Monday, March 16, 2026
29.3 C
Hyderabad

పరి‘శ్రమ’ల్లో కార్మికుల భద్రత ఎక్కడ!?|EDITORIAL

పరిశ్రమల్లో తరచూ జరుగుతున్న ప్రమాదాలు ప్రజల్ని కలవర పెడుతున్నాయి. ఒకవైపు పరిశ్రమలకు అపార నష్టం జరుగుతోంది. ఆ నష్టాలను బీమాతో పరిశ్రమలు పూడ్చుకోగలుగుతున్నాయి. కానీ, కార్మికుల మరణాలు అత్యంత దయనీయంగా ఉంటున్నాయి. కార్మికుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అసలు అనేక ప్రమాదాలు వెలుగు చూడటమే తక్కువ. ప్రమాదాలు సంభవించినప్పుడు పరిశ్రమల యాజమాన్యాలు, కార్మిక సంఘాలు కలిసి లోలోన సెటిల్ మెంట్లు చేసేస్తుంటాయి. ఏదో కొద్దిపాటి పరిహారం కార్మికుల కుటుంబాలకు ఇస్తే చాలు. ఆ కార్మిక కుటుంబాలు తమ నష్టాన్ని ఖర్మకు వదిలేసి, తిరిగి అవే పరిశ్రమల్లో పని చేస్తూ, ఏవేవో పాట్లు పడుతూనే ఉన్నాయి. పరిశ్రమల ఏర్పాటు, నిర్వహణలకు సంబంధించిన ప్రభుత్వ నియమ నిబంధనలు, మార్గదర్శకాలు ఉన్నాయి. కానీ, వాటిని పరిశ్రమలు పాటిస్తున్నాయా? పాటించే విధంగా చేయడమెలా? అధికార యంత్రాంగం ఏం చేస్తున్నది? ప్రమాదాలు సంభవించినప్పుడే నానా హంగామా చేసేసి, కేసుల మీద మరో నాలుగు కేసులు పెట్టేసి, చేతులు తడుపుకుని, ఆతర్వాత చేతులు ముడుచుకు, చేష్టలుడిగి కూర్చోవడం వల్లే పరిశ్రమల్లో కార్మిక భద్రత, పని గంటలు, పని భద్రత వంటివన్నీ గాలికి పోతున్నాయి. పరిశ్రమలు లాభాలే తప్ప, కార్మిక సంక్షేమాన్ని పట్టించుకోవడం ఏనాడో మానేశాయి.

పాశమైలారం కార్మికుల పట్ల యమపాశమైంది. ఇవ్వాళ ఒక్క పాశమైలారంలోనే కాదు. దేశమంతా ఇదే దుస్థితి నెలకొంది. ప్రధానంగా ప్రమాదం జరిగినప్పుడే హడావుడి చేస్తున్న ప్రభుత్వాలు, అధికారులు, సమస్య సద్దుమణిగాక పట్టించుకోవడం లేదు. సధారణంగా పరిశ్రమల్లో జరిగే ప్రమాదాల్లో ఎంతమంది మరణించారో కూడా లెక్కలు తెలియని అయోమయం ఉంది. భారీ పరిశ్రమలలో రెగ్యులర్‌గా సేప్టీ ఆడిట్‌ అనేది జరగడం లేదు. పని పరిస్థితులను మెరుగుపరచే చర్యలు లేవు. పారిశ్రామిక వాడల్లో వంద పడకల బర్న్స్‌ వార్డులతో కూడిన హాస్పిటల్స్ ఉండాలి. అవి ఎక్కడా లేవు. ప్రతి నెలా పరిశ్రమల్లో తనిఖీలు నిర్వహించి, భద్రతా ప్రమాణాలు పాటించేలా చర్యలు చేపట్టాలి.

