Monday, March 16, 2026
29.3 C
Hyderabad

రాష్ట్రాల పురోగతే దేశ ప్రగతి!|EDITORIAL

మరో పక్షం రోజుల్లో కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ కసరత్తుల్లో నిమగ్నమయ్యారు. ఈ ప్రక్రియలో భాగంగా ఇటీవల రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో ప్రీ–బడ్జెట్‌ సమావేశం నిర్వహించారు. దేశంలో రాష్ట్రాలు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని ఈ భేటీ మరోసారి బహిర్గతం చేసింది. రాష్ట్రాలు తమ అభివృద్ధి అవసరాల కోసం కేంద్రాన్ని దేబిరించాల్సిన పరిస్థితి. రాజకీయ భేదాభిప్రాయాల ఆధారంగా నిధుల కేటాయింపులు జరుగుతుండటం దేశ ప్రజాస్వామ్యానికి ఆందోళన కలిగించే అంశాలు.

ప్రీ బడ్జెట్‌ సమావేశంలో తెలంగాణ నుంచి భట్టి విక్రమార్క, ఆంధ్రప్రదేశ్‌ నుంచి పయ్యావుల కేశవ్‌ హాజరై తమ రాష్ట్రాల అవసరాలు, ఆకాంక్షలను కేంద్రం ముందు ఉంచారు. అయితే ఈ వినతులు కొత్తవేమీ కావు. ఏటా ఇదే విధంగా విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ, ఇప్పటివరకు కేంద్రం ప్రకటించిన బడ్జెట్లలో నిధుల కేటాయింపులు, రాష్ట్రాలు ఆశించిన విధంగా లేవు. ఏ పథకానికి ఎంత ఖర్చు చేశారో, ఏ రాష్ట్రానికి ఎంత న్యాయం జరిగిందో తెలిపే పారదర్శక వ్యవస్థ కనిపించడం లేదు.

బడ్జెట్‌ కేవలం లెక్కల పుస్తకం కాదు. అది దేశ అభివృద్ధికి దిశానిర్దేశం చేసే విధాన పత్రం. అన్ని రాష్ట్రాలను సమానంగా చూసే దృక్పథం అందులో ప్రతిఫలించాలి. కానీ వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి మద్దతు ఇచ్చే రాష్ట్రాలకు ఒక రకంగా, భిన్న రాజకీయ వైఖరులు గల రాష్ట్రాలకు మరో రకంగా నిధుల పంపిణీ జరుగుతుండడాన్ని తీవ్రంగా పరిగణించాలి. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం.

ఈసారి ప్రీ–బడ్జెట్‌ సమావేశంలో కేంద్రంలో ఎన్‌డిఎ కూటమిలో భాగస్వామ్య రాష్ట్రాలు కూడా నిధుల కోసం గళం విప్పాయి. జీఎస్‌టీ పరిహారం కొనసాగించాలని, పెరిగిన ఆర్థిక భారం దృష్ట్యా అదనపు గ్రాంట్లు ఇవ్వాలని బీహార్‌ సహా పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు కోరడం పరిస్థితి తీవ్రతను అర్థం చేస్తున్నాయి. పన్నుల వసూళ్లలో రాష్ట్రాల వాటాను తగ్గించడం, గ్రాంట్లను ఆలస్యం చేయడం, అప్పుల పరిమితులను కఠినతరం చేయడం వంటి కేంద్ర ప్రభుత్వ విధానాలే ఈ దుస్థితికి ప్రధాన కారణాలు.

కేంద్ర ఆర్థిక విధానాల వల్ల అత్యధికంగా నష్టపోయిన రాష్ట్రాల్లో కేరళ ముందుంది. సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్న కేరళపై కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. గత ఐదేళ్లలో దాదాపు రూ.57 వేల కోట్ల మేర నిధులకు కోత పెట్టడమే కాకుండా, పన్నుల వాటాను 3.89 శాతం నుంచి 1.92 శాతానికి తగ్గించింది. దీనివల్ల ఒక్క 2024–25 ఆర్థిక ఏడాదిలో కేరళ ప్రజలు సుమారు రూ.27 వేల కోట్లలు నష్టపోయారు. జీఎస్‌టీ సంస్కరణల కారణంగా మరో రూ.9 వేల కోట్లు నష్టం వాటిల్లింది. ఈ ఆర్థిక దిగ్బంధానికి నిరసనగా ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సత్యాగ్రహానికి దిగాల్సి రావడం పరిస్థితి ఎంత తీవ్రమో సూచిస్తోంది.

ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ ఈ ఏకపక్ష విధానాలపై కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుపీఏ మౌనం పాటించడం దారుణం. సమాఖ్య హక్కుల పరిరక్షణలో ప్రతిపక్షాలు ఏకోన్ముఖంగా పోరాడకపోవడం, కేంద్ర ప్రభుత్వానికి మరింత బలాన్నిస్తోంది. బరితెగించి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తోంది.

తెలంగాణ ఫ్యూచర్‌ సిటీ, మూసీ సుందరీకరణ, నవోదయ విద్యాలయాలు, రోడ్ల విస్తరణ, ఎస్సీఆర్‌ఎస్పీకి జాతీయ హోదా, ట్రిపుల్‌ ఆర్‌ వంటి కీలక ప్రాజెక్టుల కోసం నిధులు కోరింది. ఆంధ్రప్రదేశ్‌ అమరావతి రాజధాని నిర్మాణానికి కొనసాగింపు నిధులు, పోలవరం ప్రాజెక్టుకు పూర్తి సహాయం, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలు, విశాఖపట్నం–రాయలసీమ మౌలిక సదుపాయాల అభివృద్ధికి అదనపు కేటాయింపులు కోరింది. ఇవన్నీ ఏళ్లుగా వినిపిస్తున్న డిమాండ్లే. తెలంగాణ, ఏపీ సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి ఇవే అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నా ఫలితం కనిపించడం లేదు.

నిధుల కేటాయింపుల్లో సమానత, పారదర్శకత, రాజకీయ భేదాలకు అతీతమైన దృక్పథం అత్యవసరం. బలమైన రాష్ట్రాలే బలమైన కేంద్రాన్ని నిర్మిస్తాయి. రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిస్తే దేశ ప్రగతి కుంటుపడుతుంది. సమాఖ్య వ్యవస్థను బలోపేతం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ ఏకపక్ష వైఖరిని విడనాడి, రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాల హక్కులను గౌరవించాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో, ఈ ఆర్థిక, అభివృద్ధి అసమానతలు, అసంతృప్తులకు దారితీస్తాయి. ఆవేదనలు, నిరసనలు, ఆందోళనలుగా మారి దేశవ్యాప్తంగా అంతర్గత సమస్యలు పెరుగే ప్రమాదం లేకపోలేదు. ఈ లోగా కేంద్రం మేల్కొంటే మంచిది.

Latest News

16-03-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి ద్వాదశి ఉదయం 07.43 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం ధనిష్ఠ రాత్రి తెల్ల 05.09 వరకు ఉపరి శతభిషం యోగం శివ ఉదయం 08.15 వరకు ఉపరి సిద్ద కరణం తైతుల ఉదయం...

ఇంట, వంట, పంట, పయానం అన్నీ గా ట్రాక్టరే!?|ADUGU TRENDS

ఉపాయం లేనోన్ని ఊల్లెనే ఉండనీయొద్దట! గందుకే ఉపాయమున్న గీయినె, ఊల్లు తిరుగుతాండు!! ఊల్లు తిరుగుడంటే, ఊల్లు పట్టుకుని తిరుగుతాండని కాదుల్లా... ఇట్టమైన ఊల్లని ఏ కట్టం లేకుండా తిరుగుతాండు. గదెట్లంటరా? ఇగో మీరే...

బడ్జెట్ : ప్రజాకాంక్షలను ప్రతిబింబించేనా!?|EDITORIAL

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు రాష్ట్ర రాజకీయ వర్గాలనేగాక, సాధారణ ప్రజల్లో కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రాష్ట్రంలోని రైతులు, ఉద్యోగులు,...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

మార్చి 15 నుండి మార్చి 21 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి పనుల్లో కొంత ఒత్తిడి ఉన్నా చివరికి మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఉద్యోగంలో మీ...

