Friday, March 13, 2026
24.7 C
Hyderabad

అధిక జనాభా అభివృద్ధికి ఆటంకమా? ఆలంబనా!|EDITORIAL

ఒక దేశ అభివృద్ధికి అధిక జనాభా ఆటంకమా? ఆలంబనా? సాధారణంగా ఆలోచిస్తే, అధిక జనాభా కచ్చితంగా అభివృద్ధి నిరోధకమే. కానీ, శిక్షణ, నైపుణ్యాల పెంపుతో సమర్థవంతంగా మానవ వనరులను వినియోగించగలిగితే జనాభా ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలే చేస్తుంది! జనాభా ఒక అనుకూల అంశమే. నిజానికి ప్రపంచంలో ఇవ్వాళ అత్యంత సమస్యాత్మకం మానవ వనరులే. డబ్బు, పెట్టుబడులు వంటివి సమకూర్చుకోవడం కూడా పెద్ద కష్టమేమీ కాదు. కానీ, సమర్థమైన మానవ వనరుల నిర్వహణ పెద్ద సమస్యగా ఉందంటే ఆశ్చర్యం వేయక మానదు. అభివృద్ధి చెందిన, చెందుతోన్న దేశాలకు మానవ వనరుల కొరత తీవ్రంగా ఉంది. అదే వెనుకబడిన దేశాలకు మానవ వనరులు పెద్ద సమస్యగా, గుదిబండగా మారుతున్నాయి. ప్రజల నైపుణ్యాలు, జ్ఞానం, సామర్థ్యాలను సమర్థవంతంగా ఉపయోగించడమే మానవ వనరుల నిర్వహణ. ఇది నియామకం, శిక్షణ, అభివృద్ధి, జీతాలు, ప్రయోజనాలు, ఉద్యోగి సంబంధాల నిర్వహణ వంటి అనేక అంశాల మీద ఆదారపడి ఉంటుంది.

భారతదేశంలో 1991లో జరిగిన ఆర్థిక సరళీకరణలు అత్యంత పోటీ వాతావరణాన్ని సృష్టించాయి. అంతర్జాతీయ సంస్థలు వారి వినూత్న, శక్తివంతమైన పోటీతత్వంతో మన దేశంలో పెట్టుబడుల పేరుతో ప్రవేశించగా, సంప్రదాయిక సంస్థలు తమ పురాతన పద్ధతులను సమూలంగా మార్చుకున్నాయి. కొత్త పంథాలో పయనించటం మొదలుపెట్టాయి. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా గల దేశాలలో భారతదేశం ఒకటి. దేశవ్యాప్తంగా పెరుగుతోన్న అక్షరాస్యతా శాతం వల్ల అర్హత గల మానవ వనరుల సంఖ్య పెరిగింది. గ్లోబలైజేషన్, సరళీకరణల వల్ల 1995 తర్వాత బహుళ జాతి సంస్థలు దేశంలో వ్యాపారం చేయటానికి ముందుకు వచ్చాయి. ఇక్కడ తగినన్ని మానవ వనరులు అందుబాటులో ఉండటం వల్ల మానవ వనరుల నిర్వహణ ప్రాముఖ్యత రానురాను పెరుగుతోంది.

దీంతో మానవవనరుల నిర్వహణ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రజలు ఏం కోరుకుంటున్నారు? వారికి తగు శిక్షణనివ్వడం ద్వారా నైపుణ్యాలను పెంచడం, వారి సామర్థ్యాలకనుగుణంగా వారి నుంచి పనిని తీసుకోవడం అనేది సవాల్ గా మారింది. యాజమాన్యానికి, ఉద్యోగులకు మధ్య నెలకొనే ఘర్షణలను తగ్గుముఖం పట్టించటం. శిక్షణ, అభివృద్ధి ద్వారా నైపుణ్యాలను పెంచటం. భారతీయ సంస్థలు ఉద్యోగుల నైపుణ్యాలు, సామర్థ్యాలు అభివృద్ధిపరచటానికి, వృత్తి సంబంధిత అభివృద్ధిని విస్తరించటానికి వారి బాధ్యతలను గుర్తించటం వంటివి చేస్తున్నాయి. మహిళా ఉద్యోగులపై ఉన్న వివక్ష రూపు మాపటానికి భారతదేశంలో సంస్థలన్నీ సమాన ఉపాధికి కట్టుబడి ఉన్నాయి. మహిళలకు శిక్షణనిచ్చి మరీ నిర్వాహక స్థాయిలో పదవులనిస్తున్నాయి. వివిధ దశలలో మహిళల పరిమితులను గుర్తించి దీర్ఘకాలిక సెలవు, తగు సమయం వరకు ప్రసూతి సెలవు వంటి సదుపాయాలు అన్ని సంస్థలు అందిస్తున్నాయి.

