Sunday, May 10, 2026
35.2 C
Hyderabad

మార్పుకై ప్రజల తీర్పు!|EDITORIAL

భారత రాజకీయాల్లో ప్రతి అసెంబ్లీ ఎన్నిక జాతీయ ఎన్నికలపై ప్రభావం చూపేదే. దేశ రాజకీయాలను మలుపు తిప్పేవే. సంకీర్ణ దశ నడుస్తున్న ప్రస్తుత దశలో ఇది మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నది. గత కొన్ని దశాబ్దాలుగా సంకీర్ణాలే దేశాన్ని ఏలుతున్నాయి. ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమిలేనిదే ఏ పార్టీ అధికారంలోకి రాలేని పరిస్థితి ఏర్పడింది. ఒక్కో రాష్ట్రం, ఆయా రాష్ట్రాల్లోని ఒక్కో సీటూ కీలకంగా మారాయి. అందుకే ప్రతి ఎన్నికా, ఉప ఎన్నికా నువ్వా? నేనా? అన్నట్లుగా సాగుతున్నాయి.

ప్రజలు కోరుకుంటున్న మార్పునకు ప్రతీకే ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికలు, వాటి ఫలితాలు.
ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అదే విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఈ ఐదు రాష్ట్రాల్లో వచ్చిన తీర్పులు ప్రాంతీయ రాజకీయ గణాంకాలను మాత్రమే కాదు, జాతీయ పార్టీల స్థితిగతులను కూడా ప్రతిబింబించాయి.

పశ్చిమ బెంగాల్‌ లో తృణమూల్ కాంగ్రెస్ మట్టి కరిచింది. అన్నది అన్నట్లుగానే బీజేపీ విజయం సాధించింది. 294 స్థానాల్లో సుమారు 206 సీట్లను గెలుచుకుని మమతపై తిరుగలేని విధంగా గెలిచింది. తృణమూల్ పార్టీ 80 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా మిగిలింది. జాతీయ కాంగ్రెస్, కమ్యూనిస్టులు, స్వతంత్రులు రెండేసి సీట్లతో సరిపెట్టుకున్నారు. నరేంద్ర మోడీ, అమిత్ షా నేతృత్వంలో బీజేపీ కొనసాగించిన సర్ ఓట్ల సవరింపు, రాజకీయ చాణక్యం సక్సెస్ సాధించింది. బెంగాల్ ఓటర్లు స్థానికం నుంచి జాతీయ బీజేపీని ఈ సారి ఎంచుకున్నారు.

తమిళనాడులో ద్రవిడ పార్టీలు ఖంగు తిన్నాయి. దశాబ్దాల నాటి సంప్రదాయ ఓటుకు భిన్నంగా తమిళ ప్రజలు సంచలన తీర్పునిచ్చారు. ద్రవిడ పార్టీలను కాదని, తమిళగ వెట్రి కజగం అప్రతిహత విజయాన్ని సొంతం చేసుకుంది. 234 స్థానాల్లో టీవీకే 107స్థానాలతో అత్యధిక మెజార్టీని సాధించిన పార్టీగా నిలిచింది. డీఎంకే కూటమి 74 సీట్లతో సరి పెట్టుకుంది. అన్నాడీఎంకే కూటమి 53 స్థానాలకు పరిమితమైంది. సీఎం ఎం.కే. స్టాలిన్ ఓడిపోయారు. ద్రావిడ రాజకీయాలకు తమిళ ప్రజలు తిలోదకాలిచ్చారు. రాజకీయాలకు కొత్త, పరిపాలనా అనుభవంలేని, విజయ నాయగన్ విజయ్ నే ప్రజలు నమ్మారు. దళపతికి ఎవరు మద్దతుగా నితుస్తారన్నది ఆసక్తిగా మారింది.

కేరళలోనూ సంప్రదాయాన్ని చెరిపేస్తూ ఎల్‌డిఎఫ్ ను కాదని యూడీఎఫ్ పై ప్రజలు మొగ్గారు. 140 స్థానాల్లో యూడీఎఫ్ 102 సీట్లు గెలుచుకుంది. ఎల్ డీఎఫ్ 35 స్థానాలకు పరిమితమైంది. ఇక్కడ ఎన్డీయే కేవలం 3 స్థానాలతోనే నిలిచింది. పినరయి విజయన్ తన పాలనపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతను చాటారు.

