Friday, April 24, 2026
37.2 C
Hyderabad

మండుటెండల గుణ‘పాఠాలు’! |EDITORIAL

ఈ ఏడాది వేసవి తీవ్రత అసాధారణ స్థాయికి చేరుకుంది. ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగి, వర్షపాతం తగ్గే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరికలు చేసినప్పటికీ, వాటి నివారణకు చర్యలు చేపట్టడంలో పాలకులు విఫలమవుతున్నారు. ప్రకృతి వైపరిత్యాలను ఎదుర్కోవడంలో దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించి అమలు చేయాల్సిన ప్రభుత్వాల నిర్లిప్తత, ప్రజల బాధ్యతారాహిత్యం శాపంగా మారుతోంది!

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

ఈ ఏడాది వేసవి తీవ్రత అసాధారణ స్థాయికి చేరుకుంది. ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగి, వర్షపాతం తగ్గే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరికలు చేసినప్పటికీ, వాటి నివారణకు చర్యలు చేపట్టడంలో పాలకులు విఫలమవుతున్నారు. ప్రకృతి వైపరిత్యాలను ఎదుర్కోవడంలో దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించి అమలు చేయాల్సిన ప్రభుత్వాల నిర్లిప్తత ప్రజలకు శాపంగా మారుతోంది.

ఇటీవలి రోజుల్లో అనేక ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 44°C నుంచి 46°C వరకు నమోదవుతున్నాయి. సాధారణ స్థాయిలకు మించి కనీసం 3–4°C ఎక్కువగా నమోదవుతున్న ఈ ఉష్ణోగ్రతలు ప్రజల ఆరోగ్యానికే కాకుండా జన జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. కనీస దైనందిన జీవనానికి ముప్పుగా మారుతున్నాయి. గ్రామాలు సహా, పట్టణాలు, నగరాల్లో కాంక్రీట్ నిర్మాణాలు వేడిని మరింత పెంచుతున్నాయి.

పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఏర్పడే ఎల్‌నినో పరిస్థితులు భారతదేశంలో నైరుతి రుతుపవనాలను బలహీనపరుస్తాయి. దేశానికి అవసరమైన వార్షిక వర్షపాతం లో 70% ఈ రుతుపవనాల ద్వారానే లభిస్తుంది. ఈ ఏడాది 10% నుంచి 15% వరకు వర్షపాతం లోటు ఉండవచ్చని అంచనాలు చెబుతున్నాయి. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు రావాల్సిన వర్షాలు తగ్గితే, ఖరీఫ్ పంటలపై తీవ్ర ప్రభావం పడటం ఖాయం.

నదుల్లో ఇసుక అక్రమ తవ్వకాలు, అడవుల నరికివేత, కొండల ధ్వంసం కలిసి పర్యావరణ, వాతావరణ సమతౌల్యాన్ని దెబ్బతీస్తున్నాయి. చెట్ల కొరత వల్ల భూగర్భ జలాల నిల్వలు తగ్గిపోతున్నాయి. పట్టణాల్లో చెట్ల నీడ అరుదుగా మారింది. గత కొన్ని దశాబ్దాల్లో అటవీ విస్తీర్ణం తగ్గడం వాతావరణ మార్పులకు ఒక ప్రధాన కారణంగా నిలుస్తోంది.

దేశంలో లభ్యమయ్యే మంచినీటి వనరుల్లో 80% వ్యవసాయానికి వినియోగమవుతున్నాయి. అయితే అసమర్థ నీటి నిర్వహణ, నీటి వినియోగంలో లోపాలు నీటి కొరతకు ప్రధాన సమస్యలుగా మారాయి. డ్రిప్, స్ప్రింక్లర్ వంటి ఆధునిక పద్ధతులు అందుబాటులో ఉన్నప్పటికీ వాటి వినియోగం 30% లోపే ఉంది. ఫలితంగా వేసవిలో తాగునీటి కొరత తీవ్రంగా మారుతోంది.

