Saturday, July 25, 2026
22.7 C
Hyderabad

జాతీయ ఆర్థిక అత్యవసర పరిస్థితి తప్పదా?!|EDITORIAL

దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడం కోసం ఇప్పుడు తీసుకునే నిర్ణయాలే భవిష్యత్తును నిర్ణయిస్తాయి. కేవలం రాజకీయ విజయాలు, విమర్శలతో దేశం ముందుకు సాగదు. బలమైన ఆర్థిక వ్యవస్థే నిజమైన జాతీయ శక్తి. పరిస్థితి తీవ్రతను గుర్తించి తక్షణ చర్యలు చేపడితేనే దేశం ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడగలదు.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్ 

దేశంలో రెండు పరస్పర విరుద్ధ అంశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు రాజకీయాల్లో, నాయకుల్లో విజయోత్సాహాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఆర్థిక సంక్షోభ ఆందోళనకర సంఘటనలు వినిపిస్తున్నాయి. ఎన్నికల విజయాలు తాత్కాలిక ఉత్సాహాన్ని కలిగించవచ్చు. కానీ దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనపడితే ఆ ప్రభావం చివరకు ప్రజల జీవితాలపైనే పడుతుంది. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న పరిస్థితులను పరిశీలిస్తే, ఇది సాధారణ ఆర్థిక మందగమనం కాదు. సమగ్ర జాతీయ ఆర్థిక అత్యవసర పరిస్థితిగా చూడాల్సిన దశకు చేరుకుంది.

పశ్చిమాసియా యుద్ధ వాతావరణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ఇరాన్–అమెరికా–ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఘర్షణల ప్రభావంతో అంతర్జాతీయ చమురు సరఫరా వ్యవస్థ దెబ్బతింది. హోర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 107 డాలర్లకు చేరుకుంది. మరోవైపు రూపాయి విలువ అత్యంత దయనీయంగా డాలర్‌కు రూ.96 సమీపానికి పడిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రూపాయి పతనం అంటే దిగుమతుల భారం మరింత పెరగడం. ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడే భారతదేశానికి ఇది తీవ్రమైన దెబ్బ.
ఇప్పటికే దేశ విదేశీ మారక నిల్వలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. దిగుమతులు విపరీతంగా పెరుగుతుండగా, ఎగుమతులు ఆశించిన స్థాయిలో లేవు. ఈ పరిస్థితిలో బంగారం దిగుమతులు మరింత భారం అవుతున్నాయి. బంగారం వంటి ఉత్పాదకేతర వస్తువుల దిగుమతులపై కఠిన నియంత్రణలు అవసరం. అంతేకాదు, దేశీయ రైతుల పంటలకు పోటీగా మారుతున్న ఆహార ధాన్యాల దిగుమతులపైనా ఆంక్షలు విధించాల్సిన అవసరం ఉంది.

ప్రస్తుతం అధికారిక వినియోగదారుల ధరల సూచీ ద్రవ్యోల్బణం 3.5 శాతంగా ఉన్నప్పటికీ, ఆహార ద్రవ్యోల్బణం 4.33 శాతంగా నమోదవుతోంది. టోకు ధరల సూచీ ద్రవ్యోల్బణం 8.3 శాతానికి చేరుకోవడం ఉత్పత్తి వ్యయాలు పెరుగుతున్న సంకేతం. గృహావసరాల ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.913 కాగా, కమర్షియల్ సిలిండర్ ధర రూ.3077 నుంచి రూ.3237 వరకు ఉంది. పెరుగుతున్న ఇంధన ధరలు రవాణా ఖర్చులను పెంచి చివరకు ప్రతి వస్తువు ధరను ప్రభావితం చేస్తున్నాయి.

ఈ పరిస్థితుల్లో ప్రజల కొనుగోలు శక్తి పెంచే చర్యలు తీసుకోవడం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత కావాలి. కానీ ప్రస్తుతం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. రైతుకు గిట్టుబాటు ధర రావడం లేదు. వినియోగదారుడికి సరసమైన ధరకు సరుకులు అందడం లేదు. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాల్లో వరి, మక్కజొన్న, మిర్చి, శనగ వంటి పంటలు విస్తారంగా పండుతున్నప్పటికీ రైతులు నష్టాలను ఎదుర్కొంటున్నారు. మధ్యవర్తుల లాభాలు పెరుగుతున్నాయి గానీ రైతు–వినియోగదారుల మధ్య ధరల అసమానత తగ్గడం లేదు.