అసోంలో భారతీయ జనతా పార్టీ తన పట్టు నిలుపుకుంది. 127 స్థానాల్లో బీజేపీ కూటమి గతాని(75)కి మించి 102 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి 21 స్థానాలు సాధించింది. హిమంత బిశ్వ శర్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఈ ఎన్నికల ప్రత్యేకత. అభివృద్ధి, జాతీయ భద్రత, మరియు స్థానిక సమస్యలపై సమన్వయ ప్రచారం బీజేపీ విజయానికి దోహదపడింది.

పుదుచ్చేరిలో 30 స్థానాల్లో బీజేపీ-ఎన్‌ఆర్ కాంగ్రెస్ కూటమి 18 సీట్లతో అధికారాన్ని దక్కించుకుంది. కాంగ్రెస్ కూటమి ఇక్కడ వెనుకబడింది. చిన్న ప్రాంతం అయినప్పటికీ, ఈ ఫలితం దక్షిణ భారతంలో బీజేపీ విస్తరణకు సంకేతంగా పరిగణించబడింది.

మొత్తంగా ఈ ఐదు రాష్ట్రాల తీర్పులు కొన్ని కీలక సందేశాలను ఇస్తున్నాయి. ప్రజలు కోరుకుంటున్న మార్పును సూచిస్తున్నాయి. సంప్రదాయ పద్ధతులకు భిన్నమైన తీర్పులు వెలువడ్డాయి. మహిళలు, యువత అత్యధికంగా ఓట్లు వేయడాన్ని గమనించొచ్చు. అప్రతిహతంగా బీజేపీ ఒక్కో రాష్ట్రాన్ని, ఒక్కో ప్రాంతాన్ని వరసగా గెలుస్తుండటం కనిపిస్తోంది. ప్రాంతీయ నాయకత్వం బలంగా ఉంటే జాతీయ పార్టీల ప్రభావాన్ని తగ్గించగలదని తమిళనాడు స్పష్టం చేసింది. సంక్షోభ నిర్వహణ మరియు పాలనా విశ్వసనీయత ఓటర్లను ప్రభావితం చేస్తాయని బెంగాల్ చూపించింది. సరైన కూటమి వ్యూహం మరియు నాయకత్వ మార్పు విజయానికి దారితీస్తాయని అస్సాం, పుదుచ్చేరి నిరూపించాయి.

ఈ ఎన్నికలు భారత రాజకీయాల్లో వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ప్రతి రాష్ట్రం తన ప్రత్యేక సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని తీర్పు ఇస్తోంది. అందువల్ల ఈ ఫలితాలను ఒకే రాజకీయ పార్టీ విజయంగా లేదా ఓటమిగా చూడటం కంటే, భారత ప్రజాస్వామ్యంలోని బహుముఖ స్వభావంగా చూడటం సముచితం.

ఈ ఫలితాలు జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపడం ఖాయం. ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యం కొనసాగుతూనే, జాతీయ పార్టీలు తమ వ్యూహాలను మరింత స్థానికీకరించాల్సిన అవసరం స్పష్టమైంది. ఓటరు చైతన్యవంతుడు, అతను తన రాష్ట్ర అవసరాల ప్రకారం నిర్ణయం తీసుకుంటాడు. అన్నింటికీ మించి మార్పును ప్రజలు కోరుకుంటున్నారని స్పష్టమైంది.

Latest News

తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం|TAMILNADU|CM|THALAPATAHY VIJAY

కొత్త శకం ఆరంభం తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, సినీ నటుడు జోసెఫ్ విజయ్ ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. చెన్నైలోని జవహర్లాల్...

అసలే కోతి.. ఆపై సవురం!?|ADUGU TRENDS

పని లేని ఒకాయినె పిలిసి పిల్లి తల కొరిగిండని సామెత. గది సరే గనీ, మరి గీ కోతి మాత్రం.. ఏకంగా గా మంగళాయనె దగ్గరికి పోయి, సవురం శేయించుకుంది. గీ యింతేందో...