రసాయన ఎరువుల అధిక వినియోగం వల్ల భూమి సహజ సారం తగ్గిపోతోంది. మరోవైపు సరఫరా సమస్యల కారణంగా రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో అందడం లేదు. కొన్ని ప్రాంతాల్లో 10–20% వరకు కొరత నమోదవుతోందని నివేదికలు సూచిస్తున్నాయి. ఇది దిగుబడులపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.
పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు చమురు ధరలను పెంచుతున్నాయి. భారత్ తన చమురు అవసరాల్లో 85% దిగుమతులపై ఆధారపడుతోంది. దీంతో డీజిల్ ధరలు పెరిగి, వ్యవసాయ యంత్రాల వినియోగ ఖర్చు అధికమవుతోంది. ఎరువుల తయారీకి అవసరమైన ముడిసరుకు రవాణాపైనా ప్రభావం పడుతోంది.

పెరుగుతున్న ఖర్చులు, తగ్గుతున్న లాభాలు రైతులను సంక్షోభంలోకి నెడుతున్నాయి. వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడంతో యువత ఈ రంగం నుంచి వైదొలుగుతోంది. కూలీల కొరత పెరిగి, యాంత్రీకరణపై ఆధారపడాల్సి వస్తోంది. ఇది మరింత పెట్టుబడిని అమాంతం పెంచేస్తోంది.
ఈ పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలి. వర్షాభావాన్ని ముందుగానే అంచనా వేసి ప్రత్యామ్నాయ, నివారణ కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలి. విత్తనాలు, ఎరువులు, రుణాలు సకాలంలో అందించాలి. ప్రాంతాల వారీగా అనుకూల పంటలపై రైతులకు మార్గనిర్దేశం చేయాలి. అత్యవసర పరిస్థితులకు ప్రత్యేక నిధులు కేటాయించాలి.

వేసవిలో తాగునీటి సమస్యలు తీవ్రమవుతున్నాయి. పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా నీటి కొరత కనిపిస్తోంది. వర్షపు నీటి సంరక్షణ, సరఫరా వ్యవస్థల మెరుగుదల, నీటి వాడకంపై నియంత్రణ వంటి చర్యలు తక్షణం అమలు చేయాలి.

వాతావరణ హెచ్చరికలు వస్తూనే ఉన్నాయి. కానీ వాటిని గుణపాఠంగా తీసుకుని మార్పులు తీసుకురావడం జరగడం లేదు. ప్రకృతి హెచ్చరికలు పెరుగుతున్న ఈ సమయంలో ముందుచూపుతో చర్యలు తీసుకోవడం తప్పనిసరి. రైతాంగాన్ని రక్షించడం, నీటి వనరులను సంరక్షించడం, పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడడం వంటివి ఇక ఆలస్యం చేయకూడని బాధ్యతలు. లేకపోతే భవిష్యత్తులో ఈ సమస్యలు మరింత తీవ్ర పరిణామాలకు దారి తీయడం ఖాయం.

Latest News

ఏయేయి ఎప్పుడు కొనాల్నో తెలుసా!?|ADUGU TRENDS

మనకు అవసరం ఉన్నప్పుడే యే వస్తువునైనా కొంటం. ఎప్పుడు పడితే గప్పుడు గా వస్తువలను కొంటే ఎక్కువ ధర పడ్తయి. ఇగ తక్కువ ధరకే గవాట్ని కొనాల్నంటే గవాటి సీజన్లను బట్టి గాకుండ,...

ప్రయాణ ప్రగతి రథ చక్రంపై ప్రభుత్వ నిర్లక్ష్యం!|EDITORIAL

ఎన్నికల రాజకీయాల్లో హామీలు ఇవ్వడం సహజం. కానీ ఆ హామీల అమలు విషయంలో నిర్లక్ష్యం ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరం. హామీలివ్వడం, గాలికి వదిలేయడం.. తెలంగాణలో గత కొన్నేళ్లుగా ఇదే ధోరణి పునరావృతమవుతోంది. అధికారంలోకి...

