాయాది!

పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదనేది సామెత. అయితే ఇది పాకిస్తాన్ విషయంలో అక్షరాలా వాస్తవం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన వేళ, కలిసి ఉండలేని కుత్సిత బుద్ధి, అధికార లాలసతో పాకిస్తాన్ వేరుపడింది. ఆనాటి నుండి నేటి దాకా, అకారణంగా పాక్ పాలి పగతోనే రగిలిపోతోంది. కుయుక్తులు, కుట్రలకు, కుతంత్రాలకు పాల్పడుతోంది. ఉగ్రవాదాన్ని పెంచి, పోషించి, రక్షిస్తూ, భారత్ పైకి ఉసి గొల్పుతోంది. ఉగ్రవాదులను కాపాడుతున్నది. దాయాది తనను తాను దహించుకుంటున్నది.

ఒక్క ‘ఆపరేషన్‌ సిందూర్‌’తో పాక్‌ సంస్కరించలేం. ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్న తీరును దారికి తేలేం. దాని వక్ర బుద్దిని మార్చలేము. భారత్‌తో పెట్టుకుంటే భవిష్యత్తే ఉండదన్న రీతిలో తగిన బుద్ధి చెప్పాలి. ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేయాలి. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్ళతో తుద ముట్టించాలి. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ను సంపూర్ణంగా శాశ్వతంగా స్వాధీనం చేసుకోవాలి. మరోసారి పాక్ మన తెరువు రాకుండా చేయాలి.

పదవీ లాలస లక్ష్యంగా సాగిన నాటి సమీకరణల్లోనే ఆనాడు భారత్ నుండి విడివడింది. ఆంగ్ల వలస పాలకులు కూడా ఇదే అదనుగా దేశాన్ని అడ్డ దిడ్డంగా విభజించేసి చేతులు దులుపుకున్నారు. దేశ విభజన ఓ చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. విభజన సందర్భంగా ప్రజ్వల్లిన హింస, ఆనాటి ఊచకోతల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇలా ఊచకోతలు, బలవంతపు మత మార్పిళ్లతో ఇస్లామిక్‌ రాజ్యంగా అవతరించిన పాక్‌ ఆదినుంచీ భారత్‌ వ్యతిరేకతను నరనరాన జీర్ణించుకుంది. కశ్మీర్‌లో కొంత భాగాన్ని ఆక్రమించింది. దానిని ఆనాడే పరిష్కరించలేక పోయిన దేశ నాయకత్వం, 370 ఆర్టికల్‌తో కొత్త సమస్యలు తెచ్చి పెట్టింది.

ఇప్పుడు పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ను తిరిగి స్వాధీన పర్చుకుంటే తప్ప పాక్‌ కోరలు పీకలేం. భారత్ అంతర్భాగమైన కశ్మీర్‌తో మన అనుబంధం విడదీయలేనిది. పాకిస్తాన్‌ పాలకులు తమ మనుగడకోసం, రాజకీయాల కోసం మతాన్ని, కశ్మీర్‌ను ఉపయోగించుకుంటూనే ఉన్నారు. అంతర్జాతీయంగా యాగీ చేస్తున్నారు. పివోకెలో ఉగ్రశిబిరాలను ఏర్పాటు చేసి దాడులకు ఉసిగొల్పుతున్నారు. చివరకు ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో హతమైన ఉగ్రవాదుల శవాలకు పాక్‌ సైనికులు సలాం కొట్టారు. అంటేనే ఆ దేశ దుర్నీతిని అర్థం చేసుకోవచ్చు. భారత దేశాన్ని శత్రువుగా, ముస్లింల వ్యతిరేకిగా చిత్రిస్తూ పబ్బం గడుపు కోవడమే పనిగా పెట్టుకుని ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్‌కు వైఖరిని ఏమనాలి? భారతదేశం తమకు శత్రువని పదేపదే రుజువు చేసుకుంటోంది. పాక్‌ సైనికాధికారులు ఎప్పుడూ భారత వ్యతిరేకతను నూరిపోస్తున్నారు. ఇటీవల పాక్‌ ఆర్మీ చీఫ్‌ మునీర్‌ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ‘భారత వ్యతిరేకతే పాకిస్తాన్ జాతీయ వాదం’గా ప్రజల్ని ప్రభావితం చేసేందుకు పాక్‌ ప్రభుత్వాలు, సైన్యం, ఇంటలిజెన్స్‌ సంస్థలూ నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాయి.

