మనసు ఎవ్వలి మీద ఎప్పుడు? ఎందకు? పడ్తదో తెల్వదంటరు. గదాన్నే పేమ అంటాండ్రు. గట్లనే జైల్లో జీవిత ఖైదుగా ఉన్న ఇద్దరు మనసు పడ్డరు. గా ముచ్చటను జైలు సార్లకు శేరవేసిండ్రు. గానుంచి గా ముచ్చట కోర్టు దాకా ఎల్లింది. గా కోర్టు..ఏమన్నదంటే.. ‘లగ్గమనేది అందరి ప్రాథమిక హక్కు కాబట్టి, గవాల్లకు లగ్గం శేయాల్న’ని ఆర్డరేసింది. ఇక గా కోర్టు శెప్పినంక ఏముంటది? అనుకుంటాండ్రా? గా తీర్పును బట్టి, గా జంటకు లగ్గం శేయాల్నా? వద్దా? శేసినంక సంసారమెట్ల? పోరగాల్లు పుడితే ఎట్ల? ఎక్కడుండాలె? అని ఆలోసిత్తాండ్రు అధికారులు.

గీ ముచ్చట రాజస్థాన్ ల జరిగింది. గా బయిరంగ జైల్ల పరిచయమైన జంట మూలారాం, సీమా ఘడ్నేలు. ఇగిప్పుడు లగ్గమెప్పుడో అని గా జంట ఎదురు సూత్తాంది.

