Friday, March 13, 2026
24.7 C
Hyderabad

PENSIONS|పెన్షన్లు పెంచుతరా? గద్దె దిగుతరా?|MANDA KRISHNA MADIGA

CM|సీఎం ఇయ్యడు… KCR|కేసీఆర్ అడగడు
ASSEMBLY|అసెంబ్లీకి పోడు… జనంలోకి రాడు
OPPOSITION LEADER|ప్రతిపక్ష నేతగా కేసీఆర్ పనికి రాడు
తమ SALARIES|జీతాలు పెంచుకునే పాలకులు
పేదలకు పెన్షన్లు ఎందుకు పెంచరు?
కుల, మతాలకంటే మానవత్వమే ముఖ్యం
ఆరోగ్య బీమా నుండి ఆరోగ్యశ్రీ వరకు
తెచ్చిన ఘనత MRPS|ఎమ్మార్పీఎస్ దే!
పెన్షన్లు పెరిగింది ఎమ్మార్పీఎస్ కారణంగానే
మంద కృష్ణ ఉద్ఘాటన, ఘాటైన విమర్శలు
పాలకుర్తిలో సన్నాహక సదస్సు
సెప్టెంబర్ 3న హైదరాబాద్ లో జరిగే చేయూత వికలాంగుల మహాసభ జయప్రదానికి విజ్ఞప్తి

పాలకుర్తి, ఆగస్టు 12 (అడుగు న్యూస్):
పెన్షన్లు పెంచుతరా? లేక గద్దె దిగుతరా? అధికార పార్టీ తేల్చుకోవాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మంద కృష్ణమాదిగ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. పెన్షన్లను పెంచి ఇవ్వాల్సిన కాంగ్రెస్ ఇవ్వదు. అడగాల్సిన బీఆర్ఎస్ అడగదు. అంటే సీఎం ఇయ్యడు, కేసీఆర్ అడగడు. కేసీఆర్ అసెంబ్లీకి పోడు. జనంలోకి రాడు. ప్రతిపక్ష నేతగా పనికి రాడని తేల్చేశారు. ఇద్దరూ చంద్రబాబు శిష్యులే మరి, చంద్రబాబు అమలు చేస్తున్న పెన్షన్లను వీరెందుకు చేయడం లేదని ప్రశ్నించారు? తనకు కులం, మతం కంటే కూడా మానవత్వమే ఎక్కువని అందుకే తాను వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, దీర్ఘ కాలిక వ్యాధిగ్రస్తుల కోసం పోరాడుతున్నానని చెప్పారు. ఇప్పటి వరకు పెరిగిన పెన్షన్లన్నీ ఎమ్మార్పీఎస్ పోరాడి సాధించినవేనని సోదాహరణగా వివరించారు.

వికలాంగులకు రూ.6 వేలు, వ్రుద్ధులకు, వితంతువులకు రూ.4 వేలు, కండరాల సమస్య (మయోసైటీస్)లతో బాధపడేవారికి రూ.15వేలు పెన్షన్లను పెంచాలని డిమాండ్ చేస్తూ, సెప్టెంబర్ 3న హైదరాబాద్ లో నిర్వహించనున్న చేయూత పెన్షన్ దారుల గర్జన మహాసభకు సన్నాహకంగా జరుపుతున్న నియోజకవర్గాల స్థాయి సన్నాహక సమావేశాల్లో భాగంగా పాలకుర్తి నియోజకవర్గ స్థాయి సదస్సు పాలకుర్తిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో మంగళవారం జరిగింది. ఈ సదస్సుకు మంద కృష్ణమాదిగ ముఖ్య అతిథిగా విచ్చేసి, ప్రసంగించారు.

20 నెలలు గడిచినా, కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా పెన్షన్లను పెంచలేదన్నారు. ప్రతిపక్షం ఈ విషయమై ప్రశ్నించడం లేదన్నారు. వాళ్ళు విస్మరించినందునే తాను ఈ సమస్యను నెత్తినెత్తుకుని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నాని మంద కృష్ణ చెప్పారు. అత్యంత పేదల సమస్యలను అత్యున్నత వర్గాల పార్టీలు, పాలకులు, ప్రభుత్వాలు పట్టించుకోవన్నారు. రూ.75గా ఉన్న పెన్షన్ ను రూ.200లకు, తర్వాత 2007లో రూ.500లకు, 2014లో రూ.1500లకు, 2015లో రూ.3,000లకు, దీన్నే ర.3016లకు పెంచే విధంగా ఉద్యమాలు చేసి, ఒత్తిడి తెచ్చిన ఘనత ఎమ్మార్పీఎస్ దేనని ఆయన ఉదాహరణలు, పేపర్, ఫోటో, ఆడియో క్లిప్పింగులతో సహా వివరించారు. ఆనాడు దేశంలోనే అత్యంత తక్కువగా, ఈనాడు అత్యంత ఎక్కువగా పెన్షన్లు నిరుపేదలకు అందుతున్నాయంటే దానికి కారణం ఎమ్మార్పీఎస్ అన్నారు. అలాగే ఆనాడు వైఎస్ఆర్ సీఎంగా ఉన్న ఉమ్మడి ఏపీలో పేదలకు ఆరోగ్య బీమా, తర్వాత ఆరోగ్యశ్రీ పథకాన్ని అందించినందునే ఇవ్వాళ ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.10లక్షలు చేతిలో ఉన్నట్లేగాక, ఆ మేరకు ఆరోగ్యం అందే అవకాశం ఏర్పడిందంన్నారు. ఇలాంటి ఉద్యమ చరిత్ర ఉన్న ఎమ్మార్పీఎస్ సెప్టెంబర్ 3న హైదరాబాద్ లో నిర్వహించే భారీ బహిరంగ సభకు లక్షలాదిగా పెన్షన్ దారులంతా తరలి రావాలని మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెన్షన్ దారులతోపాటు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు, మంద కృష్ణ అభిమానులు పాల్గొన్నారు.

