Friday, March 13, 2026
24.7 C
Hyderabad

ఓటర్ల జాబితా సవ‘రణ’లు!|EDITORIAL

భారతదేశంలో 2024 సార్వత్రిక ఎన్నికల కోసం నమోదైన ఓటర్లు 96.88 కోట్ల మంది. అంతకుముందు ఎన్నికలకు నమోదైన ఓటర్లతో పోలిస్తే 8% పెరుగుదల ఉంది. మహిళా ఓటర్ల నమోదు పురుష ఓటర్ల కంటే ఎక్కువగా ఉంది. 18-29 ఏళ్ల వయస్సు గల 2 కోట్ల మంది కొత్త యువ ఓటర్లు నమోదయ్యారు. అయితే, ఓటర్ల జాబితా సవరణలు అవసరమా? లేదా? అన్నది ఈ మధ్య వివాదాంశంగా మారింది. బిహార్ ఎన్నికలకు ముందు సవరింపులు, అంతకుముందు మహారాష్ట్ర ఎన్నికలకు ముందు సవరింపులతో ముడిపడి పెద్ద చర్చనీయాంశంగా మారింది. దేశంలో బీజేపీయేతర పార్టీలు, ప్రభుత్వాలు వసరణను వ్యతిరేకిస్తున్నాయి. కేరళ అసెంబ్లీ ఏకంగా తీర్మానమే చేసింది. ఇంతకీ ఓటర్ల జాబితా సవరణ అవసరమా? కాదా?

మార్గం-అడుగు, డా.మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్

భారతదేశంలో 2024 సార్వత్రిక ఎన్నికల కోసం నమోదైన ఓటర్లు 96.88 కోట్ల మంది. అంతకుముందు ఎన్నికలకు నమోదైన ఓటర్లతో పోలిస్తే 8% పెరుగుదల ఉంది. మహిళా ఓటర్ల నమోదు పురుష ఓటర్ల కంటే ఎక్కువగా ఉంది. 18-29 ఏళ్ల వయస్సు గల 2 కోట్ల మంది కొత్త యువ ఓటర్లు నమోదయ్యారు. అయితే, ఓటర్ల జాబితా సవరణలు అవసరమా? లేదా? అన్నది ఈ మధ్య వివాదాంశంగా మారింది. బిహార్ ఎన్నికలకు ముందు సవరింపులు, అంతకుముందు మహారాష్ట్ర ఎన్నికలకు ముందు సవరింపులతో ముడిపడి పెద్ద చర్చనీయాంశంగా మారింది. దేశంలో బీజేపీయేతర పార్టీలు, ప్రభుత్వాలు వసరణను వ్యతిరేకిస్తున్నాయి. కేరళ అసెంబ్లీ ఏకంగా తీర్మానమే చేసింది. ఇంతకీ ఓటర్ల జాబితా సవరణ అవసరమా? కాదా?

దేశంలో ఉద్యోగ, ఉపాధి వలసలు పెరుగుతున్నాయి. దీంతో చాలా మంది ఓట్లు ఒకచోట, వారొక చోట ఉండటమో, లేదా రెండు చోట్లా ఓట్లు కలిగి ఉండటమో చేస్తున్నారు. ఓటే లేకుండా పోవడమో జరుగుతోంది. చిరునామా మార్చులు, మరణించినవారి పేరు తొలగించకపోవడం లాంటి కారణాల వల్ల జాబితా మార్పులు అవసరం అవుతాయి. భారత ఎన్నికల కమిషన్ పేర్కొన్నట్లు ‘ఒకసారి తయారైన ఓటర్ల జాబితాను ఎప్పటికి అలాగే కొనసాగించలేం. అందుకే సవరణ అవసరం’. భద్రతా ప్రమాణాల రీత్యా, రిప్రజెంటేసన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ 1950, సెక్షన్ 16 ప్రకారం ‘కేవలం భారత పౌరులు, 18 ఏళ్ళు నిండిన వారు ఓటర్లుగా నమోదు కావచ్చు’.

అయితే, సాంకేతికత, సమాచారం, డిజిటలైజేషన్ పెరిగిన ఈ తరుణంలో ఆధార్, ఓటర్ ఐడీ వంటి గుర్తింపు కార్డులను అత్యంత భద్రతగా ఇవ్వాల్సి ఉంది. కానీ, నకిలీ గుర్తింపు కార్డులున్నట్లుగా గుర్తించారు. ఓటర్ల రిజిస్ట్రేషన్, జాబితా వ్యవస్థను సక్రమంగా నిర్వహించాలంటే, సవరణలు తప్పనిసరి.
అయితే వసరణల్లో లోపాలే సవరణ ఎందుకు? అన్న ప్రశ్నలను సంధిస్తున్నాయి. హడావుడిగా ఎన్నికలకు ముందే ఈ సవరణలు చేపట్టడం వల్ల అనుమానాలు కలుగుతున్నయి. నిర్ణీత పద్ధతులు, సమయాల్లో నిరంతరంగా జరగాల్సిన సవరణపై సుప్రీం కోర్టు కూడా ఈసీని మందలించింది. ఇందుకు తగ్గట్లుగానే, వసరణల్లో లోపాలు, నిర్లక్ష్యాలు, ఓటర్ల హక్కులకు భంగం కలిగిస్తున్నాయి. డాక్యుమెంటేషన్ పద్ధతి వల్ల నిరక్షరాస్యులైన ఓటర్లు వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. పరిమిత వనరులతో తక్కువ సమయంలో చేపట్టే సవరణలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

