Thursday, June 4, 2026
29.5 C
Hyderabad

రం(కు)గు తేలిన రాజకీయం!|EDITORIAL

వ్యక్తిగత విలువలే లుప్తమైన ఈ రోజుల్లో, రాజకీయాల్లో నైతిక విలువల గురించి మట్లాడటం గొంగట్లో కూర్చుని బొచ్చేరుకోవడమే! విలువల్ని గౌరవించడం అటుంచి, పాటించడం అసంభవంగా మారింది. అబద్ధం, అవినీతి, అరాచకమే రాజకీయమై, అధికారమే పరమా‘వధి’ అయి, అందలానికై ఎంతకైనా తెగించడమే నీతైపోయింది. రాజ్యాంగం రాసుకున్నదే కానీ, ఆచరించడానికి కాదన్నట్లుగా రాజకీయ నేతలు చేతలుంటున్నాయి. ఇప్పుడు ప్రజాస్వామ్య విలువల గురించి చర్చించడమంటే కోడిగుడ్డు మీద ఈకలు పీకడమే! ఇందుకు పార్టీ ఫిరాయింపులు అతీతమేమీ కాదు.

ప్రజాస్వామ్యం, రాజ్యంగం, ఫిరాయింపుల చట్టం వంటివన్నీ ఫిరాయింపులు అనైతికమని ఘోషిస్తున్నా, రాజకీయ నాయకులు బట్టలు మార్చినంత ఈజీగా పార్టీలు మారుతున్నారు. ఫిరాయింపు అనైతికమంటే, నీవు చూపిన దారే కదా నీరజాక్షా? అంటున్నారు. నైతికత వ్యక్తిగతం, సంస్థాగతం సామాజికం. దాన్ని చట్టం చేసి, చాటింపు వేసినా సరే, తాము ఆడిందే ఆట, తాము పాడిందే పాట అంటున్నారు రాజకీయ నాయకులు. ఎవరు ఏ పార్టీలోకి వెళ్లినా పెద్దగా అడ్డంకులు లేకుండా వ్యవహారం ముగుస్తున్న తరుణంలో, దీనికోసం కోర్టులు, వాదపోవాదనలు, ఆరోపణలు, విచారణలు అవసరమా? డబ్బు, సమయం సహా అంతా వ్రుథాయే కదా?

నిజానికి పార్టీ ఫిరాయింపులకు ఏ రాజకీయ పార్టీ మినహాయింపు కాదు. ఆయారాం, గయారాంల చరిత్ర ఈనాటిదేమీ కాదు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాభివ్రుద్ధి, పునరేకీకరణ, తెలంగాణ పునర్నిర్మాణం పేరిట ఇతర పార్టీల ఎమ్మెల్యేలను నిర్లజ్జగా తమ పార్టీలో చేర్చుకున్నది చూశాం. ఇద్దరు ఎమ్మెల్యేలను కారణం లేకుండా అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ చేయించడం తెలుసు. ఏకంగా టీడీఎల్పీని తమ పార్టీలో విలీనం చేసుకున్న వైనం తెలంగాణ అసెంబ్లీ రికార్డుల్లో, రాజకీయ పుస్తకంలో నిక్షిప్తమై ఉంది. జర్మనీ పౌరసత్వం ఉన్న చెన్నమనేని రమేశ్‌ను రెండుసార్లు ఎమ్మెల్యేగా కొనసాగించడం వంటి దురంతాలు అప్పట్లో పెద్దగా నైతిక చర్చకు వచ్చినా, ఎవరూ లెక్క చేయలేదు. బలమైన అధికార పక్షం, బలహీనమైన ప్రతిపక్షాలు సర్దుకుపోయాయి. అవన్నీ అనైతికమేనని అంగీకరిస్తే, ఇప్పుడు పదిమంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులూ అనైతికమే. లేదంటే అవసరార్థపు రాజకీయాల్లో అది చెల్లితే ఇదీ చెల్లినట్లే అనుకోవాలా? అధికారంలోకి వస్తే చాలు, దాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఏమైనా చెల్లుతుందా?

