Friday, April 10, 2026
26.7 C
Hyderabad

మీకో దండం మీ పార్టీకో దండం

Bjp| బీజేపీకి Ghoshamahal| గోషామహల్ mla| ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా |resignation

Leaders| నేతల తీరుపై తీవ్ర అసంతృప్తి,

Hinduism| హిందుత్వానికి తాను అంకితమంటూ లేఖ | letter

గోషామహల్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిచిన రాజాసింగ్, భార‌తీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ నేతృత్వం తనను లక్ష్యంగా చేసుకొని మోసం చేసిందని, రాష్ట్ర అధ్యక్షుడిగా రాంచందర్ రావు పేరును ప్రకటించడంతో తనకు జరిగిన అన్యాయాన్ని భరించలేక ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టంగా తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు రెండు పేజీల కృతజ్ఞతా, తన అభిప్రాయాల లేఖను ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపారు.

రాజాసింగ్ లేఖలో పేర్కొన్న విషయాలను చూస్తే, ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. లక్షలాది కార్యకర్తలు, ప్రజలు పార్టీలో విశ్వాసంతో నిలబడిన తరుణంలో, పార్టీ తొలి సారిగా తెలంగాణలో అధికారంలోకి రానుందన్న ఆశలు వ్యక్తమవుతున్న వేళ, పార్టీ అధిష్ఠానం తీసుకున్న ఈ నిర్ణయం ఆశావాదాన్ని అణిచేసేలా ఉందని రాజాసింగ్ పేర్కొన్నారు. ఈ నిర్ణయం కేవలం వ్యక్తిగతంగా తనకే కాకుండా, అనేకమంది బీజేపీ కార్యకర్తలకు, నమ్మకమైన ఓటర్లకు తీవ్ర నిరాశ కలిగించిందన్నారు.

పార్టీలో అనుభవం కలిగిన ఎంతో మంది సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నప్పటికీ, వారికి అవకాశం ఇవ్వకుండా కర్టెన్ వెనుక ఉండే నేతల సూచనల మేరకు తీసుకున్న ఈ నిర్ణయం తీవ్రంగా బాధించింది అన్నారు. ఇది కేవలం ఒక వ్యక్తిగత ప్రతిష్ఠ కోసం తీసుకున్న నిర్ణయంగా రాజాసింగ్ భావిస్తున్నట్లు లేఖలో తెలిపారు . ఇది వేల మంది కార్యకర్తల త్యాగాలను విస్మరించడమేనని అన్నారు.

తాను బీజేపీకి అంకితమైన కార్యకర్తగా, ప్రజల ఆశీర్వాదంతో వరుసగా మూడుసార్లు గెలిచిన ఎమ్మెల్యేగా ఉన్నా కూడా, ఇలాంటి అన్యాయాన్ని చూసి మౌనంగా ఉండలేనని పేర్కొన్నారు. ఇది వ్యక్తిగత కారణక వల్ల తీసుకున్న నిర్ణయం కాదని, కార్యకర్తల వేదనను ప్రతిబింబించడమే అని లేఖలో వివరించారు. తెలంగాణలో బీజేపీకి అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, సరైన నాయకత్వాన్ని ఎంపిక చేయకపోవడం వల్ల ఆ ఆశను కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

రాజాసింగ్ తన లేఖ చివరి పేజీలో, పార్టీకి రాజీనామా చేసినా, హిందుత్వ సిద్ధాంతం, తన ధర్మ సేవ, గోషామహల్ ప్రజల పట్ల తన బాధ్యత మారదని పేర్కొన్నారు. హిందూ సమాజానికి తన సహకారం మరింత బలంగా కొనసాగుతుందని, ధైర్యంగా తన గొంతును వినిపిస్తానని స్పష్టం చేశారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని పునః ఆలోచించాలని ప్రధాని మోదీ, జేపీ నడ్డా, అమిత్ షా, బీఎల్ సంతోష్ తదితరులను కోరారు. తెలంగాణ బీజేపీకి ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని, అలాంటి సమయంలో సరైన నాయకత్వాన్ని ఎంపిక చేసి ఆ అవకాశాన్ని వదులుకోకూడదని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేకాకుండా, తన రాజీనామాను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, తెలంగాణ శాసనసభ స్పీకర్‌ ప్రసాద్ కుమార్ కి తెలియజేయాలని కోరారు. ఈ ఉదంతం రాజకీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. మూడుసార్లు గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే రాజీనామా చేయడం ద్వారా, పార్టీలో నూతన రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికతో భిన్నాభిప్రాయాలు, అంతర్గత సంఘర్షణలు ఉన్నట్లు స్పష్టమవుతోంది.

ఈ నేపథ్యంలో పార్టీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేంద్ర నాయకత్వం సమీక్షిస్తే మంచిదని అనేక బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే రాజాసింగ్ ఇక నుంచి ఏ రాజకీయ నిర్ణయం తీసుకుంటారో, ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతారో అన్నది రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. అయితే ఆయన ఇప్పటికీ హిందుత్వ సిద్ధాంతానికి అంకితమని స్పష్టంగా చెప్పడం ద్వారా, రాజకీయ ప్రయాణం కొనసాగించే సూచనలు లేఖలో కనిపిస్తున్నాయి.

ఇక పార్టీ నాయకత్వంపై విమర్శలు చేసిన రాజాసింగ్ లేఖ బీజేపీలో చర్చలకు తావిస్తోంది. పార్టీ కేంద్ర నేతలు ఈ లేఖను ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటారు, నాయకత్వ మార్పు పై మళ్లీ సమీక్ష జరగుతుందా? అన్నదానిపై రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా చూస్తున్నారు.