ఈ క్రమంలో జనాభా పెరగాలని రష్యా లాంటి దేశాలు ఆరాటపడుతున్నాయి. భారత్‌ లాంటి దేశాలు జనాభా నియంత్రణను కోరుకుంటున్నాయి. కొన్ని దేశాలు అధిక జనాభాతో సతమతమవుతూ, జనాభా నియంత్రణ చర్యలు పాటిస్తున్నాయి. మరికొన్ని దేశాలు జనాభా పెరుగుదలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. గతంలో జనాభా నియంత్రణను కఠినంగా అమలు చేసిన దేశాలు కూడా ఇప్పుడు ఆ నిబంధనను సడలిస్తున్నాయి. దేశంలో కొన్ని రాష్ట్రాల పరిస్థితులు కూడా ఇలాగే ఉన్నాయి. జనాభా పెరగాలని కొన్ని రాష్ట్రాలు కోరుకుంటున్నాయి. యూపీ, బీహార్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ లాంటి రాష్ట్రాలు ఇప్పటికీ జనాభా నియంత్రణకు ప్రాధాన్యమివ్వడం లేదు. జనాభా అనేది సమస్యే కాదని, మావన వనరుల నిర్వహణకు ప్రభుత్వాల వద్ద సరైన ప్రణాళికలు లేకపోవడమే అసలు సమస్యని తేట తెల్లమవుతోంది. కేవలం రాజకీయ ప్రయోజనాలే పరాకాష్టగా పని చేస్తున్నందువల్లే సమస్యలుత్పన్నమవుతున్నాయి. సరైన ప్రణాళికలతో జనాభాను వినియోగించుకుంటే అద్భుత ఫలితాలు సాధించవచ్చు. వస్తూత్పత్తని పెంచవచ్చు. ఆహారోత్పత్తిని జరపవచ్చు. వ్యవసాయంలో విప్లవం తేవచ్చు. ఇలా ఆలోచించ గల నేతలు దేశంలో లేకుండాపోయారు.

మన దేశం 146 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండగా, చైనా రెండో స్థానంలో ఉన్నది. జనాభా ఆయా దేశాల ఆర్థిక, సామాజిక, పర్యావరణంపై ఆధారపడి ఉంటాయి. సరైన ప్రణాళిక లేనప్పుడు జనాభా పెరుగుదల ఒత్తిడిని సృష్టిస్తుంది. వనరులను దెబ్బతీస్తుంది. పర్యావరణ విధ్వంసానికి కారణం అవుతుంది. అయితే సమర్థవంతమైన విధానాలతో ఈ సవాళ్లను అధిగమించవచ్చు. అధిక జనాభా ఉన్నా, చైనా సరైన ప్రణాళికలతో అభివృద్ధి పథంలో దూసుకు పోతోంది. ప్రపంచంలో మూడో అధిక జనసాంద్రత గల దేశం సింగపూర్‌ ఆర్థిక, సామాజిక అభివృద్ధిని సాధించింది. సింగపూర్ వైశాల్యం 719.9 చ. కి. మీ. కాగా, చదరపు కిలో మీటర్‌కు 8,595 మంది నివసిస్తున్నారు. అయితే అధిక ఆర్థిక వృద్ధి, అత్యుత్తమ గృహనిర్మాణం, ఆరోగ్య సేవలతో ప్రపంచంలోనే ఆ దేశం అగ్రగామిగా ఉంది. 1980 నుంచి 2015 వరకు చైనా వన్‌ చైల్డ్‌ పాలసీని అమలు చేసి, దాదాపు 40 కోట్ల జనాభాను నియంత్రించింది. ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చిన ఆ దేశం జనాభా వనరులను అత్యంత సమర్థవంతంగా ఉపయోగించింది. ఫలితంగా చైనా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగింది. భారతదేశంలో 35 ఏళ్ల లోపు యువ జనాభా 65 శాతం ఉంది. ఈ జనాభాను పని విధానంలోకి మారిస్తే అద్భుతాలు సాధించవచ్చు. వీరిని ఉత్పాదక శక్తిగా మారిస్తే, ఆర్థిక వృద్ధికి దోహదపడతారు. ఈ దిశగా ఆలోచనలు సాగడం లేదు. మన ప్రజాస్వామ్యంలో ఓటు ప్రధానం కనుక అంతా ఆ ఓటు బ్యాంకు వైపే మొగ్గుతున్నారు. దీంతో ఉచితానుచితాలు పెరిగి, ప్రజలు సోమర్లుగా మారి, ఉత్పాదక తగ్గి మొత్తం దేశమే సమస్యల్లో కూరుకుపోతోంది.
…..

Latest News

ముగిసిన యువకుడి అంత్యక్రియలు|PALAKURTHI

పుత్రశోకంలో కన్నతల్లి కన్నీటి వీడ్కోలు ఘన నివాళులు అర్పించిన పాలకుర్తి విధి ఆడిన వింత నాటకంలో ఒక కన్నతల్లికి అంతకన్నా దౌర్భాగ్య స్థితి మరొకటి ఉండదు. కొడుకే లోకమని, తనే తన సర్వస్వమని బతికిన ఆ...

