Trending News
Friday, March 6, 2026
35.9 C
Hyderabad
Trending News

భారతీయ జీవన, విద్యావిధానమే జీవనాడి!|EDITORIAL

భారతీయ జీవన, విద్యావిధానం ఒకప్పుడు మనిషి మేధస్సుకు పదును పెట్టి, ప్రపంచాన్ని శాసించే స్థాయికి తీసుకెళ్లేలా ఉండేది. అన్ని రంగాల్లో విద్యార్థులను ఆరితేరేలా చేసే సమగ్ర విద్యా విధానం మనదే! కానీ, కాలక్రమేణా ఆ వ్యవస్థను మనమే కాల గర్భంలో కలిపేస్తున్నాం. బ్రిటిష్ పాలనలో మెకాలే ప్రవేశపెట్టిన విద్యావిధానం భారతీయ విద్యా తత్వాన్ని దెబ్బతీసింది. ఫలితంగా నైపుణ్యాలు, విలువలు లేని విద్యార్థులు పెద్ద సంఖ్యలో తయారవుతున్నారు. చదువున్నా ఉపాధి లేదు. డిగ్రీలున్నా దిశా దెశా లేదు. ఇదే నేటి దుర్భర వాస్తవం.

దేశంలో కోట్లాది మంది నిరుద్యోగులు ఉన్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో అవకాశాలు విస్తారంగా ఉన్నప్పటికీ బీటెక్, ఎంటెక్ వంటి డిగ్రీలు చదివిన యువత ఆ రంగాల వైపు అడుగులు వేయలేకపోతున్నారు. చదువు వేరు, వృత్తి వేరు అన్న దృక్పథం యువతలో బలంగా పాతుకుపోయింది. భారతీయ మేధస్సు అపారమని ప్రపంచం ఎప్పుడో గుర్తించింది. విదేశాల్లో ముఖ్యంగా ఇంగ్లిష్, గణితం, సైన్స్ రంగాల్లో మనవాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. కానీ అలాంటి మానవ వనరులను దేశంలోనే అభివృద్ధి చేసుకునేలా విద్యావిధానం రూపుదిద్దుకోలేదు.

సమాజంలో విలువలు పడిపోవడం, యువతలో నైపుణ్యాల కొరత మన విద్యావిధాన లోపాలే. అత్యాధునిక సెల్‌ఫోన్లు, ఇంటర్నెట్, సోషల్ మీడియా ప్రభావం విద్యార్థుల మేధస్సుపై తీవ్రంగా పడుతోంది. ప్రతి చిన్న విషయానికీ గూగుల్‌ను ఆశ్రయించడం అలవాటైంది. గంటల తరబడి ఫోన్లకు అతుక్కుపోయి చదువుకూ, ఆలోచనకూ దూరమవుతున్నారు. యువతలో పోర్న్ వ్యసనం, ఆన్‌లైన్ జూదాలు, మానసిక ఒత్తిడి పెరిగి చివరికి ఆత్మహత్యల వరకూ వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది వ్యక్తిగత సమస్య కాదు. ఇది ఒక సామాజిక రుగ్మతగా మారింది.

ఈ పరిస్థితిని మార్చాలంటే అక్షరాభ్యాసం నుంచే క్రమశిక్షణను అలవర్చాలి. విద్యారంగాన్ని బలోపేతం చేసి విలువలతో కూడిన విద్యను అందించాలి. లేకపోతే సమాజం మరింతగా దెబ్బతినే ప్రమాదం ఉంది. నేటి తల్లిదండ్రులు చిన్న పిల్లలను బుజ్జగించడానికి, అన్నం పెట్టడానికి కూడా సెల్‌ఫోన్‌ను చేతికిస్తున్నారు. ఫలితంగా పిల్లల్లో మానసిక పరిపక్వత తగ్గి, తరగతి గదుల్లో పరధ్యానంగా మారుతున్నారు. ఆటస్థలాల్లో చురుకుదనం తగ్గి, ఒంటరితనం పెరుగుతోంది.

