Wednesday, July 29, 2026
22.6 C
Hyderabad

KONDA FAMILY|కొండా చుట్టూ బిగిస్తున్న ఉచ్చు

DISCPLINE|క్రమశిక్షణ కమిటీకే తప్పుడు నివేదిక!
అన్ని పార్టీలు మారింది ఆ కుటుంబమే
‘కొండ’పై NAINI|నాయిని ఇంట్లో సుదీర్ఘంగా చర్చించిన CONGRESS|కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు

వరంగల్, మే 30 (అడుగు న్యూస్):
కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై తప్పుడు సమాచారం ఇచ్చారని, షోకాజ్ నోటీసు ఇచ్చినందుకు హాజరై నన్నెవ్వరూ పిలవలేదంటూ అబద్ధాలు చెబుతున్నారని, పార్టీ మారలేదని చెబుతున్న కొండా కుటుంబానిది అన్ని పార్టీలు మారిన చరిత్ర అని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య విమర్శించారు. ‘కొండ’ వ్యవహారంపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఇంట్లో సుదీర్ఘంగా చర్చించిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, అధిష్టానం డెడ్ లైన్ గా విధించిన 5వ తేదీ వరకు వేచి ఉండాలని నిర్ణయించారు.

అనంతరం మీడియాతో బస్వరాజు సారయ్య మాట్లాడుతూ, 38 ఏళ్లుగా కాంగ్రెస్‌ను బతికించానంటూ కొండా మురళి చెప్పిన మాటలు పచ్చి అబద్ధాలన్నారు. కొండా కుటుంబానికి టీడీపీ రాజకీయ జన్మనిస్తే, తర్వాత కాంగ్రెస్, ఆతర్వాత వైఎస్సార్ సీపీ, ఆ తర్వాత బీఆర్ఎస్ మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ లకు మారారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన వారు, ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలను గెలిపించామనడం హాస్యాస్పదం అన్నారు. గతంలో సోనియా గాంధీని బూతులు తిట్టిన వ్యక్తి ఇప్పుడు పార్టీ సేవలు, పార్టీ నాయకత్వంపై గురించి మాట్లాడటం దారుణం. క్రమశిక్షణ కమిటీపై కూడా కొండా కుటుంబానికి గౌరవం లేదు. కొండా పిచ్చిపిచ్చి మాటలు మానుకోవాలి. ఏ పార్టీలో ఉన్నా, ఆ పార్టీ నాయకత్వాన్ని తిట్టడం ఈ కుటుంబానికి అలవాటైంది” అంటూ ధ్వజమెత్తారు. జూలై 5 వరకు కాంగ్రెస్ అధిష్టానం కొండా మురళిపై తీసుకునే నిర్ణయం కోసం ఎదురు చూస్తాం. పార్టీ డిసిప్లిన్‌కు మించి ప్రవర్తించే వారిని సహించలేమంటూ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

‘తూర్పు’ అసెంబ్లీలో రూ.70 కోట్లు ఖర్చా?
స్వయంగా వెల్లడించిన కొండా మురళి
వివాదాస్పదమవుతోన్న మంత్రి కొండా సురేఖ భర్త వ్యాఖ్యలు

గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఒక్క వరంగల్ తూర్పు నియోజకవర్గంలోనే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత మంత్రి కొండా సురేఖ రూ.70 కోట్లు ఖర్చు పెట్టారా? అంటే అవుననే సమాధానం వేరే ఎక్కడి నుంచో రావడం లేదు. స్వయంగా ఆమె భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ నోటి నుండే వెలువడ్డాయి. ఇప్పుడు అవే వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. నిన్న వరంగల్ లో జరిగిన ఒక సమావేశంలో మంత్రి కొండా సురేఖ భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తన 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఏనాడూ ఎవరినీ ఆశించలేదన్నారు. ‘మా నాన వతన్ దార్. ఇంకా 500 ఎకరాల ఉన్నది నాకు. 70 కోట్లు ఖర్చు పెట్టిన. మీకందరికీ తెలుసు’ అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలిప్పుడు సంచలనంగా మారాయి. వివాదాస్పదమవుతున్నాయి. రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలను తూలనాడిన ఘటన, ఆ ఘటనపై వివరణ ఇవ్వడానికి గాంధీ భవన్ కు వెళ్ళి క్రమశిక్షణా కమిటీకి ఇచ్చిన 6 పేజీల ఫిర్యాదు, ఆ తర్వాత బయట మీడియాతో మాట్లాడుతూ నన్ను రెచ్చగొట్టొద్దంటూ చేసిన ఘాటైన మాటలు మరచిపోక ముందే తాజా వ్యాఖ్యలు ఇప్పటికే ఉన్న వివాదాలకు ఆజ్యం పోసినట్లయింది. కొండా మాటలను తీవ్రంగా పరిగణిస్తున్న ఆయన ప్రత్యర్థులు ఆయన సతీమణి, మంత్రి కొండా సురేఖ బర్తరఫ్ కు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి.

మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేయండి!
శాసన సభ్యత్వాన్ని రద్దు చేయండి
సుమోటోగా స్వీకరించి, విచారించాలని బీజేపీ డిమాండ్

ఎన్నికల నియమాళికి విరుద్ధంగా గత అసెంబ్లీ ఎన్నికలో తూర్పు నియోజకవర్గం నుంచి తన సతీమణి, ప్రస్తుత మంత్రి కొండా సురేఖను రూ.70 కోట్లు పెట్టి, గెలిపించానని ఆమె భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి స్వయంగా బహిరంగంగా చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని కోర్టు, ఎన్నికల కమిషన్ విచారించాలని, ఆమెను వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని, ఆమె శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని గత ఎన్నికలో ఆమె ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావు డిమాండ్ చేశారు. కొండా సురేఖ తమ అఫిడవిట్ లో తన పేరు మీద ఒక ఎకరం, తన భర్త కొండా మురళి పేరున 13.31 ఎకరాలు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారన్నారు. కానీ ప్రస్తుతం కొండా మురళి తమకు 500 ఎకరాలున్నట్లు చెప్పారన్నారు. అందులో 16 ఎకరాలమ్మి రూ. 70 కోట్లు ఖర్చు చేశానని చెప్పారని పేర్కొన్నారు. 16 ఎకరాలు అమ్మితే రూ.70 కోట్లు వచ్చాయా? ప్రభుత్వానికి పన్ను కట్టారా? మొత్తానికి కొండా మురళి వ్యాఖ్యలతో సురేఖ తప్పుడు అఫిడవిట్ సమర్పించారని తేలిందన్నారు. అంతేగాక రూ.70 కోట్లు ఖర్చు చేశామని చెప్పడం ద్వారా ప్రజల్ని కూడా అవమానించారని, ఎన్నికల నిబంధనలను అతిక్రమించారని అన్నారు. ఈ ఆధారాలతో తాను రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు, కోర్టులోనూ ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. నైతిక బాధ్యత వహించి, కొండా సురేఖ తమ పదవి నుంచి తప్పుకోవాలన్నారు. లేదంటే సీఎం తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

Latest News

ఆర్యుల/వైదిక నాగరికత|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS

సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా...

గుండు కొట్టించుకోండ్రి! యేలు పట్టుకుపోండ్రి!?|ADUGU TRENDS

గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే...

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...

జూలై 30, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు ఉపరి విదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి ఉపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం 07.44...

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

ద్రవరూప రంగుల విల్లు|ADUGU|SPECIAL STORY|CANO CRYSTALS

కొలంబియాలోని ‘లిక్విడ్ రెయిన్‌బో’ కానో క్రిస్టేల్స్ అద్భుత గాథ! ప్రకృతి ఒడిలో దాగున్న వింతలు, విశేషాలు ఎప్పుడూ మానవాళిని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. మన భూగోళంపై నీలిరంగులో నిర్మలంగా పారే నదులు, అద్దంలా మెరిసే...

అగ్గి పెట్టెతోటే హాజరీ!?|ADUGU TRENDS

పాఠం సెప్పుడంటే పుస్తకం సూసి సదువుడు కాదు. గండ్లున్నదాన్నే వళ్లె యేసుడు కాదు. బెత్తెం పట్టుకుని, బట్టీ పట్టిచ్చుడు అసలే కాదు. గా పిల్లల మెదల్లకు మేతేసుడు. పదను పెట్టుడు. కొత్తగ ఆచరించుడు,...

పార్టీలకు, ప్రభుత్వాలకు ‘నీట్’ గా ఓ హెచ్చరిక!|EDITORIAL

సామాన్య పౌరులు ప్రారంభించిన చిన్న ఉద్యమాలకు దేశవ్యాప్త ఆదరణ లభించడం రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సంప్రదాయ నాయకత్వంపై మాత్రమే ఆధారపడటం లేదు. కొత్త...

జూలై 28, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 05.30 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం విష్కంబ రాత్రి 12.49 వరకు ఉపరి ప్రీతి కరణం వణజి సాయంత్రం 05.30 వరకు ఉపరి...

ప్రకృతి వింత: నడిచే అడవి రహస్యం తెలుసా?|NATURE|FOREST

ప్రకృతి సృష్టించే వింతలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అడవి అనగానే ఒకే చోట స్థిరంగా ఉండే వృక్షాలు గుర్తుకొస్తాయి. కానీ, చెట్లు ఒక చోటు నుండి మరొక చోటుకి నెమ్మదిగా నడుస్తూ కదులుతాయనే...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News