Monday, July 20, 2026
25.8 C
Hyderabad

ప్రకృతిని ప్రేమిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం!|EDITORIAL

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, పండగలన్నీ ప్రకృతితో ముడిపడి ఉన్నవే. ప్రకృతిని ఆరాధించడం మన జీవన విధానంలోనే ఇమిడి ఉంది. ప్రకృతితో ముడిపడి ఉన్న పంచభూతాలను ఆరాధించడం వేదకాలం నుంచే ఉంది. మొదట మనం ఆరాధించిన దేవతామూర్తుల ప్రతిమలన్నీ మట్టితో చేసినవే. తర్వాత రాతివి, ఆతర్వాత లోహాలతో చేసే విగ్రహాలు మనం చూస్తున్నాం. వినాయకచవితి పర్వదినంలో మనం అనేక పుష్పాలు, ఫలాలతో విఘ్నేశ్వరుడిని పూజిస్తాం. విఘ్నాలను నివారించే వినాయకుని పూజతోనే ప్రతి శుభకార్యాన్ని ఆరంభిస్తాం. వినాయకుడిని విఘ్నాలు తొలగించి, శుభాలు కలిగించే ఆది దేవుడిగా కొలుస్తాం. ప్రత్యేకించి వినాయక విగ్రహాలను ప్లాస్టర్ ఆఫ్ పారిస్ –పీఓపీ-తో తయారు చేయడం చూస్తున్నాం. ఈ వినాయక, దుర్గామాత విగ్రహాలను, 10 రోజులపాటు పూజించి, మన చెరువుల్లో వేస్తున్నాం. పూలూ, పత్రి వంటి వాటిని చెరువులో వేయడం వెనక ప్రకృతి పరమార్థం దాగివుంది.
వినాయక పూజలో ఉపయోగించే పూలు, పత్రిలో విశేష ఔషధ గుణాలు ఉన్నాయి. గోరంత పత్రి పెడితే చాలు కొండంత వరాలు గుప్పిస్తాడు. అందుకే వినాయక పూజ అంటే అందరికీ ఇష్టం. వారిని ప్రోత్సహించడం ద్వారా ప్రకృతికి పాటుపడేలా చేయాలి. ఉండ్రాళ్ళ నైవేద్యానికే మహదానందపడిపోతాడు విఘ్నేశ్వరుడు. ఒక్క వినాయకుడికే పత్రిపూజ ఎందుకు చేస్తాం? ఆయన గజముఖుడు కదా! ఏనుగుకు ఇష్టమైనవి ఆకులే కదా! అందుకే ఈ పత్రి పూజ. ఏకవింశతి అంటే ఇరవై ఒక్క రకాల పత్రితో గణేశుణ్ణి పూజిస్తాం. గజాననుడని కీర్తించినా, మూషిక వాహనుడని మొక్కినా, సర్వ విఘ్నాలకు అధినాయకుడని శిరస్సు వంచినా, తొలిపూజలు దక్కేదతనికే. అందుకే భాద్రపద శుక్ల చవితి రోజున భక్తి శ్రద్ధలతో వినాయక పూజ చేసుకోవడం పుణ్యప్రదం. మోక్ష దాయకం!
విఘ్నాలను నివారించే వినాయకుని పూజతో మనం పండగను జరుపుకొంటాం. గణపతి అంటే ప్రకృతి ప్రియుడు. ఆయనకు మనం చేసే పూజ అంతా ప్రకృతి ఆరాధన కిందకే వస్తుంది. చెరువుల్లో మట్టిని తవ్వి తీసుకుని వచ్చి వినాయకుడిగా చేసి, మళ్లీ చెరువులోనే పూజించిన పత్రీపూలతో నిమజ్జనం చేయడం వెనక శాస్త్రీయత ఉంది. మట్టిని తీసి మళ్లీ అది ఎరువుగా, చెరువు నీరు కాలుష్య రహితంగా కావడానికి జరిగే ప్రక్రియ ఇందులో ఇమిడి ఉంది. మనం పూజించే మారేడు, ఉత్తరేణి వంటివి ఔషధ గుణాలు కలిగి ఉండడం వల్ల వీటిని కాలుష్యం నుంచి కాపాడుతాయి. అందుకే వినాయకచవితి ఎన్నో ప్రత్యేకతలు కలిగిన పర్వదినంగా చూడాలి. ఏటా కొన్ని వేల గణపతి విగ్రహాలను రంగులతో అలంకరించి మండపాల్లో ఏర్పాటు చేస్తుంటాం. అలాగే ప్రతి ఇంట్లో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి పూజ నిర్వహిస్తాం. ఇవన్నీ ప్రకృతికి దగ్గరగా ఉండేలా చూడాలి. అలాగే