Tuesday, June 9, 2026
28.2 C
Hyderabad

తెలంగాణ నినాదాన్ని నిలబెట్టుకుందాం!|ESSAY

‘తెలంగాణ!’ నినాదంపై అప్రకటిత నిషేధం!?
రాష్ట్రంలో తెలంగాణ నినాదాన్ని నిషేధించారా? ఎందుకు ‘జై తెలంగాణ!, జైజై తెలంగాణ!!’ నినాదం ఎక్కడా వినిపించడం లేదు? ప్రభుత్వం ఆ నినాదాన్ని కేవలం ఓ పార్టీ నినాదంగా భావిస్తోందా? యావత్ తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా చూస్తోందా? ఉద్యమాన్ని గౌరవిస్తోందా? అవమానిస్తోందా? అప్రకటిత నిషేధం నుంచి తెలంగాణ నినాదాన్ని నిలబెట్టుకుందాం! అంటూ.. సీనియర్ జర్నలిస్టు గోపాల బాలరాజు రాసిన తెలంగాణ నినాదాన్ని నిలబెట్టుకుందాం! ప్రత్యేక వ్యాసం 

తెలంగాణ నినాదాన్ని నిలబెట్టుకుందాం!

‘జై తెలంగాణ..! జై జై తెలంగాణ..!’ ఒక నినాదం మాత్రమే కాదు… ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మూడు కోట్ల తెలంగాణ హృదయాల్లో ఉవ్వెత్తున ఎగిసిన ఆత్మగౌరవ జ్వాల. ఆ నినాదం తెలంగాణ ప్రజల గుండెల్లోంచి వచ్చింది. ప్రజల శ్వాసై నిలిచింది. అది దిక్కులు పిక్కటిల్లేలా చేసిన ప్రజోద్వేగం. ఆ నినాదం ప్రతీ తెలంగాణ బిడ్డ మనోవేదనకు ప్రతీక. తెలంగాణ ఉద్యమానికి రణ నినాదం. ప్రజల ఆత్మ గౌరవ గళం.

1952 ముల్కీ ఉద్యమంలో అమరుల బలిదానాన్ని స్మరించుకుంటూ ఎగిసిన ఆ నినాదం… 1969లో తొలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నిలిచి, వేలాది విద్యార్థుల త్యాగాన్ని కీర్తించింది. మళ్లీ మలిదశ ఉద్యమంలో ప్రతి గల్లీ, ప్రతి బస్తీ, ప్రతి వీధిలో దిక్కులు పిక్కటిల్లేలా మార్మోగింది – జై తెలంగాణ!.
ఇప్పటి పాలకులు ఆ నినాదాన్ని మరిచిపోవచ్చు… కానీ ప్రజల గుండెల్లో అది ఇంకా సజీవంగానే ఉంది. గత బీఆర్‌ఎస్ హయాంలో అధికారిక కార్యక్రమం ఏదైనా, చివర్లో ‘జై తెలంగాణ’ అంటూ ముగించటం సంప్రదాయంగా ఉండేది. అదే నినాదం అధికారులకు, ప్రజలకు, ఉద్యమకారులకు గర్వంగా నిలిచింది. కానీ, కొత్త పాలకులొస్తే నినాదమే మారిపోతుందా? అంటే మారిపోయింది అని చెప్పవచ్చు.

ప్రస్తుతం పాలకవర్గాలు, అధికార యంత్రాంగం ఆ నినాదాన్ని ఉచ్చరించకుండా పాపంగా మౌనంగా ఉంటోంది. నినాదం మీద ఏ విధమైన అధికారిక నిషేధం ప్రకటించకపోయినా, ఒక అప్రకటిత నిషేధం మాత్రం అమలవుతోంది. పాలకులు ‘జై తెలంగాణ’ అనే పదమే ఎక్కడా వినిపించకుండా జాగ్రత్త పడుతున్నట్లుగా కనిపిస్తోంది. జై తెలంగాణ అనగానే గుర్తుకొచ్చేది తెలంగాణ ఉద్యమం మాత్రమే కాదు, కేసీఆర్ కూడా. కాబట్టి ఆ పదాన్నే ఉచ్చరించమని భీష్మించడం మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని, నాటి ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజలన్ని అవమానించడమే అవుతుంది. పాలకులు పలకడం లేదు. అధికారులు, ఉద్యోగులు కూడా జై తెలంగాణ నినాదాన్ని వదిలేసినట్లే కనిపిస్తున్నది.

