Friday, April 24, 2026
37.2 C
Hyderabad

హార్ముజ్ జలసంధి ఆర్థిక సంక్షోభంలో ప్రపంచం!|EDITORIAL

ఇరాన్–అమెరికా–ఇజ్రాయిల్ మధ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అనిశ్చితి అంచులపై నిలిపింది. ఇది కేవలం యుద్ధ దేశాలకే పరిమితం కాదు. ప్రపంచ ఇంధన భద్రతకు కీలక నాడి హార్ముజ్ జలసంధి చుట్టూ ముప్పు ముసురుకుంది. ఇది అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు పెను హెచ్చరికగా మారింది. ఈ జలసంధి మూసివేయడంతో చమురు సరఫరా నిలిచిపోయింది. సరఫరా తగ్గితే ధరలు పెరగడం, ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం పెరుగడం, ద్రవ్యోల్బణం పెరిగితే కొనుగోలు శక్తి తగ్గడం, ప్రజల జీవన వ్యయం మరింత భారమవడం అనివార్యం.

ప్రపంచ రోజువారీ చమురు వినియోగంలో 20% హార్మూజ్ జలసంధి నుంచే సరఫరా అవుతోంది. ఈ మార్గం ద్వారా జరిగే చమురు ఎగుమతుల్లో 82% ఆసియాకు వెళ్తున్నాయి. ఇందులో భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా వాటా 67%గా ఉంది. భారత్ ముడి చమురులో 90% మిడిల్ ఈస్ట్ దేశాల నుంచే వస్తోంది. అందులోనూ గణనీయంగా గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఖతార్ ల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇందులో 40% హార్మూజ్ జలసంధి నుంచే వస్తున్నాయి.
ప్రపంచ వాణిజ్యాన్ని పర్యవేక్షించే సంస్థ ’కెప్లర్’ గణాంకాల ప్రకారం, ఫిబ్రవరి 24 నాటికి రోజుకు 2.6 మిలియన్ బ్యారెళ్ల చమురు హార్ముజ్ మార్గం ద్వారా భారతదేశానికి చేరేది. అమెరికా దాడుల నేపథ్యంలో ప్రపంచ చమురు ధరలు బ్యారెల్‌కు 72.87 డాలర్లకు పెరిగాయి. ఒకే రోజులో 6 డాలర్లు పెరిగాయి.

బ్యారెల్‌కు రూ.10 పెరిగితే, మనదేశ దిగుమతులపై 140 బిలియన్ డాలర్లు అంటే రూ.1.27 లక్షల కోట్లు అదనంగా చెల్లించాల్సి వస్తుందని అంచనా. ఇది మన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తోంది. ఇప్పటికే ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రూపాయి మారకం విలువ తగ్గడం వంటి ఒత్తిళ్ళలో ఉన్న తరుణంలో చమురు ధరల పెరుగుదల మరింత సంక్లిష్టతను తీసుకువస్తుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ద్వారా రవాణా వ్యయం పెరుగుతుంది. ఆహార పదార్థాల నుంచి పరిశ్రమల ఉత్పత్తుల వరకు మొత్తం జీవన ప్రక్రియకు వ్యాపిస్తుంది.

దేశం వద్ద 70–75 రోజుల వినియోగానికి సరిపడా చమురు నిల్వలు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో నిల్వ చేసిన వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు తాత్కాలిక ఉపశమనాన్ని కల్పిస్తాయి. అదనంగా, రష్యా వంటి ప్రత్యామ్నాయ వనరుల నుంచి సరఫరా కొనసాగుతున్నది. ఇవి తాత్కాలిక రక్షణ మాత్రమే. హార్ముజ్ మార్గం దీర్ఘకాలం మూతపడితే, నిల్వలు క్రమంగా ఖాళీ అవుతాయి. ధరల ఒత్తిడి పెరుగుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో కొనుగోలు పోటీ తీవ్రమవుతుంది.

అమెరికా, ఇరాన్, రష్యా, గల్ఫ్ దేశాలతో సంబంధాలను సమన్వయం చేసుకోవడం అవసరం. తటస్థ వైఖరితో జాతీయ ప్రయోజనాలను రక్షించుకోవడం కీలకం. ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి దేశాల నుంచి దిగుమతులను పెంచడం, పునరుత్పాదక ఇంధనాలపై దృష్టి సారించడం, విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడం వంటి చర్యలు మాత్రమే భవిష్యత్ సంక్షోభాలను తగ్గించగలవు.

ప్రస్తుత పరిస్థితి యుద్ధం మరింత విస్తరించే సంకేతాలు ఇస్తోంది. లెబనాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, గల్ఫ్ లో మిస్సైల్ హెచ్చరికలు, అంతర్జాతీయ నౌకాశ్రయాలపై భద్రతా ఆందోళనలు ప్రపంచానికి అప్రమత్త సంకేతాలే. ఈ సంక్షోభం త్వరగా చల్లారకపోతే, ఇది కేవలం ప్రాంతీయ యుద్ధం కాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపే పరిణామంగా మారే ప్రమాదం ఉంది.

