Friday, March 13, 2026
24.7 C
Hyderabad

విధ్వంసాల పర్యవసానమే ప్రకృతి వైపరీత్యాలు!|EDITORIAL

ప్రకృతి విధ్వంసాన్ని ఎదుర్కోవడం తప్ప ప్రత్యామ్నాయం లేదు. ప్రకృతిని కాపాడటం, పర్యావరణ పరిరక్షణకు పూనుకోవడం తప్ప వేరే దారే లేదు. ఇందుకవసరమైన చైతన్యాన్ని ప్రజల్లో కల్పించడం తప్ప మరో మార్గమే లేదు. వీటికి తగ్గట్లుగా మనం ఉంటున్నామా? మన ప్రభుత్వాలు పని చేస్తున్నాయా? నిజానికి మనకంటే అంటే మానవుల కంటే కూడా జంతువులే నయం. అసలు ప్రకృతికి మొదటి శత్రువు మనషే. మనిషి ఉద్భవించిన తర్వాతే ప్రకృతి వినాశనం మొదలైంది. ఇప్పటికీ గమనిస్తే, మనిషి ఉన్న చోటే పర్యావరణానికి చేటు కలుగుతోంది. అదే పులి, సింహం వంటి ప్రాణాంతక జంతువులున్న చోట కూడా విధ్వంసం లేదు. పైగా అవి పర్యావరణానికి పాటు పడుతున్నాయి. కాబట్టే పులిని మన జాతీయ జంతువుగా పరిగణిస్తున్నాం. కానీ మనం పులిలా కాదు కదా, కనీసం పిల్లిలా కూడా వ్యవహరించలేకపోతున్నాం. అందుకే ఈ ప్రకృతి వైపరీత్యాలకు గురవుతున్నాం. ప్రకృతి ప్రకోపానికి బలవుతున్నాం. అయినా మనం మారమా? మన అంతానికి మనమే కారణమవుదామా? లేక ఈ గుణపాఠాల నేపథ్యంతో ప్రకృతితో సహవాసం చేద్దాం.
అడుగు’ చీఫ్ ఎడిటర్ డాక్టర్ మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్ విధ్వంసాల పర్యవసానమే ప్రకృతి వైపరీత్యాలు!

విధ్వంసాల పర్యవసానమే ప్రకృతి వైపరీత్యాలు!