ఈవీలేవీ? ఈవీలపై క్లారిటీలేవీ?|EV|TELANGANA|CM|GOVERNMENT

మొన్న సీఎం|CM|REVANTH REDDY, నిన్న డిప్యూటీ సీఎం|DEPUTY CM|BHATTI VIKRAMARKA MALLU ప్రకటనల సారాంశమేంటి?|SUMMARY ప్రస్తుత వాహనాలనేం చేస్తారు?|OLD VEHICLES కొత్తవి సరే, పాతవాటి పరిస్థితేంటి? ఇప్పటికే తుప్పుపట్టిన వాహనాల సంగతేంటి? ఇం‘ధన’ ఖర్చు తగ్గించడానికి వేల కోట్ల వ్యయమా? ఉన్న...

ఎలుకలు రాకుండ అదిరే శిట్కా!?|ADUGU TRENDS

ఎలుక సొర్రిందని ఇల్లు తగుల బెట్టుకుంటమా? ఏంది? యెట్లన్న శేసి గా ఎలుకను బయిటికి తోలుతం. ఇల్లును మాత్రం మంచిగ కాపాడుకుంటం. మరైతే ఇంట్లకు ఎలుకలు రాకుండ ఏం శేయాల్నో, ఎట్లెట్ల శేయాల్నో...

రాహుల్ పరిపక్వ విపక్ష నేతేనా!?|EDITORIAL

భారత రాజకీయాల్లో విపక్ష నాయకత్వం ఎప్పుడూ ప్రజాస్వామ్య పరిరక్షణకు అత్యంత కీలకం. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, విధానాలను సమీక్షించడం, ప్రత్యామ్నాయ మార్గాలను చూపడం, అవసరమైన సూచనలు చేయడం, తద్వారా ప్రభుత్వాన్ని గాడిలో పెట్టడం విపక్షం...

14-03-2026, శనివారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి ఏకాదశి పూర్తిగ రోజంత నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 02.53 వరకు ఉపరి శ్రవణ యోగం వరీయాన్ ఉదయం 09.01 వరకు ఉపరి పరిఘ కరణం బవ సాయంత్రం 06.24 వరకు ఉపరి బాలవ రాహుకాలం...

ముగిసిన యువకుడి అంత్యక్రియలు|PALAKURTHI

పుత్రశోకంలో కన్నతల్లి కన్నీటి వీడ్కోలు ఘన నివాళులు అర్పించిన పాలకుర్తి విధి ఆడిన వింత నాటకంలో ఒక కన్నతల్లికి అంతకన్నా దౌర్భాగ్య స్థితి మరొకటి ఉండదు. కొడుకే లోకమని, తనే తన సర్వస్వమని బతికిన ఆ...

గాలి మోటర్ల.. గా అత్తగారింటికి!?|ADUGU TRENDS

అత్తగారింటికి దారేది? అంటే గాల్లో తేలినట్లు ఏకంగా గాలి మోటర్లనే తీసుకపోయి, సూసెటోల్ల గుండె పేలినట్టు శేసిండో పెండ్లి కొడుకు. గీ మద్దెల పండ్లిల్లకు ఇరగమరగ కర్సు సేత్తాండ్లు. ఎంత ఎక్కువ కర్సు శేస్తే,...

సాగు బాగుకు ఇదే సరైన సమయం!|EDITORIAL

ప్రపంచ రాజకీయ పరిణామాలు, పశ్చిమాసియాలో యుద్ధాలు, అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థను ప్రగాఢంగా ప్రభావితం చేస్తున్నాయి. ఎగుమతులు, దిగుమతులు తీవ్ర అంతరాయానికి గురవుతున్నాయి. ఈ సమయాన్ని భారత్ తన ఆహార భద్రత, వ్యవసాయ రంగాన్ని...

13-03-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి దశమి రాత్రి తెల్ల 05.47 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 01.02 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం వ్యతీపాత ఉదయం 08.53 వరకు ఉపరి వరీయాన్ కరణం వణజి సాయంత్రం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News