హార్ముజ్ జలసంధి చుట్టూ ఏర్పడిన ఈ సంక్షోభం భారత్‌కు కఠిన పరీక్ష. దీర్ఘకాలంలో ఇంధన భద్రతను పటిష్ఠం చేయడం తప్పనిసరి. సమయోచిత వ్యూహం, చురుకైన రాజనీతి చర్యలు, ప్రత్యామ్నాయ ఇంధనాల ప్రోత్సాహం ఈ సంక్షోభం నుంచి భారత్‌ను రక్షించగల మార్గాలు.

Latest News

ఏయేయి ఎప్పుడు కొనాల్నో తెలుసా!?|ADUGU TRENDS

మనకు అవసరం ఉన్నప్పుడే యే వస్తువునైనా కొంటం. ఎప్పుడు పడితే గప్పుడు గా వస్తువలను కొంటే ఎక్కువ ధర పడ్తయి. ఇగ తక్కువ ధరకే గవాట్ని కొనాల్నంటే గవాటి సీజన్లను బట్టి గాకుండ,...

ప్రయాణ ప్రగతి రథ చక్రంపై ప్రభుత్వ నిర్లక్ష్యం!|EDITORIAL

ఎన్నికల రాజకీయాల్లో హామీలు ఇవ్వడం సహజం. కానీ ఆ హామీల అమలు విషయంలో నిర్లక్ష్యం ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరం. హామీలివ్వడం, గాలికి వదిలేయడం.. తెలంగాణలో గత కొన్నేళ్లుగా ఇదే ధోరణి పునరావృతమవుతోంది. అధికారంలోకి...

24-04-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం తిధి శు అష్టమి రాత్రి 11.34 వరకు ఉపరి నవమి నక్షత్రం పుష్యమి రాత్రి 12.18 వరకు ఉపరి ఆశ్లేష యోగం ధృతి ఉదయం 07.51 వరకు ఉపరి శూల కరణం భద్ర మధ్యాహ్నం...

ఖరీదైన కారుతోటే గా రోడ్డును బాగుశేసిండు!?|ADUGU TRENDS

మనసుంటే మార్గమున్నట్లే గద! మరి గా మార్గమే బాగా లేకపోతే? ఒకాయినె గా బాగా లేని రోడ్డును కోట్ల యిలువ శేసే ఖరీదైన కారుతోటి ఎట్ల బాగు శేసిండో సూడుండ్రి? బెంగళూరులో ఒకాయినె రోజూ...

ఒకటి ఒకటి ఒకటి! రెండు రెండు రెండు!!|EDITORIAL

దేశంలో ప్రతి ఏటా కోటిన్నర మంది విద్యార్థులు పది, ఇంటర్ వంటి కీలక పరీక్షలకు హాజరవుతున్నారు. వీళ్ళంతా ర్యాంకుల పోటీలో చిక్కుకుని తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికల...

23-04-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం తిధి శు సప్తమి రాత్రి 01.32 వరకు ఉపరి అష్టమి నక్షత్రం పునర్వసు రాత్రి 01.30 వరకు ఉపరి పుష్యమి యోగం సుకర్మ ఉదయం 10.41 వరకు ఉపరి ధృతి కరణం గరజి మధ్యాహ్నం...

గా కార్ బిల్డింగును సూద్దాం పాండ్రి!?|ADUGU TRENDS

ఒక్కొక్కలు ఒక్కో రకం. ఒక్కొక్కలిది ఒక్కో టేస్టు. ఎవ్వలిట్టం వాల్లది. గా హైదరాబాద్ పట్నంల ఫిష్ హౌజ్, రెడ్ బిల్డింగ్ వంటి ల్యాండ్ మార్క్ లను సూసినం. శేప ఆకారంలనే గా సర్కార్...

మండుటెండల గుణ‘పాఠాలు’! |EDITORIAL

ఈ ఏడాది వేసవి తీవ్రత అసాధారణ స్థాయికి చేరుకుంది. ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగి, వర్షపాతం తగ్గే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరికలు చేసినప్పటికీ, వాటి నివారణకు చర్యలు...

22-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 06.05 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఆరుద్ర రాత్రి తెల్ల 02.55 వరకు ఉపరి పునర్వసు యోగం అతిగండ మధ్యాహ్నం 01.40 వరకు ఉపరి సుకర్మ కరణం బాలవ...

గోడలకు గట్టిగ నీల్లు గొట్టే శిట్కా!?|ADUGU TRENDS

పెండ్లి శేసి సూడు... ఇల్లు కట్టి సూడన్నరు. గివి రెండు శేసుడు అంత వీజీ కాదన్నట్లు. గందుకే పండ్లి అన్నా, ఇల్లన్నా కనా కట్టమన్నట్లు. గట్లనే ఇల్లు కట్టాల్నంటే గా ముగ్గు పోసి...

కవిత పార్టీతో బీఆర్‌ఎస్‌కు లాభమా? నష్టమా?|EDITORIAL

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి వేదిక సిద్ధమవుతోంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ ప్రకటించబోతున్నట్లు వస్తున్న సమాచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రకటన కేవలం కొత్త...

21-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం శ్రీ ఆదిశంకరాచార్య జయంతి తిధి శు చవితి ఉదయం 08.31 వరకు ఉపరి పంచమి నక్షత్రం రోహిణి ఉదయం 06.14 వరకు ఉపరి మృగశిర యోగం శోభ సాయంత్రం 04.45 వరకు ఉపరి అతిగండ కరణం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News