Friday, June 19, 2026
32.1 C
Hyderabad

‘జల్ జీవన్ మిషన్’ తో నీటి సమస్యలు సమసేనా!?|EDITORIAL

నీటి సమస్య వనరుల లభ్యత, వినియోగ విధానం, దుర్వినియోగం, సమర్థవంతమైన నిర్వహణలపై ఆధారపడింది. గ్రామీణ భారతావనికి ప్రతి ఇంటికి నల్లాల ద్వారా మంచినీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘జల్ జీవన్ మిషన్’ ను దేశవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ పథకం వల్ల దేశంలో నీటి సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అయ్యాయా? అవుతున్నాయా? ఆ ‘మిషన్’ క‘న్నీటి’ని తుడిచేనా? నీటి సమస్యలు సమసేనా!?

నీటి సమస్య వనరుల లభ్యత, వినియోగ విధానం, దుర్వినియోగం, సమర్థవంతమైన నిర్వహణలపై ఆధారపడింది. గ్రామీణ భారతావనికి ప్రతి ఇంటికి నల్లాల ద్వారా మంచినీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘జల్ జీవన్ మిషన్’ ను దేశవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ పథకం వల్ల దేశంలో నీటి సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అయ్యాయా? అవుతున్నాయా? ఆ ‘మిషన్’ క‘న్నీటి’ని తుడిచేనా? నీటి సమస్యలు సమసేనా!?

2019 ఆగస్టు 15న ప్రకటించిన జల్ జీవన్ మిషన్ ప్రధాన లక్ష్యం గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి రోజుకు కనీసం 55 లీటర్ల తాగునీటిని పైప్ లైన్ ద్వారా అందించడం. ఈ పథకం ప్రారంభానికి ముందు దేశంలోని 19 కోట్ల గ్రామీణ కుటుంబాల్లో, కేవలం 3 కోట్ల కుటుంబాలకు మాత్రమే నల్లాలు ఉండేవి. అంటే కేవలం 17% కుటుంబాలకే మంచినీరు నేరుగా ఇంటికి చేరేది. కానీ, గత కొన్ని ఏళ్ళల్లో ఈ పథకం వేగంగా అమలవడం వల్ల 2026 నాటికి 15 కోట్లకు పైగా గ్రామీణ కుటుంబాలకు నల్లాల ద్వారా నీరు అందుతోంది. ఇది గ్రామీణ జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలకమైన అంశం. మహిళలు రోజూ గంటల తరబడి నీరు తెచ్చే కష్టాలు తగ్గడం, గ్రామాల్లో ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడడం వంటి ప్రయోజనాలు కనిపిస్తున్నాయి.

అయితే, ఈ సానుకూల విజయాల మధ్య దేశంలో నీటి వనరుల వాస్తవ పరిస్థితి ప్రతికూలంగానే గాక, ఆందోళనకరంగా ఉంది. ప్రపంచ జనాభాలో 18% మంది భారతదేశంలోనే నివసిస్తుంటే, ప్రపంచ నీటి వనరుల్లో దేశానికి కేవలం 4% మాత్రమే ఉన్నాయి. దేశంలో ఉపయోగించదగిన మొత్తం నీటి వనరులు 1,123 బిలియన్ క్యూబిక్ మీటర్లు మాత్రమే. ఇందులో ఉపరితల జలాలు 690 బిలియన్ క్యూబిక్ మీటర్లు కాగా, భూగర్భ జలాలు 433 బిలియన్ క్యూబిక్ మీటర్లుగా నమోదయ్యాయి.

ఇక దేశంలో ఉపయోగించే నీటిలో సుమారు 80% వ్యవసాయ రంగానికే వెళ్తోంది. గృహ వినియోగం 6% మాత్రమే కాగా, పరిశ్రమలు 5% నీటిని వినియోగిస్తున్నాయి. అంటే నీటి వినియోగంలో వ్యవసాయ రంగం ప్రధాన పాత్ర పోషిస్తోంది. వరి, చెరకు వంటి అధిక నీరు అవసరమయ్యే పంటలు పెద్ద మొత్తంలో నీటిని వినియోగిస్తున్నాయి.

భూగర్భ జలాల వినియోగంలో భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. దేశంలో తాగునీటి అవసరాల్లో 85%, సాగునీటిలో 60% వరకు భూగర్భ జలాలపైనే ఆధారపడి ఉన్నాయి. అయితే, అధికంగా బోర్లు తవ్వడం, నిరంతరంగా నీటిని పంపింగ్ చేయడం వల్ల అనేక ప్రాంతాల్లో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి అడుగంటి పోతున్నాయి. కేంద్ర గణాంకాల ప్రకారం దేశంలోని 700కి పైగా ప్రాంతాలు ‘ఓవర్ ఎక్స్ ప్లోయిటెడ్’ స్థితికి చేరాయి.

