Thursday, March 12, 2026
26.8 C
Hyderabad

ప్రకృతిని ప్రేమిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం!|EDITORIAL

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, పండగలన్నీ ప్రకృతితో ముడిపడి ఉన్నవే. ప్రకృతిని ఆరాధించడం మన జీవన విధానంలోనే ఇమిడి ఉంది. ప్రకృతితో ముడిపడి ఉన్న పంచభూతాలను ఆరాధించడం వేదకాలం నుంచే ఉంది. మొదట మనం ఆరాధించిన దేవతామూర్తుల ప్రతిమలన్నీ మట్టితో చేసినవే. తర్వాత రాతివి, ఆతర్వాత లోహాలతో చేసే విగ్రహాలు మనం చూస్తున్నాం. వినాయకచవితి పర్వదినంలో మనం అనేక పుష్పాలు, ఫలాలతో విఘ్నేశ్వరుడిని పూజిస్తాం. విఘ్నాలను నివారించే వినాయకుని పూజతోనే ప్రతి శుభకార్యాన్ని ఆరంభిస్తాం. వినాయకుడిని విఘ్నాలు తొలగించి, శుభాలు కలిగించే ఆది దేవుడిగా కొలుస్తాం. ప్రత్యేకించి వినాయక విగ్రహాలను ప్లాస్టర్ ఆఫ్ పారిస్ –పీఓపీ-తో తయారు చేయడం చూస్తున్నాం. ఈ వినాయక, దుర్గామాత విగ్రహాలను, 10 రోజులపాటు పూజించి, మన చెరువుల్లో వేస్తున్నాం. పూలూ, పత్రి వంటి వాటిని చెరువులో వేయడం వెనక ప్రకృతి పరమార్థం దాగివుంది.
వినాయక పూజలో ఉపయోగించే పూలు, పత్రిలో విశేష ఔషధ గుణాలు ఉన్నాయి. గోరంత పత్రి పెడితే చాలు కొండంత వరాలు గుప్పిస్తాడు. అందుకే వినాయక పూజ అంటే అందరికీ ఇష్టం. వారిని ప్రోత్సహించడం ద్వారా ప్రకృతికి పాటుపడేలా చేయాలి. ఉండ్రాళ్ళ నైవేద్యానికే మహదానందపడిపోతాడు విఘ్నేశ్వరుడు. ఒక్క వినాయకుడికే పత్రిపూజ ఎందుకు చేస్తాం? ఆయన గజముఖుడు కదా! ఏనుగుకు ఇష్టమైనవి ఆకులే కదా! అందుకే ఈ పత్రి పూజ. ఏకవింశతి అంటే ఇరవై ఒక్క రకాల పత్రితో గణేశుణ్ణి పూజిస్తాం. గజాననుడని కీర్తించినా, మూషిక వాహనుడని మొక్కినా, సర్వ విఘ్నాలకు అధినాయకుడని శిరస్సు వంచినా, తొలిపూజలు దక్కేదతనికే. అందుకే భాద్రపద శుక్ల చవితి రోజున భక్తి శ్రద్ధలతో వినాయక పూజ చేసుకోవడం పుణ్యప్రదం. మోక్ష దాయకం!
విఘ్నాలను నివారించే వినాయకుని పూజతో మనం పండగను జరుపుకొంటాం. గణపతి అంటే ప్రకృతి ప్రియుడు. ఆయనకు మనం చేసే పూజ అంతా ప్రకృతి ఆరాధన కిందకే వస్తుంది. చెరువుల్లో మట్టిని తవ్వి తీసుకుని వచ్చి వినాయకుడిగా చేసి, మళ్లీ చెరువులోనే పూజించిన పత్రీపూలతో నిమజ్జనం చేయడం వెనక శాస్త్రీయత ఉంది. మట్టిని తీసి మళ్లీ అది ఎరువుగా, చెరువు నీరు కాలుష్య రహితంగా కావడానికి జరిగే ప్రక్రియ ఇందులో ఇమిడి ఉంది. మనం పూజించే మారేడు, ఉత్తరేణి వంటివి ఔషధ గుణాలు కలిగి ఉండడం వల్ల వీటిని కాలుష్యం నుంచి కాపాడుతాయి. అందుకే వినాయకచవితి ఎన్నో ప్రత్యేకతలు కలిగిన పర్వదినంగా చూడాలి. ఏటా కొన్ని వేల గణపతి విగ్రహాలను రంగులతో అలంకరించి మండపాల్లో ఏర్పాటు చేస్తుంటాం. అలాగే ప్రతి ఇంట్లో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి పూజ నిర్వహిస్తాం. ఇవన్నీ ప్రకృతికి దగ్గరగా ఉండేలా చూడాలి. అలాగే