తమిళనాట కొత్త కథా చిత్రం!|EDITORIAL

తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ వీడింది. గత కొన్ని రోజులుగా నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ప్రజా తీర్పు తర్వాత కొనసాగిన అనిశ్చితి, పెద్ద పార్టీల కుట్రలు, చిన్న పార్టీల బేరసారాలు, మద్దతు లేఖల హైడ్రామా,...

ఈ రోజు/వార రాశి ఫలాలు|RASHI PHALALU|WEEKLY|TODAY

మే 10 నుండి మే 16 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. పనుల్లో ఆలస్యాలు తగ్గి ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో...

గింత బట్ట తున్కతోటి గంత పట్టీలా!?|ADUGU TRENDS

పని ఎంత పెద్దదైనా, శిన్న శిన్న శిట్కాలతోటి సిడెంల శేయొచ్చు. గా ఆటల పోటీలకు, ఎవలన్న ముక్యమైనోల్లు వచ్చినప్పుడు పట్టీలు, ముగ్గులు ఏత్తరు కదా? గయి ఏయాల్నంటే బొచ్చెడు పని మనుసులు, శానా...

తమిళనాడు హంగ్-గవర్నర్-టీవీకే కింకర్తవ్యం?|EDITORIAL

హంగ్ సమయంలో ఎవరిని ముందుగా పిలవాలి? అతిపెద్ద పార్టీనా? లేక మెజారిటీ మద్దతు ఉన్న కూటమినా? అన్న విషయంలో రాజ్యాంగం స్పష్టమైన విధానం నిర్దేశించలేదు. ఇక్కడే గవర్నర్ విచక్షణాధికారం ప్రాధాన్యం సంతరించుకుంది. మన...

09-05-2026 శనివారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం తిధి బ సప్తమి ఉదయం 09.15 వరకు ఉపరి అష్టమి నక్షత్రం శ్రవణ రాత్రి 07.05 వరకు ఉపరి ధనిష్ఠ యోగం శుక్ల రాత్రి 10.43 వరకు ఉపరి బ్రహ్మ కరణం బవ ఉదయం...

ట్యూబ్ కు పొక్క.. తెల్సుకోండ్రి గిట్ల!?|ADUGU TRENDS

గా చైనాల గిప్పటికీ సైకోల్లే తొక్కుతాండ్లట. గిప్పుడైతే గయి మన దేశంల మోటైపోయినయి గనీ, ఎన్కటికి సైకోల్లు ఎక్కువ తొక్కేది. గదే పెద్ద రెండు గిర్రల బండి. ఇగ ఇంట్లనే గాలి కొట్టేది....

ధాన్యం కొనుగోల్ మాల్!|EDITORIAL

దేశంలో వ్యవసాయం ఇప్పటికీ కోట్లాది కుటుంబాల జీవనాధారం. కానీ రైతు పండించిన పంటను ప్రభుత్వాలు కొనుగోలు చేసే విధానం ప్రతి ఏడాది గందరగోళానికీ, వివాదానికీ కారణమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల టన్నుల...

08-05-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి ఉదయం 08.05 వరకు ఉపరి సప్తమి నక్షత్రం ఉత్తరాషాఢ సాయంత్రం 05.26 వరకు ఉపరి శ్రవణ యోగం శుభ రాత్రి 11.02 వరకు ఉపరి శుక్ల కరణం వణజి ఉదయం...

తాలు, తేమను తీసే మిషిని!?|ADUGU TRENDS

రోజులు మార్తానయి. గట్లనే గా యెవుసం శేసే పద్ధతులు గూడ మార్తానయి. అన్నిట్ల లెక్కనే గిండ్ల గూడ మిషిన్లొత్తానయి. అయితే కొత్త ఆలోశెనలు, సరికొత్త ఉపాయాలను తెత్తానయి. గసొంటిదే గిది మీరే సూడుండ్రి. యెద్దు,...

విపరీత రాజకీయ ధోరణులు!|EDITORIAL

ప్రపంచంలోనే అతిపెద్దదైన భారత ప్రజాస్వామ్యంలో ప్రతి ఎన్నిక.. ప్రజల తీర్పు, పాలనపై సమీక్ష, భవిష్యత్ దిశను నిర్ణయించే కీలక ఘట్టం. ఇటీవలి 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల వైఖరులు,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News