Tuesday, August 4, 2026
27.7 C
Hyderabad

జూన్ 1 లేదా 2న మంత్రివర్గ విస్తరణ?|MINISTER|EXPANSION

THREE|ముగ్గురు MINISTERS|మంత్రులకు ఉద్వాసన?
మంత్రుల్లో, ఆశావహుల్లో ఉత్కంఠ
CM|సీఎం, PCC CHIEF|పీసీసీ చీఫ్, రాష్ట్ర ముఖ్య నేతలకు ఢిల్లీ పిలుపు
మంత్రులకు, ముఖ్య నేతలకు CM|సీఎం విందు

అసలు అవుతుందో లేదో అనుకున్న తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు రంగం సిద్ధమైందా? గిల్లి కజ్జాలు, బుజ్జగింపుల తర్వాత అన్ని అవాంతరాలను అధిగమించినట్లేనా? అదే జరిగితే, ఇప్పుడున్న మంత్రుల్లో ముగ్గురికి ఉద్వాసన తప్పదా? ఆ ముగ్గురు ఎవరు? కొత్తగా మంత్రులయ్యేది ఎవరు? పీసీసీ కార్యవర్గంలో చోటు దక్కేదెవరికి? కాంగ్రెస్ మార్క్ రాజకీయంలో అంతా ఉత్కంఠ నెలకొంది.

తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ఈ నెల 30 లేదా జూన్ మొదటి వారంలోనే ఉండనుందా? అదే సమయంలో పీసీసీ కార్యవర్గాన్ని కూడా ప్రకటిస్తారా? ఇదే జరిగితే, ప్రస్తుత మంత్రివర్గంలో ఉన్న ముగ్గురు మంత్రులకు ఉద్వాసన తప్పదా? ఆ ముగ్గురు ఎవరు? కొత్తగా మంత్రులు కానున్నది ఎవరు? పైగా ఈ నెల 30న ఢిల్లీకి ఎఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వస్తున్నారు. ఇదే రోజున ఢిల్లీకి రావాలని సీఎం, పీసీసీ చీఫ్, మంత్రులకు పిలుపు వచ్చినట్లుగా తెలిసింది. మంత్రివర్గ విస్తరణ, కార్యవర్గ కూర్పుపై అధిష్టానం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే, ఇప్పుడు ఇవే అంశాలు రాష్ట్ర కాంగ్రెస్ తోపాటు, మంత్రివర్గ సభ్యులలో ఉత్కంఠ రేపుతున్నాయి. ఇవే అంశాలు చర్చనీయాంశంగా మారాయి.

విందు రాజకీయం
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో మంత్రులకు విందు ఇచ్చారు. ఈ విందుకు డిప్యూటీ సీఎం సహా, రాష్ట్ర మంత్రులు, పీసీసీ చీఫ్, కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరయ్యారు. అంతా ఒక చోట కలిసి పిచ్చా పాటి ముచ్చటించుకుంటున్న సమయంలో మంత్రి వర్గ విస్తరణ అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. రెండు రోజుల క్రితమే రెండు రోజులపాటు అధిష్ఠానం పిలుపు మేరకు ఢిల్లీలో మకాం వేసి, సుదీర్ఘంగా చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. పీసీసీ కార్యవర్గం తుది జాబితా ఖరారు, మంత్రి వర్గ విస్తరణపైనే కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఎఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితరులతో భేటీలు జరిపారు. చర్చించారు. అయితే ఎఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఢిల్లీలో అందుబాటులో లేని కారణంగా ఆయన వచ్చిన వెంటనే మళ్ళీ మరోసారి భేటీ అయ్యేందుకు, తుది జాబితాలు సిద్ధం చేసేందుకు నిర్ణయించారు. 30న ఖర్గే ఢిల్లీలో అందుబాటులో ఉంటారని తెలిసింది. దీంతో విందులో చర్చంతా పీసీసీ కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణపైనే జరిగినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఖర్గే ఆమోదం కోసం ఢిల్లీకి 30న కాంగ్రెస్ ముఖ్య నేతలు వెళ్ళనున్నట్లు చర్చ వచ్చింది. ఇదే సమయంలో ముగ్గురు మంత్రులకు ఉద్వాసన తప్పదన్న విషయం చర్చకు వచ్చింది. ఆ ముగ్గురు ఎవరన్న దానిపై విందులోనే ఉత్కంఠగా చర్చ జరిగినట్లు తెలిసింది. మంత్రుల్లో అప్పుడే గుబులు మొదలైంది. పైకి గంభీరంగా కనిపించినప్పటికీ దాదాపు మంత్రులందరిలోనూ ఏయే కారణాలతో ఎవరిని పక్కన పెడతారోనన్న ఆందోళన కలిగినట్లు తెలిసింది. పైకి నవ్వుతూ ఏదోలా ఆ విందు ముగించుకుని బయట పడ్డారట. అంతేగాక కొత్తగా వచ్చే మంత్రులు ఎవరై ఉంటారన్నదానిపై కూడా కొందరు చర్చించుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే బహిరంగంగా చర్చకు వచ్చిన పేర్లను వారు ఉటంకించినట్లు తెలిసింది.