ప్రకృతి పరిరక్షణ ద్వారా పండగల పరమార్థం తెలుసుకోవాలి. గణపతి నవరాత్రుల కోసం ఖర్చు చేసే మొత్తాన్ని ప్రకృతి పరిరక్షణకు ఉపయోగిస్తే కరోనా లాంటి వైరస్‌లు మన దరి చేరవు. నేత్ర, మూత్ర, చర్మ సంబంధమైన రోగాలతోపాటు మరికొన్ని ఇతర వ్యాధులకు మంచి మందుగా పనిచేస్తుందీ పత్రి. అంతేకాక ఆ పత్రి నుంచి వెలువడే సుగంధాన్ని పీల్చడం వల్ల కూడా స్వస్థత చేకూరుతుంది. పత్రిని మనం చేత్తో ముట్టుకోవడం వల్ల అందులో ఉండే వృక్ష సంబంధ రసాయన పదార్థాలు కావలసిన మోతాదులో చర్మం ద్వారా మన శరీరంలోకి శోషణం చెంది ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి.
తొమ్మిది రోజుల తర్వాత వినాయకుణ్ణి బావుల్లో, నదుల్లో, చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. ఇలా ఎందుకు చేయడం అంటే కలుషితమైన ఆ నీటిని శుభ్రం చేయడానికి ఈ 21 పత్రాలు ఉపయోగపడతాయట. ఇరవైమూడు గంటలయ్యాక తమలో ఉన్న ఔషధగుణాల ఆల్కలాయిడ్స్ ని నీళ్లలోకి వదిలేస్తాయి. దాని వల్ల నీటిలో ఉండే బాక్టీరియా నిర్మూలన జరిగి ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. పత్రి సేకరణ వల్ల వృక్ష విజ్ఞానంతో పాటు వినోదం, పర్యావరణం పట్ల స్నేహభావం కలుగుతాయి. చెరువుల్లో మట్టిని తవ్వి తీసి, వినాయకుడిగా చేసి, మళ్లీ చెరువులోనే పత్రీపూలతో నిమజ్జనం చేయడం అది ఎరువుగా, చెరువు నీరు కాలుష్యరహితంగా అవుతుంది. అందుకే వినాయకచవితి ఎన్నో ప్రత్యేకతలు కలిగిన పర్వదినంగా చూడాలి.
ఇటీవల కొంతకాలంగా విగ్రహాల తయారీలో ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ ప్యారిస్‌, రసాయనాలు కలిగిన రంగులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. వినాయక నిమజ్జనంతో ఈ రంగులు, ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తో చెరువులు, కుంటలు, తటాకాలు, బావులు, నదులకు పర్యావరణ నష్టం జరుగుతోంది. జలాల్లో నివసించే అనేక జీవకోటి మనుగడకు విఘాతం ఏర్పడుతోంది. నీరు కలుషితం అవుతోంది. హైదారాబాద్‌ హుస్సేన్‌ సాగర్‌లా కాలుష్య కాసారంగా మారుతున్నాయి. అందుకే ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను వాడాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. మట్టి గణపతులను తయారుచేయడం ద్వారా కొంతయినా పర్యావరణం కాపాడుకోగలం. ఇంట్లో పూజించే చిన్న చిన్న వినాయక విగ్రహాలను పూర్తిగా మట్టితో తయారుచేస్తే అవి పర్యావరణహితంగా వుంటాయి. నీటిలో సులభంగా కరిగిపోతాయి. ఎలాంటి రంగులను వాడకపోవడంతో నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉండదు.
ఇక వీధుల్లో ప్రతిష్టించే పెద్ద విగ్రహాల తయారీలోనూ మట్టినీ, పర్యావరణ హితమైన రంగుల్నీ వాడటం ద్వారా పర్యావరణానికి మేలు చేయొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇటువంటి విగ్రహాల వల్ల నిమజ్జన సమయంలో జలాలు కలుషితం కావని చెబుతున్నారు.

