Tuesday, August 4, 2026
29.8 C
Hyderabad

పాక్ లాగే అమెరికా కూడా నమ్మదగిన దేశం కాదు!?

ఇటీవలి అమెరికా ఎన్నికల ప్రచారంలో డోనాల్డ్‌ ట్రంప్ ప్రపంచ శాంతి ప్రవచనాలు పలికారు. అధ్యక్షుడిగా గెలిచాక ఆ మాట మరిచారు. ఒక దేశాన్ని ఎగదోస్తూ, మరో దేశాన్ని దిగదోస్తూ దొంగ దోస్తీ మాటలు మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో రెండు యుద్ధాలు కొనసాగుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధాన్ని ట్రంప్‌ అపక పోగా, రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌కు అమెరికా ఆయుధాలను అందిస్తోంది. అలాగే పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ విరుచుకు పడుతోంది. పాలస్తీనాకు వ్యతిరేకంగా అమెరికా ఇజ్రాయిల్‌కు ప్రత్యక్ష మద్దతునిస్తోంది. ఒక దేశంపై దాడి చేస్తున్న దేశానికి మద్దతుగా నిలిచి శాంతి శాంతి అనడం దేనికి సంకేతం? ఇజ్రాయల్‌ హమాస్‌ ఉగ్రవాదుల ఏరివేత లక్ష్యంగా యుద్ధం చేస్తోంది. ఈ యుద్ధాన్ని ఆపేందుకు ఏమాత్రం ప్రయత్నించని ట్రంప్, ఇదే తరహా ఉగ్రవాదంపై భారత్ యుద్ధం చేస్తుంటే, పాక్ కు మద్దతుగా నిలవడంలో అర్థమేంటి? అంటే అమెరికా, ఆ దేశ అధ్యక్షుడు నమ్మదగిన మిత్ర దేశం, మిత్రుడు కాదనే కదా? అర్థం.

నిజానికి భారత్‌ -పాక్ మధ్య అసలు యుద్ధమే మొదలు కాలేదు. కేవలం ఉగ్రవాదం లక్ష్యంగా కాల్పులు మాత్రమే జరుగుతున్నాయి. భారత్‌పై ఉగ్రదాడి నేపథ్యంలో ఉగ్రవాదుల ఏరివేత కోసం ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టింది. వందమంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. అందులో భారత్‌ కోరుతున్న ఉగ్రవాదులు కూడా ఉన్నారు. కానీ ఎక్కడా జనావాసాలు లక్ష్యంగా దాడులకు దిగలేదు. కానీ పాకిస్తాన్‌ జనావాసాలు లక్ష్యంగా భారత్ పై దాడులకు తెగబడింది. దీంతో భారత్‌ పాక్ దాడులను తిప్పి కొడుతూనే, ప్రతి దాడులు చేసింది. యుద్ధం ప్రస్థావనే లేదు. అయితే, ట్రంప్‌ ఇరు దేశాల్లో జోక్యం చేసుకుని యుద్ధ నివారణకు చర్యలు తీసుకున్నానని ప్రకటించుకున్నారు. పాక్‌ ఉగ్రవాదంతో అమెరికా కూడా నష్టపోయింది. ఈ తరుణంలో పాక్‌కు ఐఎంఎఫ్‌ రుణం ఇప్పించాల్సిన అవసరం ఏముంది?

కశ్మీర్‌, భారత్‌ గురించి మాట్లాడే సమయంలో చరిత్ర కూడా తెలియకుండా ట్రంప్‌ అతి తెలివితో వ్యవహరించారు. కశ్మీర్‌ సమస్య వెయ్యేళ్ల నుంచి ఉందంటూ తన డొల్లతనాన్ని బయటపెట్టుకున్నారు. నిజానికి కశ్మీర్‌ సమస్య పరిష్కరించాలని భారత్‌ ఏనాడూ ఎవ్వరినీ కోరలేదు. చివరకు ట్రంపును కూడా. అయితే, తమ జోక్యంతోనే ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ సాధించామంటూ గొప్పలు చెప్పుకున్న ట్రంప్‌..అమెరికా అసలు లక్ష్యమేంటో ఆదివారం మరో ప్రకటన ద్వారా వెల్లడించారు. కేవలం తన వాణిజ్య అవసరాల కోసం పాక్‌, భారత్‌లను వాడుకుంటానని చెప్పినందున మనం ట్రంప్‌ వ్వయహారశైలి పైనా అప్రమత్తంగా ఉండాల్సిందే. మధ్యవర్తిత్వం పేరిట జోక్యాన్ని పెంచుకొని అనేక దేశాల మధ్య ఆరని చిచ్చులు, ఘర్షణలు రాజేసిన అమెరికా ఇప్పుడు భారత్‌, పాక్‌ విషయంలోనూ అదే ప్రయత్నం చేస్తోందని గుర్తించాలి.

