Monday, July 20, 2026
25.8 C
Hyderabad

‘పాల’కూట విషం!|EDITORIAL

మొత్తం ప్రపంచ పాల ఉత్పత్తిలో 25% భారత్ లోనే జరుగుతున్నది. దేశంలో 91వేల కోట్ల లీటర్ల పాలు అవసరముండగా, 23వేల 930 కోట్ల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. తేడా 67 వేల కోట్లకు పైగా లీటర్లు. గత పదేళ్ళల్లో పాల ఉత్పత్తి కేవలం 6% పెరగగా, వినియోగం మాత్రం 64% పెరిగింది. ఉత్పత్తి,వినియోగాల మధ్య ఈ భారీ తేడానే పాల కల్తీకి కారణమవుతోంది. ప్రజావసరాలను సొమ్ముచేసుకునే నకిలీలు కోకొల్లలుగా పుట్టుకొస్తున్నాయి. ఆ పాలే ప్రజల పాలిట కాలకూట విషంగా మారుతున్నాయి.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

పాలను స్వచ్ఛతకు, పోషకానికి ప్రతీకగా చూస్తాం. ప్రతి ఇంటి రోజువారీ ఆహారంలో పాలు ప్రాథమిక ఆవశ్యం. అనివార్యం. మరి పాలే కల్తీకి గురై ప్రాణాంతకమవుతుంటే ప్రజలకు దిక్కేది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో కల్తీ పాలు తాగి ఐదుగురు మరణించడం, మరికొందరు తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్స్ లో చికిత్స పొందడం రాష్ట్రాన్ని కలవరపరుస్తోంది. ఒకే చోట పాలు కొనుగోలు చేసిన వారిలో అనూరియా లక్షణాలు అంటే మూత్రం ఆగిపోవడం, బయటపడటం, అర్థాంతరంగా కిడ్నీలు ఫెయిల్ కావడంతో కొందరికి డయాలసిస్ అవసరం కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.

పాలే ప్రజల పాలిట కాలకూట విషమవడం అత్యంత దారుణం.ప్రాథమిక విచారణలో ప్రైవేట్ డెయిరీ నుంచి సరఫరా అయిన పాలే అస్వస్థతకు కారణమని తేలింది. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. బాధితుల వైద్య ఖర్చులను భరించనున్నట్టు హామీ ఇచ్చింది.

మొత్తం ప్రపంచ పాల ఉత్పత్తిలో 25% భారత్ లోనే జరుగుతున్నది. దేశంలో 91వేల కోట్ల లీటర్ల పాలు అవసరముండగా, 23వేల 930 కోట్ల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. తేడా 67 వేల కోట్లకు పైగా లీటర్లు. గత పదేళ్ళల్లో పాల ఉత్పత్తి కేవలం 6% పెరగగా, వినియోగం మాత్రం 64% పెరిగింది. ఉత్పత్తి,వినియోగాల మధ్య ఈ భారీ తేడానే పాల కల్తీకి కారణమవుతోంది. ప్రజావసరాలను సొమ్ముచేసుకునే నకిలీలు కోకొల్లలుగా పుట్టుకొస్తున్నాయి. ఆ పాలే ప్రజల పాలిట కాలకూట విషంగా మారుతున్నాయి. కాగా, పాల ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ (16.21%), రాజస్థాన్ (14.51%), మధ్యప్రదేశ్ (8.91%), గుజరాత్ (7.65%), మహారాష్ట్ర (6.71%) అగ్రస్థానంలో ఉన్నాయి.

పాల కల్తీ కొత్తేమీ కాదు. ఒకప్పుడు పాలల్లో నీళ్లు కలపడం పెద్ద నేరంగా పరిగణించేవారు. ఇప్పుడు యూరియా, ఫార్మలిన్, గ్లూకోజ్, సోడా, సింథటిక్ పదార్థాలు, గంజి పొడి లాంటి ప్రాణాంతక ఫెర్టిలైజర్స్ వాడుతున్నారు. ఇక రెండు లీటర్ల పాలను అయిదారు లీటర్లుగా మార్చే దందా వెలుగులోకి వస్తోంది. నిల్వ కోసం వాడే ఫార్మలిన్ తో జీర్ణకోశం దెబ్బతింటుంది. చిక్కదనం కోసం యూరియా కలపడం మూత్రపిండాలకు ముప్పు. ఇలాంటి కల్తీ వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడమే కాక, కిడ్నీ ఫెయిల్యూర్ వరకు పరిస్థితి దిగజారుతుంది.