Latest News

‘పునర్జన్మ’ ప్రాప్తి…! జీవ ‘కారుణ్య’ విముక్తి!!|ADUGU|SPECIAL STORY

-‘బ్రెయిన్ డెడ్’ కు ‘కామా’, ‘కోమా’కు ‘ఫుల్ స్టాప్’!!!|BRAIN DEAD|COMA జీవితం విచిత్రం. పుట్టుక వరమైతే, మరణం శాపం. అనివార్యం. ఇందుకు ఈ రెండు ఘటనలే నిదర్శనం. బ్రెయిన్ ‘డెడ్’ అయిన మహిళ, ఒక్క...

రూపాయికే బూట్లు!?|ADUGU TRENDS

శిత్తం శివుని మీద.. భక్తి శెప్పుల మీద అన్నరు. గీ సామెతను చపల చిత్తానికి వాడినప్పటికీ, పాదరచ్చలు... మన ఆరోగ్యానికి కూడా రచ్చణే! గందుకే గవాటిని మనం యేసుకుంటం. ఇగ బూట్లైతే పాదాలకు...

‘జల్ జీవన్ మిషన్’ తో నీటి సమస్యలు సమసేనా!?|EDITORIAL

నీటి సమస్య వనరుల లభ్యత, వినియోగ విధానం, దుర్వినియోగం, సమర్థవంతమైన నిర్వహణలపై ఆధారపడింది. గ్రామీణ భారతావనికి ప్రతి ఇంటికి నల్లాల ద్వారా మంచినీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘జల్ జీవన్ మిషన్’...

12-03-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి నవమి రాత్రి తెల్ల 04.10 వరకు ఉపరి దశమి నక్షత్రం మూల రాత్రి 10.51 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం సిద్ది ఉదయం 08.20 వరకు ఉపరి వ్యతీపాత కరణం తైతుల పగలు...

ప్లాస్టిక్ ఇటికెలతోటి ఇల్లు!?|ADUGU TRENDS

గీ అన్న ఇకమతు సూత్తే, బుర్ర గిర్రున తిరుగుతది. ఇగిప్పుడు అంతా ప్లాస్టిక్ మయమే అయింది. పుట్టిన కానుండి, గిట్టేదాక, గా ప్లాస్టిక్ లేకుండ పనైతలేదు. ఎంత ముప్పని శెప్పినా, నీల్ల కానుంచి...

గ్యాస్ ట్రబుల్స్-ప్రత్యామ్నాయ మార్గాలు|EDITORIAL

ప్రపంచంతోపాటు, భారతదేశంలో వంటగ్యాస్‌-ఎల్పీజీ వినియోగం గత రెండు దశాబ్దాల్లో విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు నగరాలకే పరిమితమైన ఈ ఇంధనం ఇప్పుడు గ్రామాలకు కూడా విస్తరించింది. వంట కోసం ఇంధనంగా ఎల్పీజీ వినియోగం పెరగడం...

11-03-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి అష్టమి రాత్రి 02.14 వరకు ఉపరి నవమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 08.20 వరకు ఉపరి మూల యోగం వజ్ర ఉదయం 08.00 వరకు ఉపరి సిద్ది కరణం బాలవ పగలు 01.12...

లైటర్ లేకుండనే గ్యాస్ స్టౌని ఎలిగిచ్చుడు!?|ADUGU TRENDS

ఉపాయాలున్నోడు ఊరేగుతడట. గట్లనే ఉంది గీ పొల్లగాని తెలివి. నిప్పులేందే పొగే గాదుల్లా. మంట గూడ రాదు కదా? మరీ గీయన గా నిప్పునే తెలివిగ ఎలిగిచ్చి గ్యాస్ స్టౌకి మంట పుట్టిచ్చిండు. గా...

భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాధ్యాయం|EDITORIAL

పొట్టి ప్రపంచ కప్ క్రికెట్ లో తిరుగులేని విజేతగా నిలవడం భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాధ్యాయం. ఈ విజయం కేవలం ఒక ట్రోఫీ సాధన మాత్రమే కాదు. గత విశ్వకప్ ఆటల అనుభవాల...

10-03-2026 మంగళవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి సప్తమి రాత్రి 12.05 వరకు ఉపరి అష్టమి నక్షత్రం అనురాధ సాయంత్రం 05.42 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం హర్షణ ఉదయం 07.24 వరకు ఉపరి వజ్ర కరణం భద్ర ఉదయం 11.04...

09-03-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి షష్టి రాత్రి 10.03 వరకు ఉపరి సప్తమి నక్షత్రం విశాఖ పగలు 03.10 వరకు ఉపరి అనురాధ యోగం వ్యాఘాత ఉదయం 06.54 వరకు ఉపరి హర్షణ కరణం గరజి ఉదయం 09.04...

వరల్డ్ కప్ మనదే|WORLD CUP|INDIA

T2O WORLD CUP|టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌లో భారత్ ఘన విజయం…|INDIA|WIN 3RD TIME|మూడోసారి ప్రపంచ ఛాంపియన్|WORLD|CHAMPION అహ్మదాబాద్‌లో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు అద్భుత...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News