Monday, August 3, 2026
31.5 C
Hyderabad

రాజ్యాంగం- గవర్నర్ల వ్యవహారం- సుప్రీం తీర్పు!|EDITORIAL

రాష్ట్రపతి, గవర్నర్ల దగ్గర బిల్లుల పెండింగ్ వ్యవహారంలో సుప్రీం కోర్టు వ్యాఖ్యలు సంచలనంగా ఉన్నా, తీర్పు మాత్రం రాజ్యాంగానికి లోబడే కనిపిస్తున్నాయి. నిర్ణీత గడువులోగా ఆమోదించకపోతే అవి ఆమోదం పొందినట్లేనన్న వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్లే. అయితే గడువు ఉండాలన్న నిర్ణయం తీసుకోవాలన్నా, రాజ్యాంగాన్ని సవరించాలన్నా, అది పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. రాష్ట్రపతి అడిగిన ప్రశ్నలకు సమాధానంగా తేలింది కూడా ఏమీ లేదు. ఫైనల్ గా బంతి పార్లమెంటులోనే పడింది. గవర్నర్ల బిల్లు పెండింగ్ వ్యవహారం పెండింగులోనే పడింది.

మార్గం-అడుగు, డా. మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్

రాష్ట్రపతి, గవర్నర్ల దగ్గర బిల్లుల పెండింగ్ వ్యవహారంలో సుప్రీం కోర్టు వ్యాఖ్యలు సంచలనంగా ఉన్నా, తీర్పు మాత్రం రాజ్యాంగానికి లోబడే కనిపిస్తున్నాయి. నిర్ణీత గడువులోగా ఆమోదించకపోతే అవి ఆమోదం పొందినట్లేనన్న వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్లే. అయితే గడువు ఉండాలన్న నిర్ణయం తీసుకోవాలన్నా, రాజ్యాంగాన్ని సవరించాలన్నా, అది పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. రాష్ట్రపతి అడిగిన ప్రశ్నలకు సమాధానంగా తేలింది కూడా ఏమీ లేదు. ఫైనల్ గా బంతి పార్లమెంటులోనే పడింది. గవర్నర్ల బిల్లు పెండింగ్ వ్యవహారం పెండింగులోనే పడింది.

