Tuesday, August 4, 2026
29.8 C
Hyderabad

స్పందించ “వేం” !?

ఉలక’వేం’? పలక’వేం’!?
మౌనంగా ఉంటా”వేం”!?
– అజంజాహి కార్మిక భవనం కూల్చి రెండు నెలలైనా మాట్లాడ “వేం”!?
సీఎం ప్రధాన సలహాదారుగా మీ సూచనలేంటి?
సీఎం గారికి మీరిస్తున్న సలహాలేంటి?
కాంగ్రెస్ నేతగా కార్మికులకు ఏ కబురంపుతారు?
ఈ జిల్లా నేత గా మీ జవాబు ఏంటి?
మీ జోక్యం కోసం కోసం అజం జాహి కార్మిక లోకం ఆశగా ఎదురుచూస్తున్నది

కొందరికి అవకాశాలు అరుదుగా వస్తుంటాయి. కానీ కొందరికి అరుదైన అవకాశాలు వస్తాయి. రెండు కోవలకు చెందిన వారు వేం నరేందర్ రెడ్డి. కే సముద్రం మండలం అర్పణ పల్లె లో పుట్టిన ఆయన వరంగల్ సి కె ఎం కాలేజీలో డిగ్రీ చేసి, 2004లో మహబూబాబాద్ ఎమ్మెల్యే అయ్యారు. కాలక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారాల ప్రధాన సలహాదారుగా నియమింపబడ్డారు. ఆయనకు వరంగల్ చరిత్ర తెలుసు. ఆజం జాహి మిల్లు చరిత్రా తెలుసు. కార్మికుల సంగతి తెలుసు. మిల్లు కార్మిక భవన స్థలం కబ్జా సంగతీ తెలుసు. ఆ స్థలాన్ని ఎప్పుడు? ఎలా? ఏం? చేయాలో కూడా తెలుసు. సమస్య తెలుసు! పరిష్కారం కూడా తెలుసు!! అ(ఇ)న్నీ తెలిసిన, సీఎం కే సలహాలిచ్చే పొజిషన్ లో ఉన్న వేం నరేందర్ రెడ్డి మాత్రం మౌనం వీడటం లేదేం!? ఉలక’వేం’? పలక’వేం’!? మౌనంగా ఉంటా”వేం”!? అజం జాహి కార్మిక భవనం కూల్చి రెండు నెలలైనా మాట్లాడ “వేం”!? అంటూ “వేం” జోక్యం కోసం మిల్లు కార్మిక లోకం కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని మరీ ఎదురుచూస్తున్నది.

వరంగల్ మట్టి పరిమళం వేం నరేందర్ రెడ్డి. ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే చదువుకుని, ఇక్కడే ప్రజా ప్రతినిధిగా ఎన్నుకోబడి… ఇప్పుడు ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారుగా నియమింప పడ్డారు. ఆయన సీఎం కు సలహాలిచ్చే అసాధారణ స్థానంలో ఉన్నారు. ఇది వరంగల్ కే గర్వకారణం. ఇంతటి స్థాయి, స్థానంలో ఉన్న మనిషి నుంచి ఎవరైనా ఏం కోరుకుంటారు? కాస్త మంచి, వీలైతే ఓ మాట సాయం. అంతేగా!? కానీ ఆయన నుంచి ఓ మంచి మాట సాయాన్ని కోరుకున్న అజం జాహి మిల్లు కార్మికులు మాత్రం ఉలుకు, పలుకు లేని మౌనాన్ని ఎదుర్కొంటున్నారు. చారిత్రక అజంజాహి కార్మిక భవనం కబ్జాకు గురైంది. తప్పుడు దస్తావేజులతో అన్యాక్రాంతమైoది, ఓ బడా వ్యాపారి అక్రమ పర్మిషన్లు పొందాడు. కాంగ్రెస్ కే చెందిన ఓ ప్రజా ప్రతినిధి కొబ్బరికాయ కొట్టి, బహుళ అంతస్తుల భవనానికి శంకుస్థాపన చేశారు. కార్మికుల కళ్ళ ముందే వాళ్ళ కలల సౌధం, ఎన్నో కార్మిక ఉద్యమాల సాక్షీభూతం, కార్మిక దేవాలయం, కార్మిక భవనం నేలమట్టం అయింది. ఇది జరిగి రెండు నెలలు గడుస్తున్నాయి. కార్మికులు, కార్మిక కుటుంబాలు, కాంగ్రెస్ సహా పార్టీలన్ని అఖిల పక్షమై, కార్మిక, ప్రజా సంఘాలన్నీ ఏకపక్షమై కోట్లాడుతున్నాయి. అది ముమ్మాటికీ కార్మిక భవన స్థలమే అనడానికి భవన శిలాఫలకం నుండి ఇంటి నెంబర్, ఇంటి పన్ను వరకు అవసరమైన అనేక ఆధారాలను బయట పెట్టారు. కార్మిక నాయకుల కాసుల కక్కుర్తిని, తప్పుడు దస్తావేజులతో చేపట్టిన కబ్జాని, నియమ నిబంధనలు అతిక్రమించిన అధికారుల అవినీతిని సాక్ష్యాలతో సహా ఎలుగెత్తారు. అయినా సరే, ప్రజాపాలనే గీటురాయిగా పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టలేదు. అధికారంలో ఉన్న ఏ ప్రజా ప్రతినిధి కీ ఇది తప్పని తోయలేదు. ఏ ఉన్నతాధికారికి తప్పును సరిదిద్దుకోవాలనిపించలేదు. సరిదిద్దే ప్రయత్నం ఏ కోణం నుంచీ జరగలేదు. ఒక అవినీతి కోణం వెనుక ఇంత మౌనమా?!