ప్రకృతి విధ్వంసాన్ని ఎదుర్కోవడం తప్ప ప్రత్యామ్నాయం లేదు. ప్రకృతిని కాపాడటం, పర్యావరణ పరిరక్షణకు పూనుకోవడం తప్ప వేరే దారే లేదు. ఇందుకవసరమైన చైతన్యాన్ని ప్రజల్లో కల్పించడం తప్ప మరో మార్గమే లేదు. వీటికి తగ్గట్లుగా మనం ఉంటున్నామా? మన ప్రభుత్వాలు పని చేస్తున్నాయా? నిజానికి మనకంటే అంటే మానవుల కంటే కూడా జంతువులే నయం. అసలు ప్రకృతికి మొదటి శత్రువు మనషే. మనిషి ఉద్భవించిన తర్వాతే ప్రకృతి వినాశనం మొదలైంది. ఇప్పటికీ గమనిస్తే, మనిషి ఉన్న చోటే పర్యావరణానికి చేటు కలుగుతోంది. అదే పులి, సింహం వంటి ప్రాణాంతక జంతువులున్న చోట కూడా విధ్వంసమే లేదు. పైగా అవి పర్యావరణానికి పాటు పడుతున్నాయి. కాబట్టే పులిని మన జాతీయ జంతువుగా పరిగణిస్తున్నాం. కానీ మనం పులిలా కాదు కదా, కనీసం పిల్లిలా కూడా వ్యవహరించలేకపోతున్నాం. అందుకే ఈ ప్రకృతి వైపరీత్యాలకు గురవుతున్నాం. ప్రకృతి ప్రకోపానికి బలవుతున్నాం.
కాలం కాలానుగుణంగా కాకుండా కాలాతీతంగా నడుస్తోంది. కాల చక్రం భూత, వర్తమాన, భవిష్యత్ లాగే, వానా కాలం, చలి కాలం, ఎండా కాలం ఉన్నాయి. కానీ అవి గతి తప్పాయి. కాలచక్రానికి అతీతంగా అటు ఇటుగా వాటి ప్రభావాలు ఉంటున్నాయి. అందులో భాగమే అతివృష్టి, అనావృష్టి, కరువు కాటకాలు, ప్రకృతి వైపరీత్యాలు వంటివన్నీను. వర్షాకాలం మొదలైంది. కానీ, వర్షాలే ఆలస్యంగా పడ్డాయి. దీంతో పంటలు ఎండిపోయి ఇక కాలం కాదనే దాకా రైతాంగం వెళ్ళిపోయింది. హఠాత్తుగా ఆగస్టు నెలాఖరులో క్లౌడ్ బరస్ట్, కుంభవృష్టి, హఠాత్తుగా వరదలు, బురదలు, మునిగిపోవడాలు, కొందరు శవాలై తేలిపోవడాలు జరిగిపోతూనే ఉన్నాయి. మూసీ ముంచెత్తింది. గోదారి పోటెత్తింది. కృష్ణా పరుగులు పెట్టింది.
హైదరాబాద్ లో అనేకసార్లు, కామారెడ్డి, రామాయం పేట, సిరిసిల్ల, సిద్దిపేట, ఏపీలో అమరావతి, తీర ప్రాతాలతో పాటు ఉత్తారాఖండ్ వంటి ఉత్తరాది, అసోం, మేఘాలయ లాంటి ఈశాన్య రాష్ట్రాల్లో ఈ వానా కాలం జలప్రళయాన్నే కలిగించింది. ఆయా ప్రాంతాలు, ప్రజలు విలవిల్లాడుతున్నారు. నిజామాబాద్‌, మెదక్‌, కామారెడ్డి, నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో వరదలకు ప్రకృతి విధ్వంసం సృష్టించింది. క్లౌడ్‌ బరస్ట్ లతో కుంభవృష్టి కురుస్తోంది. ఉత్తరాఖండ్‌ లోని రుదప్రయాగ్‌, చమోలీ జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. ఇదే ప్రాంతంలో తాజాగా మరోసారి క్లౌడ్‌ బరస్ట్ సంభవించింది. నానా విధ్వంసానికి అనేక మంది గల్లంతయ్యారు. ప్రాణాలు కోల్పోయారు. హిమాచల్‌ప్రదేశ్‌, జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రాల్లో అనేక జిల్లాలకు సంబంధాలు తెగిపోయాయి. ఒక్క కశ్మీర్‌లోనే ఇప్పటివరకు 40 మంది ప్రాణాలు కోల్పోయారు. శ్రీనగర్‌, అనంత్‌నాగ్‌ల్లో నదులు ప్రమాద స్థాయిని మించి ఉప్పొంగడంతో, గండ్లుపడి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంజాబ్‌లో గ్రామాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వ్యవసాయ భూములు