దేశ అత్యున్నత న్యాస్థానం చెబుతున్నట్లు.. ఇలాంటి అనుమానాలకు తావులేకుండా ఓటర్ల జాబితా సవరణలు నిరంతరంగా పారదర్శకంగా జరగాలి. సవరణ సులభంగా ఉండి, నిజమైన ఓటు పోకుండా ఉండాలి. ఆధార్ లింకింగ్, డేటాబేస్ పూర్తి చేయడం, ఇంటర్నెట్/మొబైల్ ద్వారా తనిఖీలు చేయడం వంటి మార్గాలు ఉండాలి. అయితే ఇది ప్రజల గోప్యత, డేటా భద్రత హక్కులకు హాని కలగకుండా ఉండాలి. ‘అధికారికంగా ఆధార్ లింకింగ్ తప్పనిసరి కాద’ని ఈసీ తెలిపింది. సవరణ ఎన్నికల ముంగిట కాకుండా, ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలగకుండా ఉండాలి.

అయితే, బిహార్ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా సవరణ వివాదస్పదమైంది. కాంగ్రెస్ పార్టీ సవరణలపై అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఈసీని నిందించింది. దొంగ ఓట్లను చేర్చారని అనుమానించింది. పెద్ద దుమారమే లేచింది. చివరకు సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఓటర్ల సవరింపులో కొన్ని లోపాలు కూడా బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలోని అధికార బీజేపీయేతర పార్టీ ప్రభుత్వాలన్నీ సవరణను వ్యతిరేకిస్తున్నాయి. ‘స్థానిక సంస్థలకు, రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఎస్‌ఐఆర్‌ చేపట్టవద్దని కేరళ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. తమిళనాడు, పశ్చిమబెంగాల్ లోనూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తమిళ సీఎం అఖిలపక్షానికి పిలునిచ్చారు.

ఎన్నికల సంఘం విధుల్లో తలదూర్చడం తప్పే. అయితే, ఓటర్ల జాబితా ఆధునీకరణ పక్రియ ద్వారా అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంగా, రాజకీయ పక్షపాత రహితంగా, అనుమానాలకు తావివ్వని విధంగా చేపట్టాల్సిందే. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాతమైన ఎన్నికలు భారత రాజ్యాంగ మౌలిక వ్యవస్థకు మూలస్తంభం. వాటిని నిర్వహించే ఎన్నికల కమిషన్‌ను బలోపేతం చేస్తూ పోవాల్సిందే. శేషన్‌ లాంటి వారు ఎన్నికల కమిషనర్‌గా ఉన్నత ప్రమాణాలను పాటించారు. ప్రధాని, ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీ ఎన్నికల కమిషనర్ల నియామకాలను చేపట్టే విధానాన్ని బీజేపీ ప్రభుత్వం మార్చేసింది. సీజేఐని తొలగించి, ఆ స్థానంలో సీనియర్‌ కేబినెట్‌ మంత్రిని సభ్యుడిగా చేర్చింది. దీన్ని వ్యతిరేకించిన సుప్రీంకోర్టు తీర్పును పక్కనపెడుతూ పార్లమెంటులో చట్టం చేసింది. ఈ ప్రక్రియే అనేక అనుమానాలకు మూలంగా మారింది.

అయితే, బీహార్‌ ఎస్‌ఐఆర్‌ పక్రియపై సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వనే లేదు. తాజాగా దేశవ్యాప్తంగా ఎస్‌ఐఆర్‌ చేపట్టడం వల్ల కొందరికి అనుమానాలు కలుగుతున్నాయి. కేంద్రం ఈ రకమైన అనుమానాలను నివృతి చేయాలి. ప్రతిపక్షాలు కూడా అనుమానాలుంటే వాటిని నిరూపించాలి. అంతేకానీ, వ్యవస్థనే తప్పుపడితే, ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమే అవుతుంది. పైగా పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా మాట్లాడ్డం కూడా మానుకోవాలి.

Latest News

ముగిసిన యువకుడి అంత్యక్రియలు|PALAKURTHI

పుత్రశోకంలో కన్నతల్లి కన్నీటి వీడ్కోలు ఘన నివాళులు అర్పించిన పాలకుర్తి విధి ఆడిన వింత నాటకంలో ఒక కన్నతల్లికి అంతకన్నా దౌర్భాగ్య స్థితి మరొకటి ఉండదు. కొడుకే లోకమని, తనే తన సర్వస్వమని బతికిన ఆ...