Latest News

గా మట్టిని సాప్ చేయిండ్లిట్ల!?|ADUGU TRENDS

రాను రాను ఆనలు తక్కువైతానయి. ఎండలెక్కువైతానయి. మోటర్లు ఎక్కువై రోడ్ల మీద గిర్రగిర్ర తిరుగుతానయి. ఇగ దుమ్ము, దుమ్ములేస్తుందనుకోండ్రి. గీ దమ్ముతోటి మస్తు రోగాలొత్తయి. మన దగ్గరున్న వస్తువులు దుమ్ముకొట్టుకపోతయి. ఇగ మనం...

యుద్ధం వాస్తవాలు: చర్చల్లో కీలకాంశాలు!|EDITORIAL

పశ్చిమాసియా యుద్ధ తీవ్రత చర్చల అంకానికి చేరుకుంది. రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన తర్వాత నేటి నుంచే ఇస్లామాబాద్ లో చర్చలు ప్రారంభం కానున్నాయి. యుద్ధం ప్రారంభం కంటే విరమణే విపరీతంగా...

10-04-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ అష్టమి రాత్రి 07.23 వరకు ఉపరి నవమి నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 08.12 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం శివ మధ్యాహ్నం 03.34 వరకు ఉపరి సిద్ద కరణం బాలవ ఉదయం 06.38...

నారీ శక్తికి పట్టం కడదాం|WOMEN|NARENDRA MODI|ESSAY

మహిళా సాధికారతను సాధిద్దాం ఏప్రిల్ 16న మనమంతా మహిళలకు అండగా నిలుద్దాం మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాసం రానున్న రోజుల్లో దేశంలో పండుగ వాతావరణం పరిఢవిల్లనుంది. వివిధ రాష్ట్రాల్లో జరిగే ఈ పర్వదినాల...

పసువుల గడ్డికి పక్కా రచ్చణ!?|ADUGU TRENDS

పసువులను మనుసులతోటి సమానంగ సూత్తం. పసువు శేసే పని, మనిసి గూడ సేయడు. గా పసువులు గడ్డి తిని పాలిత్తయి. మరి గీ మనుసులే పాలు తాగి విసం అయితరు. కనీ, గా...

యుద్ధోన్మాదం మిగిల్చిన ప్రపంచ సంక్షోభం!|EDITORIAL

ప్రపంచ ఇటీవలి రాజకీయ పరిణామాలు మానవాళికి మరో చేదు అనుభవాన్ని మిగిల్చాయి. శక్తివంతమైన దేశాల యుద్ధోన్మాదం, ఆధిపత్య పోరాటాలు చివరకు సామాన్య ప్రజల జీవన విధానాన్ని ఎలా దెబ్బతీస్తాయో ప్రస్తుత పరిస్థితులు గుణపాఠాలు...

09-04-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ సప్తమి సాయంత్రం 05.48 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మూల ఉదయం 05.53 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం పరిఘ మధ్యాహ్నం 03.19 వరకు ఉపరి శివ కరణం బవ సాయంత్రం 05.46...

ఎరుపెక్కిన కర్రె గుట్టల్లో.. శాంతి గీతం!|POLICE|MAOIST

తెలంగాణలో ముగిసిన మావోల శకం|TELANGANA పలు అభివృద్ధి పనులకు డీజీపీ శ్రీకారం|DEVELOPMENT|DGP తెలంగాణలో మావోయిస్టుల శకం ముగిసిందని డిజిపి శివధర్ రెడ్డి అన్నారు. ఒకప్ప్పుడు తుపాకుల మోతతో, అశాంతితో నిండిన తెలంగాణ అటవీ ప్రాంతాల్లో ఇప్ప్పుడు...

‘మామ’ నుంచి భూమి! |MOON|EARTH

మామకు అత్యంత చేరువగా మన వ్యోమగాములు నాసా ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ II మిషన్ వ్యోమగాములు సోమవారం (ఏప్రిల్ 6, 2026) చంద్రుడికి అత్యంత చేరువగా వెళ్లారు. ఓరియన్ క్యాప్సూల్ నుంచి చంద్రుడి ఉపరితలాన్ని చూసిన...

మడ్డి పట్టిన నూనె మంచిగైతది!?|ADUGU TRENDS

ఒకప్పుడు కాపిష్కెడు నూనె పోసి కిల కూర ఒండాల్నంటే గగనమయ్యేది. ఉప్పు, కారం, మసాల, ఇంత నూనె యేసి కలిపి పొయ్యి మీద పెడితే ఒంటయ్యేది. కూర గూడ కమ్మగుండేది. కిల నూనె...

అభివృద్ధి నిరోధకంగా పార్టీలు, నేతలు!|EDITORIAL

ప్రజాస్వామ్యానికి రాజకీయాలు ప్రాణం అయితే, అభివృద్ధి ఆత్మ. ఈ రెండింటి మధ్య సన్నని విభజన రేఖను చెరిపేస్తూ, విస్మరిస్తూ, వాటిని కలగలిపి స్వార్థపూరితంగా ఉపయోగిస్తే రాష్ట్రాల పురోగతే కాదు, ప్రజల భవిష్యత్తు కూడా...

08-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి సప్తమి నక్షత్రం మూల పూర్తిగా ఉంది యోగం వరీయాన్ మధ్యాహ్నం 02.51 వరకు ఉపరి పరిఘ కరణం వణజి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి భద్ర రాహుకాలం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News