నీటి లభ్యతలో గత కొన్ని దశాబ్దాల్లో పెద్ద మార్పు వచ్చింది. 1951లో ప్రతి వ్యక్తికి ఏడాదికి 5,200 క్యూబిక్ మీటర్ల నీరు అందుబాటులో ఉండగా, ప్రస్తుతం అది 1,500 క్యూబిక్ మీటర్ల కంటే తక్కువకు పడిపోయింది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం దీన్ని ‘వాటర్ స్ట్రెస్’ పరిస్థితిగా పరిగణిస్తున్నారు. జనాభా పెరుగుదల, నగరీకరణ, పరిశ్రమల విస్తరణ వంటి కారణాల వల్ల భవిష్యత్తులో ఈ ఒత్తిడి మరింత పెరగే అవకాశం ఉంది.

దక్షిణ భారత రాష్ట్రాల్లో కూడా నీటి ఒత్తిడి అధికంగానే ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వ్యవసాయ అవసరాల కోసం భూగర్భ జలాల వినియోగం అధికంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం భూగర్భ జల వినియోగంలో 86% వ్యవసాయానికే వెళ్తోంది. తెలంగాణలో కూడా రైతులలో ఎక్కువ శాతం మంది భవిష్యత్తులో నీటి లభ్యతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దేశంలో నీటి సంక్షోభానికి ప్రధాన కారణాలు అనేకం ఉన్నాయి. సంప్రదాయ వరద సాగు పద్ధతులు భారీగా నీటిని వృథా చేస్తున్నాయి. నగరాల్లో మురుగు నీరు, పరిశ్రమల వ్యర్థాలు, నదులు, చెరువులను కాలుష్యానికి గురిచేస్తున్నాయి. చెరువులు, సరస్సులు ఆక్రమణలకు గురవడం వల్ల సహజ నీటి నిల్వ వ్యవస్థలు బలహీనపడ్డాయి. అంతేకాకుండా వర్షపు నీటిని సేకరించే, నిలువ చేసే పద్ధతులు చాలా ప్రాంతాల్లో సరైన స్థాయిలో అమలు కావడం లేదు.

ఈ నేపథ్యంలో జల్ జీవన్ మిషన్ ప్రధానంగా నీటి సరఫరా మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టిన పథకం మాత్రమే. పైప్‌లైన్లు వేయడం ద్వారా నీటిని ఇంటికి చేరవేయడం సాధ్యమే కానీ, నీటి వనరులు తగ్గిపోతే సరఫరా వ్యవస్థలు కూడా పనిచేయలేవు. కొన్ని ప్రాంతాల్లో వేసవికాలంలో ఈ సమస్య తీవ్రత ప్రస్ఫుటమవుతోంది.

దేశంలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలంటే సమగ్ర నీటి నిర్వహణ అవసరం. వర్షపు నీటి సంరక్షణను ప్రోత్సహించడం, డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ సాగు పద్ధతులను విస్తరించడం, తక్కువ నీరు అవసరమయ్యే పంటలను ప్రోత్సహించడం, చెరువులు, రిజర్వాయర్లను పునరుద్ధరించడం వంటి చర్యలు కీలకం. ప్రజలలో నీటి వినియోగంపై అవగాహన పెంచడం కూడా అంతే ముఖ్యమైన అంశం.

జల్ జీవన్ మిషన్ గ్రామీణ భారతానికి తాగునీటి అందుబాటును పెంచడంలో గొప్ప ముందడుగు. కానీ. అది నీటి సంక్షోభానికి పూర్తి పరిష్కారం మాత్రం కాదు. నీటి సంరక్షణ, సమర్థ వినియోగం, సమగ్ర విధానాలు సమన్వయం చేసి అమలు చేసినప్పుడే భారతదేశం భవిష్యత్తులో నీటి భద్రతను సాధించగలదు. నీటిని కేవలం వనరుగా కాకుండా జీవనాధారంగా భావించి పరిరక్షించే సంస్కృతి ఏర్పడితేనే ఈ సంక్షోభానికి దీర్ఘకాలిక పరిష్కారం లభిస్తుంది.

Latest News

ఎక్కువ కాలం ఎవలు బత్కుతరు?!|ADUGU TRENDS

పుట్టిన పతి ప్రాణీ గిట్టక మానది. గట్లనే ఒక్కో జీవికి ఒక్కో ఆయుర్ధాయం ఉంటది. జెల్లీ ఫిష్ కి ఏకంగా అమరత్వమే ఉందంట. గిది వయసైపోయినంక, మళ్ళీ శైశవ దశకు చేరుకుని జీవితాన్ని...

సంకల్పంతోనే కామన్ స్కూల్ విజయవంతం!|EDITORIAL

విద్యారంగంలో నిజమైన సంస్కరణలు రావాలంటే ప్రభుత్వ పాఠశాలల నాణ్యతను పెంచడం, కామన్ స్కూల్ విధానాన్ని దశలవారీగా అమలు చేయడం, ప్రైవేట్ విద్యాసంస్థలపై సమర్థవంతమైన నియంత్రణ విధించడం ఒకేసారి అమలు చేయాలి. తెలంగాణ పబ్లిక్...

