Sunday, September 20, 2026
26.7 C
Hyderabad

మార్పుకై ప్రజల తీర్పు!|EDITORIAL

భారత రాజకీయాల్లో ప్రతి అసెంబ్లీ ఎన్నిక జాతీయ ఎన్నికలపై ప్రభావం చూపేదే. దేశ రాజకీయాలను మలుపు తిప్పేవే. సంకీర్ణ దశ నడుస్తున్న ప్రస్తుత దశలో ఇది మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నది. గత కొన్ని దశాబ్దాలుగా సంకీర్ణాలే దేశాన్ని ఏలుతున్నాయి. ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమిలేనిదే ఏ పార్టీ అధికారంలోకి రాలేని పరిస్థితి ఏర్పడింది. ఒక్కో రాష్ట్రం, ఆయా రాష్ట్రాల్లోని ఒక్కో సీటూ కీలకంగా మారాయి. అందుకే ప్రతి ఎన్నికా, ఉప ఎన్నికా నువ్వా? నేనా? అన్నట్లుగా సాగుతున్నాయి.

ప్రజలు కోరుకుంటున్న మార్పునకు ప్రతీకే ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికలు, వాటి ఫలితాలు.
ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అదే విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఈ ఐదు రాష్ట్రాల్లో వచ్చిన తీర్పులు ప్రాంతీయ రాజకీయ గణాంకాలను మాత్రమే కాదు, జాతీయ పార్టీల స్థితిగతులను కూడా ప్రతిబింబించాయి.

పశ్చిమ బెంగాల్‌ లో తృణమూల్ కాంగ్రెస్ మట్టి కరిచింది. అన్నది అన్నట్లుగానే బీజేపీ విజయం సాధించింది. 294 స్థానాల్లో సుమారు 206 సీట్లను గెలుచుకుని మమతపై తిరుగలేని విధంగా గెలిచింది. తృణమూల్ పార్టీ 80 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా మిగిలింది. జాతీయ కాంగ్రెస్, కమ్యూనిస్టులు, స్వతంత్రులు రెండేసి సీట్లతో సరిపెట్టుకున్నారు. నరేంద్ర మోడీ, అమిత్ షా నేతృత్వంలో బీజేపీ కొనసాగించిన సర్ ఓట్ల సవరింపు, రాజకీయ చాణక్యం సక్సెస్ సాధించింది. బెంగాల్ ఓటర్లు స్థానికం నుంచి జాతీయ బీజేపీని ఈ సారి ఎంచుకున్నారు.

తమిళనాడులో ద్రవిడ పార్టీలు ఖంగు తిన్నాయి. దశాబ్దాల నాటి సంప్రదాయ ఓటుకు భిన్నంగా తమిళ ప్రజలు సంచలన తీర్పునిచ్చారు. ద్రవిడ పార్టీలను కాదని, తమిళగ వెట్రి కజగం అప్రతిహత విజయాన్ని సొంతం చేసుకుంది. 234 స్థానాల్లో టీవీకే 107స్థానాలతో అత్యధిక మెజార్టీని సాధించిన పార్టీగా నిలిచింది. డీఎంకే కూటమి 74 సీట్లతో సరి పెట్టుకుంది. అన్నాడీఎంకే కూటమి 53 స్థానాలకు పరిమితమైంది. సీఎం ఎం.కే. స్టాలిన్ ఓడిపోయారు. ద్రావిడ రాజకీయాలకు తమిళ ప్రజలు తిలోదకాలిచ్చారు. రాజకీయాలకు కొత్త, పరిపాలనా అనుభవంలేని, విజయ నాయగన్ విజయ్ నే ప్రజలు నమ్మారు. దళపతికి ఎవరు మద్దతుగా నితుస్తారన్నది ఆసక్తిగా మారింది.