భారత్‌-పాకిస్తాన్‌ వివాదం గురించి ట్రంప్‌ తప్పుగా ప్రస్తావించడం ఇదే మొదటిసారి కాదు. 2019లో పాక్ అప్పటి ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తో కలిసి విలేకరులతో మాట్లాడుతూ, కశ్మీర్‌ సమస్యపై మధ్యవర్తిత్వం వహించడానికి సహయం చేయమని ప్రధాని మోడీ అభ్యర్థించారని బుకాయించారు. అప్పట్లోనే భారత్ పార్లమెంట్‌లో దీన్ని ఖండించింది. ఇలాంటి అబద్ధాలకోరు అమెరికాకు మరోమారు అధ్యక్షుడయ్యాక ఇటీవల అనేక గందరగోళ చర్యలు తీసుకున్నారు. దీంతో అమెరికాలోనే ఆయనపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు చేశారు. ట్రంప్‌ తీరును దుయ్యబట్టారు.

ట్రంప్‌ చెప్పాడని పాక్‌ను నమ్మితే నట్టేట మునిగినట్లేనని భారత్ గుర్తించాలి. పహల్గాంలో భారత మహిళల సిందూరాన్ని నేలరాల్చిన పాక్‌ ముష్కరుల స్థావరాలపై భారత సైనిక, వైమానిక, రక్షణ దళాలు మూకుమ్మడిగా క్షిపణులతో అగ్నివర్షం కురిపించాయి. లక్ష్యాలను ఛేదించడంలో, శత్రు స్థావరాలను నేలమట్టం చేయడంలో మన సైనిక దళాల పాటవానికి ’సిందూర్‌’ నిలువుటద్దంగా నిలిచింది. ఒకేసారి తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై గురిపెట్టి గట్టిగా చావుదెబ్బ కొట్టడంతో పాక్‌ ఉక్కిరిబిక్కిరి అయింది. మన సత్తా ఏమిటో ప్రపంచానికి తెలిసింది. అలాగే పాక్ కు అమ్మిన చైనా, అమెరికా ఆయుధాలు ఎలా పేలిపోయాయో చూశాం. ఎఫ్‌-16లను కూడా మన వాయుసేన కుప్పకూల్చింది. భారత్ ఎంచుకున్న 9 లక్ష్యాల్లో ఐదు పాక్‌ భూభాగంలో, నాలుగు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్నాయి. అక్కడి ప్రజలకు, ఆస్తులకు నష్టం జరగకుండా కేవలం ఉగ్ర మూలకనే మట్టు పెట్టింది. తమ వాళ్లు 14 మంది భారత్‌ దాడుల్లో మరణించినట్టు- జైషే మహమ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ ప్రకటించడమే ఇందుకు నిదర్శనం. కాగా, భారత్ ఆయుధ సంపత్తి ముందు అమెరికా, చైనా ఆయుధాలు తుపాస్ అయ్యాయి. మరోవైపు ఈ దాడులతో యుద్ధంలో భారత్ పరిణతి అందరినీ ఆశ్యర్య పరచింది. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసమే, లేని పెత్తనాన్ని నెత్తినెత్తుకుని పేనుకు పెత్తనమిస్తే, నెత్తంతా కొరిగినట్లుగా, ట్రంప్ భారత్ పాక్ ల మధ్య మధ్యవర్తిత్వ పాగా వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.

అప్పులివ్వడం, ఆయుధ వ్యాపారాన్నే నమ్ముకున్న అమెరికాకు పాక్ దైన్యం అందివచ్చినట్లయింది. పైగా భారత్ దాడితో దిమ్మతిరిగి మైంగ్ బ్లాక్ అయిన పాక్, అమెరికా కాళ్ళుపట్టుకుంది. దీంతో ఇప్పటికే పాక్ కు ఐఎంఎఫ్ ద్వారా అప్పు ఇప్పించింది. ఆయుధాలు అందిస్తున్నది. ఇప్పుకు తమ వ్యాపారం కోసం పాక్ ను రక్షించేందుకు మధ్యవర్తిత్వం పేరుతో ప్రయత్నాలు చేస్తున్నది. దీన్ని ఇప్పటికే భారత్ గట్టిగా తిప్పి కొట్టింది. భారత ప్రధాని మోడీ సైతం తాము ఎవరి జోక్యాన్నీ అంగికరించబోమని, ఉగ్రవాదంపై పోరాటం కొనసాగుతుందని, పాక్ కు తగిన బుద్ధి చెబుతామని, యుద్ధం ఆగలేదని, పాక్ మనుగడ దాని ఉగ్రమూలాలను విడిచి పెట్టడంలోనే ఉందని తీవ్రంగానే హెచ్చరించారు. అందుకే పాక్ లాగే అమెరికా కూడా నమ్మదగిన మిత్ర దేశం కాదు.

