Saturday, June 13, 2026
30.8 C
Hyderabad

‘పాల’కూట విషం!|EDITORIAL

మొత్తం ప్రపంచ పాల ఉత్పత్తిలో 25% భారత్ లోనే జరుగుతున్నది. దేశంలో 91వేల కోట్ల లీటర్ల పాలు అవసరముండగా, 23వేల 930 కోట్ల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. తేడా 67 వేల కోట్లకు పైగా లీటర్లు. గత పదేళ్ళల్లో పాల ఉత్పత్తి కేవలం 6% పెరగగా, వినియోగం మాత్రం 64% పెరిగింది. ఉత్పత్తి,వినియోగాల మధ్య ఈ భారీ తేడానే పాల కల్తీకి కారణమవుతోంది. ప్రజావసరాలను సొమ్ముచేసుకునే నకిలీలు కోకొల్లలుగా పుట్టుకొస్తున్నాయి. ఆ పాలే ప్రజల పాలిట కాలకూట విషంగా మారుతున్నాయి.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

పాలను స్వచ్ఛతకు, పోషకానికి ప్రతీకగా చూస్తాం. ప్రతి ఇంటి రోజువారీ ఆహారంలో పాలు ప్రాథమిక ఆవశ్యం. అనివార్యం. మరి పాలే కల్తీకి గురై ప్రాణాంతకమవుతుంటే ప్రజలకు దిక్కేది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో కల్తీ పాలు తాగి ఐదుగురు మరణించడం, మరికొందరు తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్స్ లో చికిత్స పొందడం రాష్ట్రాన్ని కలవరపరుస్తోంది. ఒకే చోట పాలు కొనుగోలు చేసిన వారిలో అనూరియా లక్షణాలు అంటే మూత్రం ఆగిపోవడం, బయటపడటం, అర్థాంతరంగా కిడ్నీలు ఫెయిల్ కావడంతో కొందరికి డయాలసిస్ అవసరం కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.

పాలే ప్రజల పాలిట కాలకూట విషమవడం అత్యంత దారుణం.ప్రాథమిక విచారణలో ప్రైవేట్ డెయిరీ నుంచి సరఫరా అయిన పాలే అస్వస్థతకు కారణమని తేలింది. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. బాధితుల వైద్య ఖర్చులను భరించనున్నట్టు హామీ ఇచ్చింది.

మొత్తం ప్రపంచ పాల ఉత్పత్తిలో 25% భారత్ లోనే జరుగుతున్నది. దేశంలో 91వేల కోట్ల లీటర్ల పాలు అవసరముండగా, 23వేల 930 కోట్ల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. తేడా 67 వేల కోట్లకు పైగా లీటర్లు. గత పదేళ్ళల్లో పాల ఉత్పత్తి కేవలం 6% పెరగగా, వినియోగం మాత్రం 64% పెరిగింది. ఉత్పత్తి,వినియోగాల మధ్య ఈ భారీ తేడానే పాల కల్తీకి కారణమవుతోంది. ప్రజావసరాలను సొమ్ముచేసుకునే నకిలీలు కోకొల్లలుగా పుట్టుకొస్తున్నాయి. ఆ పాలే ప్రజల పాలిట కాలకూట విషంగా మారుతున్నాయి. కాగా, పాల ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ (16.21%), రాజస్థాన్ (14.51%), మధ్యప్రదేశ్ (8.91%), గుజరాత్ (7.65%), మహారాష్ట్ర (6.71%) అగ్రస్థానంలో ఉన్నాయి.

పాల కల్తీ కొత్తేమీ కాదు. ఒకప్పుడు పాలల్లో నీళ్లు కలపడం పెద్ద నేరంగా పరిగణించేవారు. ఇప్పుడు యూరియా, ఫార్మలిన్, గ్లూకోజ్, సోడా, సింథటిక్ పదార్థాలు, గంజి పొడి లాంటి ప్రాణాంతక ఫెర్టిలైజర్స్ వాడుతున్నారు. ఇక రెండు లీటర్ల పాలను అయిదారు లీటర్లుగా మార్చే దందా వెలుగులోకి వస్తోంది. నిల్వ కోసం వాడే ఫార్మలిన్ తో జీర్ణకోశం దెబ్బతింటుంది. చిక్కదనం కోసం యూరియా కలపడం మూత్రపిండాలకు ముప్పు. ఇలాంటి కల్తీ వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడమే కాక, కిడ్నీ ఫెయిల్యూర్ వరకు పరిస్థితి దిగజారుతుంది.