పదవీ విరమణ పొందుతున్న సమయంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ బుధ, గురు వారాల్లో రెండు రాజ్యాంగ ధర్మాసనాలకు నేతృత్వం వహించి సంచలన తీర్పులిచ్చారు. రాష్ట్రపతి న్యాయ సలహా కోరిన అంశంపై గురువారం ఏకాభిప్రాయంతో ఇచ్చిన తీర్పూ సంచలనమే. తమిళనాడులో గవర్నర్, పలు బిల్లులను ఆమోదించకుండా తొక్కిపెడుతుండటంతో అక్కడి ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. సహేతుకమైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు గవర్నర్‌ను ఆదేశించింది. బిల్లులను తొక్కిపట్టే విధానాన్ని తప్పుబట్టింది. అయినా సరే, గవర్నర్‌ మాత్రం బిల్లులను ఆమోదించలేదు. దీంతో తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ద్విసభ్య బెంచ్‌ ఈ ఏడాది ఏప్రిల్‌ 8న గవర్నర్‌ రాజ్యాంగ విధుల్లో విఫలయ్యారని మండిపడింది. బిల్లులు తిప్పిపంపకుండా దగ్గర పెట్టుకోవడం కుదరదని చెప్పింది. మళ్లీ శాసనసభ ఆమోదిస్తే గవర్నర్‌ ఆమోదించాల్సిందేనని స్పష్టం చేసింది. నిర్ణీత గడువులో గవర్నర్‌ బిల్లులను ఆమోదించకపోతే, అవి ఆమోదం పొందినట్లుగా పరిగణిస్తున్నట్లు తెలిపింది.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మే 13న రాష్ట్రపతి ద్వారా సుప్రీంకోర్టును 14 ప్రశ్నలతో న్యాయ సలహా కోరింది. వాటికి సుప్రీంకోర్టు గురువారం సమాధానం ఇచ్చింది. వాదనల సమయంలో ఏప్రిల్‌ 8 నాటి తీర్పును తోసిపుచ్చే ఉద్దేశం లేదని ప్రధాన న్యాయమూర్తి పదేపదే చెప్పారు. మరో తీర్పును తోసిపుచ్చేందుకు రాష్ట్రపతి ఆర్టికల్‌ 143 కింద సలహా కోరడాన్ని ఉపకరణంగా వాడటం కుదరదని పేర్కొంది. ప్రధానంగా బెంగాల్‌, తమిళనాడు, తెలంగాణల్లో ఇలాంటి పరిస్థితులను చూశాం.
అయితే రాష్ట్రపతి, గవర్నర్లకు బిల్లుల ఆమోదంలో గడువు విధించడం తగదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇటీవలే తేల్చిచెప్పింది. విచక్షణతో వ్యవహరించవచ్చంది. అటువంటి సమయంలో సహేతుకమైన సమయంలో నిర్ణయం తీసుకోవా లని గవర్నర్‌ను న్యాయస్థానం ఆదేశించవచ్చని చెప్పింది.ఈ తీర్పుతో ఇప్పుడు గవర్నర్ల వద్ద బిల్లులు పెండింగ్‌లో ఉన్నా ప్రశ్నించే అవకాశం లేకుండా పోయింది. అలాగే బిల్లులను సకాలంలో పంపాలన్న నిబంధన లేకపోతే వారు రాష్ట్ర ప్రభుత్వాలపై పెత్తనం చెలాయిస్తారని తమిళనాడు, బెంగాల్‌ తదితర రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సుప్రీం తీర్పుపై తమిళనాడు సీఎం స్టాలిన్‌ స్పందించారు. గవర్నర్లకు గడువు ఉండాలని, అభిప్రాయపడ్డారు. అవసరమైతే రాజ్యాంగ సవరణ చేయాలన్నారు.

గవర్నర్‌కు రాజ్యాంగపరంగా మూడు ఆప్షన్లు ఉంటాయని సుప్రీంకోర్టు తెలిపింది. ఆమోదించడం లేదా సహేతుక కారణం చెప్పి బిల్లును రిజర్వులో పెట్టడం లేదా రాష్ట్రపతికి పంపడం చేయాలి. ఒకవేళ బిల్లును తిరస్కరించి తిరిగి అసెంబ్లీకి పంపాలి. అప్పుడు శాసనసభ తిరిగి అదే బిల్లును పంపితే, ఆమోదించాలి. కానీ చాలా సందర్భాల్లో అలా జరగడం లేదు. తమిళనాడు గవర్నర్‌ రవి నిబంధనలను పట్టించుకోలేదు. అయితే, రాజ్యాంగంలోని 200 నిబంధన కింద గవర్నర్‌ విచక్షణాధికారాన్ని ఉపయోగిస్తారన్నది ధర్మాసనం అభిప్రాయం. అలాంటి సమయాల్లో మంత్రి మండలి సలహా ప్రకారం నడుచుకోవాల్సిన అవసరం లేదు. 361 అధికరణ కింద వారికి రక్షణ కవచం ఉన్నప్పటికీ సుదీర్ఘమైన ఆలస్యం జరిగినప్పుడు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయవచ్చని తెలిపింది.

తన పరిశీలనకు వచ్చిన ప్రతి బిల్లుపై రాష్ట్రపతి రాజ్యాగంలోని 143వ అధికరణం కింద సుప్రీంకోర్టు సలహా కోరనవసరం లేదు. గవర్నర్లు నిరవధికంగా ఒక బిల్లును తమ వద్ద ఉంచుకోరాదనేదే ప్రధానం. అందువల్ల పరిమితమైన న్యాయ సవిూక్ష ఉండవచ్చని రాజ్యాంగ ధర్మాసనం తన ఏకగ్రీవ తీర్పులో అభిప్రాయపడింది. డెడ్‌లైన్‌ పెట్టి, ఆలోగా ఆమోదం ఇవ్వకపోతే లభించినట్లుగానే భావించడం రాజ్యాంగంలోని అధికారాల విభజన సూత్రానికి భంగం కలిగిస్తుందని తెలిపింది.

