ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి!
రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ…
అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ
గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ, అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల్లోని అన్ని జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ)తో తయారు చేసిన వినాయక విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమవుతున్న నేపథ్యంలో, పర్యావరణానికి హాని కలిగించని మట్టి వినాయక విగ్రహాలను వినియోగించాలని అడుగు డిజిటల్ మీడియా ప్రజలను కోరింది. ఇందులో భాగంగా పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో శివసాయి కిరాణం అండ్ జనరల్ స్టోర్స్ అధినేత చారగొండ్ల రవి కుమార్ సహకారంతో అడుగు డిజిటల్ మీడియా, మార్గం ఫౌండేషన్, స్టూడెంట్ ఫర్ సేవ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి అడుగు డిజిటల్ మీడియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఆయా సంస్థల చైర్మన్ మార్గం సాయి సందేశ్ తేజ సభాధ్యక్షత వహించగా, అడుగు డిజిటల్ మీడియా చీఫ్ ఎడిటర్ డా. మార్గం లక్ష్మీ నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాలకుర్తి గ్రామ ఉప సర్పంచ్ గాదెపాక కిరణ్, వార్డు సభ్యులు కామారపు సునీల్, కమ్మగాని సుధాకర్, కమ్మగాని శ్రీకాంత్, డీవీఆర్ శర్మ, దేవగిరి అనిల్ కుమార్ శర్మ, మత్తగజం నాగరాజు శర్మ, గంగు నవీన్ శర్మ, దేవగిరి సంతోష్ శర్మ, దేవగిరి శ్యామ్ శర్మ, గంగు శ్రావణ్ కుమార్, గంగు రఘు శర్మ, పాలకుర్తి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గూడూరు లెనిన్, గణేష్ ఉత్సవ సమితి నాయకులు దొంగరి మహేందర్ తదితర ఆత్మీయులు పాల్గొని ప్రజలకు మట్టి గణపతి విగ్రహాలను అందజేశారు.



ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ప్రజలకు వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, రసాయనాలు లేని మట్టి వినాయక విగ్రహాలు నీటిలో సులభంగా కలిసిపోయి పర్యావరణానికి మేలు చేస్తాయని అన్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు మట్టి వినాయకుల వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తల్లిదండ్రులు చిన్ననాటి నుంచే పిల్లల్లో పర్యావరణహిత ఆలోచనలు, ఆచారాలను పెంపొందించాలని సూచించారు. భక్తి భావన ప్రకృతికి హాని కలిగించేదిగా ఉండకూడదని, మట్టి గణపతిని పూజించడం ద్వారా భక్తితో పాటు ప్రకృతి మాతకు కూడా మేలు చేసినవారమవుతామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అడుగు డిజిటల్ మీడియా చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని, ఇలాంటి సేవా కార్యక్రమాల్లో అడుగు చీఫ్ ఎడిటర్ డా. మార్గం లక్ష్మీ నారాయణ కుటుంబం ముందుండటం ప్రశంసనీయమని అన్నారు. అదే విధంగా ప్రతి సేవా కార్యక్రమానికి సహకరిస్తున్న చారగొండ్ల రవి కుమార్ కుటుంబాన్ని కూడా అభినందించారు. మట్టి వినాయకుల వినియోగం ద్వారా భక్తిని, సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే పర్యావరణాన్ని కాపాడే బాధ్యతను ప్రతి ఒక్కరూ స్వీకరించాలని వారు కోరారు.



అనంతరం అడుగు డిజిటల్ మీడియా చీఫ్ ఎడిటర్ డా. మార్గం లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ మట్టి వినాయకుల వినియోగం వల్ల కలిగే పర్యావరణ ప్రయోజనాలను వివరించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు నీటిలో సులభంగా కరగకపోవడంతో పాటు వాటికి ఉపయోగించే రంగులు, రసాయనాల వల్ల చెరువులు, కుంటలు, ఇతర నీటి వనరులు కలుషితమయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా తమ బృందం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణహిత ఆలోచనలు చేయాలని, మట్టి గణపతిని మహా గణపతిగా భావించి భక్తిశ్రద్ధలతో పూజించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి సహకరించిన చారగొండ్ల రవి కుమార్ కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమాన్ని ఆలోచించి, సమన్వయం చేసి విజయవంతం చేసిన అడుగు డిజిటల్ మీడియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మార్గం సాయి సందేశ్ తేజను అభినందించారు.

ఈ కార్యక్రమంలో హిందూ బంధువులు చిట్యాల యాకయ్య, మారం రవి కుమార్, దేవరాజు, అశోక్ మహర్షి, సాహిత్ శర్మ, రాపోలు రాంబాబు, బోనగిరి యాకస్వామి, ఇమ్మడి వీరన్న, రాపాక దయాకర్, ఉమాకర్, పునీత్ కుమార్, గాదెపాక రమేష్, పోతనరావు, సత్యనారాయణ, అశోక్, మణికంఠ, సోమన్న, మార్గం సారంగపాణి, అనంతుల సోమేశ్వర్, వైట్ల శ్రీహరి, మార్కండేయ, పెద్దూరి సోమన్న తదితరులు పాల్గొన్నారు.