అదృశ్యమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో కూడా భారీ వర్షపాతం నమోదైంది. యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. నైరుతి పవనాల ప్రభావం తీవ్రంగా ఉంటోంది. ఈ ఆగస్టులో ఎప్పుడూ లేనంతగా క్లౌడ్‌ బరస్ట్‌ కారణంగా భారీ వర్షాలు పడుతున్నాయి. హిమాలయ పర్వత వాలు ప్రాంతాలు ఒరిగిపోయాయి. మైదానప్రాంతాల్లో గట్లు దెబ్బతిన్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంట పొలాలు నీట మునిగాయి. రైతన్నలు పూర్తిగా రోడ్డున పడ్డారు. నేలకోత పెరిగింది. కొండచరియలు విరిగిపడి సమీప నివాసాలను ధ్వంసం చేస్తున్నాయి. ఊళ్లకు ఊళ్లే కొట్టుకు పోతున్నాయి. పదుల సంఖ్యలో జనం మృత్యువాత పడుతున్నారు.
ఇలా ఎందుకు జరుగుతుందో మనమంతా ఆలోచించాలి. ప్రభుత్వాలు చర్చించాలి. కార్యాచరణకు దిగాలి. ప్రకృతి వైపరీత్యాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. పర్యావరణానికి మనం చేస్తున్న విధ్వంసాన్ని విస్మరించి, ప్రకృతి విపత్తును అసాధారణమైనవిగా చర్చిస్తున్నాం. కొండచరియలు విరిగి పడడానికి కూడా మనం చెట్లను నరికేయడం, బండలను పగుల గొట్టడం అని తెలసీ చేస్తున్నాం. దేశంలోని 16 రాష్టాల్రు, హిమాలయ రీజియన్‌ లోని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు, ఈశాన్యంలోని హిమాలయ పర్వత దిగువ భాగాలు, పశ్చిమ కనుమలు ఇవన్నీ కొండచరియలు విరిగిపడే ప్రాంతాలుగా జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా అధ్యయనంలో గుర్తించింది. రోడ్లు, రైల్వే ప్రాజెక్టుల నిర్మాణాలు, ఎలాంటి ప్రణాళిక లేకుండా సాగించే క్వారీ పనుల కారణంగా కొండచరియలు విరిగిపడుతున్నాయని చేసిన హెచ్చరికలేవీ మన మొద్దుబారిన చెవికి ఎక్కడలం లేదు.
పర్వత ప్రాంతాల్లో ఇష్టం వచ్చినట్లుగా చెట్లనునరకడం వల్లే కొండలపై ఉన్న సారవంతమైన మట్టి వర్షాలకు కొట్టుకుపోయి, కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతోపాటు పంట పొలాల్లోకి, ఇళ్లలోకి బురద ప్రవాహంలా వచ్చిచేరుతోంది. ఎన్నో ప్రాణాలు జలసమాధి అవుతున్నాయి. ఇవన్నీ స్వయం కృతాపరాధాలే. హిమాలయ పర్వత ప్రాంతాల్లో కొండవాలు ప్రాంతాలు అత్యంత బలహీనమైనవని, వాటిని తిరిగి పొందలేమని పర్యావరణ శాస్త్రవేత్తలు చేసిన హెచ్చరికలు ఎవరికి పట్టాయి? ప్రభుత్వాలు ఈ విధ్వంసాన్ని అడ్డుకోవడం లేదు. అలాగని ప్రజలు కూడా తమ వైఖరి మార్చుకోవడం లేదు. భారీ వర్షాల కారణంగా భూమి కొతకు గురై, చెరువుల్లో పూడిక పేరుకుపోతోంది. ఇదంతా మానవ తప్పిదమని గుర్తించడం లేదు.
ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఒక ప్రణాళికతో ప్రకృతి విధ్వంసాన్ని ఆపితే తప్ప, ఈ విపత్తులను ఆపలేం. ఎదుర్కోలేం. ఈ విపత్తుల నివారణకు ముందస్తు ప్రణాళికలు ఆలోచించాలి. అడవులను నరకడం తక్షణం ఆపాలి. కాలువలు, చెరువులను పునరుద్ధరించాలి. జనాభా నియంత్రణ అవసరం. మనిషి తన మనుగడ కోసం ప్రకృతిని విద్వంసం చేస్తున్నాడని గుర్తించి కఠిన నివారణ చర్యలకు పూనుకోవాలి. అప్పుడే ఈ విధ్వంసాన్ని కొంతయినా ఆపగలం.