ఈ దురవస్థకి కారణాలు అనేకం. రాష్ట్రంలో పాల ఉత్పత్తి–వినియోగం మధ్య భారీ తేడా ఉంది. అవసరాలకు సరిపడా ఉత్పత్తి లేక కొందరు అక్రమాలకు దిగుతున్నారు. ప్రైవేట్ డెయిరీలు పుట్టగొడుగుల్లా పుట్టుకురావడం, వాటిపై నియంత్రణ, నిఘా పర్యవేక్షణ లేకపోవడం సమస్యను మరింత తీవ్రచేస్తోంది. సహకార రంగం బలహీనపడటంతో డెయిరీల మధ్య అనారోగ్య పోటీ నెలకొంది. లాభాల కోసం అడ్డదారులు తొక్కే దరిద్రం దాపురించింది.

ఫుడ్ సేఫ్టీ వ్యవస్థ నిర్వీర్యమైంది. సమర్థవంతమైన పరీక్షా ప్రయోగశాలలు ఉన్నాయా? పాల నమూనాలను తరచుగా తనిఖీ చేస్తున్నారా? లైసెన్స్ లేని డెయిరీలు ఎందుకు నడుస్తున్నాయి? తనిఖీ బాధ్యతను ఆయా శాఖలకు వదిలేయడం సరైన విధానం కాదు. ప్రజారోగ్యం పరిరక్షణ పూర్తిగా ప్రభుత్వ బాధ్యత.

పాడి పంట గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలకం. కష్టపడి పాలను ఉత్పత్తి చేసే రైతుకు గిట్టుబాటు ధర దక్కకపోవడం మరో సమస్య. రైతు వద్ద తక్కువ ధరకు సేకరించిన పాలను మధ్యవర్తులు అధిక లాభాలతో విక్రయిస్తున్నారు. ఉత్పత్తి స్థాయిలో పారదర్శకత లేకపోవడం, సరఫరాలో పర్యవేక్షణ లోపాలు కల్తీకి కారణమవుతున్నాయి. పాడిపశువుల సంఖ్య, ఉత్పత్తి పరిమాణం, సరఫరాలపై సమగ్ర సమాచారం, లెక్కలు లేకపోవడం కూడా లోపమే.

తనిఖీలు నిర్వహించి లైసెన్స్ లేని కేంద్రాలను మూసివేయాలి. పాల ఉత్పత్తి నుంచి వినియోగదారు వరకు సరఫరాలపై పూర్తి అవగాహన, పాదర్శకతతో కూడిన వ్యవస్థను అమలు చేయాలి. ఆధునిక ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేసి, తరచూ తనిఖీ పరీక్షలు నిర్వహించాలి. కల్తీ పాల తయారీని తీవ్రమైన నేరంగా పరిగణించి కఠిన శిక్షలు విధించాలి. సహకార డెయిరీలను బలోపేతం చేసి రైతు ఆధారిత పారదర్శక వ్యవస్థను పునరుద్ధరించాలి.

అలాగే పాలు-కల్తీపై ప్రజల్లో అవగాహన పెంచాలి. ఇంటి వద్దే సాధ్యమయ్యే ప్రాథమిక పరీక్షలపై చైతన్యం చేయాలి. అనుమానాస్పద, కల్తీ పాలపై వెంటనే ఫిర్యాదు చేసే హెల్ప్ లైన్‌లు అందుబాటులో ఉండాలి. అధిక పాల ఉత్పత్తికి పశువులకు ఇచ్చే ఆక్సిటోసిన్ వంటి నిషేధిత ఇంజెక్షన్ల వినియోగంపై కఠిన నిఘా పెట్టాలి.

పాలు ఒక్క రాజమండ్రిలో మాత్రమే కాదు. అంతటా కల్తీ అవుతున్నాయి. కాకపోతే, రాజమండ్రి ఘటన వెలుగులోకి వచ్చిన ఒక హెచ్చరిక. నమ్మకమైన పాలను సరఫరా చేయడం ప్రభుత్వ బాధత. సమాజ హితం. లాభాల కోసం ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టే పాల కల్తీగాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి. వ్యవస్థలోని లోపాలను సరిదిద్దాలి.

Latest News

ఒక్క స్కూల్.. వేల మంది ఐఏఎస్‌లు!|SCHOOL|IAS

నేతర్‌హాట్ విద్యా మోడల్‌కు దేశమంతా ఫిదా|NETHERHAT|EDUCATIONAL MODEL ప్రకృతి రమణీయత ఉట్టిపడే కొండల నడుమ, చుట్టూ దట్టమైన అడవులు, ప్రశాంతమైన వాతావరణం. ఒక సాధారణ పాఠశాలలా కనిపించే ఆ ప్రాంగణం.. యావత్ భారతదేశ పరిపాలనా...

జూలై 20, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి షష్ఠి ఉదయం 07.00 వరకు ఉపరి సప్తమి నక్షత్రం హస్త రాత్రి 11.01 వరకు ఉపరి చిత్త యోగం శివ రాత్రి 11.07 వరకు ఉపరి సిద్ద కరణం తైతుల ఉదయం 07.00 వరకు ఉపరి...

