Saturday, June 13, 2026
32.8 C
Hyderabad

ఉగ్రవాదంపై ఉక్కుపాదం!

2008 ముంబై దాడులు మిగిల్చిన విషాదాల గాయాలింకా మానలేదు. అయితే ఆ కుట్రల వెనక ఎవరెవరు ఉన్నారన్నది కూడా ఇంకా తేలలేదు. ముంబై దాడులు సహా, అనేక ఉగ్రవాద దాడులు, కుట్రల్లో పాక్ ప్రమేయం ఉన్నట్లు భారత్‌ అనేక ఆధారాలు సేకరిస్తూనే ఉంది. కానీ, పాక్‌ తోసిపుచ్చుతూనే ఉంది. ప్రపంచం ముందు పాక్‌ను దోషిగా నిలబెట్టడంలో భారత్‌ విజయం సాధించింది. కసబ్‌ తదితరులను ఉరితీత తర్వాత కూడా పాక్‌ ఉగ్రవాదాన్ని ఎప్పటికప్పుడు ప్రపంచ వేదికలపై భారత్‌ ఎండగడుతూనే ఉంది. పాక్‌కు గట్టిగా బుద్ది చెప్పేలా చర్యలు తీసుకునేందుకు కూడా వెనకాడడం లేదు. గతంలో పాలకులు పాక్‌ పట్ల ఉదాసీనంగా నిర్లిప్తంగా వ్యవహరించారు. పాక్‌తో యుద్ధం, బంగ్లాదేశ్‌ విముక్తి తదితర సందర్భాల్లో పాక్‌ను పూర్తిగా కట్టడి చేసి ఉంటే ఇవాళ ఈ దుర్గతి పట్టేది కాదు.
తాజాగా ఇప్పుడు తహవ్వుర్‌ రాణాను ఇండియాకు రప్పించడంలో సఫలం అయినట్లే, ఇదే సందర్బంలో రాణా నుంచి వివరాలు సేకరిస్తే..ముంబై దాడుల వెనక కుట్రలను ఛేదించగలం. రాణా అంత సులువుగా బయటపడతాడని అనుకోవడానికి లేదు. భారత్‌ పట్ల నరనరాన వ్యతిరేకతను నింపుకున్న రాణా ముంబై దాడుల కోసం ఎంతగా తెగించాడన్నది ప్రపంచ దేశాలతో పాటు పాక్‌కు కూడా అర్థం అయివుంటుంది. ముంబై దాడుల వెనక ఉగ్రవాదులుగా మారిన ఇద్దరు స్కూల్‌ ఫ్రెండ్స్‌ మాస్టర్‌ మైండ్స్ గా వ్యవహరించారు. 166 మంది ప్రాణాలు పొట్టన పెట్టుకొన్నారు. అమెరికా చట్టాల్లోని లొసుగుల్ని వాడుకొని భారత్‌కు దొరక్కుండా తప్పించుకోవాలని విశ్వప్రయత్నం చేశారు. చివరికి ఆ ఇద్దరిలో ఒకరిని మన జాతీయ దర్యాప్తు సంస్థ భారత్‌కు తీసుకొచ్చింది. మరొకరు అమెరికా జైల్లోనే ఉన్నాడు. ఆ ఇద్దరే తహవ్వుర్‌ రాణా, డేవిడ్‌ కోల్‌మన్‌ హెడ్లీ. వీరిద్దరి వయస్సు 64 ఏళ్లు. వీరిని ముంబై దాడుల కుట్రదారులుగా గుర్తించడంలో ఎన్‌ఐఎ తీవ్రంగా కృషి చేసింది. ఈ ఇద్దరూ పాక్‌లోని హసన్‌ అబ్దుల్‌లోని సైనిక అకాడవిూ అయిన క్యాడెట్‌ కాలేజ్‌ (సీసీహెచ్‌)లో చదువుకున్నప్పటి నుంచి మిత్రులు. ఆ తర్వాత ఇద్దరూ ఉగ్రవాదులు గా మారడం విచిత్రం. డేవిడ్‌ హెడ్లీ పాకిస్థానీ దౌత్యవేత్త, బ్రాడ్‌కాస్టర్‌ అయిన దావూద్‌ సయ్యద్‌ గిలానీ, ఓ అమెరికా జాతీయురాలికి పుట్టాడు. ఆ తర్వాత