Thursday, June 4, 2026
29.5 C
Hyderabad

విధ్వంసాల పర్యవసానమే ప్రకృతి వైపరీత్యాలు!|EDITORIAL

ప్రకృతి విధ్వంసాన్ని ఎదుర్కోవడం తప్ప ప్రత్యామ్నాయం లేదు. ప్రకృతిని కాపాడటం, పర్యావరణ పరిరక్షణకు పూనుకోవడం తప్ప వేరే దారే లేదు. ఇందుకవసరమైన చైతన్యాన్ని ప్రజల్లో కల్పించడం తప్ప మరో మార్గమే లేదు. వీటికి తగ్గట్లుగా మనం ఉంటున్నామా? మన ప్రభుత్వాలు పని చేస్తున్నాయా? నిజానికి మనకంటే అంటే మానవుల కంటే కూడా జంతువులే నయం. అసలు ప్రకృతికి మొదటి శత్రువు మనషే. మనిషి ఉద్భవించిన తర్వాతే ప్రకృతి వినాశనం మొదలైంది. ఇప్పటికీ గమనిస్తే, మనిషి ఉన్న చోటే పర్యావరణానికి చేటు కలుగుతోంది. అదే పులి, సింహం వంటి ప్రాణాంతక జంతువులున్న చోట కూడా విధ్వంసం లేదు. పైగా అవి పర్యావరణానికి పాటు పడుతున్నాయి. కాబట్టే పులిని మన జాతీయ జంతువుగా పరిగణిస్తున్నాం. కానీ మనం పులిలా కాదు కదా, కనీసం పిల్లిలా కూడా వ్యవహరించలేకపోతున్నాం. అందుకే ఈ ప్రకృతి వైపరీత్యాలకు గురవుతున్నాం. ప్రకృతి ప్రకోపానికి బలవుతున్నాం. అయినా మనం మారమా? మన అంతానికి మనమే కారణమవుదామా? లేక ఈ గుణపాఠాల నేపథ్యంతో ప్రకృతితో సహవాసం చేద్దాం.
అడుగు’ చీఫ్ ఎడిటర్ డాక్టర్ మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్ విధ్వంసాల పర్యవసానమే ప్రకృతి వైపరీత్యాలు!

విధ్వంసాల పర్యవసానమే ప్రకృతి వైపరీత్యాలు!