ఈమధ్య ఓ బీజేపీ ఎమ్మెల్యే ఏకంగా ‘జై తెలంగాణ’ నినాదాన్ని వదిలేద్దాం. ‘జై భారత్’ అందాం అంటున్నాడు! మరి ఇదే బీజేపీ వాళ్లు మహారాష్ట్రలో ‘జై మహారాష్ట్ర’ నినాదాన్ని నిషేధించగలరా? అసలు ఇది ఏ రకమైన దురాలోచన? ఎలాంటి తర్కానికి నిలుస్తుంది?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదకొండేళ్లు దాటింది. అయినా ఇంకా రాష్ట్రంలోని కీలక రంగాలు సీమాంధ్ర పెట్టుబడిదారుల పట్టు నుంచి స్వేచ్ఛను పొందలేదు. ముఖ్యంగా భావజాల రంగమైన మీడియా, ఇప్పటికీ సీమాంధ్ర చేతుల్లోనే, వారి ప్రభావంలోనే ఉంది. ఈ మీడియా – తెలంగాణ ప్రజల ఉద్యమాలను, ఆత్మగౌరవాన్ని – ‘సెంటిమెంట్’గా తక్కువ చేస్తూ, మళ్ళీ సీమాంధ్ర వర్గాల ఆధిపత్యాన్ని స్థాపించడానికి పాత పద్దతినే తిరిగి తెస్తోంది.

తెలంగాణ ప్రజలు తమ నీటి హక్కుల గురించి, భాషా-సాంస్కృతిక హక్కుల గురించి మాట్లాడగానే… ఇదే మన పాలకులు చేతులెత్తేసి మరీ ‘ఇదిగో మళ్ళీ సెంటిమెంటు’ అంటున్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా తెలంగాణకు జరుగుతున్న న్యాయం?

‘తెలంగాణ సెంటిమెంటు’ అనే పదం మన తెలంగాణ పోరాటాలపై, మన త్యాగాలను తక్కువ చేసి చూపే కుట్ర. ఎందుకంటే తెలంగాణ వాదం ఒక్క ‘భావోద్వేగం’ మాత్రమే కాదు. అది అనుభవం నుండి పుట్టిన సహేతుకమైన, స్పష్టమైన రాజకీయ ఆకాంక్ష. అన్యాయానికి, వివక్షకి వ్యతిరేకంగా సుదీర్ఘంగా సాగిన చరిత్రబద్ధమైన ఉద్యమ ధోరణి.

ఇవాళ పాలకులు అప్రకటితంగా నిషేధించిన జై తెలంగాణ నినాదాన్ని మళ్లీ నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలందరి మీద ఉన్నది. జై తెలంగాణ అనే గళం మళ్లీ ఒక్కసారి గాలిని చీల్చాలి. ప్రతి పాలకుడు, ప్రతి అధికారి, ప్రతి ఉద్యోగి – ఈ నినాదాన్ని గౌరవించి, గర్వంగా ఉచ్చరించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళీ ‘సెంటిమెంటు’ గా తగ్గించి చూపేందుకు జరిగే కుట్రల్ని తిప్పికొట్టాలి. తెలంగాణ ప్రజలు తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి.
‘జై తెలంగాణ’ నినాదం — మన ఊపిరి. మనకు గర్వం.

–గోపాల బాలరాజు
సీనియర్ జర్నలిస్టు – 73370 82570

Latest News

సేఫ్టీ డోర్లు!|ADUGU TRENDS

భద్రతకే భద్రత లేని రోజులియి.! మరైతే మనమెంత భద్రంగుండాలె? మనమెంత జాగర్త పడ్డా దోసేటోడు కొత్త కొత్త దారుల్ల దోస్తనే ఉన్నడు. కట్టం లేకుండా మన సొక్కం మన గాబుల్ల, జేబుల్ల నిండాలె....