గాలి మోటర్ల.. గా అత్తగారింటికి!?|ADUGU TRENDS

అత్తగారింటికి దారేది? అంటే గాల్లో తేలినట్లు ఏకంగా గాలి మోటర్లనే తీసుకపోయి, సూసెటోల్ల గుండె పేలినట్టు శేసిండో పెండ్లి కొడుకు. గీ మద్దెల పండ్లిల్లకు ఇరగమరగ కర్సు సేత్తాండ్లు. ఎంత ఎక్కువ కర్సు శేస్తే,...

సాగు బాగుకు ఇదే సరైన సమయం!|EDITORIAL

ప్రపంచ రాజకీయ పరిణామాలు, పశ్చిమాసియాలో యుద్ధాలు, అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థను ప్రగాఢంగా ప్రభావితం చేస్తున్నాయి. ఎగుమతులు, దిగుమతులు తీవ్ర అంతరాయానికి గురవుతున్నాయి. ఈ సమయాన్ని భారత్ తన ఆహార భద్రత, వ్యవసాయ రంగాన్ని...

13-03-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి దశమి రాత్రి తెల్ల 05.47 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 01.02 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం వ్యతీపాత ఉదయం 08.53 వరకు ఉపరి వరీయాన్ కరణం వణజి సాయంత్రం...

‘పునర్జన్మ’ ప్రాప్తి…! జీవ ‘కారుణ్య’ విముక్తి!!|ADUGU|SPECIAL STORY

-‘బ్రెయిన్ డెడ్’ కు ‘కామా’, ‘కోమా’కు ‘ఫుల్ స్టాప్’!!!|BRAIN DEAD|COMA జీవితం విచిత్రం. పుట్టుక వరమైతే, మరణం శాపం. అనివార్యం. ఇందుకు ఈ రెండు ఘటనలే నిదర్శనం. బ్రెయిన్ ‘డెడ్’ అయిన మహిళ, ఒక్క...

రూపాయికే బూట్లు!?|ADUGU TRENDS

శిత్తం శివుని మీద.. భక్తి శెప్పుల మీద అన్నరు. గీ సామెతను చపల చిత్తానికి వాడినప్పటికీ, పాదరచ్చలు... మన ఆరోగ్యానికి కూడా రచ్చణే! గందుకే గవాటిని మనం యేసుకుంటం. ఇగ బూట్లైతే పాదాలకు...

‘జల్ జీవన్ మిషన్’ తో నీటి సమస్యలు సమసేనా!?|EDITORIAL

నీటి సమస్య వనరుల లభ్యత, వినియోగ విధానం, దుర్వినియోగం, సమర్థవంతమైన నిర్వహణలపై ఆధారపడింది. గ్రామీణ భారతావనికి ప్రతి ఇంటికి నల్లాల ద్వారా మంచినీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘జల్ జీవన్ మిషన్’...

12-03-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి నవమి రాత్రి తెల్ల 04.10 వరకు ఉపరి దశమి నక్షత్రం మూల రాత్రి 10.51 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం సిద్ది ఉదయం 08.20 వరకు ఉపరి వ్యతీపాత కరణం తైతుల పగలు...

ప్లాస్టిక్ ఇటికెలతోటి ఇల్లు!?|ADUGU TRENDS

గీ అన్న ఇకమతు సూత్తే, బుర్ర గిర్రున తిరుగుతది. ఇగిప్పుడు అంతా ప్లాస్టిక్ మయమే అయింది. పుట్టిన కానుండి, గిట్టేదాక, గా ప్లాస్టిక్ లేకుండ పనైతలేదు. ఎంత ముప్పని శెప్పినా, నీల్ల కానుంచి...

గ్యాస్ ట్రబుల్స్-ప్రత్యామ్నాయ మార్గాలు|EDITORIAL

ప్రపంచంతోపాటు, భారతదేశంలో వంటగ్యాస్‌-ఎల్పీజీ వినియోగం గత రెండు దశాబ్దాల్లో విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు నగరాలకే పరిమితమైన ఈ ఇంధనం ఇప్పుడు గ్రామాలకు కూడా విస్తరించింది. వంట కోసం ఇంధనంగా ఎల్పీజీ వినియోగం పెరగడం...

11-03-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి అష్టమి రాత్రి 02.14 వరకు ఉపరి నవమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 08.20 వరకు ఉపరి మూల యోగం వజ్ర ఉదయం 08.00 వరకు ఉపరి సిద్ది కరణం బాలవ పగలు 01.12...

లైటర్ లేకుండనే గ్యాస్ స్టౌని ఎలిగిచ్చుడు!?|ADUGU TRENDS

ఉపాయాలున్నోడు ఊరేగుతడట. గట్లనే ఉంది గీ పొల్లగాని తెలివి. నిప్పులేందే పొగే గాదుల్లా. మంట గూడ రాదు కదా? మరీ గీయన గా నిప్పునే తెలివిగ ఎలిగిచ్చి గ్యాస్ స్టౌకి మంట పుట్టిచ్చిండు. గా...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News