దేశ గోదాముల్లో లక్షల టన్నుల ఆహార ధాన్యాలు నిల్వగా ఉన్నప్పటికీ, వాటిని సరసమైన ధరలకు ప్రజలకు అందించే సమగ్ర విధానం కనిపించడం లేదు. ఉచిత పథకాలకన్నా, తక్కువ ధరలకు నాణ్యమైన సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడం సమర్థవంతమైన ఆర్థిక విధానంగా ఉంటుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడకపోతే దేశ ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం రాదు.

ఇక ప్రభుత్వ వ్యయ నియంత్రణ కూడా అత్యంత కీలకం. ప్రజలు పొదుపు పాటించాలని చెప్పే ముందు పాలకులు ఆదర్శంగా నిలవాలి. ప్రజాప్రతినిధుల అధిక సౌకర్యాలు, భారీ కాన్వాయ్‌లు, అవసరం లేని ప్రభుత్వ వ్యయాలు తగ్గించాలి. వందల లీటర్ల ఇంధనం ఖర్చు చేసే కాన్వాయ్‌లు ఆర్థిక క్రమశిక్షణకు వ్యతిరేకం. ప్రభుత్వ యంత్రాంగం ముందుగా ఖర్చు నియంత్రణ పాటిస్తేనే ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది.

అదేవిధంగా ఇంధనం, వంటనూనెలు, ఎరువుల వినియోగంలో దేశవ్యాప్తంగా పొదుపు చర్యలు చేపట్టాలి. అవసరం లేని దిగుమతులను తగ్గించి, “దేశీయ ఉత్పత్తి–దేశీయ వినియోగం” అనే విధానాన్ని బలోపేతం చేయాలి. స్వదేశీ ఉత్పత్తులకు ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా విదేశీ మారకద్రవ్యంపై ఒత్తిడి తగ్గించవచ్చు.
ప్రస్తుతం అత్యవసరంగా చేయాల్సింది రూపాయి మారకం విలువను స్థిరీకరించడం. రూపాయి నిరంతరం పతనం అవుతుంటే విదేశీ మారక నిల్వలు మరింత క్షీణించే ప్రమాదం ఉంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ సమన్వయంతో కఠిన చర్యలు తీసుకోవాలి. దిగుమతుల నియంత్రణ, ఎగుమతుల ప్రోత్సాహం, విదేశీ పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాలపై స్పష్టమైన కార్యాచరణ అవసరం.
దేశం ఎదుర్కొంటున్న ఈ పరిస్థితిని రాజకీయ కోణంలో కాకుండా జాతీయ సంక్షోభంగా చూడాలి. ఆర్థిక నిపుణులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు, గ్రామీణ సంఘాలతో కలిసి సమగ్ర చర్చలు జరపాలి. తక్షణ చర్యల కోసం ఒక ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి, గ్రామాల నుంచి పట్టణాల వరకు ప్రజల అభిప్రాయాలు సేకరించాలి.

దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడం కోసం ఇప్పుడు తీసుకునే నిర్ణయాలే భవిష్యత్తును నిర్ణయిస్తాయి. కేవలం రాజకీయ విజయాలు, విమర్శలతో దేశం ముందుకు సాగదు. బలమైన ఆర్థిక వ్యవస్థే నిజమైన జాతీయ శక్తి. పరిస్థితి తీవ్రతను గుర్తించి తక్షణ చర్యలు చేపడితేనే దేశం ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడగలదు.

Latest News

ఒక్క ఏసీ మిషినీ, రొండు అర్రలకు సల్లదనం!?|ADUGU TRENDS

‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు!’. ‘ఒకే కాన్పుల ఇద్దరు పిల్లలు!! లెక్కనే’ గీ ‘ఒక్క ఏసీతో రెండు గదుల్ల సల్లదనమన్నట్లు!?’ అరె గదెట్ల? అనుకుంటాండ్రా? కావాల్నంటే ఇగో సూడుండ్రి. ఇగో గీ ఉపాయం ఏడ...

‘బొద్దింకే’ కదాని నిర్లక్ష్యం చేస్తే..!?|EDITORIAL

‘బొద్దింక’లే కదాని చులకనగా చూడొద్దు. వాటిని చంపినా మళ్ళీ అవి పుట్టుకు వస్తూనే ఉంటాయి. వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఉద్యమాలను అణచివేయవచ్చు. కానీ, సమస్యలను పరిష్కరించకపోతే కొత్త రూపాల్లో అసంతృప్తి మళ్లీ...

