సమగ్ర విచారణకు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఆదేశం
చిత్తూరు జిల్లా మంగళంపేట సమీపంలోని అడవీ భూముల ఆక్రమణపై ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కఠినంగా స్పందించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు 295, 296 సర్వే నంబర్లలో 23.69 ఎకరాల పట్టా భూమిని అటవీ భూమిగా చూపించి, మొత్తం 104 ఎకరాలను వ్యవసాయ భూమిగా మార్చారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలని అటవీ శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చారు. అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చారు.
పిసిసిఎఫ్కి తక్షణమే ప్రాథమిక నివేదిక సమర్పించాలంటూ ఆదేశించిన ఆయన, అటవీ భూముల ఆక్రమణకు సంబంధించిన అన్ని ఆధారాలను సేకరించాలని తెలిపారు. భూమి ఆక్రమణల వెనుక ఉన్న అసలు విషయాలను వెలికితీయాలని, ఎవరెవరు లబ్ధి పొందారు అనేది నివేదికలో స్పష్టంగా పొందుపరచాలని సూచించారు. పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని అటవీ భూముల వివరాలను సమగ్రంగా పరిశీలించి, ఎక్కడైనా రికార్డులు తారుమారు చేసినట్లయితే, అందుకు బాధ్యులెవరో గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అటవీ భూములు దుర్వినియోగం కాకుండా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
చిత్తూరు జిల్లా మంగళంపేట సమీపంలోని అడవీ భూముల ఆక్రమణపై ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కఠినంగా స్పందించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు 295, 296 సర్వే నంబర్లలో 23.69 ఎకరాల పట్టా భూమిని అటవీ భూమిగా చూపించి, మొత్తం 104 ఎకరాలను వ్యవసాయ భూమిగా మార్చారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలని అటవీ శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చారు. అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చారు.
పిసిసిఎఫ్కి తక్షణమే ప్రాథమిక నివేదిక సమర్పించాలంటూ ఆదేశించిన ఆయన, అటవీ భూముల ఆక్రమణకు సంబంధించిన అన్ని ఆధారాలను సేకరించాలని తెలిపారు. భూమి ఆక్రమణల వెనుక ఉన్న అసలు విషయాలను వెలికితీయాలని, ఎవరెవరు లబ్ధి పొందారు అనేది నివేదికలో స్పష్టంగా పొందుపరచాలని సూచించారు. పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని అటవీ భూముల వివరాలను సమగ్రంగా పరిశీలించి, ఎక్కడైనా రికార్డులు తారుమారు చేసినట్లయితే, అందుకు బాధ్యులెవరో గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అటవీ భూములు దుర్వినియోగం కాకుండా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