1971లో జరిగిన యుద్ధంతో బంగ్లాదేశ్‌ ఆవిర్భావం జరిగినా…పాక్‌ వంకర బుద్ధిని మార్చుకోలేదు. 1999లో కార్గిల్‌లో చొరబాటుకు పాల్పడి దెబ్బతిన్నా పాకిస్తాన్‌ పాలకుల మనస్తత్వం మారడంలేదు. ఉగ్రవాదులను పెంచి పోషించడంతో పాటు అబోటాబాద్‌లో లాడెన్‌కు ఆశ్రయమిచ్చి దాచి పెట్టాయి. అమెరికన్‌ దళాలు ఒసామాబిన్‌ లాడెన్‌ను హతమార్చిన తర్వాత కూడా పాక్‌ సైన్యం బుద్ధి మారడం లేదు. పొరుగు దేశాల్లో హింసాత్మక చర్యలను ప్రోత్సహించడం ద్వారా పాకిస్తాన్‌ తన అంతర్గత భద్రతకే ముప్పు తెచ్చుకుంటుందని తెలిసి కూడా కుక్కతోక వంకరలా వక్రబుద్ధిని మార్చుకోవడం లేదు. పాక్‌ బడ్జెట్‌లో 30శాతానికి పైగా సైన్యానికి ఖర్చుపెడుతున్నారు. విద్య, ఆరోగ్యం, సంక్షేమ రంగాల్లో నిధులు తగ్గిపోయాయి. ఆర్థిక ప్రగతి కునారిల్లింది. ఆసియాలోనే అత్యంత ఎక్కువ స్థాయిలో పెరుగుతున్న జనాభాలో దాదాపు 41 శాతం పేదరికంలో మగ్గుతున్నారు. ఆర్థిక స్థితి అత్యంత దయనీయంగా ఉంది. పక్క దేశాలు బిచ్చమేస్తే తప్ప మనుగడ కష్టమవుతున్న దశలోనూ, ఆ దేశ పాలకులు, సైన్యం తమ మనుగడకోసం మతాన్ని ఆయుధంగా వాడుకుని ప్రజల్ని మభ్యపెడుతూ, భారత్‌లో హింసాత్మక చర్యలకు పాల్పడుండటం అత్యంత హేయం.

పాక్ పిచ్చి పన్నాగాల ఫలితమే పహల్గామ్‌ ఊచకోత. పర్యాటకుల్లోని కుటుంబాల నుంచి పురుషులను వేరు చేసి, హిందువుల పేరుపెట్టి క్రూరంగా చంపిన ఘటన భారత్ పట్ల పాక్ వైఖరికి పరాకాష్ట. యావత్ భారతీయుల రక్తం మరిగేలా చేసిన దుర్ఘటన అది. అందుకే ఇప్పుడు ఆపరేషన్ సిందూర్‌ ని పాక్ ప్రజలపై దాడిగా చూడకూడదు. పాక్ వైఖరిపై దాడి. ఉగ్రవాదంపై భారత్ ఆగ్రహం. చర్యకు ప్రతి చర్య. పాక్ పై ప్రతీకారం కాదు పాక్ ప్రతీ చర్యపై ప్రతీకారం. సహనానికి సుదీర్ఘ పరీక్ష కూడా సరికాదు. శాంతికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఉండాలి. శాంతి సహనం భారతీయ సంస్క్రుతిలో, జీవన విధానంలో ఇమిడి ఉన్నాయి. వాటిని పరీక్షించాలనుకుంటే ఇదిగో ఇలా ఈ ఆపరేషన్ సిందూర్ లాగే ఉంటుందనేది పాక్ కు తెలిసి వచ్చేట్లు చేయాలి. మరోసారి మన భూభాగంలో, మన వ్యవహారాల్లో, మన సార్వభౌమాధికారంలో వేలు పెట్టాలంటేనే కాదు మనవైపు కన్నెత్తి చూడాలన్నా వెన్నులో వణుకు పుట్టాలి. అంత భీకరంగా బుద్ధి చెప్పాలి.

పహల్గాం ఉగ్రదాడి ఉచ్చు తన చుట్టూ బిగుస్తోందని, భారత్‌ నుంచి ప్రతీకార దాడి తప్పదని లోలోపల పాక్‌ బెంబేలెత్తుతున్నా పైకి మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శి స్తోంది. పిచ్చి ప్రేలాపనలతో రెచ్చగొడుతోంది. అన్నింటికీ సమాధానమే ఆపరేషన్ సిందూర్‌ అని, ఇది అంతంకాదు, ఆరంభమనేది నిజం కావాలి. రుజువు కావాలి.

Latest News

పురుగుల బెడదకు.. బెల్లం పానకం శిట్కా!?|ADUGU TRENDS

పంటలకు పట్టే పురుగులు రైతులకు శాపంగ మారుతానయి. ఇగ గవాటిని సంపడానికి పురుగుల మందులు కొట్టాలె. కర్సు బాగైతది. మల్ల గా మందులతోటి పురుగులు సత్తలేవు. పంటల దిగుబడొత్తలేదు. ఎరువులు, పురుగుల మందులెక్కువై...