గిలానీ కుటుంబం పాక్‌కు వలస వెళ్లింది. అక్కడే హెడ్లీ సీసీహెచ్‌లో చేరాడు. ఇక తహవ్వుర్‌ రాణా 1961లో ఓ హైస్కూల్‌ ప్రిన్సిపల్‌ కుటుంబంలో జన్మించాడు. ఇతడూ సీసీహెచ్‌లోనే చేరాడు. అక్కడే తొలిసారి హెడ్లీ-రాణా మిత్రులుగా మారారు. అక్కడి నుంచే వారి ఉగ్రరచనలకు బీజం పడిందని చెప్పాలి. ఆ తర్వాత కాలంలో హెడ్లీ తల్లితో కలిసి అమెరికాలోని ఫిలడెల్ఫియాకు వెళ్లిపోయాడు. అక్కడ అతడు మాదక ద్రవ్యాల వ్యాపారంతోపాటు, కీలక సమాచారాన్ని ఏజెన్సీలకు విక్రయించేవాడు. పాక్‌లో లష్కరే, సైన్యానికి, ఇటు- అమెరికాలోని సీఐఏకు ఇన్ఫర్మేషన్‌ చేరవేసేవాడు. మరోవైపు రాణా పాక్‌ ఆర్మీ మెడికల్‌ కోర్‌లో కెప్టెన్‌ హోదాలో పని చేశాడు. 1997లో ఆర్మీని వదిలేసి.. భార్యతో కలిసి కెనడాకు వలస వెళ్లి, 2001 నాటికి పౌరసత్వం సంపాదించాడు. టొరెంటోలో ‘ఫస్ట్‌ వరల్డ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీస్‌’ పేరిట ఓ సంస్థను స్థాపించాడు. ఆ తర్వాత దాని కార్యాలయాలను చికాగో, న్యూయార్క్ ల్లోనూ తెరిచాడు. ఈ కంపెనీ ముసుగులోనే అతడు ముంబై దాడులకు కుట్రను అమలు చేశాడని బహిర్గతం అయింది.
2006 నుంచి ముంబై దాడులకు కుట్ర రచన మొదలైంది. ఇదంతా ఎన్‌ఐఎ సేకరించగలిగింది. అదే ఏడాది హెడ్లీ తొలిసారి ముంబైని సందర్శించాడు. అప్పుడు ‘మెస్సర్స్‌ ఇమిగ్రేషన్‌ లా సెంటర్‌’ పేరిట ఓ కార్యాలయం ఏర్పాటుకు ఆర్‌బీఐకి పత్రాలు సమర్పించాడు. వీటిపై రేమాండ్‌ జోసెఫ్‌ శాండర్స్‌ అనే వ్యక్తి సంతకాలున్నాయి. ఇది రాణాకు చెందిన ‘ఫస్ట్‌ వరల్డ్‌ ఇమిగ్రేషన్‌’కు అనుబంధంగా పనిచేసింది. ఇందుకోసం టార్డియో ఏసీ మార్కెట్‌లో ఆఫీస్‌ స్పేస్‌ తీసుకొన్నాడు. భారత్‌ వచ్చినప్పుడు దానిని స్థావరంగా వాడుకున్నాడు. ముంబైలో మొత్తం ఎనిమిది సార్లు పర్యటించి రెక్కీలు నిర్వహించాడని ఎన్‌ఐఎ పసిగట్టింది. దాడులకు రెండు వారాల ముందు రాణా స్వయంగా భారత్‌కు వచ్చాడు. అతడు ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ పొవాయ్‌లో దాదాపు 10 రోజుల పాటు తిష్ఠ వేసి కుట్రలు పన్నాడు. డేవిడ్‌ హెడ్లీకి అవసరమైన వీసాను రాణానే ఇప్పించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ వెల్లడించింది. ఇందుకోసం అతడి పేరు, తండ్రి వివరాలను తప్పుగా చూపించారు. ముంబైలో తన ఎనిమిది రెక్కీల సందర్భంగా హెడ్లీ నిరంతరం రాణాతో టచ్‌లో ఉన్నాడు. ఇందుకోసం 231 ఫోన్‌కాల్స్‌ చేశాడని ఎన్‌ఐఎ గుర్తించింది. అతడు చేసిన సాయానికి ప్రతిగా..