ప్రకృతి పరిరక్షణ ద్వారా పండగల పరమార్థం తెలుసుకోవాలి. గణపతి నవరాత్రుల కోసం ఖర్చు చేసే మొత్తాన్ని ప్రకృతి పరిరక్షణకు ఉపయోగిస్తే కరోనా లాంటి వైరస్‌లు మన దరి చేరవు. నేత్ర, మూత్ర, చర్మ సంబంధమైన రోగాలతోపాటు మరికొన్ని ఇతర వ్యాధులకు మంచి మందుగా పనిచేస్తుందీ పత్రి. అంతేకాక ఆ పత్రి నుంచి వెలువడే సుగంధాన్ని పీల్చడం వల్ల కూడా స్వస్థత చేకూరుతుంది. పత్రిని మనం చేత్తో ముట్టుకోవడం వల్ల అందులో ఉండే వృక్ష సంబంధ రసాయన పదార్థాలు కావలసిన మోతాదులో చర్మం ద్వారా మన శరీరంలోకి శోషణం చెంది ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి.
తొమ్మిది రోజుల తర్వాత వినాయకుణ్ణి బావుల్లో, నదుల్లో, చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. ఇలా ఎందుకు చేయడం అంటే కలుషితమైన ఆ నీటిని శుభ్రం చేయడానికి ఈ 21 పత్రాలు ఉపయోగపడతాయట. ఇరవైమూడు గంటలయ్యాక తమలో ఉన్న ఔషధగుణాల ఆల్కలాయిడ్స్ ని నీళ్లలోకి వదిలేస్తాయి. దాని వల్ల నీటిలో ఉండే బాక్టీరియా నిర్మూలన జరిగి ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. పత్రి సేకరణ వల్ల వృక్ష విజ్ఞానంతో పాటు వినోదం, పర్యావరణం పట్ల స్నేహభావం కలుగుతాయి. చెరువుల్లో మట్టిని తవ్వి తీసి, వినాయకుడిగా చేసి, మళ్లీ చెరువులోనే పత్రీపూలతో నిమజ్జనం చేయడం అది ఎరువుగా, చెరువు నీరు కాలుష్యరహితంగా అవుతుంది. అందుకే వినాయకచవితి ఎన్నో ప్రత్యేకతలు కలిగిన పర్వదినంగా చూడాలి.
ఇటీవల కొంతకాలంగా విగ్రహాల తయారీలో ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ ప్యారిస్‌, రసాయనాలు కలిగిన రంగులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. వినాయక నిమజ్జనంతో ఈ రంగులు, ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తో చెరువులు, కుంటలు, తటాకాలు, బావులు, నదులకు పర్యావరణ నష్టం జరుగుతోంది. జలాల్లో నివసించే అనేక జీవకోటి మనుగడకు విఘాతం ఏర్పడుతోంది. నీరు కలుషితం అవుతోంది. హైదారాబాద్‌ హుస్సేన్‌ సాగర్‌లా కాలుష్య కాసారంగా మారుతున్నాయి. అందుకే ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను వాడాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. మట్టి గణపతులను తయారుచేయడం ద్వారా కొంతయినా పర్యావరణం కాపాడుకోగలం. ఇంట్లో పూజించే చిన్న చిన్న వినాయక విగ్రహాలను పూర్తిగా మట్టితో తయారుచేస్తే అవి పర్యావరణహితంగా వుంటాయి. నీటిలో సులభంగా కరిగిపోతాయి. ఎలాంటి రంగులను వాడకపోవడంతో నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉండదు.
ఇక వీధుల్లో ప్రతిష్టించే పెద్ద విగ్రహాల తయారీలోనూ మట్టినీ, పర్యావరణ హితమైన రంగుల్నీ వాడటం ద్వారా పర్యావరణానికి మేలు చేయొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇటువంటి విగ్రహాల వల్ల నిమజ్జన సమయంలో జలాలు కలుషితం కావని చెబుతున్నారు.