విస్తరణ పూర్తి స్థాయిలోనేనా?
అయితే ఈ సారి మంత్రి వర్గ విస్తరణ పూర్తి స్థాయిలో ఉంటుందా? లేక ఇద్దరు ముగ్గురిని తప్పించి, మరో ఇద్దరు ముగ్గురిని తీసుకుని వివాదాస్పదంగా ఉన్న మిగతా ఒకటి రెండు జిల్లాలను పక్కన పెడతారా? అన్న సందిగ్ధం కూడా నెలకొంది. ముఖ్యంగా అదిలాబాద్ జిల్లాలో సామాజిక వర్గాల సమీకరణలు కుదరడం లేదు. ఒకటి రెండు సామాజిక వర్గాల మధ్య పడటం లేదు. నల్లగొండలోనూ ఒకే సామాజిక వర్గం, ఒకే కుటుంబానికి చెందిన వారికి మంత్రి పదవులు దక్కుతాయా? అన్నది ఉత్కంఠగానే ఉంది. అధిష్టానం నిర్ణయం ఏమై ఉంటుంది? ఏ మేరకు సీఎం, రాష్ట్ర నేతలు ఎఐసీసీని ఒప్పించగలరన్నదానిపై ఈ సమీకరణలు ఆధారపడి ఉన్నాయి.

మీనాక్షి కీలక పాత్ర
ఇక పీపీసీతోపాటు, మంత్రి వర్గ కూర్పులోనూ ఎఐసీసీ వ్యవహారాల ఇన్ చార్జీ మీనాక్షి నటరాజన్ కీలక పాత్ర వహిస్తున్నట్లు తెలిసింది. గతానికి భిన్నంగా కొన్ని నిబంధనలు పెట్టి, దరఖాస్తులు స్వీకరించి, పరిశీలించి, వడపోసి, నిర్ణయించే ప్రక్రియను ఆమె మొదలు పెట్టారు. ఎట్టకేలకు ఒక జాబితాను ఎఐసీసీకి పంపించారు. పీసీసీ మాత్రమేగాకుండా, మరోవైపు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల పనితీరును సైతం మీనాక్షి మదింపు వేసి, ఎఐసీసీకి పంపించినట్లుగా విశ్వసనీయంగా తెలిసింది. దీంతో ఎవరేంటి? వారి పనితీరేంటి? పార్టీకి వారు పనికొచ్చే తీరేంటి? వంటి అంశాల్లో ఒక నిర్ధారణకు రావడానికి ఎఐసీసీకి సులువైనట్లుగా చెబుతున్నారు.

మొత్తానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన18 నెలలు తర్వాత కూడా అసలు పీసీసీ విస్తరణ ఉంటుందా? మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందా? అనే అనుమానాలు బలపడి, విస్తారంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ రెండు నియామకాలు ఒక కొలిక్కి రావడం ఆ పార్టీలో కొందరికి ఇబ్బందీగా ఉన్నప్పటికీ, అనేక మందికి ఆనందాన్ని కలిగిస్తున్నది.

