Sunday, June 14, 2026
28.9 C
Hyderabad

PENSIONS|పెన్షన్లు పెంచుతరా? గద్దె దిగుతరా?|MANDA KRISHNA MADIGA

CM|సీఎం ఇయ్యడు… KCR|కేసీఆర్ అడగడు
ASSEMBLY|అసెంబ్లీకి పోడు… జనంలోకి రాడు
OPPOSITION LEADER|ప్రతిపక్ష నేతగా కేసీఆర్ పనికి రాడు
తమ SALARIES|జీతాలు పెంచుకునే పాలకులు
పేదలకు పెన్షన్లు ఎందుకు పెంచరు?
కుల, మతాలకంటే మానవత్వమే ముఖ్యం
ఆరోగ్య బీమా నుండి ఆరోగ్యశ్రీ వరకు
తెచ్చిన ఘనత MRPS|ఎమ్మార్పీఎస్ దే!
పెన్షన్లు పెరిగింది ఎమ్మార్పీఎస్ కారణంగానే
మంద కృష్ణ ఉద్ఘాటన, ఘాటైన విమర్శలు
పాలకుర్తిలో సన్నాహక సదస్సు
సెప్టెంబర్ 3న హైదరాబాద్ లో జరిగే చేయూత వికలాంగుల మహాసభ జయప్రదానికి విజ్ఞప్తి

పాలకుర్తి, ఆగస్టు 12 (అడుగు న్యూస్):
పెన్షన్లు పెంచుతరా? లేక గద్దె దిగుతరా? అధికార పార్టీ తేల్చుకోవాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మంద కృష్ణమాదిగ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. పెన్షన్లను పెంచి ఇవ్వాల్సిన కాంగ్రెస్ ఇవ్వదు. అడగాల్సిన బీఆర్ఎస్ అడగదు. అంటే సీఎం ఇయ్యడు, కేసీఆర్ అడగడు. కేసీఆర్ అసెంబ్లీకి పోడు. జనంలోకి రాడు. ప్రతిపక్ష నేతగా పనికి రాడని తేల్చేశారు. ఇద్దరూ చంద్రబాబు శిష్యులే మరి, చంద్రబాబు అమలు చేస్తున్న పెన్షన్లను వీరెందుకు చేయడం లేదని ప్రశ్నించారు? తనకు కులం, మతం కంటే కూడా మానవత్వమే ఎక్కువని అందుకే తాను వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, దీర్ఘ కాలిక వ్యాధిగ్రస్తుల కోసం పోరాడుతున్నానని చెప్పారు. ఇప్పటి వరకు పెరిగిన పెన్షన్లన్నీ ఎమ్మార్పీఎస్ పోరాడి సాధించినవేనని సోదాహరణగా వివరించారు.

వికలాంగులకు రూ.6 వేలు, వ్రుద్ధులకు, వితంతువులకు రూ.4 వేలు, కండరాల సమస్య (మయోసైటీస్)లతో బాధపడేవారికి రూ.15వేలు పెన్షన్లను పెంచాలని డిమాండ్ చేస్తూ, సెప్టెంబర్ 3న హైదరాబాద్ లో నిర్వహించనున్న చేయూత పెన్షన్ దారుల గర్జన మహాసభకు సన్నాహకంగా జరుపుతున్న నియోజకవర్గాల స్థాయి సన్నాహక సమావేశాల్లో భాగంగా పాలకుర్తి నియోజకవర్గ స్థాయి సదస్సు పాలకుర్తిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో మంగళవారం జరిగింది. ఈ సదస్సుకు మంద కృష్ణమాదిగ ముఖ్య అతిథిగా విచ్చేసి, ప్రసంగించారు.

20 నెలలు గడిచినా, కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా పెన్షన్లను పెంచలేదన్నారు. ప్రతిపక్షం ఈ విషయమై ప్రశ్నించడం లేదన్నారు. వాళ్ళు విస్మరించినందునే తాను ఈ సమస్యను నెత్తినెత్తుకుని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నాని మంద కృష్ణ చెప్పారు. అత్యంత పేదల సమస్యలను అత్యున్నత వర్గాల పార్టీలు, పాలకులు, ప్రభుత్వాలు పట్టించుకోవన్నారు. రూ.75గా ఉన్న పెన్షన్ ను రూ.200లకు, తర్వాత 2007లో రూ.500లకు, 2014లో రూ.1500లకు, 2015లో రూ.3,000లకు, దీన్నే ర.3016లకు పెంచే విధంగా ఉద్యమాలు చేసి, ఒత్తిడి తెచ్చిన ఘనత ఎమ్మార్పీఎస్ దేనని ఆయన ఉదాహరణలు, పేపర్, ఫోటో, ఆడియో క్లిప్పింగులతో సహా వివరించారు. ఆనాడు దేశంలోనే అత్యంత తక్కువగా, ఈనాడు అత్యంత ఎక్కువగా పెన్షన్లు నిరుపేదలకు అందుతున్నాయంటే దానికి కారణం ఎమ్మార్పీఎస్ అన్నారు. అలాగే ఆనాడు వైఎస్ఆర్ సీఎంగా ఉన్న ఉమ్మడి ఏపీలో పేదలకు ఆరోగ్య బీమా, తర్వాత ఆరోగ్యశ్రీ పథకాన్ని అందించినందునే ఇవ్వాళ ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.10లక్షలు చేతిలో ఉన్నట్లేగాక, ఆ మేరకు ఆరోగ్యం అందే అవకాశం ఏర్పడిందంన్నారు. ఇలాంటి ఉద్యమ చరిత్ర ఉన్న ఎమ్మార్పీఎస్ సెప్టెంబర్ 3న హైదరాబాద్ లో నిర్వహించే భారీ బహిరంగ సభకు లక్షలాదిగా పెన్షన్ దారులంతా తరలి రావాలని మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెన్షన్ దారులతోపాటు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు, మంద కృష్ణ అభిమానులు పాల్గొన్నారు.