Latest News

ఒక్క స్కూల్.. వేల మంది ఐఏఎస్‌లు!|SCHOOL|IAS

నేతర్‌హాట్ విద్యా మోడల్‌కు దేశమంతా ఫిదా|NETHERHAT|EDUCATIONAL MODEL ప్రకృతి రమణీయత ఉట్టిపడే కొండల నడుమ, చుట్టూ దట్టమైన అడవులు, ప్రశాంతమైన వాతావరణం. ఒక సాధారణ పాఠశాలలా కనిపించే ఆ ప్రాంగణం.. యావత్ భారతదేశ పరిపాలనా...

జూలై 20, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి షష్ఠి ఉదయం 07.00 వరకు ఉపరి సప్తమి నక్షత్రం హస్త రాత్రి 11.01 వరకు ఉపరి చిత్త యోగం శివ రాత్రి 11.07 వరకు ఉపరి సిద్ద కరణం తైతుల ఉదయం 07.00 వరకు ఉపరి...

కాళేశ్వరం కలహాలతో కాలం వెళ్ళదీయలేరు!?|EDITORIAL

ప్రజలకు కావాల్సింది రాజకీయ వాదోపవాదాలు కాదు. పరిష్కారం. లక్ష కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టును నిరుపయోగంగా వదిలేయడం ఎంత తప్పో, భద్రతా ప్రమాణాలు పట్టించుకోకుండా వినియోగించడం కూడా అంతే ప్రమాదకరం. అందువల్ల ప్రభుత్వం...

మొగోల్లను గౌరవిద్దాం!?|ADUGU TRENDS

ఎర్రబస్సుల్ల ఎన్కటేం రాసుండేదో గుర్తుందా!? ఒకపాలి గుర్తు శేసుకోండ్రి. ‘పొగ తాగరాదు!’, ‘టికెట్టుకు సరిపడా చిల్లర ఇచ్చి కండక్టర్ కు సహకరించండి.’ ఇంక..? ‘టికెట్ లేని ప్రయాణం నేరం. రూ.500 వరకు జరిమానా,...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూలై 19 నుండి జూలై 25 వరకు రాశి ఫలాలు మేష రాశి: ఈ వారం మీ ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. చేపట్టిన పనులు క్రమంగా విజయవంతమవుతాయి. ఉద్యోగంలో కొత్త అవకాశాలు లభించవచ్చు. వ్యాపారంలో ఆదాయం...

జీవిత ఖైదీలకు జైల్లోనే లగ్గం!?|ADUGU TRENDS

మనసు ఎవ్వలి మీద ఎప్పుడు? ఎందకు? పడ్తదో తెల్వదంటరు. గదాన్నే పేమ అంటాండ్రు. గట్లనే జైల్లో జీవిత ఖైదుగా ఉన్న ఇద్దరు మనసు పడ్డరు. గా ముచ్చటను జైలు సార్లకు శేరవేసిండ్రు. గానుంచి...

వాడివేడిగా పార్లమెంట్ సమావేశాలు!?|EDITORIAL

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం, ప్రతిపక్షం రెండూ ప్రత్యర్థులే. కానీ, ప్రజా ప్రయోజనాల విషయంలో భాగస్వాములే. అందువల్ల పార్లమెంట్ సమావేశాలు రాజకీయ ఆరోపణలకే పరిమితం కాకుండా ప్రజల ఆశలను నెరవేర్చే విధంగా నిర్మాణాత్మక చర్చలకు వేదిక...

జూలై 18, శనివారం, 2026|RASHI P[HALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి చవితి ఉదయం 08.30 వరకు ఉపరి పంచమి నక్షత్రం పుబ్బ రాత్రి 10.28 వరకు ఉపరి ఉత్తర యోగం వరీయాన్ రాత్రి 01.45 వరకు ఉపరి పరిఘ కరణం భద్ర ఉదయం 08.30 వరకు ఉపరి...

కరువు కోరలు!|Fangs of drought

ఇప్పటికి 33శాతమే వర్షం నమోదు!! రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రం అడుగంటుతున్న జలాశయాలు జీవ నదుల్లోనూ జల జీవమే లేదు రిజర్వాయర్లలోనూ ఇదే పరిస్థితి సాగుకు తొందరొద్దంటున్న నిపుణులు ప్రత్యామ్నాయ పంటలపై కార్యాచరణ 20వ తేదీ తర్వాత పత్తి విత్తనాలేయొద్దు బోరుబావుల కింద వరి...

మొక్క నాటుండ్రి.. డిస్కౌంట్లు పొందుండ్రి!?|ADUGU TRENDS

పర్యావరణానికి మూలం మొక్కే. గా మొక్కే చెట్టై, మహా మానై మనల్ని రచ్చిత్తది. గీ భూమి, వాతావరణం మొత్తం గా మొక్కల మీదనే ఆధారపడ్డది. కనీ, మనమేం చేత్తానం? ఏడికాడికి శెట్లని తెగ...

‘ఢీ’లిమిటేషన్ రాజకీయాలు!?|EDITORIAL

డీలిమిటేషన్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ సంస్కరణలలో ఒకటిగా నిలవనుంది. ఇది కేవలం సీట్ల సంఖ్య మార్చే ప్రక్రియ కాదు, భవిష్యత్ రాజకీయ ప్రాబల్య సమీకరణాలను నిర్ణయించే కీలక ఘట్టం....

జూలై 17, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం దక్షిణాయణం ప్రారంభం తిధి తదియ ఉదయం 09.54 వరకు ఉపరి చవితి నక్షత్రం మఖ రాత్రి 10.51 వరకు ఉపరి పుబ్బ యోగం సిద్ది ఉదయం 05.00 వరకు ఉపరి వ్యతీపాత కరణం గరజి ఉదయం 09.54...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News