గాలి మోటర్ల.. గా అత్తగారింటికి!?|ADUGU TRENDS

అత్తగారింటికి దారేది? అంటే గాల్లో తేలినట్లు ఏకంగా గాలి మోటర్లనే తీసుకపోయి, సూసెటోల్ల గుండె పేలినట్టు శేసిండో పెండ్లి కొడుకు. గీ మద్దెల పండ్లిల్లకు ఇరగమరగ కర్సు సేత్తాండ్లు. ఎంత ఎక్కువ కర్సు శేస్తే,...

సాగు బాగుకు ఇదే సరైన సమయం!|EDITORIAL

ప్రపంచ రాజకీయ పరిణామాలు, పశ్చిమాసియాలో యుద్ధాలు, అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థను ప్రగాఢంగా ప్రభావితం చేస్తున్నాయి. ఎగుమతులు, దిగుమతులు తీవ్ర అంతరాయానికి గురవుతున్నాయి. ఈ సమయాన్ని భారత్ తన ఆహార భద్రత, వ్యవసాయ రంగాన్ని...

13-03-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి దశమి రాత్రి తెల్ల 05.47 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 01.02 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం వ్యతీపాత ఉదయం 08.53 వరకు ఉపరి వరీయాన్ కరణం వణజి సాయంత్రం...

‘పునర్జన్మ’ ప్రాప్తి…! జీవ ‘కారుణ్య’ విముక్తి!!|ADUGU|SPECIAL STORY

-‘బ్రెయిన్ డెడ్’ కు ‘కామా’, ‘కోమా’కు ‘ఫుల్ స్టాప్’!!!|BRAIN DEAD|COMA జీవితం విచిత్రం. పుట్టుక వరమైతే, మరణం శాపం. అనివార్యం. ఇందుకు ఈ రెండు ఘటనలే నిదర్శనం. బ్రెయిన్ ‘డెడ్’ అయిన మహిళ, ఒక్క...

రూపాయికే బూట్లు!?|ADUGU TRENDS

శిత్తం శివుని మీద.. భక్తి శెప్పుల మీద అన్నరు. గీ సామెతను చపల చిత్తానికి వాడినప్పటికీ, పాదరచ్చలు... మన ఆరోగ్యానికి కూడా రచ్చణే! గందుకే గవాటిని మనం యేసుకుంటం. ఇగ బూట్లైతే పాదాలకు...

‘జల్ జీవన్ మిషన్’ తో నీటి సమస్యలు సమసేనా!?|EDITORIAL

నీటి సమస్య వనరుల లభ్యత, వినియోగ విధానం, దుర్వినియోగం, సమర్థవంతమైన నిర్వహణలపై ఆధారపడింది. గ్రామీణ భారతావనికి ప్రతి ఇంటికి నల్లాల ద్వారా మంచినీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘జల్ జీవన్ మిషన్’...

12-03-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి నవమి రాత్రి తెల్ల 04.10 వరకు ఉపరి దశమి నక్షత్రం మూల రాత్రి 10.51 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం సిద్ది ఉదయం 08.20 వరకు ఉపరి వ్యతీపాత కరణం తైతుల పగలు...

ప్లాస్టిక్ ఇటికెలతోటి ఇల్లు!?|ADUGU TRENDS

గీ అన్న ఇకమతు సూత్తే, బుర్ర గిర్రున తిరుగుతది. ఇగిప్పుడు అంతా ప్లాస్టిక్ మయమే అయింది. పుట్టిన కానుండి, గిట్టేదాక, గా ప్లాస్టిక్ లేకుండ పనైతలేదు. ఎంత ముప్పని శెప్పినా, నీల్ల కానుంచి...

గ్యాస్ ట్రబుల్స్-ప్రత్యామ్నాయ మార్గాలు|EDITORIAL

ప్రపంచంతోపాటు, భారతదేశంలో వంటగ్యాస్‌-ఎల్పీజీ వినియోగం గత రెండు దశాబ్దాల్లో విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు నగరాలకే పరిమితమైన ఈ ఇంధనం ఇప్పుడు గ్రామాలకు కూడా విస్తరించింది. వంట కోసం ఇంధనంగా ఎల్పీజీ వినియోగం పెరగడం...

11-03-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి అష్టమి రాత్రి 02.14 వరకు ఉపరి నవమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 08.20 వరకు ఉపరి మూల యోగం వజ్ర ఉదయం 08.00 వరకు ఉపరి సిద్ది కరణం బాలవ పగలు 01.12...

లైటర్ లేకుండనే గ్యాస్ స్టౌని ఎలిగిచ్చుడు!?|ADUGU TRENDS

ఉపాయాలున్నోడు ఊరేగుతడట. గట్లనే ఉంది గీ పొల్లగాని తెలివి. నిప్పులేందే పొగే గాదుల్లా. మంట గూడ రాదు కదా? మరీ గీయన గా నిప్పునే తెలివిగ ఎలిగిచ్చి గ్యాస్ స్టౌకి మంట పుట్టిచ్చిండు. గా...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News