Latest News

ఆగస్టు 04, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి రాత్రి 07.06 వరకు ఉపరి సప్తమి నక్షత్రం రేవతి రాత్రి 08.09 వరకు ఉపరి అశ్విని యోగం ధృతి రాత్రి 06.53 వరకు ఉపరి శూల కరణం గరజి ఉదయం 07.45...

గీ అవుడియ అదిరింది!?|ADUGU TRENDS

ఒక అవుడియ జీవితాన్నే మారుస్తదంటే గిదేనేమో మరి! ఏదైనా ఆలోశన శేత్తే, ఏదో ఒకటి జర్గుతది. లేకపోతే ఊదు కాలది పిల్లి గూడ లేవది? గది సరే గనీ గా పిల్లగాడు శేసిందేంటో...

అధికారం రాగానే హామీలు హుష్ కాకీ!?

ప్రజలు ఇప్పుడు రాజకీయ పార్టీల ప్రకటనలను కాకుండా వాటి పనితీరును కొలుస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కాలపరిమితి నిర్ణయించి, వాటి అమలుపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి శ్వేతపత్రం విడుదల చేయడం...

ఆగస్టు 03, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి రాత్రి 08.18 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 08.37 వరకు ఉపరి రేవతి యోగం సుకర్మ రాత్రి 08.54 వరకు ఉపరి ధృతి కరణం కౌలవ ఉదయం 08.40...

అవుమల్లా! కడుపుల బిడ్డ స్పందిత్తదా!?|ADUGU TRENDS

తల్లి గర్భంల ఉండంగనే బిడ్డలకి బయటియి యినబడ్తయా? గవాటికి గా పిల్లలు గూడ స్పందిత్తరా? యెన్కటికి కడుపుల ఉండంగనే అర్జునుడి కొడుకు అభిమన్యుడు పద్మవ్యూహంలకెట్ల పోవాల్నో తెలుసుకున్నడట. గిది నిజమో కాదో కనీ,...

ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ గా భోగాపురం!?|EDITORIAL

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఒక కొత్త అవకాశాన్ని తెరిచింది. ఈ అవకాశాన్ని స్థిరమైన అభివృద్ధిగా మలచడం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్థానిక ప్రజల సమిష్టి కృషిపైనే ఆధారపడి ఉంటుంది. మౌలిక వసతుల...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 02 నుండి ఆగస్టు 08 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీరు చేపట్టే పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో...

యిధి యిసిత్రమైందంటే గిదే మరి!?|ADUGU TRENDS

యిధి శాల యిసిత్రమైంది. ఒకపాలి కలిసున్నోల్లను సిడెంల యిడదీత్తది. యిడిపోయినోల్లని శిటికెల కలిపేత్తది. గసొంటిదే గీ ముచ్చట. గదేందో సూద్దాం పాండ్రి. తమిళనాడు రాస్ట్రం విరుదు నగర్ జిల్లా తిరుచూలి పూమాలై పట్టీకి శెందిన...

పోలీసింగ్ పై పార్లమెంటులో సమీక్షేది!?|EDITORIAL

పార్లమెంట్ వరుసగా వాయిదాలు పడుతూ స్తంభిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ప్రతిష్ఠంభనల వల్ల ఉభయ సభల్లో కీలక అంశాలపై అసలు చర్చే జరగడం లేదు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు కూడా అత్యవసరం....

ఆగస్టు 01, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ తదియ రాత్రి 09.20 వరకు ఉపరి చవితి నక్షత్రం శతభిషం రాత్రి 08.09 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శోభ రాత్రి 11.43 వరకు ఉపరి అతిగండ కరణం వణజి ఉదయం 09.10...

తెలంగాణ ‘పెద్ద’న్న అస్తమయం!|TELANGANA|PEDDI SUDHARSHAN REDDY

ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు హనుమకొండలో గుండెపోటు మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు 5రోజులు మృత్యువుతో పోరాటం కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ...

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News