Friday, April 24, 2026
37.2 C
Hyderabad

వచన సాహిత్యం ప్రజల సాహిత్యం!|ESSAY

ಓಂ శ్రీ గురు బసవ లింగాయ నమః! శరణు శరణార్థి! బీదర్ పట్టణం బసవగిరిలోని బసవ సేవా ప్రతిష్ఠాన వారి ఆధ్వర్యంలో 2026 జనవరి 30, 31 మరియు ఫిబ్రవరి 1 తేదీలలో మూడు రోజుల పాటు జరుగుతున్న 24 వ వచన విజయోత్సవం ప్రారంభ సమావేశ సందర్భంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మొదట, సభాధ్యక్షత వహించిన కర్ణాటక ప్రభుత్వ గౌరవ మంత్రి, వచన విజయోత్సవ స్వాగత సమితి అధ్యక్షులు శ్రీ ఈశ్వర్ ఖండ్రే గారికి నా మనఃపూర్వక నమస్కారాలు. తమ దివ్య సాన్నిధ్యంతో ఆధ్యాత్మిక అనుకంపనలు ప్రసాదించిన పరమ పూజ్యులు డాక్టర్ బసవలింగ పట్టదేవరు మరియు డాక్టర్ శివానంద మహాస్వామి వారలకు నా ప్రణామాలు. ఇటువంటి గొప్ప కార్యక్రమాలు నిర్వహణ చేస్తూ నేతృత్వం వహిస్తున్న పూజ్య డాక్టర్ గంగాంబిక అక్క గారికి నమస్కృతులు. వరిష్ఠ సాహితీవేత్త ప్రొఫెసర్ సిద్ధరామయ్య, విచ్చేసిన ముఖ్య అతిథులు, గౌరవ అతిథులు, సర్వులకూ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రజానాయకుడు డాక్టర్ భీమన్న ఖండ్రే గారిని స్మరించుకుంటూ, వారి ఆశీస్సులు అర్థిస్తున్నాను.

నేను డాక్టర్ రాపోలు సత్యనారాయణ, తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా పాలకుర్తి లోని సోమనాథ కళాపీఠం అధ్యక్షుడిని. పాలకుర్తి – తెలంగాణ ఆది కవి పాలకురికి సోమనాథుని జన్మస్థలం. సాంస్కృతికంగా, భౌగోళికంగా మనకు ఆత్మీయ బంధం ఉన్నది. బీదర్ ప్రాంతం, కళ్యాణ కర్ణాటక 1956 దాకా హైదరాబాద్ రాష్ట్రంలో అంతర్భాగం. పాలకురికి సోమనాథుడు బసవన్న మరియు శరణుల జీవిత చరిత్రను తెలుగు భాషలో వ్రాసిన తొలి కవి. తర్వాత భీమ కవి ద్వారా కన్నడలోనికి అనువదించబడింది. బసవన్న గారిని భక్తికి ప్రతి రూపంగా భావించినాడు సోమన్న.

ఉదాహరణ:
వడి వీచు గాడ్పున కొడలెల్ల తలలు,
వడి కాలు చిచ్చున కొడలెల్ల నోళ్లు,
వడి పారు జలమున కొడలెల్ల కాళ్లు,
వడి సేయు బసవని కొడలెల్ల భక్తి.

ఈ పద్య పాదాలు పాలకురికి సోమనాథునికి బసవన్న పట్ల ఉన్న భక్తి గాఢతను చూపిస్తున్నాయి.
గురు బసవన్న, ఇతర శరణుల వచనాలు ప్రజల భాషలో వ్రాయబడినాయి. సోమనాథుడు కూడా ప్రజలకు చేరేలా సరళమైన ద్విపద పద్యాలలో బసవ పురాణాన్ని వ్రాసినారు. ఈ ద్విపదలు సులభంగా పాడి ఆస్వాదించగల రీతిలో ఉంటాయి. సోమనాథుడు బసవ పురాణం ద్వారా తెలుగు నేలపై బసవ తత్త్వం, బసవ ధర్మం విస్తరించడంలో మహత్తరమైన కృషి చేసినాడు. అంతేకాదు, ప్రజల ఆలోచన శైలిలో మార్పుతో పాటు, సాహిత్య విప్లవం తీసుకొని వచ్చినాడు. వచన సాహిత్యం ప్రజల సాహిత్యం. సోమనాథుని రచనలు కూడా ప్రజల కోసమే.