పాక్‌ ఐఎస్‌ఐ అధికారులతో మాట్లాడి ఓ డీల్‌ కుదిర్చాడు. రాణా పాకిస్థాన్‌ను సందర్శించడానికి వీలుగా అతడికి మేజర్‌ ఇక్బాల్‌ను పరిచయం చేశాడు. ఆ మేజర్‌ రాణాతో మాట్లాడినట్లు తేలింది. భారత్‌లో ఉన్నప్పుడు నేరుగా పాక్‌కు కాల్స్‌ చేయోద్దని హెడ్లీకి స్పష్టమైన ఆదేశాలున్నాయి. ముంబై దాడుల తర్వాత కూడా హెడ్లీ-రాణా టచ్‌లో ఉన్నారు. ఇక విజయవంతంగా ముంబైలో మారణ హోమం సృష్టించి నందుకు ఉగ్రవాది లష్కరే సాజిద్‌ను రాణా అభినందించాడు. ఈ దాడిలో మరణించిన ఉగ్రవాదులకు పాక్‌ అత్యున్నత పురస్కారం ‘నిషాన్‌ ఈ హైదర్‌’ ఇవ్వాలని హెడ్లీ వద్ద రాణా వ్యాఖ్యానించాడు. భారతీయులకు అలా జరగాల్సిందేనని కూడా వ్యాఖ్యానించాడు. 2009 అక్టోబర్‌ 3న చికాగో అంతర్జాతీయ విమానాశ్రయంలో హెడ్లీని ఎఫ్‌బీఐ అరెస్టు చేయడంతో ఇద్దరి స్నేహం ముగిసింది.
హెడ్లీ సీఐఏకు పని చేస్తున్నా.. తరచూ పాక్‌కు వెళ్లి రావడంపై అమెరికా నిఘా సంస్థ కన్నేసింది. డెన్మార్క్ లోని కోపన్‌హెగన్‌లో ఉగ్రదాడికి కుట్ర పన్నుతున్నట్లు అతడిపై అనుమానాలు ఉన్నాయి. అప్పటికే హెడ్లీని తమకు అప్పగించాలని భారత్‌ అమెరికాను కోరుతోంది. ఆ తర్వాత కొన్ని నెలలకే రాణాను కూడా డెన్మార్క్‌ కుట్ర కేసులో అరెస్టు చేశారు. ఈ నేరం నిరూపితమైనా.. భారత్‌లో ముంబై దాడుల కుట్ర అభియోగాలు మాత్రం వీగిపోయాయి. ఈ విచారణ సందర్భంగా తనను హెడ్లీ ఇందులోకి లాగాడని రాణా చెప్పాడు. డెన్మార్క్‌ కుట్ర కేసులో రాణాకు వ్యతిరేకంగా హెడ్లీ కూడా సాక్ష్యం చెప్పడంతో ఈ కేసులో రాణాకు 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. అతడు 2020 కొవిడ్‌ సమయంలో విడుదలయ్యాడు. ఆ మర్నాడే అతడిని అరెస్టు చేయడానికి ‘పరస్పర నేరగాళ్ల అప్పగింత ఒప్పందం’ మేరకు భారత్, అమెరికా వారెంటు కోరింది. దాదాపు ఐదేళ్లపాటు వివిధ దశల్లో జరిపిన న్యాయపోరాటం తర్వాత అతడు విచారణను ఎదుర్కోవడానికి భారత్‌కు తీసుకొచ్చారు.
మొత్తంగా ఎన్‌ఐఎ చేసిన కృషి సాహససోపేత మైనదని చెప్పాలి. ఇది ఓ రకంగా అంతర్జాతీయంగా భారత్‌ ప్రతిష్టను పెంచేదే. రాణా నోరు విప్పితేనే విషయాలు, వివరాలు బయటకు వస్తాయి. అప్పుడే భారత్ కు అసలైన విజయం దక్కుతుంది.

