Friday, July 17, 2026
26.4 C
Hyderabad

ఒక యుద్ధం ముగిసింది!|EDITORIAL

ఇది యుద్ధాల కాలంగా మారింది. ఎవరు ఎప్పుడు ఎవరిపై, ఏ దేశం మరే దేశంపై ఎప్పుడు దాడి చేస్తుందో తలియని కాలమిది. గత నాలుగైదేళ్లుగా ఉక్రెయిన్‌ రష్యాల మధ్య ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇజ్రాయెల్‌ పాలస్తీనా మధ్య యుద్ధం నిరంతరంగా చూస్తూనే ఉన్నాం. భారత్‌లో ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా భారత్‌ పాక్‌లోని ఉగ్రస్థావరాలపై దాడి చేసింది. ప్రతిగా పాక్‌ ఇండియాపై దాడికి తెగించింది. పాక్ పప్పులుడకలేదు. దిక్కుతోచని పాక్‌ కాళ్ల బేరానికి వచ్చింది. యుద్ధం ఆపాలన్న వినతిపై మరోమాట లేకుండా భారత్‌ కాల్పుల విరమణకు అంగీకరించింది. 12 రోజుల క్రితం ఇజ్రాయెల్‌ ఇరాన్‌పై దాడి చేసింది. ఇరాన్‌ కూడా ప్రతిదాడులతో తిరగబడింది. చివరకు అమెరికా కూడా రణరంగానికి దిగి ఇరాన్‌పై విరుచుకు పడింది. చివరకు ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. భారత్-పాక్ యుద్ధాన్ని తానే ఆపించానని ప్రగల్భాలు పలికిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధాన్ని కూడా తానే ఆపాలని కోరినట్లుగా ప్రకటించుకున్నారు. ప్రత్యక్షంగా యుద్ధానికి దిగి, ఇరాన్ దాడి చేసే సరికి తోకముడిచి, తానేదో శాంతికాముకుడినైనట్లు ట్రంప్ పోజు కొడుతున్నాడు.

ఏమైనప్పటికీ పశ్చిమాసియాలో ఒక యద్ధం ముగిసింది. లేదంటే ఇప్పటికే సంక్షోభంలో కూరుకుపోయిన ప్రపంచ చమురు, ఆర్థిక వ్యవస్థ పెను సంక్షోభానికి గురయ్యేది. ఆయుధ సంపత్తి కలిగిన దేశాలు తమ ఆయుధాలను పరీక్షించుకోవడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఉక్రెయిన్ మాదేనంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తాజాగా ప్రకటన చేశారు. నిజానికి ఆయా దేశాల నేతల యుద్ధ కాంక్షల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. వెనుకటికి రాజులు కూడా ఇలాగే యుద్ధాలు చేసి రాజ్యవిస్తరణకు పాల్పడేవారు. ఇప్పుడు మరో రూపంలో సామ్రాజ్యవాదం కొనసాగుతోంది. తమ ఆధిపత్యాన్ని అంగీకరించడం లేదన్న కారణంతో ఉక్రెయిన్‌పై రష్యా దాడికి తెగించింది. ఇరాన్‌ అణ్వస్త్ర ప్రయోగాలు చేస్తోందన్న కారణంతో ఇజ్రాయిల్‌, అమెరికాలు దాడికి తెగించాయి. ఈ దాడలతో ఇరాన్‌కు జరగాల్సిన నష్టం జరిగింది. అయితే పెద్దన్న పాత్రను పదిలపర్చుకోవాలన్న అమెరికా ఈ తరహా దాడులను ప్రోత్సహించడం సరికాదు. సాగినంత కాలం సరే, తర్వాత? యుద్ధ ప్రభావాలు బలహీన దేశాలపైనే కాదు, బలమైన దేశాలపై కూడా ఉంటాయి. ఇజ్రాయెల్‌-ఇరాన్‌ యుద్ధంలో, పరోక్షంగా అన్నీతానై ఇజ్రాయెల్‌తో కథ నడిపించిన అమెరికా, చివరకు ప్రత్యక్షంగా కూడా యుద్ధానికి దిగింది. ఇరాన్ పై దాడులకు తెగబడింది. ఇరాన్ ఎదురు తిరిగింది. తిరిగి కతార్ లోని అమెరికా స్థావరాలపై దాడులకు దిగే సరికి తోకముడిచి శాంతి జపం చేస్తోంది. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో తనను తాను యుద్ధ వ్యతిరేకిగా ప్రచారం చేసుకున్న ట్రంప్‌ స్వయంగా కయ్యానికి కాలు దువ్వాడు. చివరకు యుద్ధాన్ని ముగిస్తున్నట్లుగా ప్రకటించారు.