Latest News

ఆగస్టు 04, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి రాత్రి 07.06 వరకు ఉపరి సప్తమి నక్షత్రం రేవతి రాత్రి 08.09 వరకు ఉపరి అశ్విని యోగం ధృతి రాత్రి 06.53 వరకు ఉపరి శూల కరణం గరజి ఉదయం 07.45...

గీ అవుడియ అదిరింది!?|ADUGU TRENDS

ఒక అవుడియ జీవితాన్నే మారుస్తదంటే గిదేనేమో మరి! ఏదైనా ఆలోశన శేత్తే, ఏదో ఒకటి జర్గుతది. లేకపోతే ఊదు కాలది పిల్లి గూడ లేవది? గది సరే గనీ గా పిల్లగాడు శేసిందేంటో...

అధికారం రాగానే హామీలు హుష్ కాకీ!?

ప్రజలు ఇప్పుడు రాజకీయ పార్టీల ప్రకటనలను కాకుండా వాటి పనితీరును కొలుస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కాలపరిమితి నిర్ణయించి, వాటి అమలుపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి శ్వేతపత్రం విడుదల చేయడం...

ఆగస్టు 03, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి రాత్రి 08.18 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 08.37 వరకు ఉపరి రేవతి యోగం సుకర్మ రాత్రి 08.54 వరకు ఉపరి ధృతి కరణం కౌలవ ఉదయం 08.40...

అవుమల్లా! కడుపుల బిడ్డ స్పందిత్తదా!?|ADUGU TRENDS

తల్లి గర్భంల ఉండంగనే బిడ్డలకి బయటియి యినబడ్తయా? గవాటికి గా పిల్లలు గూడ స్పందిత్తరా? యెన్కటికి కడుపుల ఉండంగనే అర్జునుడి కొడుకు అభిమన్యుడు పద్మవ్యూహంలకెట్ల పోవాల్నో తెలుసుకున్నడట. గిది నిజమో కాదో కనీ,...

ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ గా భోగాపురం!?|EDITORIAL

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఒక కొత్త అవకాశాన్ని తెరిచింది. ఈ అవకాశాన్ని స్థిరమైన అభివృద్ధిగా మలచడం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్థానిక ప్రజల సమిష్టి కృషిపైనే ఆధారపడి ఉంటుంది. మౌలిక వసతుల...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 02 నుండి ఆగస్టు 08 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీరు చేపట్టే పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో...

యిధి యిసిత్రమైందంటే గిదే మరి!?|ADUGU TRENDS

యిధి శాల యిసిత్రమైంది. ఒకపాలి కలిసున్నోల్లను సిడెంల యిడదీత్తది. యిడిపోయినోల్లని శిటికెల కలిపేత్తది. గసొంటిదే గీ ముచ్చట. గదేందో సూద్దాం పాండ్రి. తమిళనాడు రాస్ట్రం విరుదు నగర్ జిల్లా తిరుచూలి పూమాలై పట్టీకి శెందిన...

పోలీసింగ్ పై పార్లమెంటులో సమీక్షేది!?|EDITORIAL

పార్లమెంట్ వరుసగా వాయిదాలు పడుతూ స్తంభిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ప్రతిష్ఠంభనల వల్ల ఉభయ సభల్లో కీలక అంశాలపై అసలు చర్చే జరగడం లేదు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు కూడా అత్యవసరం....

ఆగస్టు 01, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ తదియ రాత్రి 09.20 వరకు ఉపరి చవితి నక్షత్రం శతభిషం రాత్రి 08.09 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శోభ రాత్రి 11.43 వరకు ఉపరి అతిగండ కరణం వణజి ఉదయం 09.10...

తెలంగాణ ‘పెద్ద’న్న అస్తమయం!|TELANGANA|PEDDI SUDHARSHAN REDDY

ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు హనుమకొండలో గుండెపోటు మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు 5రోజులు మృత్యువుతో పోరాటం కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ...

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News