Latest News

మియా జాకీ మాయ!|ADUGU TRENDS

పండంటే మామిడి పండే! పండ్లండ్ల మధురమైన పండ్లంటే కూడా మామిడి పండ్లే!! గందుకే గా పండ్లకు గంత గిరాకీ. గీ పండ్లల్ల మస్తు గిరాకీ ఉన్న పండ్లు మియా జాకీ రకమట. గీ...

బడే భవిష్యత్తుకు పునాది?!|EDITORIAL

దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది. ఒక మంచి పాఠశాల కేవలం విద్యార్థిని మాత్రమే కాదు, కుటుంబాలని, గ్రామాలని, సమాజాన్ని మార్చగలదు. అందుకే విద్యను వ్యయంగా కాకుండా పెట్టుబడిగా చూడాలి. నీతి ఆయోగ్...

జూన్ 13, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం మాస శివరాత్రి శని త్రయోదశి తిధి బ త్రయోదశి మధ్యాహ్నం 01.55 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం కృత్తిక రాత్రి 12.17 వరకు ఉపరి రోహిణి యోగం సుకర్మ సాయంత్రం 04.30 వరకు ఉపరి ధృతి కరణం వణజి...

నచ్చత్రాల ఇల్లు!|ADUGU TRENDS

ఆకాసంల నచ్ఛత్రాలన్నీ మన ఇంటిమీదకే వత్తే ఎట్లుంటది!? గట్లనే ఓ ఇల్లు కట్టుకుంటే ఇంకెట్లుంటది!? మబ్బుల్ల తేలాడినట్లే ఉంటది కదా? ఇది కలేం కాదుల్లా? దాన్ని నిజం చేసేటట్లు ఇప్పుడు ఇండ్లు కడతుండ్రు.!...

టీఎంసీ భవితవ్యమేంటి?!|EDITORIAL

టీఎంసీలో గందరగోళానికి బీజేపీ కారణమా? బెంగాల్ లో కాంగ్రెస్‌కు పునరుజ్జీవం లభిస్తుందా? కాంగ్రెస్ లో టీఎంసీ విలీనంపై వస్తున్న ఊహాగానాలు నిజమేనా? రాజకీయాల్లో ఏ పార్టీకైనా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నంత కాలమే మనుగడ....

జూన్ 12, శుక్రవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి సాయంత్రం 04.06 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం భరణి రాత్రి 01.46 వరకు ఉపరి కృత్తిక యోగం అతిగండ రాత్రి 07.20 వరకు ఉపరి సుకర్మ కరణం తైతుల సాయంత్రం 04.06...

గీ కోతి మనుసులకే ఆదర్శం!|ADUGU TRENDS

నిజం కాకపోయినా, కోతి నుండే మనిసి వచ్చాడంటరు. కోతులకు మనుసులకు గంత పోలికన్నట్లు. గా కోతుల బుద్ధులు, శేట్టలు మనుసులకు కూడా ఉంటయి. కొందరిల బయట పడ్తయి. మరికొందరిల బయట పడయి గంతే....

నిరంతరాయ ప్రధానిగా మోదీ రికార్డు!|EDITORIAL

మోదీ, నెహ్రూ రికార్డును అధిగమించడం కేవలం ఒక గణాంక ఘట్టం మాత్రమే కాదు. ఇది భారత ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ద్వారా వరుసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చిన నాయకుడి రాజకీయ ప్రయాణానికి...

జూన్ 11-గురువారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి సాయంత్రం 06.03 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం అశ్విని రాత్రి తెల్ల 03.02 వరకు ఉపరి భరణి యోగం శోభ రాత్రి 10.00 వరకు ఉపరి అతిగండ కరణం బవ ఉదయం...

శెట్టు కిందే ఊరు!|ADUGU TRENDS

ఎండా కాలమొస్తే మనమేం శేత్తానం? ప్యాన్లు, ప్రిజ్జీలు, కూలర్లు, ఏసీలను సిద్ధం చేసుకుంటానం. మండే కాలం వత్తాందనంగనే గవాటన్నింటినీ మరమ్మతులు చేసి పెట్టుకుంటానం. ఎండ మండుతనే ఉండె, కరెంటు కాల్తనే ఉండె. ఇగ...

ట్రంప్ కు బోస్టన్ తీర్పు దెబ్బ!|EDITORIAL

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలస విధానాలపై, హెచ్-1బీ వీసాలపై విధించిన లక్ష డాలర్ల ఫీజును బోస్టన్ ఫెడరల్ కోర్టు చట్టవిరుద్ధమని ప్రకటించింది. ఆ తీర్పు భారతీయ వృత్తి నిపుణులకు తక్షణ ఊరటనిచ్చినా, అంతిమ...

జూన్ 10-బుధవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ దశమి రాత్రి 07.41 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం రేవతి రాత్రి తెల్ల 04.00 వరకు ఉపరి అశ్విని యోగం సౌభాగ్య రాత్రి 12.20 వరకు ఉపరి శోభ కరణం వణజి ఉదయం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News