తాజా పరిణామాల్లో సుప్రీంకోర్టు సూచనల తర్వాత తెలంగాణ స్పీకర్‌ ప్రసాద్ కుమార్ ఇచ్చిన తీర్పు, రాజకీయాల్లో ఎలాంటి మౌలిక మార్పు రాలేదన్న నగ్న సత్యాన్ని వెల్లడిస్తోంది. నైతికతకు చోటులేని రాజకీయ వ్యవస్థలో తీర్పులు సాంకేతికత చుట్టూనే తిరుగుతాయి. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా, ఫిరాయింపులపై చివరకు తేలిందిదే. ఎమ్మెల్యేలు తాము బీఆర్‌ఎస్‌లోనే ఉన్నామని చెప్పడం, వారు పార్టీ మారినట్లు నిరూపణలేవీ లేవని స్పీకర్‌ నమ్మి, నిర్ధారించడం జరిగిపోయాయి.

ఈ నేపథ్యంలో నైతికతను ప్రశ్నిస్తున్న బీఆర్‌ఎస్‌, ఇప్పుడు అదే పశ్నను ఎదుర్కొంటోంది. అప్పుడు తాము చేసిందానికి ఇప్పుడు జరుగుతోంది చెల్లుకు చెల్లని వదిలేయడమా? లేక న్యాయం కోసం నిటారుగా నిలబడి నిలదీయడమా? ఇంకా ఈ పదిమంది ఎమ్మెల్యేలను తిరిగి పార్టీలోకి ఆహ్వానించి, గులాబీ కండువాలు కప్పి, పార్టీ కార్యక్రమాలకు పిలిస్తే వారి అసలు రంగు ప్రజల ముందే తేలిపోతుంది. వారు వస్తే బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతారు, రాకపోతే వారి రాజకీయ రంకు తేలిపోతుంది.

అలాగే, హర్యానాలో కాంగ్రెస్‌ నుంచి గెలిచి బీజేపీలో చేరిన ఎమ్మెల్యేలపై వెంటనే ఫిరాయింపు నిరోధక చట్టం ప్రయోగించాలని డిమాండ్‌ చేసిన కాంగ్రెస్, తెలంగాణలో మాత్రం భిన్నంగా మాట్లాడటం ద్వంద్వ వైఖరినే సూచిస్తుంది. రాజ్యాంగ ప్రతిని చేతిలో పట్టుకొని ఫొటోలకు పోజులివ్వడం కన్నా, దేశమంతా ఒకే విధమైన నైతిక ప్రమాణాన్ని పాటించడమే అసలైన రాజ్యాంగ పరిరక్షణ అవుతుంది.

ప్రజాజీవితంలో నైతిక విలువలు పూర్తిగా అడుగంటిన ఈ తరుణంలో, ఫిరాయింపులపై వచ్చిన ఈ తీర్పు అన్ని రాజకీయ పార్టీలకూ ఒక కనువిప్పుగా మారాలి. తమకు అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలా, వ్యతిరేకంగా ఉన్నప్పుడు మరోలా కాకుండా, ఎప్పుడూ ఒకే ప్రమాణంతో వ్యవహరించగలిగినప్పుడే రాజకీయాలకు కొంతైనా విశ్వసనీయత మిగులుతుంది. ప్రజాస్వామ్యం మనగలుగుతుంది.

Latest News

నల్లా దానంతటదే బందైతది!|ADUGU TRENDS

నల్లా పెట్టుడే కాదుల్లా, బంజేసుడు కూడా పెద్ద పనే. నల్లా తిప్పితే నీళ్లొత్తయి. కనీ, నల్లా బంజేయాల్నంటే, గాడ కావలి కాయాలె. లేకపోతే, నా నీల్లన్నీ తొణికి, బయటకి కారిపోతయి. గట్ల కావొద్దని...

‘మమత’ల కోవెలలో వేరుకుంపట్ల కలతలు|EDITORIAL

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మూడు దశాబ్దాలకుపైగా కొనసాగిన వామపక్ష పాలనకు ముగింపు పలికి, 2011లో అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా మార్చేశారు. గత పదిహేనేళ్లుగా...