ఈ దురవస్థకి కారణాలు అనేకం. రాష్ట్రంలో పాల ఉత్పత్తి–వినియోగం మధ్య భారీ తేడా ఉంది. అవసరాలకు సరిపడా ఉత్పత్తి లేక కొందరు అక్రమాలకు దిగుతున్నారు. ప్రైవేట్ డెయిరీలు పుట్టగొడుగుల్లా పుట్టుకురావడం, వాటిపై నియంత్రణ, నిఘా పర్యవేక్షణ లేకపోవడం సమస్యను మరింత తీవ్రచేస్తోంది. సహకార రంగం బలహీనపడటంతో డెయిరీల మధ్య అనారోగ్య పోటీ నెలకొంది. లాభాల కోసం అడ్డదారులు తొక్కే దరిద్రం దాపురించింది.

ఫుడ్ సేఫ్టీ వ్యవస్థ నిర్వీర్యమైంది. సమర్థవంతమైన పరీక్షా ప్రయోగశాలలు ఉన్నాయా? పాల నమూనాలను తరచుగా తనిఖీ చేస్తున్నారా? లైసెన్స్ లేని డెయిరీలు ఎందుకు నడుస్తున్నాయి? తనిఖీ బాధ్యతను ఆయా శాఖలకు వదిలేయడం సరైన విధానం కాదు. ప్రజారోగ్యం పరిరక్షణ పూర్తిగా ప్రభుత్వ బాధ్యత.

పాడి పంట గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలకం. కష్టపడి పాలను ఉత్పత్తి చేసే రైతుకు గిట్టుబాటు ధర దక్కకపోవడం మరో సమస్య. రైతు వద్ద తక్కువ ధరకు సేకరించిన పాలను మధ్యవర్తులు అధిక లాభాలతో విక్రయిస్తున్నారు. ఉత్పత్తి స్థాయిలో పారదర్శకత లేకపోవడం, సరఫరాలో పర్యవేక్షణ లోపాలు కల్తీకి కారణమవుతున్నాయి. పాడిపశువుల సంఖ్య, ఉత్పత్తి పరిమాణం, సరఫరాలపై సమగ్ర సమాచారం, లెక్కలు లేకపోవడం కూడా లోపమే.

తనిఖీలు నిర్వహించి లైసెన్స్ లేని కేంద్రాలను మూసివేయాలి. పాల ఉత్పత్తి నుంచి వినియోగదారు వరకు సరఫరాలపై పూర్తి అవగాహన, పాదర్శకతతో కూడిన వ్యవస్థను అమలు చేయాలి. ఆధునిక ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేసి, తరచూ తనిఖీ పరీక్షలు నిర్వహించాలి. కల్తీ పాల తయారీని తీవ్రమైన నేరంగా పరిగణించి కఠిన శిక్షలు విధించాలి. సహకార డెయిరీలను బలోపేతం చేసి రైతు ఆధారిత పారదర్శక వ్యవస్థను పునరుద్ధరించాలి.

అలాగే పాలు-కల్తీపై ప్రజల్లో అవగాహన పెంచాలి. ఇంటి వద్దే సాధ్యమయ్యే ప్రాథమిక పరీక్షలపై చైతన్యం చేయాలి. అనుమానాస్పద, కల్తీ పాలపై వెంటనే ఫిర్యాదు చేసే హెల్ప్ లైన్‌లు అందుబాటులో ఉండాలి. అధిక పాల ఉత్పత్తికి పశువులకు ఇచ్చే ఆక్సిటోసిన్ వంటి నిషేధిత ఇంజెక్షన్ల వినియోగంపై కఠిన నిఘా పెట్టాలి.

పాలు ఒక్క రాజమండ్రిలో మాత్రమే కాదు. అంతటా కల్తీ అవుతున్నాయి. కాకపోతే, రాజమండ్రి ఘటన వెలుగులోకి వచ్చిన ఒక హెచ్చరిక. నమ్మకమైన పాలను సరఫరా చేయడం ప్రభుత్వ బాధత. సమాజ హితం. లాభాల కోసం ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టే పాల కల్తీగాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి. వ్యవస్థలోని లోపాలను సరిదిద్దాలి.

Latest News

మియా జాకీ మాయ!|ADUGU TRENDS

పండంటే మామిడి పండే! పండ్లండ్ల మధురమైన పండ్లంటే కూడా మామిడి పండ్లే!! గందుకే గా పండ్లకు గంత గిరాకీ. గీ పండ్లల్ల మస్తు గిరాకీ ఉన్న పండ్లు మియా జాకీ రకమట. గీ...