పాఠశాలల్లో కూడా బోధన యాంత్రికంగా మారింది. స్క్రీన్ల ద్వారా పాఠాలు చెప్పడం పెరిగిపోయింది. పిల్లలు టీచర్లతో సంభాషించడం మానేసి, పరస్పర అవగాహన కోల్పోతున్నారు. పుస్తక పఠనం తగ్గింది. పరిసరాలపై అవగాహన లేకుండా, చుట్టూ ఏం జరుగుతుందో తెలియకుండా చదువులు పూర్తిచేసి పట్టాలు పుచ్చుకుంటున్నారు. మనం తినే అన్నం ఎక్కడి నుంచి వస్తుందో, పాలు ఎలా వస్తాయో కూడా తెలియని తరం తయారవుతోంది.

సెల్‌ఫోన్ వ్యసనానికి తోడు జంక్ ఫుడ్ వల్ల ఊబకాయం పెరుగుతోంది. టీనేజర్లలో ఆత్మహత్యా ప్రయత్నాలు పెరిగాయి. అధ్యయనాల ప్రకారం ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరికి కంటి సమస్యలు తలెత్తుతున్నాయి. బ్లూ లైట్ ప్రభావం, నిద్రలేమి, ఆటలు ఆడకపోవడం మనమే తెచ్చుకున్న సమస్యలు. కోవిడ్ సమయంలో ఆన్‌లైన్ విద్య పిల్లలను మరింతగా ఫోన్లకు బానిసల్ని చేసింది. ఇప్పుడు కోవిడ్ లేకపోయినా ఆ అలవాటు మాత్రం కొనసాగుతోంది.

టెక్నాలజీ అవసరం కాదనలేం. కానీ, దానికీ ఓ పరిమితి ఉండాలి. అదే జీవితం కాకూడదు. చిన్నప్పటి నుంచే పిల్లలను టెక్నాలజీకి అతుక్కుపోయేలా చేయడం వారిని బడి, కుటుంబం, చివరకు స్వతంత్ర ఆలోచనల నుంచే దూరం చేస్తోంది. పిల్లల్లో మానసిక పరివర్తన, పరిపక్వత రావాలంటే సమతుల ఆహారం, వ్యాయామం, నడక, ఆటలు తప్పనిసరి. మన ప్రాచీన జీవన విధానాల్లో ఉన్న సౌలభ్యం, సమతుల్యతను మళ్లీ మనం పాటించాలి.

ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ రాజకీయాలకు అతీతంగా విద్యను చూడాలి. పాఠశాలల్లో పెరుగుతున్న వ్యాపార ధోరణిని అడ్డుకోవాలి. కానీ అంతకన్నా ముందు తల్లిదండ్రులే మారాలి. ఈ బిజీ జీవితంలో పిల్లల కోసం సమయం కేటాయించాలి. మార్పు ఇంటి నుంచే మొదలవ్వాలి. లేదంటే మన పిల్లల భవిష్యత్తే కాదు, మన సమాజపు పునాది కూడా కూలిపోయే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులూ… తస్మాత్ జాగ్రత్త! ఇప్పటికైనా జాగ్రత్త పడకపోతే, రేపు పశ్చాత్తాపంతో కూడా పని ఉండదు.

Latest News

పురుగుల బెడదకు.. బెల్లం పానకం శిట్కా!?|ADUGU TRENDS

పంటలకు పట్టే పురుగులు రైతులకు శాపంగ మారుతానయి. ఇగ గవాటిని సంపడానికి పురుగుల మందులు కొట్టాలె. కర్సు బాగైతది. మల్ల గా మందులతోటి పురుగులు సత్తలేవు. పంటల దిగుబడొత్తలేదు. ఎరువులు, పురుగుల మందులెక్కువై...

మూసీ ప్రక్షాళనపై ముసురుకుంటున్న వివాదాలు!|EDITORIAL

అభివృద్ధి పథకాలు ప్రజావసరాలు తీర్చడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయా? అసలా పథకాలు ప్రజల కోసమే అమలవుతున్నాయా? పేదలు, అట్టడుగు వర్గాలు నివసించే ప్రాంతాల్లో చేపట్టే ప్రాజెక్టులు తరచూ నిర్వాసిత సమస్యలకు...

06-03-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి తదియ సాయంత్రం 05.20 వరకు ఉపరి చవితి నక్షత్రం హస్త ఉదయం 09.15 వరకు ఉపరి చిత్త యోగం గండ ఉదయం 07.05 వరకు ఉపరి వృద్ధి కరణం భద్ర సాయంత్రం 05.22...