దేశానికి ముప్పుగా డ్రగ్స్ దందా!|EDITORIAL

యువతను మాదక ద్రవ్యాల మహమ్మారి నుంచి కాపాడటం కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు. అది సమాజం మొత్తం నిర్వర్తించాల్సిన సామూహిక కర్తవ్యం. నేడు అప్రమత్తంగా వ్యవహరిస్తేనే రేపటి తరాన్ని ఆరోగ్యవంతమైన, సురక్షితమైన...

09-06-2026, మంగళవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 సంకల్ప తిథి: కృష్ణ-నవమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-నవమి తిథి : కృష్ణ-నవమి తె. ఝా 2:35 వరకు...

08-06-2026, సోమవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 సంకల్ప తిథి: కృష్ణ-అష్టమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-అష్టమి తిథి : కృష్ణ-అష్టమి తె. ఝా 3:24 వరకు...

ప్రొఫెసర్ వ్యాఖ్యలు-పోస్టు మార్టం|JANASENA|PROF.NAGESHWAR|PSPK

స్థానిక బీజేపీ నాయకత్వం నుంచి కాని పనిని జాతీయ పార్టీ నెత్తికెత్తుకుందా? అందుకే జన సేనాని పవన్ ని తెలంగాణపైకి ఉసి గొల్పిందా? ఈ స్కెచ్ లో భాగంగానే జగన్ ను అరెస్ట్...

మందా? ‘మజా’కా!?|ADUGU TRENDS

ఎనకటికి ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే, సుట్టకు అగ్గి కావాలని మరొకడేడిసిండట! గీ ముచ్చట గట్లనే ఉన్నది. రోజులు మారినా, గా సామెతల అర్థాలు మారట్లేదు. గీ సామెతసొంటి ముచ్చటే గా చిత్తూరు జిల్లా...

ఆర్థిక మోసాలకు అడ్డుకట్టలే లేవా!?|EDITORIAL

చిన్న మోసగాళ్లనే కాదు, పెద్ద కార్పొరేట్ సంస్థలు, ప్రభావశీల వ్యక్తులు చేసిన అక్రమాలపై కూడా సమానంగా చర్యలు తీసుకోవాలి. చట్టం ముందు అందరూ సమానమనే నమ్మకం ఏర్పడినప్పుడే ఆర్థిక క్రమశిక్షణ బలపడుతుంది. లేకపోతే...

ఈ రోజు/ వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూన్ 07 నుండి జూన్ 13 వరకు వారఫలాలు: మేషం: ఈ వారం కుటుంబ వ్యవహారాల్లో కొంత ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సౌహార్దంగా వ్యవహరించడం మంచిది. వ్యాపారవేత్తలు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా...

రెండోసారి రాజ్యసభకు సానా…|AP|TDP|RAJYASABHA|SANA SATHISH BABU

బాబుకు ధన్యవాదాలు తెలిపిన సతీష్ బాబు|CHANDRABABU|CM రాష్ట్ర రాజకీయాల్లో, సామాజిక సేవలో, క్రీడా రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, తెలుగుదేశం పార్టీ నేత సానా సతీష్ బాబు రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా...

ఏపీ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు|AP|RAJYASABHA|TDP|JANASENA|BJP

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారిన రాజ్యసభ స్థానాల భర్తీ ప్రక్రియ తుది ఘట్టానికి చేరుకుంది. రాష్ట్రం నుండి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు గాను అధికార కూటమిలో అభ్యర్థుల ఎంపిక...

గడ్డి కావాలా, బాబూ..!|ADUGU TRENDS

పసువులకే కాదు, కాస బుద్ధి తక్కువున్నోల్లకు గడ్డి పెడతం.! గడ్డంటే గడ్డి కాదు కనీ, తిట్లన్నట్లు.!! గడ్డి మేసి ఆవు పాలిస్తుంది, పాలుతాగి మినిసి విషమవుతాడు అంటాడు ఆత్రేయ. మరి ఆవు మేసే...

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత!|EDITORIAL

పర్యావరణ దినోత్సవం ఒక ఉత్సవం మాత్రమే కాదు. ప్రకృతిని కాపాడుకోవాలనే సామూహిక సంకల్పానికి ప్రతీక. పర్యావరణాన్ని రక్షించడం అంటే మానవజాతి భవిష్యత్తును రక్షించడమే. నేటి నిర్లక్ష్యం రేపటి విపత్తుకు దారితీయవచ్చు. అందుకే ప్రకృతి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News