అమెరికా నిరంతరం యుద్ధాల్లో మునిగితేలడంతో ప్రపంచంలో అశాంతి చెలరేగిందంటూ ఆరోపిస్తూ వచ్చిన ట్రంప్‌ , తాను అధికారంలోకి రాగానే అన్ని యుద్ధాలనీ ఆపేసి ప్రపంచానికి శాంతినిస్తానన్నాడు. ఆర్నెల్ల కాలంలోనే ఆయన తన అసలు రంగును బయటపెట్టుకున్నాడు. ఆదివారం తెల్లవారుజామున ఏడు బి2 స్పిరిట్‌ బాంబర్లు ఇరాన్‌లోకి ప్రవేశించి, మూడు అణుస్థావరాలవిూద బంకర్‌ బస్టర్‌ బాంబులు కురిపించాయి. ఇజ్రాయెల్‌ చేద్దామనుకున్న పనిని తానే స్వయంగా పూర్తిచేశారు. ఫర్దో, నతాంజ్‌ పాటు, శుద్ధి చేసిన యురేనియంను భారీ ఎత్తున నిల్వచేసిన ఇసఫహాన్‌ అణుకేంద్రాన్ని నాశనం చేయడానికి అదనంగా సబ్‌మెరైన్ల నుంచి ప్రయోగించిన టామాహాక్‌ క్రూయిజ్‌ మిసైళ్ళను ఉపయోగించారని వార్తలు వచ్చాయి. బీటూ బాంబర్లు, వందలాది యుద్ధవిమానాలు, సబ్‌మెరైన్లతో సహా సర్వ శక్తులనూ వాడి అమెరికా జరిపిన ఈ దాడిలో ఇరాన్‌ అణు స్థావరాలు ధ్వంసమైపోయాయి. పూర్తిగా, సమూలంగా వాటిని తుడిచిపెట్టేసినట్టు ట్రంప్‌ ప్రకటించాడు. చివరకు ఫలితం తేలింది కనుక యుద్ధం ముగిస్తున్నట్లు ప్రకటించాడు. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం ఎన్‌పిటీలో భాగస్వామి కాకుండా, భారీగా అణ్వాయుధాలు పోగేసుకున్న ఇజ్రాయెల్‌, ఆ ఒప్పందం మీద సంతకం చేసిన ఇరాన్‌ దగ్గర అణ్వాయుధాలు పోగుబడివున్నాయన్న ఆరోపణతో, ఇరాన్‌ను నిరాయుధం చేయడమే తన లక్ష్యంగా ప్రకటించి జూన్‌ 13న ఈ యుద్ధంలోకి దిగింది. కదనరంగంలోకి అమెరికా ప్రత్యక్ష ప్రవేశంతో ఆ మూడు అణుకేంద్రాలను నాశనం చేయడమనే లక్ష్యం పరిపూర్ణమైంది. అందుకే వెంటనే యుద్ధం ఆగిపోవాలి. ప్రపంచం ఇక కంటినిండా నిద్రపోవచ్చునని ప్రకటించి యుద్ధ విరమణను ప్రకటించేశాడు. అణుస్థావరాల నాశనంతో ఇరాన్‌ కాళ్ళబేరానికి వస్తుందని ట్రంప్‌ నమ్ముతున్నారు. శాంతిచర్చలకు, ఒప్పందాలకు కాలం చెల్లిందని, ఇక ప్రతీకారమే మిగిలిందని ప్రకటించిన ఇరాన్‌ కూడా శాంతిని కోరుకుంటూ యుద్ధ విరమణకు ముందుకు రావడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఎందుకంటే ఇందులో ఎవరు పట్టుదలకు పోయినా మారణహోమం తప్పదు. ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌ హెచ్చిరించినా ఆపని చేసే శక్తి లేదనే చెప్పాలి. దోహాలో ఉన్న అమెరికా స్థావరంపై దాడి చేసినా అది కూడా నామమాత్రమనే చెప్పుకోవాలి. ఇరాన్‌కు అత్యంత సమీపంలోనే అది గట్టిగా దెబ్బతీయగల దూరంలోనే అమెరికా స్థావరాలు అనేకం ఉన్నాయి. అయినా సాహసం చేయలేకపోయింది.