చివరకు మీలాంటి వారికి కూడా పట్టకపోతే, ఎవరికి పడుతుంది? ఇంకెవరిని అడగాలి సార్!? బహిరంగంగా అందరికీ తెలిసిన అజం జాహి లాంటి చారిత్రక మిల్లు కార్మిక స్థలానికే రక్షణ, దిక్కు దివాణం లేకపోతే, ఈ ప్రజా పాలనలో ఇంకెవరికి రక్షణ ఉన్నట్లు సార్?! మన ప్రజా పాలన ఫలాలు ఎవరికి అందుతున్నట్లు సార్? ప్రజలకేనా సార్?! పాలకులకా? ప్రభుత్వంలో పలుకుబడి ఉన్నోళ్లకా సార్?!

అందుకే సార్, అజం జాహి మిల్లు కార్మికులు, కార్మికుల కుటుంబాలు, అఖిల పక్షాలు, అన్ని ప్రజా సంఘాలు, ప్రజలు అంతా కలిసి, ఈ మట్టి బిడ్డగా మిమ్మల్ని అడుగుతున్నారు. మిల్లు కార్మిక భవన స్థల కబ్జా పై సీఎం ప్రధాన సలహాదారుగా మీ సూచనలేంటి? సీఎం గారికి మీరిస్తున్న సలహాలేంటి? కాంగ్రెస్ నేతగా కార్మికులకు ఏ కబురంపుతారు? ఈ జిల్లా నేత గా మీ జవాబు ఏంటి? ఉలక ‘వేం’? పలుక ‘వేం ‘? మాట్లాడ ‘వేం’? అంటూ మీ ప్రతిస్పందన కోసం అఖిల పక్షం… ప్రజాపక్షమై… మీ జోక్యం కోసం అజం జాహి కార్మిక కుటుంబ లోకం ఆశగా ఎదురుచూస్తున్నది.

Latest News

ఆగస్టు 04, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి రాత్రి 07.06 వరకు ఉపరి సప్తమి నక్షత్రం రేవతి రాత్రి 08.09 వరకు ఉపరి అశ్విని యోగం ధృతి రాత్రి 06.53 వరకు ఉపరి శూల కరణం గరజి ఉదయం 07.45...

గీ అవుడియ అదిరింది!?|ADUGU TRENDS

ఒక అవుడియ జీవితాన్నే మారుస్తదంటే గిదేనేమో మరి! ఏదైనా ఆలోశన శేత్తే, ఏదో ఒకటి జర్గుతది. లేకపోతే ఊదు కాలది పిల్లి గూడ లేవది? గది సరే గనీ గా పిల్లగాడు శేసిందేంటో...

అధికారం రాగానే హామీలు హుష్ కాకీ!?

ప్రజలు ఇప్పుడు రాజకీయ పార్టీల ప్రకటనలను కాకుండా వాటి పనితీరును కొలుస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కాలపరిమితి నిర్ణయించి, వాటి అమలుపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి శ్వేతపత్రం విడుదల చేయడం...

ఆగస్టు 03, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి రాత్రి 08.18 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 08.37 వరకు ఉపరి రేవతి యోగం సుకర్మ రాత్రి 08.54 వరకు ఉపరి ధృతి కరణం కౌలవ ఉదయం 08.40...

అవుమల్లా! కడుపుల బిడ్డ స్పందిత్తదా!?|ADUGU TRENDS

తల్లి గర్భంల ఉండంగనే బిడ్డలకి బయటియి యినబడ్తయా? గవాటికి గా పిల్లలు గూడ స్పందిత్తరా? యెన్కటికి కడుపుల ఉండంగనే అర్జునుడి కొడుకు అభిమన్యుడు పద్మవ్యూహంలకెట్ల పోవాల్నో తెలుసుకున్నడట. గిది నిజమో కాదో కనీ,...

ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ గా భోగాపురం!?|EDITORIAL

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఒక కొత్త అవకాశాన్ని తెరిచింది. ఈ అవకాశాన్ని స్థిరమైన అభివృద్ధిగా మలచడం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్థానిక ప్రజల సమిష్టి కృషిపైనే ఆధారపడి ఉంటుంది. మౌలిక వసతుల...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 02 నుండి ఆగస్టు 08 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీరు చేపట్టే పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో...

యిధి యిసిత్రమైందంటే గిదే మరి!?|ADUGU TRENDS

యిధి శాల యిసిత్రమైంది. ఒకపాలి కలిసున్నోల్లను సిడెంల యిడదీత్తది. యిడిపోయినోల్లని శిటికెల కలిపేత్తది. గసొంటిదే గీ ముచ్చట. గదేందో సూద్దాం పాండ్రి. తమిళనాడు రాస్ట్రం విరుదు నగర్ జిల్లా తిరుచూలి పూమాలై పట్టీకి శెందిన...

పోలీసింగ్ పై పార్లమెంటులో సమీక్షేది!?|EDITORIAL

పార్లమెంట్ వరుసగా వాయిదాలు పడుతూ స్తంభిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ప్రతిష్ఠంభనల వల్ల ఉభయ సభల్లో కీలక అంశాలపై అసలు చర్చే జరగడం లేదు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు కూడా అత్యవసరం....

ఆగస్టు 01, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ తదియ రాత్రి 09.20 వరకు ఉపరి చవితి నక్షత్రం శతభిషం రాత్రి 08.09 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శోభ రాత్రి 11.43 వరకు ఉపరి అతిగండ కరణం వణజి ఉదయం 09.10...

తెలంగాణ ‘పెద్ద’న్న అస్తమయం!|TELANGANA|PEDDI SUDHARSHAN REDDY

ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు హనుమకొండలో గుండెపోటు మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు 5రోజులు మృత్యువుతో పోరాటం కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ...

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News