కేరళలోనూ సంప్రదాయాన్ని చెరిపేస్తూ ఎల్‌డిఎఫ్ ను కాదని యూడీఎఫ్ పై ప్రజలు మొగ్గారు. 140 స్థానాల్లో యూడీఎఫ్ 102 సీట్లు గెలుచుకుంది. ఎల్ డీఎఫ్ 35 స్థానాలకు పరిమితమైంది. ఇక్కడ ఎన్డీయే కేవలం 3 స్థానాలతోనే నిలిచింది. పినరయి విజయన్ తన పాలనపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతను చాటారు.

అసోంలో భారతీయ జనతా పార్టీ తన పట్టు నిలుపుకుంది. 127 స్థానాల్లో బీజేపీ కూటమి గతాని(75)కి మించి 102 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి 21 స్థానాలు సాధించింది. హిమంత బిశ్వ శర్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఈ ఎన్నికల ప్రత్యేకత. అభివృద్ధి, జాతీయ భద్రత, మరియు స్థానిక సమస్యలపై సమన్వయ ప్రచారం బీజేపీ విజయానికి దోహదపడింది.

పుదుచ్చేరిలో 30 స్థానాల్లో బీజేపీ-ఎన్‌ఆర్ కాంగ్రెస్ కూటమి 18 సీట్లతో అధికారాన్ని దక్కించుకుంది. కాంగ్రెస్ కూటమి ఇక్కడ వెనుకబడింది. చిన్న ప్రాంతం అయినప్పటికీ, ఈ ఫలితం దక్షిణ భారతంలో బీజేపీ విస్తరణకు సంకేతంగా పరిగణించబడింది.

మొత్తంగా ఈ ఐదు రాష్ట్రాల తీర్పులు కొన్ని కీలక సందేశాలను ఇస్తున్నాయి. ప్రజలు కోరుకుంటున్న మార్పును సూచిస్తున్నాయి. సంప్రదాయ పద్ధతులకు భిన్నమైన తీర్పులు వెలువడ్డాయి. మహిళలు, యువత అత్యధికంగా ఓట్లు వేయడాన్ని గమనించొచ్చు. అప్రతిహతంగా బీజేపీ ఒక్కో రాష్ట్రాన్ని, ఒక్కో ప్రాంతాన్ని వరసగా గెలుస్తుండటం కనిపిస్తోంది. ప్రాంతీయ నాయకత్వం బలంగా ఉంటే జాతీయ పార్టీల ప్రభావాన్ని తగ్గించగలదని తమిళనాడు స్పష్టం చేసింది. సంక్షోభ నిర్వహణ మరియు పాలనా విశ్వసనీయత ఓటర్లను ప్రభావితం చేస్తాయని బెంగాల్ చూపించింది. సరైన కూటమి వ్యూహం మరియు నాయకత్వ మార్పు విజయానికి దారితీస్తాయని అస్సాం, పుదుచ్చేరి నిరూపించాయి.

ఈ ఎన్నికలు భారత రాజకీయాల్లో వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ప్రతి రాష్ట్రం తన ప్రత్యేక సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని తీర్పు ఇస్తోంది. అందువల్ల ఈ ఫలితాలను ఒకే రాజకీయ పార్టీ విజయంగా లేదా ఓటమిగా చూడటం కంటే, భారత ప్రజాస్వామ్యంలోని బహుముఖ స్వభావంగా చూడటం సముచితం.

ఈ ఫలితాలు జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపడం ఖాయం. ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యం కొనసాగుతూనే, జాతీయ పార్టీలు తమ వ్యూహాలను మరింత స్థానికీకరించాల్సిన అవసరం స్పష్టమైంది. ఓటరు చైతన్యవంతుడు, అతను తన రాష్ట్ర అవసరాల ప్రకారం నిర్ణయం తీసుకుంటాడు. అన్నింటికీ మించి మార్పును ప్రజలు కోరుకుంటున్నారని స్పష్టమైంది.

Latest News

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 26 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త అవకాశాలు కనిపిస్తాయి, ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ముందడుగు వేసే పరిస్థితులు ఏర్పడతాయి. నిలిచిపోయిన పనులను...

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News