హర్ముజ్‌ జలసంధి మూతబడే ప్రమాదం ఉందంటూ వార్తలు రావడంతో స్టాక్‌మార్కెట్లు తలకిందులయ్యాయి. చమురుధరలు అమాంతంగా పెరిగాయి. ఇరాన్‌కు మాట సాయం చేస్తున్న దేశాలు ఆయుధాలతో ఆదుకుంటాయన్న నమ్మకం లేకుండా పోయింది. ప్రపంచానికి ఇంధనాన్ని సమకూర్చే ఈ కీలకమైన ప్రాంతం యుద్ధ జ్వాలల్లో కొనసాగడం సరికాదు. ఇదే ప్రపంచ దేశాలూ కోరుకున్నాయి. దీంతో ఎట్టకేలకు యుద్ధం ముగిసిందన్న ప్రకటన ప్రపంచ దేశాలకు ఊరటనిచ్చింది.

Latest News

కరువు కోరలు!|Fangs of drought

ఇప్పటికి 33శాతమే వర్షం నమోదు!! రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రం అడుగంటుతున్న జలాశయాలు జీవ నదుల్లోనూ జల జీవమే లేదు రిజర్వాయర్లలోనూ ఇదే పరిస్థితి సాగుకు తొందరొద్దంటున్న నిపుణులు ప్రత్యామ్నాయ పంటలపై కార్యాచరణ 20వ తేదీ తర్వాత పత్తి విత్తనాలేయొద్దు బోరుబావుల కింద వరి...

మొక్క నాటుండ్రి.. డిస్కౌంట్లు పొందుండ్రి!?|ADUGU TRENDS

పర్యావరణానికి మూలం మొక్కే. గా మొక్కే చెట్టై, మహా మానై మనల్ని రచ్చిత్తది. గీ భూమి, వాతావరణం మొత్తం గా మొక్కల మీదనే ఆధారపడ్డది. కనీ, మనమేం చేత్తానం? ఏడికాడికి శెట్లని తెగ...

‘ఢీ’లిమిటేషన్ రాజకీయాలు!?|EDITORIAL

డీలిమిటేషన్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ సంస్కరణలలో ఒకటిగా నిలవనుంది. ఇది కేవలం సీట్ల సంఖ్య మార్చే ప్రక్రియ కాదు, భవిష్యత్ రాజకీయ ప్రాబల్య సమీకరణాలను నిర్ణయించే కీలక ఘట్టం....

జూలై 17, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం దక్షిణాయణం ప్రారంభం తిధి తదియ ఉదయం 09.54 వరకు ఉపరి చవితి నక్షత్రం మఖ రాత్రి 10.51 వరకు ఉపరి పుబ్బ యోగం సిద్ది ఉదయం 05.00 వరకు ఉపరి వ్యతీపాత కరణం గరజి ఉదయం 09.54...

