Thursday, September 17, 2026
27.7 C
Hyderabad

వచన సాహిత్యం ప్రజల సాహిత్యం!|ESSAY

ಓಂ శ్రీ గురు బసవ లింగాయ నమః! శరణు శరణార్థి! బీదర్ పట్టణం బసవగిరిలోని బసవ సేవా ప్రతిష్ఠాన వారి ఆధ్వర్యంలో 2026 జనవరి 30, 31 మరియు ఫిబ్రవరి 1 తేదీలలో మూడు రోజుల పాటు జరుగుతున్న 24 వ వచన విజయోత్సవం ప్రారంభ సమావేశ సందర్భంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మొదట, సభాధ్యక్షత వహించిన కర్ణాటక ప్రభుత్వ గౌరవ మంత్రి, వచన విజయోత్సవ స్వాగత సమితి అధ్యక్షులు శ్రీ ఈశ్వర్ ఖండ్రే గారికి నా మనఃపూర్వక నమస్కారాలు. తమ దివ్య సాన్నిధ్యంతో ఆధ్యాత్మిక అనుకంపనలు ప్రసాదించిన పరమ పూజ్యులు డాక్టర్ బసవలింగ పట్టదేవరు మరియు డాక్టర్ శివానంద మహాస్వామి వారలకు నా ప్రణామాలు. ఇటువంటి గొప్ప కార్యక్రమాలు నిర్వహణ చేస్తూ నేతృత్వం వహిస్తున్న పూజ్య డాక్టర్ గంగాంబిక అక్క గారికి నమస్కృతులు. వరిష్ఠ సాహితీవేత్త ప్రొఫెసర్ సిద్ధరామయ్య, విచ్చేసిన ముఖ్య అతిథులు, గౌరవ అతిథులు, సర్వులకూ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రజానాయకుడు డాక్టర్ భీమన్న ఖండ్రే గారిని స్మరించుకుంటూ, వారి ఆశీస్సులు అర్థిస్తున్నాను.

నేను డాక్టర్ రాపోలు సత్యనారాయణ, తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా పాలకుర్తి లోని సోమనాథ కళాపీఠం అధ్యక్షుడిని. పాలకుర్తి – తెలంగాణ ఆది కవి పాలకురికి సోమనాథుని జన్మస్థలం. సాంస్కృతికంగా, భౌగోళికంగా మనకు ఆత్మీయ బంధం ఉన్నది. బీదర్ ప్రాంతం, కళ్యాణ కర్ణాటక 1956 దాకా హైదరాబాద్ రాష్ట్రంలో అంతర్భాగం. పాలకురికి సోమనాథుడు బసవన్న మరియు శరణుల జీవిత చరిత్రను తెలుగు భాషలో వ్రాసిన తొలి కవి. తర్వాత భీమ కవి ద్వారా కన్నడలోనికి అనువదించబడింది. బసవన్న గారిని భక్తికి ప్రతి రూపంగా భావించినాడు సోమన్న.

ఉదాహరణ:
వడి వీచు గాడ్పున కొడలెల్ల తలలు,
వడి కాలు చిచ్చున కొడలెల్ల నోళ్లు,
వడి పారు జలమున కొడలెల్ల కాళ్లు,
వడి సేయు బసవని కొడలెల్ల భక్తి.

ఈ పద్య పాదాలు పాలకురికి సోమనాథునికి బసవన్న పట్ల ఉన్న భక్తి గాఢతను చూపిస్తున్నాయి.
గురు బసవన్న, ఇతర శరణుల వచనాలు ప్రజల భాషలో వ్రాయబడినాయి. సోమనాథుడు కూడా ప్రజలకు చేరేలా సరళమైన ద్విపద పద్యాలలో బసవ పురాణాన్ని వ్రాసినారు. ఈ ద్విపదలు సులభంగా పాడి ఆస్వాదించగల రీతిలో ఉంటాయి. సోమనాథుడు బసవ పురాణం ద్వారా తెలుగు నేలపై బసవ తత్త్వం, బసవ ధర్మం విస్తరించడంలో మహత్తరమైన కృషి చేసినాడు. అంతేకాదు, ప్రజల ఆలోచన శైలిలో మార్పుతో పాటు, సాహిత్య విప్లవం తీసుకొని వచ్చినాడు. వచన సాహిత్యం ప్రజల సాహిత్యం. సోమనాథుని రచనలు కూడా ప్రజల కోసమే.

గురు బసవన్న ప్రజలకు ఇష్టలింగాన్ని ప్రసాదించడం ద్వారా భగవంతుని ప్రజాస్వామ్యీకరించినారు. భక్తి, కాయకం, దాసోహం, హేతుబద్ధత వంటి విలువలను ప్రజల్లో చొప్పించినారు. సోమనాథుడు కూడా అదే మార్గంలో నడిచినాడు. సోమనాథుడు బసవన్న భావాలను తెలుగు నేల మరియు దేశంలోని ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చేసినారు. బసవన్న అనుచరులు ఇప్పటికీ సామాజిక, రాజకీయ రంగాల్లో మార్పులు తీసుకువస్తున్నారు.

సుప్రసిద్ధ తెలుగు కవి – గాయకుడు గద్దర్ లింగాయత అనుయాయి మరియు బసవ అవార్డు గ్రహీత. ప్రపంచవ్యాప్తంగా ఆదర్శవంతమైన సమాజం కోసం జరిగే ప్రయత్నాలు అన్నీ మనకు బసవన్న గారి సిద్ధాంతాలను గుర్తుచేస్తాయి. తెలంగాణ ప్రభుత్వం పాలకుర్తిలో సోమనాథ స్మృతి వనం నిర్మించి, పెద్ద శిల్పాన్ని ప్రతిష్టించింది.

హైదరాబాద్‌లో బసవ భవన్ నిర్మాణానికి భూమి కేటాయించింది. కర్ణాటక ప్రభుత్వం బసవన్నను సాంస్కృతిక నాయకుడిగా ప్రకటించింది. ఇక్కడ రామనగర జిల్లా, మాగడి సమీప కల్య గ్రామంలో పాలకురికి సోమనాథుని లింగైక్య స్థలాన్ని స్మారక స్థలంగా అభివృద్ధి చేయాలని, ముఖ్యమైన భాషలలో బసవ పురాణం మరియు వచనాలు అనువదించి ప్రచురించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని సోమనాథ కళాపీఠం పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాము.

చివరగా, డాక్టర్ గంగాంబిక అక్క గారిని పరిచయం చేసిన శరణ మడపతి వీరయ్య స్వామికి, లింగాయత ధర్మంలో ముఖ్యమైన సూక్ష్మాలు తెలిపిన ప్రొఫెసర్ కె నీలకంఠేశ్వర్ ప్రసాద్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ మూడు రోజుల ఉత్సవాలు ఘనంగా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ అందరికీ శరణు శరణార్థులు!

(24వ వచన విజయోత్సవంలో ప్రారంభ ప్రసంగం)

డాక్టర్ రాపోలు సత్యనారాయణ
ఫోన్: 9440163211

Latest News

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News