ప్రకృతి విధ్వంసాన్ని ఎదుర్కోవడం తప్ప ప్రత్యామ్నాయం లేదు. ప్రకృతిని కాపాడటం, పర్యావరణ పరిరక్షణకు పూనుకోవడం తప్ప వేరే దారే లేదు. ఇందుకవసరమైన చైతన్యాన్ని ప్రజల్లో కల్పించడం తప్ప మరో మార్గమే లేదు. వీటికి తగ్గట్లుగా మనం ఉంటున్నామా? మన ప్రభుత్వాలు పని చేస్తున్నాయా? నిజానికి మనకంటే అంటే మానవుల కంటే కూడా జంతువులే నయం. అసలు ప్రకృతికి మొదటి శత్రువు మనషే. మనిషి ఉద్భవించిన తర్వాతే ప్రకృతి వినాశనం మొదలైంది. ఇప్పటికీ గమనిస్తే, మనిషి ఉన్న చోటే పర్యావరణానికి చేటు కలుగుతోంది. అదే పులి, సింహం వంటి ప్రాణాంతక జంతువులున్న చోట కూడా విధ్వంసమే లేదు. పైగా అవి పర్యావరణానికి పాటు పడుతున్నాయి. కాబట్టే పులిని మన జాతీయ జంతువుగా పరిగణిస్తున్నాం. కానీ మనం పులిలా కాదు కదా, కనీసం పిల్లిలా కూడా వ్యవహరించలేకపోతున్నాం. అందుకే ఈ ప్రకృతి వైపరీత్యాలకు గురవుతున్నాం. ప్రకృతి ప్రకోపానికి బలవుతున్నాం.
కాలం కాలానుగుణంగా కాకుండా కాలాతీతంగా నడుస్తోంది. కాల చక్రం భూత, వర్తమాన, భవిష్యత్ లాగే, వానా కాలం, చలి కాలం, ఎండా కాలం ఉన్నాయి. కానీ అవి గతి తప్పాయి. కాలచక్రానికి అతీతంగా అటు ఇటుగా వాటి ప్రభావాలు ఉంటున్నాయి. అందులో భాగమే అతివృష్టి, అనావృష్టి, కరువు కాటకాలు, ప్రకృతి వైపరీత్యాలు వంటివన్నీను. వర్షాకాలం మొదలైంది. కానీ, వర్షాలే ఆలస్యంగా పడ్డాయి. దీంతో పంటలు ఎండిపోయి ఇక కాలం కాదనే దాకా రైతాంగం వెళ్ళిపోయింది. హఠాత్తుగా ఆగస్టు నెలాఖరులో క్లౌడ్ బరస్ట్, కుంభవృష్టి, హఠాత్తుగా వరదలు, బురదలు, మునిగిపోవడాలు, కొందరు శవాలై తేలిపోవడాలు జరిగిపోతూనే ఉన్నాయి. మూసీ ముంచెత్తింది. గోదారి పోటెత్తింది. కృష్ణా పరుగులు పెట్టింది.
హైదరాబాద్ లో అనేకసార్లు, కామారెడ్డి, రామాయం పేట, సిరిసిల్ల, సిద్దిపేట, ఏపీలో అమరావతి, తీర ప్రాతాలతో పాటు ఉత్తారాఖండ్ వంటి ఉత్తరాది, అసోం, మేఘాలయ లాంటి ఈశాన్య రాష్ట్రాల్లో ఈ వానా కాలం జలప్రళయాన్నే కలిగించింది. ఆయా ప్రాంతాలు, ప్రజలు విలవిల్లాడుతున్నారు. నిజామాబాద్‌, మెదక్‌, కామారెడ్డి, నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో వరదలకు ప్రకృతి విధ్వంసం సృష్టించింది. క్లౌడ్‌ బరస్ట్ లతో కుంభవృష్టి కురుస్తోంది. ఉత్తరాఖండ్‌ లోని రుదప్రయాగ్‌, చమోలీ జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. ఇదే ప్రాంతంలో తాజాగా మరోసారి క్లౌడ్‌ బరస్ట్ సంభవించింది. నానా విధ్వంసానికి అనేక మంది గల్లంతయ్యారు. ప్రాణాలు కోల్పోయారు. హిమాచల్‌ప్రదేశ్‌, జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రాల్లో అనేక జిల్లాలకు సంబంధాలు తెగిపోయాయి. ఒక్క కశ్మీర్‌లోనే ఇప్పటివరకు 40 మంది ప్రాణాలు కోల్పోయారు. శ్రీనగర్‌, అనంత్‌నాగ్‌ల్లో నదులు ప్రమాద స్థాయిని మించి ఉప్పొంగడంతో, గండ్లుపడి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంజాబ్‌లో గ్రామాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వ్యవసాయ భూములు