సింధు నాగరికత|ADUGU|SPECIAL|COMPITITIVE|EXAMS

నాగరికత మరియు సంస్కృతికి తేడా నాగరికత పూర్తిగా అభివృద్ధి చెందిన మరియు ఉన్నతమైన జీవనాన్ని గడిపినట్లయితే మరియు ప్రజలు పట్టణ, శాస్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రణాళికాబద్ధంగా ఉంటే దానిని నాగరికత అంటారు. సంస్కృతి సంస్కృతి అనేది ప్రతీ ఒక్కరికీ...

‘ప్రభంజన’ పథం ప్రజ్వరిల్లాలి|ESSAY|SPECIAL

జూలై 16, 2025. సరిగ్గా ఏడాది క్రితం జర్నలిస్టు, వక్త, కవి, రచయిత, మేధావి, అభ్యుదయవాది, వివేకశీలి, చైతన్యవంతుడు, నిరంతర పోరాట శీలి అయిన ప్రొఫెసర్ యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ పరమపదించారు....

రోడ్లకు కూడా ఆపరేషన్లు!?|ADUGU TRENDS

గిప్పటి దాకా మనం మనుసులకు, జంతువులకు ఆపరేషన్లు సేసుడే సూసినం. కనీ, గీ యింతను ఎక్కడా సూడలే.! గా బిహార్ రాస్ట్రంల కొత్తగ, ఎక్కడా లేని లెక్కల, రోడ్లకు కూడా ఆపరేషన్లు సేత్తాండ్రు....

నదుల అనుసంధానమే జల భద్రతకు శాశ్వత మార్గం!|EDITORIAL

ఎల్‌నినో ప్రభావాన్ని ఆపడం మన చేతుల్లో లేదు. కానీ, దాని వల్ల కలిగే నష్టాన్ని శాస్త్రీయ ప్రణాళికలు, సమర్థమైన జల నిర్వహణ, నదుల అనుసంధానం, నీటి సంరక్షణ, వాతావరణ అనుకూల వ్యవసాయం ద్వారా...

జూలై 16, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం పూరి జగన్నాధ రధోత్సవం తిధి శు విదియ ఉదయం 11.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఆశ్లేష రాత్రి 11.40 వరకు ఉపరి మఖ యోగం వజ్ర ఉదయం 08.20 వరకు ఉపరి సిద్ది కరణం కౌలవ...

ఆషాఢమాసం రహస్యాలు|ASHADAM|SECRETS

ఆచారాలు, శాస్త్రం, సంప్రదాయాల వెనుక నిజాలు ఆషాఢమాసం విశేషాలు – ఆధ్యాత్మికత, ప్రకృతి, సంప్రదాయాలు, కుటుంబ బంధాల వెనుక అసలు కథ ప్రతి ఆచారం వెనుక ఒక అర్థం... ప్రతి సంప్రదాయం వెనుక ఒక జీవన...

ఉడుతా మిడతా!?|ADUGU TRENDS

మనం మన సుట్టుముట్టు ఉడుతల్ని సూత్తనే ఉంటం. పొలాలల్ల, రోడ్ల మీద అటిటుపోతనే ఉంటయి. సిడెం సేపట్లనే కనబడ్తయి, ఆడ్తయి. ఉరుకుతయి. ఎన్కట గా రాముడికి వారధి కట్టుట్ల గీ ఉడుత సాయం...

ఓటర్ల సవరణకు శాశ్వత పరిష్కారం లేదా!?|EDITORIAL

గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు, పట్టణాల్లో వార్డు కార్యాలయాలు, మీ సేవ వంటి పౌర సేవా కేంద్రాలను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తే ప్రజలకు సౌలభ్యం పెరుగుతుంది. బీఎల్‌వోలపై పూర్తిగా ఆధారపడకుండా బహుళస్థాయి ధ్రువీకరణ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News