Latest News

ముగిసిన యువకుడి అంత్యక్రియలు|PALAKURTHI

పుత్రశోకంలో కన్నతల్లి కన్నీటి వీడ్కోలు ఘన నివాళులు అర్పించిన పాలకుర్తి విధి ఆడిన వింత నాటకంలో ఒక కన్నతల్లికి అంతకన్నా దౌర్భాగ్య స్థితి మరొకటి ఉండదు. కొడుకే లోకమని, తనే తన సర్వస్వమని బతికిన ఆ...

గాలి మోటర్ల.. గా అత్తగారింటికి!?|ADUGU TRENDS

అత్తగారింటికి దారేది? అంటే గాల్లో తేలినట్లు ఏకంగా గాలి మోటర్లనే తీసుకపోయి, సూసెటోల్ల గుండె పేలినట్టు శేసిండో పెండ్లి కొడుకు. గీ మద్దెల పండ్లిల్లకు ఇరగమరగ కర్సు సేత్తాండ్లు. ఎంత ఎక్కువ కర్సు శేస్తే,...

సాగు బాగుకు ఇదే సరైన సమయం!|EDITORIAL

ప్రపంచ రాజకీయ పరిణామాలు, పశ్చిమాసియాలో యుద్ధాలు, అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థను ప్రగాఢంగా ప్రభావితం చేస్తున్నాయి. ఎగుమతులు, దిగుమతులు తీవ్ర అంతరాయానికి గురవుతున్నాయి. ఈ సమయాన్ని భారత్ తన ఆహార భద్రత, వ్యవసాయ రంగాన్ని...

13-03-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి దశమి రాత్రి తెల్ల 05.47 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 01.02 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం వ్యతీపాత ఉదయం 08.53 వరకు ఉపరి వరీయాన్ కరణం వణజి సాయంత్రం...

‘పునర్జన్మ’ ప్రాప్తి…! జీవ ‘కారుణ్య’ విముక్తి!!|ADUGU|SPECIAL STORY

-‘బ్రెయిన్ డెడ్’ కు ‘కామా’, ‘కోమా’కు ‘ఫుల్ స్టాప్’!!!|BRAIN DEAD|COMA జీవితం విచిత్రం. పుట్టుక వరమైతే, మరణం శాపం. అనివార్యం. ఇందుకు ఈ రెండు ఘటనలే నిదర్శనం. బ్రెయిన్ ‘డెడ్’ అయిన మహిళ, ఒక్క...

రూపాయికే బూట్లు!?|ADUGU TRENDS

శిత్తం శివుని మీద.. భక్తి శెప్పుల మీద అన్నరు. గీ సామెతను చపల చిత్తానికి వాడినప్పటికీ, పాదరచ్చలు... మన ఆరోగ్యానికి కూడా రచ్చణే! గందుకే గవాటిని మనం యేసుకుంటం. ఇగ బూట్లైతే పాదాలకు...

‘జల్ జీవన్ మిషన్’ తో నీటి సమస్యలు సమసేనా!?|EDITORIAL

నీటి సమస్య వనరుల లభ్యత, వినియోగ విధానం, దుర్వినియోగం, సమర్థవంతమైన నిర్వహణలపై ఆధారపడింది. గ్రామీణ భారతావనికి ప్రతి ఇంటికి నల్లాల ద్వారా మంచినీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘జల్ జీవన్ మిషన్’...

12-03-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి నవమి రాత్రి తెల్ల 04.10 వరకు ఉపరి దశమి నక్షత్రం మూల రాత్రి 10.51 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం సిద్ది ఉదయం 08.20 వరకు ఉపరి వ్యతీపాత కరణం తైతుల పగలు...

ప్లాస్టిక్ ఇటికెలతోటి ఇల్లు!?|ADUGU TRENDS

గీ అన్న ఇకమతు సూత్తే, బుర్ర గిర్రున తిరుగుతది. ఇగిప్పుడు అంతా ప్లాస్టిక్ మయమే అయింది. పుట్టిన కానుండి, గిట్టేదాక, గా ప్లాస్టిక్ లేకుండ పనైతలేదు. ఎంత ముప్పని శెప్పినా, నీల్ల కానుంచి...

గ్యాస్ ట్రబుల్స్-ప్రత్యామ్నాయ మార్గాలు|EDITORIAL

ప్రపంచంతోపాటు, భారతదేశంలో వంటగ్యాస్‌-ఎల్పీజీ వినియోగం గత రెండు దశాబ్దాల్లో విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు నగరాలకే పరిమితమైన ఈ ఇంధనం ఇప్పుడు గ్రామాలకు కూడా విస్తరించింది. వంట కోసం ఇంధనంగా ఎల్పీజీ వినియోగం పెరగడం...

11-03-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి అష్టమి రాత్రి 02.14 వరకు ఉపరి నవమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 08.20 వరకు ఉపరి మూల యోగం వజ్ర ఉదయం 08.00 వరకు ఉపరి సిద్ది కరణం బాలవ పగలు 01.12...

లైటర్ లేకుండనే గ్యాస్ స్టౌని ఎలిగిచ్చుడు!?|ADUGU TRENDS

ఉపాయాలున్నోడు ఊరేగుతడట. గట్లనే ఉంది గీ పొల్లగాని తెలివి. నిప్పులేందే పొగే గాదుల్లా. మంట గూడ రాదు కదా? మరీ గీయన గా నిప్పునే తెలివిగ ఎలిగిచ్చి గ్యాస్ స్టౌకి మంట పుట్టిచ్చిండు. గా...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News