Latest News

ముగిసిన యువకుడి అంత్యక్రియలు|PALAKURTHI

పుత్రశోకంలో కన్నతల్లి కన్నీటి వీడ్కోలు ఘన నివాళులు అర్పించిన పాలకుర్తి విధి ఆడిన వింత నాటకంలో ఒక కన్నతల్లికి అంతకన్నా దౌర్భాగ్య స్థితి మరొకటి ఉండదు. కొడుకే లోకమని, తనే తన సర్వస్వమని బతికిన ఆ...

గాలి మోటర్ల.. గా అత్తగారింటికి!?|ADUGU TRENDS

అత్తగారింటికి దారేది? అంటే గాల్లో తేలినట్లు ఏకంగా గాలి మోటర్లనే తీసుకపోయి, సూసెటోల్ల గుండె పేలినట్టు శేసిండో పెండ్లి కొడుకు. గీ మద్దెల పండ్లిల్లకు ఇరగమరగ కర్సు సేత్తాండ్లు. ఎంత ఎక్కువ కర్సు శేస్తే,...

సాగు బాగుకు ఇదే సరైన సమయం!|EDITORIAL

ప్రపంచ రాజకీయ పరిణామాలు, పశ్చిమాసియాలో యుద్ధాలు, అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థను ప్రగాఢంగా ప్రభావితం చేస్తున్నాయి. ఎగుమతులు, దిగుమతులు తీవ్ర అంతరాయానికి గురవుతున్నాయి. ఈ సమయాన్ని భారత్ తన ఆహార భద్రత, వ్యవసాయ రంగాన్ని...

13-03-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి దశమి రాత్రి తెల్ల 05.47 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 01.02 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం వ్యతీపాత ఉదయం 08.53 వరకు ఉపరి వరీయాన్ కరణం వణజి సాయంత్రం...

‘పునర్జన్మ’ ప్రాప్తి…! జీవ ‘కారుణ్య’ విముక్తి!!|ADUGU|SPECIAL STORY

-‘బ్రెయిన్ డెడ్’ కు ‘కామా’, ‘కోమా’కు ‘ఫుల్ స్టాప్’!!!|BRAIN DEAD|COMA జీవితం విచిత్రం. పుట్టుక వరమైతే, మరణం శాపం. అనివార్యం. ఇందుకు ఈ రెండు ఘటనలే నిదర్శనం. బ్రెయిన్ ‘డెడ్’ అయిన మహిళ, ఒక్క...

రూపాయికే బూట్లు!?|ADUGU TRENDS

శిత్తం శివుని మీద.. భక్తి శెప్పుల మీద అన్నరు. గీ సామెతను చపల చిత్తానికి వాడినప్పటికీ, పాదరచ్చలు... మన ఆరోగ్యానికి కూడా రచ్చణే! గందుకే గవాటిని మనం యేసుకుంటం. ఇగ బూట్లైతే పాదాలకు...

‘జల్ జీవన్ మిషన్’ తో నీటి సమస్యలు సమసేనా!?|EDITORIAL

నీటి సమస్య వనరుల లభ్యత, వినియోగ విధానం, దుర్వినియోగం, సమర్థవంతమైన నిర్వహణలపై ఆధారపడింది. గ్రామీణ భారతావనికి ప్రతి ఇంటికి నల్లాల ద్వారా మంచినీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘జల్ జీవన్ మిషన్’...

12-03-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి నవమి రాత్రి తెల్ల 04.10 వరకు ఉపరి దశమి నక్షత్రం మూల రాత్రి 10.51 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం సిద్ది ఉదయం 08.20 వరకు ఉపరి వ్యతీపాత కరణం తైతుల పగలు...

ప్లాస్టిక్ ఇటికెలతోటి ఇల్లు!?|ADUGU TRENDS

గీ అన్న ఇకమతు సూత్తే, బుర్ర గిర్రున తిరుగుతది. ఇగిప్పుడు అంతా ప్లాస్టిక్ మయమే అయింది. పుట్టిన కానుండి, గిట్టేదాక, గా ప్లాస్టిక్ లేకుండ పనైతలేదు. ఎంత ముప్పని శెప్పినా, నీల్ల కానుంచి...

గ్యాస్ ట్రబుల్స్-ప్రత్యామ్నాయ మార్గాలు|EDITORIAL

ప్రపంచంతోపాటు, భారతదేశంలో వంటగ్యాస్‌-ఎల్పీజీ వినియోగం గత రెండు దశాబ్దాల్లో విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు నగరాలకే పరిమితమైన ఈ ఇంధనం ఇప్పుడు గ్రామాలకు కూడా విస్తరించింది. వంట కోసం ఇంధనంగా ఎల్పీజీ వినియోగం పెరగడం...

11-03-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి అష్టమి రాత్రి 02.14 వరకు ఉపరి నవమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 08.20 వరకు ఉపరి మూల యోగం వజ్ర ఉదయం 08.00 వరకు ఉపరి సిద్ది కరణం బాలవ పగలు 01.12...

లైటర్ లేకుండనే గ్యాస్ స్టౌని ఎలిగిచ్చుడు!?|ADUGU TRENDS

ఉపాయాలున్నోడు ఊరేగుతడట. గట్లనే ఉంది గీ పొల్లగాని తెలివి. నిప్పులేందే పొగే గాదుల్లా. మంట గూడ రాదు కదా? మరీ గీయన గా నిప్పునే తెలివిగ ఎలిగిచ్చి గ్యాస్ స్టౌకి మంట పుట్టిచ్చిండు. గా...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News