మూసీ ప్రక్షాళనపై ముసురుకుంటున్న వివాదాలు!|EDITORIAL

అభివృద్ధి పథకాలు ప్రజావసరాలు తీర్చడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయా? అసలా పథకాలు ప్రజల కోసమే అమలవుతున్నాయా? పేదలు, అట్టడుగు వర్గాలు నివసించే ప్రాంతాల్లో చేపట్టే ప్రాజెక్టులు తరచూ నిర్వాసిత సమస్యలకు...

06-03-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి తదియ సాయంత్రం 05.20 వరకు ఉపరి చవితి నక్షత్రం హస్త ఉదయం 09.15 వరకు ఉపరి చిత్త యోగం గండ ఉదయం 07.05 వరకు ఉపరి వృద్ధి కరణం భద్ర సాయంత్రం 05.22...

ఓలి రంగుల్లెక్క మెరపకాయెల రాసులు!?|ADUGU TRENDS

మెరపకాయెను కూడ కూరగాయల్లెక్కనే పండిత్తరు. మనం తినే బువ్వకు కారం, రుసిని ఇత్తది. గిదీన్ని మన తెలంగాణ, ఏపీల్నే గదేనుల్ల.. గుంటూరు, వరంగల్ ల ఇరగమరగ పండిత్తరు. గీ మెరపకాయెల ఉండే 'క్యాప్సైసిన్'...

స్వయం సమృద్ధే ఈ సంక్షోభానికి విరుగుడు!|EDITORIAL

వరుస యుద్ధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. కరోనా మొత్తం భూమినే అతలాకుతలం చేస్తే, ఇప్పుడు మధ్యప్రాచ్యంలో యుద్ధాలు, ఉద్రిక్తతల వల్ల మరోసారి చమురు సంక్షోభం ముంచుకొచ్చింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా జోక్యం...

05-03-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి విదియ సాయంత్రం 04.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఉత్తర ఉదయం 08.11 వరకు ఉపరి హస్త యోగం శుల ఉదయం 07.49 వరకు ఉపరి గండ కరణం గరజి సాయంత్రం 04.39...

బర్నర్ల మురికిని తీసే ఇకమతు!?|ADUGU TRENDS

మన ఆడోల్లు ఎంత ఇకమతులు పడ్డా అరవై పది దినాలకు గా గ్యాస్ స్టౌ బర్నర్లు మురికి పడతనే ఉంటయి. గ వాటిని కడగాల్నంటే మస్తు తిప్పలైతది. అల్కగ గా బర్నర్ల మురికిని...

హార్ముజ్ జలసంధి ఆర్థిక సంక్షోభంలో ప్రపంచం!|EDITORIAL

ఇరాన్–అమెరికా–ఇజ్రాయిల్ మధ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అనిశ్చితి అంచులపై నిలిపింది. ఇది కేవలం యుద్ధ దేశాలకే పరిమితం కాదు. ప్రపంచ ఇంధన భద్రతకు కీలక నాడి హార్ముజ్ జలసంధి చుట్టూ ముప్పు...

04-03-2026 బుధవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి బ.పాడ్యమి సాయంత్రం 04.29 వరకు ఉపరి విదియ నక్షత్రం పుబ్బ ఉదయం 07.30 వరకు ఉపరి ఉత్తర యోగం ధృతి ఉదయం 08.58 వరకు ఉపరి శుల కరణం కౌలవ సాయంత్రం 04.29...

వచన సాహిత్యం ప్రజల సాహిత్యం!|ESSAY

ಓಂ శ్రీ గురు బసవ లింగాయ నమః! శరణు శరణార్థి! బీదర్ పట్టణం బసవగిరిలోని బసవ సేవా ప్రతిష్ఠాన వారి ఆధ్వర్యంలో 2026 జనవరి 30, 31 మరియు ఫిబ్రవరి 1 తేదీలలో...

దుర్గంథాన్ని పోగొట్టే సుగంథం!?|ADUGU TRENDS

ఎన్కటేమో గనీ, ఇగిప్పుడైతే నీల్లకు ప్లాటిక్, స్టీలు, రాగి సీసాలే వాడుతాండ్రు. ప్రిజ్జులనే కాదుల్లా, యేడికిపోయినా, గవాటినే తీస్కపొతాండ్రు, లేకపోతే కొనుక్కుని తాగుతాండ్రు. గనీ గవి వాడంగ, వాడంగ... దుర్వాసన వేస్తయి. దుర్గంథం...

విపత్కర ఇరాన్ కు వివేకంతోనే విజయం!|EDITORIAL

అమెరికా–ఇరాన్ విభేదాలు, ఇజ్రాయెల్ భద్రతా ఆందోళనలు, ప్రాంతీయ అభద్రతా భావ రాజకీయాలు ప్రపంచాన్ని అప్రమత్తం చేస్తున్నాయి. యుద్ధ వాతావరణం సృష్టించడం సులువు కానీ, దాని ఫలితాలను భరించడం మాత్రం దేశాలకు, ప్రజలకు మాత్రం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News