జూన్ 19, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు పంచమి రాత్రి 10.13 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఆశ్లేష మధ్యాహ్నం 03.30 వరకు ఉపరి ముఖ యోగం హర్షణ రాత్రి 08.30 వరకు ఉపరి వజ్ర కరణం బవ ఉదయం 11.06...

అంతా ‘పత్తి’త్తులే!?|COTTON|CCI|SCAM

సీసీఐ పత్తి కొనుగోల్ మాల్! తప్పెవరిది? శిక్షలెవరికి? మిల్లర్లు, అధికారుల అనుబంధమేంటి? దళారుల ప్రమేయం నిజం కాదా? మార్కెటింగ్ శాఖదే బాధ్యతా? కేంద్రం ఎందుకు స్పందించదు? వరంగల్ జేడీఎం సప్పెన్షన్! 7గురు మార్కెట్ కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు 84మంది మార్కెటింగ్ అధికారులకు నోటీసులు సీసీఐ పత్తి...

మందుబాబులకో శుభవార్త!|ADUGU TRENDS

ఇగిప్పుడు యేడ సూసినా, తాగి పడేసిన బీరు, విస్కీ సీసాలెనాయె.! పార్కుల్ల, బస్సు స్టాపుల్ల, స్టాండ్లల్ల, రైల్వే స్టేషన్లల్ల, రోడ్ల పక్కల, శెట్ల కింద, ఆకరికి ఏర్గ పోయేకాడ, ఉచ్చ పోసే కాడా...

‘నీట్‌’గా నిర్వహించలేమా?!|EDITORIAL

లక్ష్యం ఎంత గొప్పదైనా, దాన్ని అమలు చేసే వ్యవస్థ సమర్థంగా, విశ్వసనీయంగా లేకపోతే నమ్మకం దెబ్బతింటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, ఎన్‌టీఏ ‘నీట్’ లోపాలను సరిదిద్దాలి. లేకపోతే ప్రతి ఏటా పరీక్షల కంటే...

జూన్ 18, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు చవితి రాత్రి 11.58 వరకు ఉపరి పంచమి నక్షత్రం పుష్యమి సాయంత్రం 04.32 వరకు ఉపరి ఆశ్లేష యోగం వ్యాఘాత రాత్రి 10.54 వరకు ఉపరి హర్షణ కరణం వణజి మధ్యాహ్నం 12.59 వరకు...

గోడలకంటే, గీ ఇకమతు మస్తుగుందే!|ADUGU TRENDS

ఇగిప్పుడు ఇండ్లు కట్టుడంటే గోడలే కాదుల్లా...! గోడల్లెక్కనే అద్దాలు పెట్టుడు, ఇనుప సువ్వలతోటి గ్రిల్స్ పెట్టుడు, రకరకాల డిజైన్లతోటి శేత్తాండ్రు. గోడలు మాత్రం పెడ్తలేరు. గవాటితోటి ఎల్తురుకు ఎల్తురు, గాలికి గాలి వత్తాంది....

పంటల సాగుకు శాశ్వత పరిష్కారమేది?!|EDITORIAL

వ్యవసాయం శాస్త్రీయ ప్రణాళిక, నాణ్యమైన ఇన్‌పుట్లు, సమర్థవంతమైన మార్కెటింగ్, ధరల భరోసా, ప్రభుత్వ మద్దతు అనే ఐదు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ప్రతి ఖరీఫ్‌కు ముందు రైతులు విత్తనాలు, ఎరువులు, రుణాల కోసం...

జూన్ 17, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు తదియ రాత్రి 02.00 వరకు ఉపరి చవితి నక్షత్రం పునర్వసు సాయంత్రం 05.51 వరకు ఉపరి పుష్యమి యోగం వృద్ధి రాత్రి 01.35 వరకు ఉపరి వ్యాఘాత కరణం తైతుల మధ్యాహ్నం 03.06 వరకు...

48 ఏండ్ల తర్వాత?!|ADUGU TRENDS

ఏడడుగులు, మూడు ముల్లతోటి పెండ్లైతది. ఇగ గీ ఏడు రోజులు, మూడు నెలల్లోనే యిడుపుకాయితం అయితున్న జంటలెన్నో? కనీ గీ జంట గివీటికి అతీతం.! అదెట్లనో మీరే సూడుండ్రి. బీహార్ రాస్ట్రంల పాట్నా జిల్లాకు...

విలీనమే పరిష్కారమా?!|EDITORIAL

ప్రాంతీయ పార్టీలన్నీ కాంగ్రెస్‌లో విలీనం కావాలనడం సరైన పరిష్కారమేనా? అదే బీజేపీ దూకుడుకు కళ్లెం వేయగలదా? ఒకవేళ బీజేపీలోనే ప్రాంతీయ పార్టీలు విలీనమైతే సరిపోతుందా? ప్రాంతీయ పార్టీల తరహాలోనే జాతీయ పార్టీల్లోనూ అధికారం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News