04-06-2026, గురువారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:44 సంకల్ప తిథి: కృష్ణ-చవితి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-చవితి తిథి : కృష్ణ-చవితి రాత్రి 11:30 వరకు, తదుపరి...

ట్రాక్టర్ ట్రాలే స్విమ్మింగ్ పూల్!?|ADUGU TRENDS

ఎన్కటికి శేద బాయిలు, ఈత బాయిలుండేయి. శేద బాయిలు మంచినీల్లకు, ఈత బాయిలు ఎండాకాలం పిల్లలు, పెద్దలు ఈదడాన్కే ఉండేటియి. ఊరు ఊరంతా గా బాయిల్లనే ఉండేది. ఈత మీద మోజు తగ్గనోల్లు,...

ఇంధన రేషనింగ్ విధానమే మేలు!|EDITORIAL

ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సవాల్ కేవలం పెట్రోల్ ధరల పెరుగుదల మాత్రమే కాదు. అది ఇంధన భద్రత, ఆర్థిక స్థిరత్వం, ప్రజల జీవన ప్రమాణాలకు సంబంధించిన అంశం. ధరలను పెంచి భారాన్ని ప్రజలపై...

03-06-2026, బుధవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:44 సంకల్ప తిథి: కృష్ణ-చవితి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-చవితి తిథి : కృష్ణ-చవితి రాత్రి 11:30 వరకు, తదుపరి కృష్ణ-పంచమి నక్షత్రము...

పెండ్లంటే, గిదే పొండ్లి!?|ADUGU TRENDS

ఇగో పెండ్లంటే గిదే.. గిట్లనే.. అబ్బో గట్లనా? అన్నట్లుగా శేసుకుంటాండ్లు. లచ్చలు, కోట్లు కర్సు పెడ్తాండ్లు. పెండ్లి పిల్ల, పిల్లగాండ్ల మీద కోట్లు కుమ్మరిస్తాండ్లు. కట్న కానుకలతోటి పని లేకుండ, పెండ్లి కర్సునే...

తెలంగాణ ఆవిర్భావం-ప్రజల ఆశలు, ఆశయాలు!|EDITORIAL

మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అప్పుల కుప్పగా తెర్లైంది. ప్రస్తుతం రాష్ట్ర రుణభారం రూ.7 లక్షల కోట్లకు పైగా చేరింది. అప్పులు తీసుకోవడం తప్పు కాదు. కానీ ఆ అప్పులు ఉత్పాదక ఆస్తులుగా...

03-06-2026|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు https://www.instagram.com/reel/DZDc5uGy3Lk/?igsh=ZWtxaG1ka3BwOWd2 సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:43 సంకల్ప తిథి: కృష్ణ-తదియ శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-తదియ తిథి : కృష్ణ-తదియ...

ఐపీఎల్ లో 5 అవార్డులు గెలుచుకున్న వైభవ్|IPL|VAIBHAV SURYAVANSHI

అవార్డుల వర్షం కురిపించిన స్టార్ ఆటగాళ్లు! ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ అభిమానులకు ఎన్నో ఉత్కంఠభరిత క్షణాలను అందించింది. యువ ఆటగాళ్ల సత్తా, సీనియర్ క్రికెటర్ల అనుభవం, చివరి బంతి వరకు సాగిన...

ఈ సాలా కప్ నమ్దే రీలోడెడ్|RCB|IPL|CUP|FINAL

గుజరాత్‌ను మట్టి కరిపించిన RCB ఐపీఎల్ 2026 మకుటాన్ని ముద్దాడిన బెంగళూరు! ఐపీఎల్ 2026 ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరోసారి చరిత్ర సృష్టించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్...

01-06-2026|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:43 సంకల్ప తిథి: కృష్ణ-పాడ్యమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-పాడ్యమి తిథి : కృష్ణ-పాడ్యమి సాయంత్రం 4:39 వరకు, తదుపరి కృష్ణ-విదియ నక్షత్రము...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News