అదృశ్యమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో కూడా భారీ వర్షపాతం నమోదైంది. యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. నైరుతి పవనాల ప్రభావం తీవ్రంగా ఉంటోంది. ఈ ఆగస్టులో ఎప్పుడూ లేనంతగా క్లౌడ్‌ బరస్ట్‌ కారణంగా భారీ వర్షాలు పడుతున్నాయి. హిమాలయ పర్వత వాలు ప్రాంతాలు ఒరిగిపోయాయి. మైదానప్రాంతాల్లో గట్లు దెబ్బతిన్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంట పొలాలు నీట మునిగాయి. రైతన్నలు పూర్తిగా రోడ్డున పడ్డారు. నేలకోత పెరిగింది. కొండచరియలు విరిగిపడి సమీప నివాసాలను ధ్వంసం చేస్తున్నాయి. ఊళ్లకు ఊళ్లే కొట్టుకు పోతున్నాయి. పదుల సంఖ్యలో జనం మృత్యువాత పడుతున్నారు.
ఇలా ఎందుకు జరుగుతుందో మనమంతా ఆలోచించాలి. ప్రభుత్వాలు చర్చించాలి. కార్యాచరణకు దిగాలి. ప్రకృతి వైపరీత్యాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. పర్యావరణానికి మనం చేస్తున్న విధ్వంసాన్ని విస్మరించి, ప్రకృతి విపత్తును అసాధారణమైనవిగా చర్చిస్తున్నాం. కొండచరియలు విరిగి పడడానికి కూడా మనం చెట్లను నరికేయడం, బండలను పగుల గొట్టడం అని తెలసీ చేస్తున్నాం. దేశంలోని 16 రాష్టాల్రు, హిమాలయ రీజియన్‌ లోని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు, ఈశాన్యంలోని హిమాలయ పర్వత దిగువ భాగాలు, పశ్చిమ కనుమలు ఇవన్నీ కొండచరియలు విరిగిపడే ప్రాంతాలుగా జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా అధ్యయనంలో గుర్తించింది. రోడ్లు, రైల్వే ప్రాజెక్టుల నిర్మాణాలు, ఎలాంటి ప్రణాళిక లేకుండా సాగించే క్వారీ పనుల కారణంగా కొండచరియలు విరిగిపడుతున్నాయని చేసిన హెచ్చరికలేవీ మన మొద్దుబారిన చెవికి ఎక్కడలం లేదు.
పర్వత ప్రాంతాల్లో ఇష్టం వచ్చినట్లుగా చెట్లనునరకడం వల్లే కొండలపై ఉన్న సారవంతమైన మట్టి వర్షాలకు కొట్టుకుపోయి, కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతోపాటు పంట పొలాల్లోకి, ఇళ్లలోకి బురద ప్రవాహంలా వచ్చిచేరుతోంది. ఎన్నో ప్రాణాలు జలసమాధి అవుతున్నాయి. ఇవన్నీ స్వయం కృతాపరాధాలే. హిమాలయ పర్వత ప్రాంతాల్లో కొండవాలు ప్రాంతాలు అత్యంత బలహీనమైనవని, వాటిని తిరిగి పొందలేమని పర్యావరణ శాస్త్రవేత్తలు చేసిన హెచ్చరికలు ఎవరికి పట్టాయి? ప్రభుత్వాలు ఈ విధ్వంసాన్ని అడ్డుకోవడం లేదు. అలాగని ప్రజలు కూడా తమ వైఖరి మార్చుకోవడం లేదు. భారీ వర్షాల కారణంగా భూమి కొతకు గురై, చెరువుల్లో పూడిక పేరుకుపోతోంది. ఇదంతా మానవ తప్పిదమని గుర్తించడం లేదు.
ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఒక ప్రణాళికతో ప్రకృతి విధ్వంసాన్ని ఆపితే తప్ప, ఈ విపత్తులను ఆపలేం. ఎదుర్కోలేం. ఈ విపత్తుల నివారణకు ముందస్తు ప్రణాళికలు ఆలోచించాలి. అడవులను నరకడం తక్షణం ఆపాలి. కాలువలు, చెరువులను పునరుద్ధరించాలి. జనాభా నియంత్రణ అవసరం. మనిషి తన మనుగడ కోసం ప్రకృతిని విద్వంసం చేస్తున్నాడని గుర్తించి కఠిన నివారణ చర్యలకు పూనుకోవాలి. అప్పుడే ఈ విధ్వంసాన్ని కొంతయినా ఆపగలం.