తెలంగాణ చరిత్రలో అతి పెద్ద పారిశ్రామిక ప్రమాదంగా సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ ఇండిస్ట్రీస్‌ లిమిటెడ్‌ దుర్ఘటన నిలిచిపోయింది. ఇప్పటికి 40 కి పైగా మంది కార్మికులు మరణించగా, మరో 37 మంది తీవ్రంగా గాయపడినట్టు గుర్తించారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న 147 మందిలో మిగిలిన వారి కోసం రెండు రోజులుగా గాలింపు కొనసాగుతూనే ఉంది. కొందరి గుర్తింపు భారంగా మారింది. డిఎన్‌ఎ టెస్టులు కూడా కష్టంగానే మారాయి. బూడిదకుప్పల నుంచి డిఎన్‌ఎ టెస్టు చేయడం సాధ్యం కావడం లేదని తెలుస్తోంది. ప్రభుత్వాల, అధికారుల, పరిశ్రమ యాజమాన్యాల నిర్లక్ష్య నిర్వాక ఫలితమే హైదరాబాద్‌ శివారు ఔషధ పరిశ్రమలో చోటు చేసుకున్న భారీ విస్ఫోటనం. హైదరాబాద్‌ శివారులోని పరిశ్రమల్లోనే గత రెండు మూడు నెలల్లో నాలుగైదు ప్రమాదాలు జరిగాయి.

ఆంధ్రప్రదేశ్‌ కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. విశాఖలో 2020 నాటి ఎల్‌జి పాలిమర్స్‌ ప్రమాదం 12 మంది కార్మికులను బలిగొంటే, చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ విషతుల్యంగా మార్చి, వందలమందిని హాస్పిటల్స్ పాలు చేసింది. ఆ తరువాత అచ్యుతాపురం సెజ్‌లో 2022 జూన్‌, ఆగస్టులో 500 మందికిపైగా మహిళలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ ప్రమాదంపై నివేదిక అమలు మాట అటుంచి వెలుగు చూసిన పాపానే పోలేదు. గత ఏడాది అచ్యుతాపురం సెజ్‌ ఎసెన్షియా ఫార్మాలోనే 17 మంది మరణించగా, 38 మంది గాయపడ్డారు. ఈ ఏడాది ఆరు నెలల్లోనే అనకాపల్లి జిల్లాలో జరిగిన 11 ప్రమాదాల్లో ఐదుగురు మరణించగా, ఎనిమిదిమంది తీవ్ర గాయాలతో మంచంపట్టారు. పరవాడ ఫార్మాసిటీలో గత ఏడాది విషవాయువుల లీకేజీ సహా పలు ప్రమాదాల్లో 10 మంది మరణించగా, 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణాలకు తెగించి ప్రాణాంతక పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల పక్షాన నిలవకుండా, లాభం కోసం భద్రతను గాలికొదిలేసి ప్రాణాలను బలిగొంటున్న పరిశ్రమల అధిపతుల పక్షాన కేంద్ర, రాష్ట్ర పాలకులు నిలవడం మరింత విషాదం.

దేశవ్యాప్తంగా పారిశ్రామిక ప్రమాదాల్లో రోజూ కనీసం ముగ్గురు కార్మికులు మరణిస్తున్నారు. తనిఖీలను తగ్గించి, స్వీయ ధ్రువీకరణలను అనుమతించడం ద్వారా భద్రతాపరమైన నియంత్రణలను బలహీనపరచడమే భారీ ప్రమాదాలకు కారణమన్న అంతర్జాతీయ కార్మిక సంస్థ హెచ్చరికలను ఇప్పటికైనా గుర్తించి, కఠిన చర్యలకు ఉపక్రమించాలి.