24-04-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం తిధి శు అష్టమి రాత్రి 11.34 వరకు ఉపరి నవమి నక్షత్రం పుష్యమి రాత్రి 12.18 వరకు ఉపరి ఆశ్లేష యోగం ధృతి ఉదయం 07.51 వరకు ఉపరి శూల కరణం భద్ర మధ్యాహ్నం...

ఖరీదైన కారుతోటే గా రోడ్డును బాగుశేసిండు!?|ADUGU TRENDS

మనసుంటే మార్గమున్నట్లే గద! మరి గా మార్గమే బాగా లేకపోతే? ఒకాయినె గా బాగా లేని రోడ్డును కోట్ల యిలువ శేసే ఖరీదైన కారుతోటి ఎట్ల బాగు శేసిండో సూడుండ్రి? బెంగళూరులో ఒకాయినె రోజూ...

ఒకటి ఒకటి ఒకటి! రెండు రెండు రెండు!!|EDITORIAL

దేశంలో ప్రతి ఏటా కోటిన్నర మంది విద్యార్థులు పది, ఇంటర్ వంటి కీలక పరీక్షలకు హాజరవుతున్నారు. వీళ్ళంతా ర్యాంకుల పోటీలో చిక్కుకుని తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికల...

23-04-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం తిధి శు సప్తమి రాత్రి 01.32 వరకు ఉపరి అష్టమి నక్షత్రం పునర్వసు రాత్రి 01.30 వరకు ఉపరి పుష్యమి యోగం సుకర్మ ఉదయం 10.41 వరకు ఉపరి ధృతి కరణం గరజి మధ్యాహ్నం...

గా కార్ బిల్డింగును సూద్దాం పాండ్రి!?|ADUGU TRENDS

ఒక్కొక్కలు ఒక్కో రకం. ఒక్కొక్కలిది ఒక్కో టేస్టు. ఎవ్వలిట్టం వాల్లది. గా హైదరాబాద్ పట్నంల ఫిష్ హౌజ్, రెడ్ బిల్డింగ్ వంటి ల్యాండ్ మార్క్ లను సూసినం. శేప ఆకారంలనే గా సర్కార్...

22-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 06.05 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఆరుద్ర రాత్రి తెల్ల 02.55 వరకు ఉపరి పునర్వసు యోగం అతిగండ మధ్యాహ్నం 01.40 వరకు ఉపరి సుకర్మ కరణం బాలవ...

గోడలకు గట్టిగ నీల్లు గొట్టే శిట్కా!?|ADUGU TRENDS

పెండ్లి శేసి సూడు... ఇల్లు కట్టి సూడన్నరు. గివి రెండు శేసుడు అంత వీజీ కాదన్నట్లు. గందుకే పండ్లి అన్నా, ఇల్లన్నా కనా కట్టమన్నట్లు. గట్లనే ఇల్లు కట్టాల్నంటే గా ముగ్గు పోసి...

కవిత పార్టీతో బీఆర్‌ఎస్‌కు లాభమా? నష్టమా?|EDITORIAL

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి వేదిక సిద్ధమవుతోంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ ప్రకటించబోతున్నట్లు వస్తున్న సమాచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రకటన కేవలం కొత్త...

21-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం శ్రీ ఆదిశంకరాచార్య జయంతి తిధి శు చవితి ఉదయం 08.31 వరకు ఉపరి పంచమి నక్షత్రం రోహిణి ఉదయం 06.14 వరకు ఉపరి మృగశిర యోగం శోభ సాయంత్రం 04.45 వరకు ఉపరి అతిగండ కరణం...

20-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం అక్షయ తృతీయ బసవ జయంతి తిధి శు తదియ ఉదయం 10.58 వరకు ఉపరి చవితి నక్షత్రం కృత్తిక ఉదయం 07.53 వరకు ఉపరి రోహిణి యోగం సౌభాగ్య రాత్రి 07.51 వరకు ఉపరి శోభ కరణం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News