Latest News

అత్యధిక బ్లడ్ డోనర్ మోటివేటర్ డా. రాజేశ్వర్ రావు|INTERNATIONAL|BLOOD|DONORS

రక్తదాన సేవలకు గుర్తింపుగా గవర్నర్ సత్కారం|BLOOD DONATION|GOVERNOR హైదరాబాద్, జూన్ 14 (అడుగు న్యూస్): రక్తదానం పట్ల సమాజంలో విస్తృత ప్రచారం, చైతన్యం కలిగిస్తూ, స్వచ్ఛంద రక్త దానాన్ని విశేషంగా ప్రోత్సహిస్తూ, విశిష్ట సేవలందిస్తున్న ...

బరంతి ఇకమతు భలేగుందే!|ADUGU TRENDS

ఇల్లు కట్టుడంటే అట్లిట్ల కాదు. నెలలు, సంవత్సరాలు పడతయి. ఒక్కో కట్టడం దగ్గర ఒక్కో జాగర్త తీసుకోవాలె. లేకపోతే ఇల్లు గుల్లైతది. గట్ల ఇంటికి బరంతి నింపుతం కద. గదాంట్ల మనమైతే ఏం...

భూమి పునరుద్ధరణకే ఎల్ నినో హెచ్చరిక!|EDITORIAL

ఎల్‌నినోను కేవలం ప్రకృతి వైపరీత్యంగా మాత్రమే చూడడం సరైంది కాదు. వాతావరణ మార్పులు, అటవీ నిర్మూలనం, భూమి క్షీణత, ప్లాస్టిక్ కాలుష్యం, జలవనరుల నాశనం వంటి మానవ చర్యలు కూడా ఈ సంక్షోభాలను...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూన్ 14 నుండి జూన్ 21 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీలో కొత్త ఉత్సాహం పెరుగుతుంది. పనుల విషయంలో ముందడుగు వేయడానికి మంచి అవకాశాలు కనిపిస్తాయి. కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం...

మియా జాకీ మాయ!|ADUGU TRENDS

పండంటే మామిడి పండే! పండ్లండ్ల మధురమైన పండ్లంటే కూడా మామిడి పండ్లే!! గందుకే గా పండ్లకు గంత గిరాకీ. గీ పండ్లల్ల మస్తు గిరాకీ ఉన్న పండ్లు మియా జాకీ రకమట. గీ...

బడే భవిష్యత్తుకు పునాది?!|EDITORIAL

దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది. ఒక మంచి పాఠశాల కేవలం విద్యార్థిని మాత్రమే కాదు, కుటుంబాలని, గ్రామాలని, సమాజాన్ని మార్చగలదు. అందుకే విద్యను వ్యయంగా కాకుండా పెట్టుబడిగా చూడాలి. నీతి ఆయోగ్...

జూన్ 13, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం మాస శివరాత్రి శని త్రయోదశి తిధి బ త్రయోదశి మధ్యాహ్నం 01.55 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం కృత్తిక రాత్రి 12.17 వరకు ఉపరి రోహిణి యోగం సుకర్మ సాయంత్రం 04.30 వరకు ఉపరి ధృతి కరణం వణజి...

నచ్చత్రాల ఇల్లు!|ADUGU TRENDS

ఆకాసంల నచ్ఛత్రాలన్నీ మన ఇంటిమీదకే వత్తే ఎట్లుంటది!? గట్లనే ఓ ఇల్లు కట్టుకుంటే ఇంకెట్లుంటది!? మబ్బుల్ల తేలాడినట్లే ఉంటది కదా? ఇది కలేం కాదుల్లా? దాన్ని నిజం చేసేటట్లు ఇప్పుడు ఇండ్లు కడతుండ్రు.!...

టీఎంసీ భవితవ్యమేంటి?!|EDITORIAL

టీఎంసీలో గందరగోళానికి బీజేపీ కారణమా? బెంగాల్ లో కాంగ్రెస్‌కు పునరుజ్జీవం లభిస్తుందా? కాంగ్రెస్ లో టీఎంసీ విలీనంపై వస్తున్న ఊహాగానాలు నిజమేనా? రాజకీయాల్లో ఏ పార్టీకైనా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నంత కాలమే మనుగడ....

జూన్ 12, శుక్రవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి సాయంత్రం 04.06 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం భరణి రాత్రి 01.46 వరకు ఉపరి కృత్తిక యోగం అతిగండ రాత్రి 07.20 వరకు ఉపరి సుకర్మ కరణం తైతుల సాయంత్రం 04.06...

గీ కోతి మనుసులకే ఆదర్శం!|ADUGU TRENDS

నిజం కాకపోయినా, కోతి నుండే మనిసి వచ్చాడంటరు. కోతులకు మనుసులకు గంత పోలికన్నట్లు. గా కోతుల బుద్ధులు, శేట్టలు మనుసులకు కూడా ఉంటయి. కొందరిల బయట పడ్తయి. మరికొందరిల బయట పడయి గంతే....

నిరంతరాయ ప్రధానిగా మోదీ రికార్డు!|EDITORIAL

మోదీ, నెహ్రూ రికార్డును అధిగమించడం కేవలం ఒక గణాంక ఘట్టం మాత్రమే కాదు. ఇది భారత ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ద్వారా వరుసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చిన నాయకుడి రాజకీయ ప్రయాణానికి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News