Latest News

నల్లా దానంతటదే బందైతది!|ADUGU TRENDS

నల్లా పెట్టుడే కాదుల్లా, బంజేసుడు కూడా పెద్ద పనే. నల్లా తిప్పితే నీళ్లొత్తయి. కనీ, నల్లా బంజేయాల్నంటే, గాడ కావలి కాయాలె. లేకపోతే, నా నీల్లన్నీ తొణికి, బయటకి కారిపోతయి. గట్ల కావొద్దని...

‘మమత’ల కోవెలలో వేరుకుంపట్ల కలతలు|EDITORIAL

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మూడు దశాబ్దాలకుపైగా కొనసాగిన వామపక్ష పాలనకు ముగింపు పలికి, 2011లో అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా మార్చేశారు. గత పదిహేనేళ్లుగా...

04-06-2026, గురువారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:44 సంకల్ప తిథి: కృష్ణ-చవితి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-చవితి తిథి : కృష్ణ-చవితి రాత్రి 11:30 వరకు, తదుపరి...

ట్రాక్టర్ ట్రాలే స్విమ్మింగ్ పూల్!?|ADUGU TRENDS

ఎన్కటికి శేద బాయిలు, ఈత బాయిలుండేయి. శేద బాయిలు మంచినీల్లకు, ఈత బాయిలు ఎండాకాలం పిల్లలు, పెద్దలు ఈదడాన్కే ఉండేటియి. ఊరు ఊరంతా గా బాయిల్లనే ఉండేది. ఈత మీద మోజు తగ్గనోల్లు,...

ఇంధన రేషనింగ్ విధానమే మేలు!|EDITORIAL

ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సవాల్ కేవలం పెట్రోల్ ధరల పెరుగుదల మాత్రమే కాదు. అది ఇంధన భద్రత, ఆర్థిక స్థిరత్వం, ప్రజల జీవన ప్రమాణాలకు సంబంధించిన అంశం. ధరలను పెంచి భారాన్ని ప్రజలపై...

03-06-2026, బుధవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:44 సంకల్ప తిథి: కృష్ణ-చవితి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-చవితి తిథి : కృష్ణ-చవితి రాత్రి 11:30 వరకు, తదుపరి కృష్ణ-పంచమి నక్షత్రము...

పెండ్లంటే, గిదే పొండ్లి!?|ADUGU TRENDS

ఇగో పెండ్లంటే గిదే.. గిట్లనే.. అబ్బో గట్లనా? అన్నట్లుగా శేసుకుంటాండ్లు. లచ్చలు, కోట్లు కర్సు పెడ్తాండ్లు. పెండ్లి పిల్ల, పిల్లగాండ్ల మీద కోట్లు కుమ్మరిస్తాండ్లు. కట్న కానుకలతోటి పని లేకుండ, పెండ్లి కర్సునే...

తెలంగాణ ఆవిర్భావం-ప్రజల ఆశలు, ఆశయాలు!|EDITORIAL

మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అప్పుల కుప్పగా తెర్లైంది. ప్రస్తుతం రాష్ట్ర రుణభారం రూ.7 లక్షల కోట్లకు పైగా చేరింది. అప్పులు తీసుకోవడం తప్పు కాదు. కానీ ఆ అప్పులు ఉత్పాదక ఆస్తులుగా...

03-06-2026|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు https://www.instagram.com/reel/DZDc5uGy3Lk/?igsh=ZWtxaG1ka3BwOWd2 సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:43 సంకల్ప తిథి: కృష్ణ-తదియ శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-తదియ తిథి : కృష్ణ-తదియ...

ఐపీఎల్ లో 5 అవార్డులు గెలుచుకున్న వైభవ్|IPL|VAIBHAV SURYAVANSHI

అవార్డుల వర్షం కురిపించిన స్టార్ ఆటగాళ్లు! ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ అభిమానులకు ఎన్నో ఉత్కంఠభరిత క్షణాలను అందించింది. యువ ఆటగాళ్ల సత్తా, సీనియర్ క్రికెటర్ల అనుభవం, చివరి బంతి వరకు సాగిన...

ఈ సాలా కప్ నమ్దే రీలోడెడ్|RCB|IPL|CUP|FINAL

గుజరాత్‌ను మట్టి కరిపించిన RCB ఐపీఎల్ 2026 మకుటాన్ని ముద్దాడిన బెంగళూరు! ఐపీఎల్ 2026 ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరోసారి చరిత్ర సృష్టించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్...

01-06-2026|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:43 సంకల్ప తిథి: కృష్ణ-పాడ్యమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-పాడ్యమి తిథి : కృష్ణ-పాడ్యమి సాయంత్రం 4:39 వరకు, తదుపరి కృష్ణ-విదియ నక్షత్రము...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News