ఓలి రంగుల్లెక్క మెరపకాయెల రాసులు!?|ADUGU TRENDS

మెరపకాయెను కూడ కూరగాయల్లెక్కనే పండిత్తరు. మనం తినే బువ్వకు కారం, రుసిని ఇత్తది. గిదీన్ని మన తెలంగాణ, ఏపీల్నే గదేనుల్ల.. గుంటూరు, వరంగల్ ల ఇరగమరగ పండిత్తరు. గీ మెరపకాయెల ఉండే 'క్యాప్సైసిన్'...

స్వయం సమృద్ధే ఈ సంక్షోభానికి విరుగుడు!|EDITORIAL

వరుస యుద్ధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. కరోనా మొత్తం భూమినే అతలాకుతలం చేస్తే, ఇప్పుడు మధ్యప్రాచ్యంలో యుద్ధాలు, ఉద్రిక్తతల వల్ల మరోసారి చమురు సంక్షోభం ముంచుకొచ్చింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా జోక్యం...

05-03-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి విదియ సాయంత్రం 04.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఉత్తర ఉదయం 08.11 వరకు ఉపరి హస్త యోగం శుల ఉదయం 07.49 వరకు ఉపరి గండ కరణం గరజి సాయంత్రం 04.39...

బర్నర్ల మురికిని తీసే ఇకమతు!?|ADUGU TRENDS

మన ఆడోల్లు ఎంత ఇకమతులు పడ్డా అరవై పది దినాలకు గా గ్యాస్ స్టౌ బర్నర్లు మురికి పడతనే ఉంటయి. గ వాటిని కడగాల్నంటే మస్తు తిప్పలైతది. అల్కగ గా బర్నర్ల మురికిని...

హార్ముజ్ జలసంధి ఆర్థిక సంక్షోభంలో ప్రపంచం!|EDITORIAL

ఇరాన్–అమెరికా–ఇజ్రాయిల్ మధ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అనిశ్చితి అంచులపై నిలిపింది. ఇది కేవలం యుద్ధ దేశాలకే పరిమితం కాదు. ప్రపంచ ఇంధన భద్రతకు కీలక నాడి హార్ముజ్ జలసంధి చుట్టూ ముప్పు...

04-03-2026 బుధవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి బ.పాడ్యమి సాయంత్రం 04.29 వరకు ఉపరి విదియ నక్షత్రం పుబ్బ ఉదయం 07.30 వరకు ఉపరి ఉత్తర యోగం ధృతి ఉదయం 08.58 వరకు ఉపరి శుల కరణం కౌలవ సాయంత్రం 04.29...

వచన సాహిత్యం ప్రజల సాహిత్యం!|ESSAY

ಓಂ శ్రీ గురు బసవ లింగాయ నమః! శరణు శరణార్థి! బీదర్ పట్టణం బసవగిరిలోని బసవ సేవా ప్రతిష్ఠాన వారి ఆధ్వర్యంలో 2026 జనవరి 30, 31 మరియు ఫిబ్రవరి 1 తేదీలలో...

దుర్గంథాన్ని పోగొట్టే సుగంథం!?|ADUGU TRENDS

ఎన్కటేమో గనీ, ఇగిప్పుడైతే నీల్లకు ప్లాటిక్, స్టీలు, రాగి సీసాలే వాడుతాండ్రు. ప్రిజ్జులనే కాదుల్లా, యేడికిపోయినా, గవాటినే తీస్కపొతాండ్రు, లేకపోతే కొనుక్కుని తాగుతాండ్రు. గనీ గవి వాడంగ, వాడంగ... దుర్వాసన వేస్తయి. దుర్గంథం...

విపత్కర ఇరాన్ కు వివేకంతోనే విజయం!|EDITORIAL

అమెరికా–ఇరాన్ విభేదాలు, ఇజ్రాయెల్ భద్రతా ఆందోళనలు, ప్రాంతీయ అభద్రతా భావ రాజకీయాలు ప్రపంచాన్ని అప్రమత్తం చేస్తున్నాయి. యుద్ధ వాతావరణం సృష్టించడం సులువు కానీ, దాని ఫలితాలను భరించడం మాత్రం దేశాలకు, ప్రజలకు మాత్రం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News