బడే భవిష్యత్తుకు పునాది?!|EDITORIAL

దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది. ఒక మంచి పాఠశాల కేవలం విద్యార్థిని మాత్రమే కాదు, కుటుంబాలని, గ్రామాలని, సమాజాన్ని మార్చగలదు. అందుకే విద్యను వ్యయంగా కాకుండా పెట్టుబడిగా చూడాలి. నీతి ఆయోగ్...

జూన్ 13, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం మాస శివరాత్రి శని త్రయోదశి తిధి బ త్రయోదశి మధ్యాహ్నం 01.55 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం కృత్తిక రాత్రి 12.17 వరకు ఉపరి రోహిణి యోగం సుకర్మ సాయంత్రం 04.30 వరకు ఉపరి ధృతి కరణం వణజి...

నచ్చత్రాల ఇల్లు!|ADUGU TRENDS

ఆకాసంల నచ్ఛత్రాలన్నీ మన ఇంటిమీదకే వత్తే ఎట్లుంటది!? గట్లనే ఓ ఇల్లు కట్టుకుంటే ఇంకెట్లుంటది!? మబ్బుల్ల తేలాడినట్లే ఉంటది కదా? ఇది కలేం కాదుల్లా? దాన్ని నిజం చేసేటట్లు ఇప్పుడు ఇండ్లు కడతుండ్రు.!...

టీఎంసీ భవితవ్యమేంటి?!|EDITORIAL

టీఎంసీలో గందరగోళానికి బీజేపీ కారణమా? బెంగాల్ లో కాంగ్రెస్‌కు పునరుజ్జీవం లభిస్తుందా? కాంగ్రెస్ లో టీఎంసీ విలీనంపై వస్తున్న ఊహాగానాలు నిజమేనా? రాజకీయాల్లో ఏ పార్టీకైనా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నంత కాలమే మనుగడ....

జూన్ 12, శుక్రవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి సాయంత్రం 04.06 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం భరణి రాత్రి 01.46 వరకు ఉపరి కృత్తిక యోగం అతిగండ రాత్రి 07.20 వరకు ఉపరి సుకర్మ కరణం తైతుల సాయంత్రం 04.06...

గీ కోతి మనుసులకే ఆదర్శం!|ADUGU TRENDS

నిజం కాకపోయినా, కోతి నుండే మనిసి వచ్చాడంటరు. కోతులకు మనుసులకు గంత పోలికన్నట్లు. గా కోతుల బుద్ధులు, శేట్టలు మనుసులకు కూడా ఉంటయి. కొందరిల బయట పడ్తయి. మరికొందరిల బయట పడయి గంతే....

నిరంతరాయ ప్రధానిగా మోదీ రికార్డు!|EDITORIAL

మోదీ, నెహ్రూ రికార్డును అధిగమించడం కేవలం ఒక గణాంక ఘట్టం మాత్రమే కాదు. ఇది భారత ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ద్వారా వరుసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చిన నాయకుడి రాజకీయ ప్రయాణానికి...

జూన్ 11-గురువారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి సాయంత్రం 06.03 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం అశ్విని రాత్రి తెల్ల 03.02 వరకు ఉపరి భరణి యోగం శోభ రాత్రి 10.00 వరకు ఉపరి అతిగండ కరణం బవ ఉదయం...

శెట్టు కిందే ఊరు!|ADUGU TRENDS

ఎండా కాలమొస్తే మనమేం శేత్తానం? ప్యాన్లు, ప్రిజ్జీలు, కూలర్లు, ఏసీలను సిద్ధం చేసుకుంటానం. మండే కాలం వత్తాందనంగనే గవాటన్నింటినీ మరమ్మతులు చేసి పెట్టుకుంటానం. ఎండ మండుతనే ఉండె, కరెంటు కాల్తనే ఉండె. ఇగ...

ట్రంప్ కు బోస్టన్ తీర్పు దెబ్బ!|EDITORIAL

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలస విధానాలపై, హెచ్-1బీ వీసాలపై విధించిన లక్ష డాలర్ల ఫీజును బోస్టన్ ఫెడరల్ కోర్టు చట్టవిరుద్ధమని ప్రకటించింది. ఆ తీర్పు భారతీయ వృత్తి నిపుణులకు తక్షణ ఊరటనిచ్చినా, అంతిమ...

జూన్ 10-బుధవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ దశమి రాత్రి 07.41 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం రేవతి రాత్రి తెల్ల 04.00 వరకు ఉపరి అశ్విని యోగం సౌభాగ్య రాత్రి 12.20 వరకు ఉపరి శోభ కరణం వణజి ఉదయం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News