గురు బసవన్న ప్రజలకు ఇష్టలింగాన్ని ప్రసాదించడం ద్వారా భగవంతుని ప్రజాస్వామ్యీకరించినారు. భక్తి, కాయకం, దాసోహం, హేతుబద్ధత వంటి విలువలను ప్రజల్లో చొప్పించినారు. సోమనాథుడు కూడా అదే మార్గంలో నడిచినాడు. సోమనాథుడు బసవన్న భావాలను తెలుగు నేల మరియు దేశంలోని ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చేసినారు. బసవన్న అనుచరులు ఇప్పటికీ సామాజిక, రాజకీయ రంగాల్లో మార్పులు తీసుకువస్తున్నారు.

సుప్రసిద్ధ తెలుగు కవి – గాయకుడు గద్దర్ లింగాయత అనుయాయి మరియు బసవ అవార్డు గ్రహీత. ప్రపంచవ్యాప్తంగా ఆదర్శవంతమైన సమాజం కోసం జరిగే ప్రయత్నాలు అన్నీ మనకు బసవన్న గారి సిద్ధాంతాలను గుర్తుచేస్తాయి. తెలంగాణ ప్రభుత్వం పాలకుర్తిలో సోమనాథ స్మృతి వనం నిర్మించి, పెద్ద శిల్పాన్ని ప్రతిష్టించింది.

హైదరాబాద్‌లో బసవ భవన్ నిర్మాణానికి భూమి కేటాయించింది. కర్ణాటక ప్రభుత్వం బసవన్నను సాంస్కృతిక నాయకుడిగా ప్రకటించింది. ఇక్కడ రామనగర జిల్లా, మాగడి సమీప కల్య గ్రామంలో పాలకురికి సోమనాథుని లింగైక్య స్థలాన్ని స్మారక స్థలంగా అభివృద్ధి చేయాలని, ముఖ్యమైన భాషలలో బసవ పురాణం మరియు వచనాలు అనువదించి ప్రచురించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని సోమనాథ కళాపీఠం పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాము.

చివరగా, డాక్టర్ గంగాంబిక అక్క గారిని పరిచయం చేసిన శరణ మడపతి వీరయ్య స్వామికి, లింగాయత ధర్మంలో ముఖ్యమైన సూక్ష్మాలు తెలిపిన ప్రొఫెసర్ కె నీలకంఠేశ్వర్ ప్రసాద్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ మూడు రోజుల ఉత్సవాలు ఘనంగా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ అందరికీ శరణు శరణార్థులు!

(24వ వచన విజయోత్సవంలో ప్రారంభ ప్రసంగం)

డాక్టర్ రాపోలు సత్యనారాయణ
ఫోన్: 9440163211

Latest News

ఏయేయి ఎప్పుడు కొనాల్నో తెలుసా!?|ADUGU TRENDS

మనకు అవసరం ఉన్నప్పుడే యే వస్తువునైనా కొంటం. ఎప్పుడు పడితే గప్పుడు గా వస్తువలను కొంటే ఎక్కువ ధర పడ్తయి. ఇగ తక్కువ ధరకే గవాట్ని కొనాల్నంటే గవాటి సీజన్లను బట్టి గాకుండ,...

ప్రయాణ ప్రగతి రథ చక్రంపై ప్రభుత్వ నిర్లక్ష్యం!|EDITORIAL

ఎన్నికల రాజకీయాల్లో హామీలు ఇవ్వడం సహజం. కానీ ఆ హామీల అమలు విషయంలో నిర్లక్ష్యం ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరం. హామీలివ్వడం, గాలికి వదిలేయడం.. తెలంగాణలో గత కొన్నేళ్లుగా ఇదే ధోరణి పునరావృతమవుతోంది. అధికారంలోకి...