ఇక పారిశ్రామిక యాజమాన్యాలు అత్యాశతో రసాయన, ఔషధ పరిశ్రమలు సహా వివిధ పరిశ్రమల్లో అత్యంత కీలకమైన స్థానాల్లో అతి తక్కువ వేతనాలకు పనిచేసే తగిన నైపుణ్యం, విద్యార్హత లేని వారిని, ఇతర రాష్టాల్ర వారిని కాంట్రాక్ట్‌, డైలీవేజ్‌ ప్రాతిపదికన నియమిస్తున్నాయి. కాలం చెల్లిన రియాక్టర్లు, యంత్రాలను వినియోగించడం తోపాటు వాటికి దగ్గరగా వెల్డింగ్‌, షోల్డరింగ్‌ చేయడం, యంత్రాలు, వాల్వులపై పర్యవేక్షణ లేకపోవడం, సిబ్బందికి భద్రతాపరమైన పరికరాలు, తగిన శిక్షణ ఇవ్వకపోవడం, భద్రతా తనిఖీలు జరగకపోవడం పలు రసాయనాలను దగ్గరగా నిల్వచేయడం తదితర కారణాల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని పలు నివేదికలు ఘోషిస్తు న్నాయి. కార్మిక చట్టాలను నాలుగు లేబర్‌ కోడ్‌లుగా మార్చేసి, తమకు జరిగిన అన్యాయాన్ని, యాజమాన్యాల దుర్మార్గాన్ని ప్రశ్నించలేని స్థితికి కార్మికులను నెట్టేసిన తీరు పాలకుల నిరంకుశ విధానాలకు నిదర్శనం. కార్పొరేట్లకు కొమ్ముకాయడం మాని, సేప్టీ వర్క్‌ లాంటి కార్మిక అనుకూల నినాదాలను తీసుకోవడం తక్షణ అవసరం. కార్మికుల సంక్షేమం ద్వారానే సంస్థలు బలపడాలి తప్ప, కార్మికులను పొట్టన పెట్టుకుని ముందుకు సాగాలన్న విధానాలకు పాతరేయాలి. ముందుగా తెలంగాణ, ఎపిల్లో ఉన్న పారిశ్రామిక వాడల్లో ఎమర్జెన్సీ సేఫ్టీ ఆడిటింగ్‌ చేపట్టాలి. ఆయా పరిశ్రమల్లో నాణ్యతాపరమైన, భద్రతాపరమైన ఏర్పాట్లు ఉన్నాయా లేదా అన్నది విశ్లేషించాలి. అప్పుడే ప్రమాదాలకు అడ్డుకట్ట వేయగలం.
……

Latest News

16-03-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి ద్వాదశి ఉదయం 07.43 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం ధనిష్ఠ రాత్రి తెల్ల 05.09 వరకు ఉపరి శతభిషం యోగం శివ ఉదయం 08.15 వరకు ఉపరి సిద్ద కరణం తైతుల ఉదయం...

ఇంట, వంట, పంట, పయానం అన్నీ గా ట్రాక్టరే!?|ADUGU TRENDS

ఉపాయం లేనోన్ని ఊల్లెనే ఉండనీయొద్దట! గందుకే ఉపాయమున్న గీయినె, ఊల్లు తిరుగుతాండు!! ఊల్లు తిరుగుడంటే, ఊల్లు పట్టుకుని తిరుగుతాండని కాదుల్లా... ఇట్టమైన ఊల్లని ఏ కట్టం లేకుండా తిరుగుతాండు. గదెట్లంటరా? ఇగో మీరే...

బడ్జెట్ : ప్రజాకాంక్షలను ప్రతిబింబించేనా!?|EDITORIAL

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు రాష్ట్ర రాజకీయ వర్గాలనేగాక, సాధారణ ప్రజల్లో కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రాష్ట్రంలోని రైతులు, ఉద్యోగులు,...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

మార్చి 15 నుండి మార్చి 21 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి పనుల్లో కొంత ఒత్తిడి ఉన్నా చివరికి మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఉద్యోగంలో మీ...