కాళేశ్వరం కలహాలతో కాలం వెళ్ళదీయలేరు!?|EDITORIAL

ప్రజలకు కావాల్సింది రాజకీయ వాదోపవాదాలు కాదు. పరిష్కారం. లక్ష కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టును నిరుపయోగంగా వదిలేయడం ఎంత తప్పో, భద్రతా ప్రమాణాలు పట్టించుకోకుండా వినియోగించడం కూడా అంతే ప్రమాదకరం. అందువల్ల ప్రభుత్వం...

మొగోల్లను గౌరవిద్దాం!?|ADUGU TRENDS

ఎర్రబస్సుల్ల ఎన్కటేం రాసుండేదో గుర్తుందా!? ఒకపాలి గుర్తు శేసుకోండ్రి. ‘పొగ తాగరాదు!’, ‘టికెట్టుకు సరిపడా చిల్లర ఇచ్చి కండక్టర్ కు సహకరించండి.’ ఇంక..? ‘టికెట్ లేని ప్రయాణం నేరం. రూ.500 వరకు జరిమానా,...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూలై 19 నుండి జూలై 25 వరకు రాశి ఫలాలు మేష రాశి: ఈ వారం మీ ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. చేపట్టిన పనులు క్రమంగా విజయవంతమవుతాయి. ఉద్యోగంలో కొత్త అవకాశాలు లభించవచ్చు. వ్యాపారంలో ఆదాయం...

జీవిత ఖైదీలకు జైల్లోనే లగ్గం!?|ADUGU TRENDS

మనసు ఎవ్వలి మీద ఎప్పుడు? ఎందకు? పడ్తదో తెల్వదంటరు. గదాన్నే పేమ అంటాండ్రు. గట్లనే జైల్లో జీవిత ఖైదుగా ఉన్న ఇద్దరు మనసు పడ్డరు. గా ముచ్చటను జైలు సార్లకు శేరవేసిండ్రు. గానుంచి...

వాడివేడిగా పార్లమెంట్ సమావేశాలు!?|EDITORIAL

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం, ప్రతిపక్షం రెండూ ప్రత్యర్థులే. కానీ, ప్రజా ప్రయోజనాల విషయంలో భాగస్వాములే. అందువల్ల పార్లమెంట్ సమావేశాలు రాజకీయ ఆరోపణలకే పరిమితం కాకుండా ప్రజల ఆశలను నెరవేర్చే విధంగా నిర్మాణాత్మక చర్చలకు వేదిక...

జూలై 18, శనివారం, 2026|RASHI P[HALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి చవితి ఉదయం 08.30 వరకు ఉపరి పంచమి నక్షత్రం పుబ్బ రాత్రి 10.28 వరకు ఉపరి ఉత్తర యోగం వరీయాన్ రాత్రి 01.45 వరకు ఉపరి పరిఘ కరణం భద్ర ఉదయం 08.30 వరకు ఉపరి...

కరువు కోరలు!|Fangs of drought

ఇప్పటికి 33శాతమే వర్షం నమోదు!! రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రం అడుగంటుతున్న జలాశయాలు జీవ నదుల్లోనూ జల జీవమే లేదు రిజర్వాయర్లలోనూ ఇదే పరిస్థితి సాగుకు తొందరొద్దంటున్న నిపుణులు ప్రత్యామ్నాయ పంటలపై కార్యాచరణ 20వ తేదీ తర్వాత పత్తి విత్తనాలేయొద్దు బోరుబావుల కింద వరి...

మొక్క నాటుండ్రి.. డిస్కౌంట్లు పొందుండ్రి!?|ADUGU TRENDS

పర్యావరణానికి మూలం మొక్కే. గా మొక్కే చెట్టై, మహా మానై మనల్ని రచ్చిత్తది. గీ భూమి, వాతావరణం మొత్తం గా మొక్కల మీదనే ఆధారపడ్డది. కనీ, మనమేం చేత్తానం? ఏడికాడికి శెట్లని తెగ...

‘ఢీ’లిమిటేషన్ రాజకీయాలు!?|EDITORIAL

డీలిమిటేషన్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ సంస్కరణలలో ఒకటిగా నిలవనుంది. ఇది కేవలం సీట్ల సంఖ్య మార్చే ప్రక్రియ కాదు, భవిష్యత్ రాజకీయ ప్రాబల్య సమీకరణాలను నిర్ణయించే కీలక ఘట్టం....

జూలై 17, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం దక్షిణాయణం ప్రారంభం తిధి తదియ ఉదయం 09.54 వరకు ఉపరి చవితి నక్షత్రం మఖ రాత్రి 10.51 వరకు ఉపరి పుబ్బ యోగం సిద్ది ఉదయం 05.00 వరకు ఉపరి వ్యతీపాత కరణం గరజి ఉదయం 09.54...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News