24-04-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం తిధి శు అష్టమి రాత్రి 11.34 వరకు ఉపరి నవమి నక్షత్రం పుష్యమి రాత్రి 12.18 వరకు ఉపరి ఆశ్లేష యోగం ధృతి ఉదయం 07.51 వరకు ఉపరి శూల కరణం భద్ర మధ్యాహ్నం...

ఖరీదైన కారుతోటే గా రోడ్డును బాగుశేసిండు!?|ADUGU TRENDS

మనసుంటే మార్గమున్నట్లే గద! మరి గా మార్గమే బాగా లేకపోతే? ఒకాయినె గా బాగా లేని రోడ్డును కోట్ల యిలువ శేసే ఖరీదైన కారుతోటి ఎట్ల బాగు శేసిండో సూడుండ్రి? బెంగళూరులో ఒకాయినె రోజూ...

ఒకటి ఒకటి ఒకటి! రెండు రెండు రెండు!!|EDITORIAL

దేశంలో ప్రతి ఏటా కోటిన్నర మంది విద్యార్థులు పది, ఇంటర్ వంటి కీలక పరీక్షలకు హాజరవుతున్నారు. వీళ్ళంతా ర్యాంకుల పోటీలో చిక్కుకుని తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికల...

23-04-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం తిధి శు సప్తమి రాత్రి 01.32 వరకు ఉపరి అష్టమి నక్షత్రం పునర్వసు రాత్రి 01.30 వరకు ఉపరి పుష్యమి యోగం సుకర్మ ఉదయం 10.41 వరకు ఉపరి ధృతి కరణం గరజి మధ్యాహ్నం...

గా కార్ బిల్డింగును సూద్దాం పాండ్రి!?|ADUGU TRENDS

ఒక్కొక్కలు ఒక్కో రకం. ఒక్కొక్కలిది ఒక్కో టేస్టు. ఎవ్వలిట్టం వాల్లది. గా హైదరాబాద్ పట్నంల ఫిష్ హౌజ్, రెడ్ బిల్డింగ్ వంటి ల్యాండ్ మార్క్ లను సూసినం. శేప ఆకారంలనే గా సర్కార్...

మండుటెండల గుణ‘పాఠాలు’! |EDITORIAL

ఈ ఏడాది వేసవి తీవ్రత అసాధారణ స్థాయికి చేరుకుంది. ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగి, వర్షపాతం తగ్గే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరికలు చేసినప్పటికీ, వాటి నివారణకు చర్యలు...

22-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 06.05 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఆరుద్ర రాత్రి తెల్ల 02.55 వరకు ఉపరి పునర్వసు యోగం అతిగండ మధ్యాహ్నం 01.40 వరకు ఉపరి సుకర్మ కరణం బాలవ...

గోడలకు గట్టిగ నీల్లు గొట్టే శిట్కా!?|ADUGU TRENDS

పెండ్లి శేసి సూడు... ఇల్లు కట్టి సూడన్నరు. గివి రెండు శేసుడు అంత వీజీ కాదన్నట్లు. గందుకే పండ్లి అన్నా, ఇల్లన్నా కనా కట్టమన్నట్లు. గట్లనే ఇల్లు కట్టాల్నంటే గా ముగ్గు పోసి...

కవిత పార్టీతో బీఆర్‌ఎస్‌కు లాభమా? నష్టమా?|EDITORIAL

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి వేదిక సిద్ధమవుతోంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ ప్రకటించబోతున్నట్లు వస్తున్న సమాచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రకటన కేవలం కొత్త...

21-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం శ్రీ ఆదిశంకరాచార్య జయంతి తిధి శు చవితి ఉదయం 08.31 వరకు ఉపరి పంచమి నక్షత్రం రోహిణి ఉదయం 06.14 వరకు ఉపరి మృగశిర యోగం శోభ సాయంత్రం 04.45 వరకు ఉపరి అతిగండ కరణం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News