ఈవీలేవీ? ఈవీలపై క్లారిటీలేవీ?|EV|TELANGANA|CM|GOVERNMENT

మొన్న సీఎం|CM|REVANTH REDDY, నిన్న డిప్యూటీ సీఎం|DEPUTY CM|BHATTI VIKRAMARKA MALLU ప్రకటనల సారాంశమేంటి?|SUMMARY ప్రస్తుత వాహనాలనేం చేస్తారు?|OLD VEHICLES కొత్తవి సరే, పాతవాటి పరిస్థితేంటి? ఇప్పటికే తుప్పుపట్టిన వాహనాల సంగతేంటి? ఇం‘ధన’ ఖర్చు తగ్గించడానికి వేల కోట్ల వ్యయమా? ఉన్న...

ఎలుకలు రాకుండ అదిరే శిట్కా!?|ADUGU TRENDS

ఎలుక సొర్రిందని ఇల్లు తగుల బెట్టుకుంటమా? ఏంది? యెట్లన్న శేసి గా ఎలుకను బయిటికి తోలుతం. ఇల్లును మాత్రం మంచిగ కాపాడుకుంటం. మరైతే ఇంట్లకు ఎలుకలు రాకుండ ఏం శేయాల్నో, ఎట్లెట్ల శేయాల్నో...

రాహుల్ పరిపక్వ విపక్ష నేతేనా!?|EDITORIAL

భారత రాజకీయాల్లో విపక్ష నాయకత్వం ఎప్పుడూ ప్రజాస్వామ్య పరిరక్షణకు అత్యంత కీలకం. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, విధానాలను సమీక్షించడం, ప్రత్యామ్నాయ మార్గాలను చూపడం, అవసరమైన సూచనలు చేయడం, తద్వారా ప్రభుత్వాన్ని గాడిలో పెట్టడం విపక్షం...

14-03-2026, శనివారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి ఏకాదశి పూర్తిగ రోజంత నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 02.53 వరకు ఉపరి శ్రవణ యోగం వరీయాన్ ఉదయం 09.01 వరకు ఉపరి పరిఘ కరణం బవ సాయంత్రం 06.24 వరకు ఉపరి బాలవ రాహుకాలం...

ముగిసిన యువకుడి అంత్యక్రియలు|PALAKURTHI

పుత్రశోకంలో కన్నతల్లి కన్నీటి వీడ్కోలు ఘన నివాళులు అర్పించిన పాలకుర్తి విధి ఆడిన వింత నాటకంలో ఒక కన్నతల్లికి అంతకన్నా దౌర్భాగ్య స్థితి మరొకటి ఉండదు. కొడుకే లోకమని, తనే తన సర్వస్వమని బతికిన ఆ...

గాలి మోటర్ల.. గా అత్తగారింటికి!?|ADUGU TRENDS

అత్తగారింటికి దారేది? అంటే గాల్లో తేలినట్లు ఏకంగా గాలి మోటర్లనే తీసుకపోయి, సూసెటోల్ల గుండె పేలినట్టు శేసిండో పెండ్లి కొడుకు. గీ మద్దెల పండ్లిల్లకు ఇరగమరగ కర్సు సేత్తాండ్లు. ఎంత ఎక్కువ కర్సు శేస్తే,...

సాగు బాగుకు ఇదే సరైన సమయం!|EDITORIAL

ప్రపంచ రాజకీయ పరిణామాలు, పశ్చిమాసియాలో యుద్ధాలు, అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థను ప్రగాఢంగా ప్రభావితం చేస్తున్నాయి. ఎగుమతులు, దిగుమతులు తీవ్ర అంతరాయానికి గురవుతున్నాయి. ఈ సమయాన్ని భారత్ తన ఆహార భద్రత, వ్యవసాయ రంగాన్ని...

13-03-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి దశమి రాత్రి తెల్ల 05.47 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 01.02 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం వ్యతీపాత ఉదయం 08.53 వరకు ఉపరి వరీయాన్ కరణం వణజి సాయంత్రం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News