మన సంప్రదాయం పకారం ఒక్కొక్కరు ఒక్కల్నే మనువాడాలె. కనీ, గాడ గా పొల్లగాడ్ని, ముగ్గురు అక్కాశెల్లెండ్లు ఒక్కపాలే పెండ్లి శేసుకున్నరు? గదేందో సూద్దాం పదండ్రి.
గిదేంది? అనకుంటాండ్రా? నిజమేనుల్లా… గీ ముచ్చట గా ఉత్తర ప్రదేశ్ రాస్ట్రం అమ్రోహా జిల్లాల జరిగింది. ధౌరియా అనే ఊరికి శెందిన అక్కా శెల్లెండ్లు అల్కా, దేవిక, సంతోశ్ లు, ఏదో సదువైనంక, ఇంటి పట్టునే ఉంటూ, ఈడియోలు శేసి, సోషల్ మీడియల పెడ్తాండ్లు. గవాటిని సూసేటోల్లు గూడా బాగా పెరిగిండ్రు. ఇగీల్లకు ఓ అనుమానం వచ్చింది. తమకు పెండ్లిండ్లయితే, ఎక్కడివాళ్లు గక్కడకు పోతే, గీ ఈడియోలు శేసుడెట్ల? అయితే, గిదీనికి ఓ ఆలోసెన శేసిండ్రు. ఒకే కుటుంబానికి శెందిన ముగ్గుర అన్నా దమ్ముల్ని పెండ్లి శేసుకుంటే, గీ సమస్యపోతది, ఎసక్కా.. గా ఈడియోలు శేసుడాపకుండ ఉండొచ్చని నిర్ణయించుకుండ్రు. గీ ముచ్చటను గవాల్ల తల్లిదండ్రులకు గూడ శెప్పిండ్రు. సరే తియ్యి బిడ్డలూ అని గ వాల్లు గూడా అనుకుండ్రు.

ఇగ ఈ ముగ్గురు అక్కాశెల్లెండ్ల ఈడియోల గాపక్కనే ఉన్న శ్యాంపురి ఊరి వికాస్ తీత్తాంటడు. గట్లనే ఓ రోజు తీత్తాంటే, గవాల్లకు ఓ కొత్త ఆలోశన మెరిసింది. గా వికాస్ నే పెండ్లి శేసుకుంటే, ఇగ ఏ శిక్కూ ఉండదనుకున్నరు. గా ముచ్చటను గా పొల్లగానికి శెప్తే, సరేనన్నడు. అవ్వయ్యలకు శెప్తే గట్లెట్ల? కుదరదుపో అన్నరు. మీతోటి మాకేందని, గా ముగ్గురు అక్కాశెల్లెండ్లు ఓ సక్కా, గా పొల్లగాడొక్కడినే పెండ్లి శేసుకున్నరు. గా ముచ్చను గూడ సోషల్ మీడియల పంచుకున్నరు. ఇగిప్పుడు గీ ఈడియ నెట్టింట మస్తు వైరలైతాంది.

