తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు!
45 మందికి కొత్త బాధ్యతలు
తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం విస్తృత స్థాయిలో ఐఏఎస్ అధికారుల బదిలీలు చేపట్టి ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 45 మంది అధికారులకు బదిలీలు, పదోన్నతులు, అదనపు బాధ్యతలు అప్పగించబడినట్లు అధికారిక ప్రకటన వెల్లడించింది. సంజయ్ కుమార్ను పరిశ్రమలు, ఐటీ శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీ పదవి నుంచి పీఆర్ & ఆర్డీ, ఆర్డబ్ల్యూఎస్ శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ చేశారు. సబ్యసాచి ఘోష్కు ఫ్లాగ్షిప్ వెల్ఫేర్ & డెవలప్మెంట్ స్కీమ్స్ యూనిట్తో పాటు సీఎస్ఆర్ బాధ్యతలు అప్పగించారు. ఎం. దానా కిషోర్ లేబర్, ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్ & ఫ్యాక్టరీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కొనసాగుతూ విపత్తు నిర్వహణ శాఖకు అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్. శ్రీధర్ను ఐటీ & పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించగా, రాహుల్ బొజ్జాను జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో రాజకీయ వ్యవహారాల ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేసి బీసీ వెల్ఫేర్ శాఖకు అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఈ. శ్రీధర్ను ఇరిగేషన్ & CAD శాఖ కార్యదర్శిగా నియమించగా, గౌరవ్ ఉప్పల్ను ఫైనాన్స్ & ప్లానింగ్ శాఖ కార్యదర్శిగా నియమించి టీజీఆర్ఏసీ ఈఓ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
జిల్లా స్థాయిలో కూడా పలువురు కలెక్టర్లను బదిలీ చేశారు. బి. విజయేంద్రను మహబూబ్నగర్ కలెక్టర్ పదవి నుంచి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ కార్యదర్శిగా నియమించారు. అద్వైత్ కుమార్ సింగ్ను మహబూబాబాద్ కలెక్టర్ పదవి నుంచి తెలంగాణ భవన్ (ఢిల్లీ)లో ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు. ఎం. హనుమంతరావును యాదాద్రి భువనగిరి కలెక్టర్ పదవి నుంచి ఎండోమెంట్స్ డైరెక్టర్గా బదిలీ చేశారు. సిక్తా పట్నాయక్ను నారాయణపేట్ కలెక్టర్ నుంచి ఫైనాన్స్ శాఖ స్పెషల్ సెక్రటరీగా నియమించారు. సందీప్ కుమార్ ఝాను జనగాం కలెక్టర్గా, అనురాగ్ జయంతిని యాదాద్రి భువనగిరి కలెక్టర్గా నియమించారు. రాహుల్ రాజ్ పి.ఎస్ను సహకార శాఖ స్పెషల్ కమిషనర్గా నియమించగా, భావేష్ మిశ్రాను ఐటీ శాఖలో స్పెషల్ సెక్రటరీగా రీడిజిగ్నేట్ చేశారు.
కొత్త జిల్లా కలెక్టర్లుగా జితేష్ వి. పాటిల్ను టీజీఎస్పీడీసీఎల్ సీఎండీగా, రిజ్వాన్బాషా షేక్ను జోగులాంబ గద్వాల్ కలెక్టర్గా, ప్రతీక్ జైన్ను నారాయణపేట్ కలెక్టర్గా, స్నేహ శబరిష్ను మహబూబాబాద్ కలెక్టర్గా నియమించారు. ఛిత్రా మిశ్రా కరీంనగర్, గరిమా అగ్రవాల్ రాజన్న సిరిసిల్ల, దీపక్ తివారి వికారంాబాద్, ప్రతిమా సింగ్ మెదక్, అంకిత్ భద్రాద్రి కొత్తగూడెం, చాహత్ బజ్పాయ్ హనుమకొండ జిల్లాల కలెక్టర్లుగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఖుష్బూ గుప్తా మహబూబ్నగర్ కలెక్టర్గా నియమితులయ్యారు.
అదనంగా పలువురు రాష్ట్ర సర్వీస్ (SCS) అధికారులకు కూడా కొత్త పోస్టింగ్లు కల్పించారు. నాగర్కర్నూల్, మంచిర్యాల, వరంగల్, సిద్ధిపేట, నిర్మల్, వనపర్తి జిల్లాలకు అదనపు కలెక్టర్లను నియమించారు. మొత్తం మీద ఈ బదిలీలతో పరిపాలనా వ్యవస్థలో చురుకుదనం తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
G.O.290 – IAS Transfers & Postings