జూలై 25, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తొలి ఏకాదశి తిధి ఏకాదశి ఉదయం 11.38 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం అనురాధ ఉదయం 05.49 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం బ్రహ్మ రాత్రి 11.00 వరకు ఉపరి ఐంద్ర కరణం భద్ర ఉదయం 11.38...

గీ అక్కాశెల్లెండ్లు ముగ్గురికి ఒక్కడే పెనిమిటి!?|ADUGU TRENDS

మన సంప్రదాయం పకారం ఒక్కొక్కరు ఒక్కల్నే మనువాడాలె. కనీ, గాడ గా పొల్లగాడ్ని, ముగ్గురు అక్కాశెల్లెండ్లు ఒక్కపాలే పెండ్లి శేసుకున్నరు? గదేందో సూద్దాం పదండ్రి. గిదేంది? అనకుంటాండ్రా? నిజమేనుల్లా... గీ ముచ్చట గా ఉత్తర...

నీట్-అణచివేతే పరిష్కారం కాదు!|EDITORIAL

దేశ జనాభాలో 65%నికి పైగా 35ఏళ్ళ లోపు వాళ్ళే. ప్రపంచంలో అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా భారత్‌కు గొప్ప అవకాశం. అయితే ఇదే యువత ఉద్యోగాలు, పారదర్శక నియామకాలు, నాణ్యమైన విద్య,...

జూలై 24, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి దశమి ఉదయం 09.51 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం అనురాధ పూర్తిగా రోజంతా యోగం శుక్ల రాత్రి 10.25 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి ఉదయం 09.53 వరకు ఉపరి వణజి రాహుకాలం ఉదయం...

సింధు నాగరికత కాలం నాటి ముఖ్య నగరాలు|HISTORY|COMPITITIVE EXAMS|ADUGU SPECIAL

సింధు నాగరికతలో సుమారు రెండువందల పట్టణాలకు పైగా పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందులో ముఖ్యమైనవి హరప్పా, మోహెంజోదారో, లోథాల్, కాళీబంగన్, ఛాన్సుధారో, బాన్వాలీ, ధోలవీర మొదలగునవి. హరప్పా ఇది 1921 లో సింధు నాగరికతలో బయల్పడిన...

యియర్ పోన్లతోటి శెవులకు శిల్లే!?|ADUGU TRENDS

కొత్త టెక్నాలజీ వచ్చిందంటే సాలు..ఇగ దానెంటే పడ్తం. గదాన్నే అనుసరిత్తం. ఏమైతాందో సూసుకోం. గసొంటిదే గీ యియర్ పోన్ల వాడకం. గదేందో సూద్దా పదండ్రి. అదే పనిగా యియర్ పోన్లను వాడేటోల్లకు గా కర్ణభేరి...

నీట్ లీకేజీ.. అంత లోకువా!?|EDITORIAL

పరీక్షల విశ్వసనీయత దెబ్బతింటే విద్యా వ్యవస్థపై నమ్మకం పోతుంది. అందువల్ల నీట్ పేపర్ లీక్ వ్యవహారాన్ని కేవలం రాజకీయ ఆరోపణలు–ప్రత్యారోపణలకే పరిమితం చేయకుండా, పార్లమెంట్‌లో సమగ్రంగా చర్చించి, అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి...

జూలై 23, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి నవమి ఉదయం 08.27 వరకు ఉపరి దశమి నక్షత్రం విశాఖ రాత్రి తెల్ల 03.30 వరకు ఉపరి అనురాధ యోగం శుభ రాత్రి 10.06 వరకు ఉపరి శుక్ల కరణం కౌలవ ఉదయం 08.28...

అడుగు ఎక్స్ క్లూజివ్: సీజేపీ ఆందోళన వెనక కుట్ర కోణం?|CJP|NATIONAL|ADUGU EXCLUSIVE

ప్రాణాలకు తెగించి రావాలని సందేశాలు ప్రాణత్యాగాలు చేసిన వారిని గుర్తుంచుకుంటాం సీక్రెట్ యాప్‌తో పరస్పరం సందేశాలు చేరవేత సంసద్ యాత్రపై కూపీ లాగుతున్న పోలీసులు|SAMSAD న్యూఢిల్లీ, జూలై 21 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం చేపట్టిన...

గాడ వజ్రాల వాన!?|ADUGU TRENDS

మన కాడ.. ఏ తియ్ మనకాడేంది? ఏడైనా.. శినుకంటే నీటి సుక్కే. జల్లంటే నీల్లే. అని అనుకుంటం కానీ, గాడ మాత్రం శినుకంటే వజ్రం. వానంటే వజ్రాలే!? కానీ, గా వజ్రాలను మనం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News