ఇకిప్పుడు గవర్నర్ల వద్ద బిల్లుల పెండింగ్ ఎంతకాలమనేదే సమస్య. దానికి కూడా పరిమిత కాలం ఉండకపోతే ఎలా? అందుకే పార్లమెంట్‌ చర్చించాలి. అవసరమైతే రాజ్యాంగాన్ని సవరించాలి.

Latest News

ఆగస్టు 03, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి రాత్రి 08.18 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 08.37 వరకు ఉపరి రేవతి యోగం సుకర్మ రాత్రి 08.54 వరకు ఉపరి ధృతి కరణం కౌలవ ఉదయం 08.40...

అవుమల్లా! కడుపుల బిడ్డ స్పందిత్తదా!?|ADUGU TRENDS

తల్లి గర్భంల ఉండంగనే బిడ్డలకి బయటియి యినబడ్తయా? గవాటికి గా పిల్లలు గూడ స్పందిత్తరా? యెన్కటికి కడుపుల ఉండంగనే అర్జునుడి కొడుకు అభిమన్యుడు పద్మవ్యూహంలకెట్ల పోవాల్నో తెలుసుకున్నడట. గిది నిజమో కాదో కనీ,...

ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ గా భోగాపురం!?|EDITORIAL

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఒక కొత్త అవకాశాన్ని తెరిచింది. ఈ అవకాశాన్ని స్థిరమైన అభివృద్ధిగా మలచడం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్థానిక ప్రజల సమిష్టి కృషిపైనే ఆధారపడి ఉంటుంది. మౌలిక వసతుల...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 02 నుండి ఆగస్టు 08 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీరు చేపట్టే పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో...

యిధి యిసిత్రమైందంటే గిదే మరి!?|ADUGU TRENDS

యిధి శాల యిసిత్రమైంది. ఒకపాలి కలిసున్నోల్లను సిడెంల యిడదీత్తది. యిడిపోయినోల్లని శిటికెల కలిపేత్తది. గసొంటిదే గీ ముచ్చట. గదేందో సూద్దాం పాండ్రి. తమిళనాడు రాస్ట్రం విరుదు నగర్ జిల్లా తిరుచూలి పూమాలై పట్టీకి శెందిన...

పోలీసింగ్ పై పార్లమెంటులో సమీక్షేది!?|EDITORIAL

పార్లమెంట్ వరుసగా వాయిదాలు పడుతూ స్తంభిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ప్రతిష్ఠంభనల వల్ల ఉభయ సభల్లో కీలక అంశాలపై అసలు చర్చే జరగడం లేదు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు కూడా అత్యవసరం....

ఆగస్టు 01, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ తదియ రాత్రి 09.20 వరకు ఉపరి చవితి నక్షత్రం శతభిషం రాత్రి 08.09 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శోభ రాత్రి 11.43 వరకు ఉపరి అతిగండ కరణం వణజి ఉదయం 09.10...

తెలంగాణ ‘పెద్ద’న్న అస్తమయం!|TELANGANA|PEDDI SUDHARSHAN REDDY

ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు హనుమకొండలో గుండెపోటు మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు 5రోజులు మృత్యువుతో పోరాటం కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ...

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమవుతోందా!?|EDITORIAL

ప్రతిపక్షం బలహీనంగా ఉంటే ప్రజాస్వామ్యం కూడా బలహీనపడుతుంది. అధికార పక్షం తప్పులను ఎత్తిచూపే శక్తి లేకపోతే ప్రభుత్వ జవాబుదారీతనం తగ్గుతుంది. అందుకే, కాంగ్రెస్ బలపడటం కేవలం ఆ పార్టీ అవసరం మాత్రమే కాదు....

జూలై 31, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ విదియ రాత్రి 09.03 వరకు ఉపరి తదియ నక్షత్రం ధనిష్ఠ రాత్రి 07.09 వరకు ఉపరి శతభిషం యోగం సౌభాగ్య రాత్రి 12.33 వరకు ఉపరి శోభ కరణం తైతుల ఉదయం 08.40...

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News