Saturday, June 13, 2026
23.9 C
Hyderabad

అంబేద్కర్ అందరివాడు!|EDITORIAL

పాలకులు, ప్రజలు అంబేద్కర్ ఆశయాలను, సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణలో అనుసరించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఆయన సిద్ధాంతాలను కార్యరూపంలోకి తీసుకురావడం ముఖ్యం.అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి. ఒక ఆలోచన. ఒక ఆచరణ. ఒక ఉద్యమం. ఆ ఆలోచన సమాజంలో ప్రతిఫలించాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలి. అంబేద్కర్ కలలు కన్న సమానత్వ భారతాన్ని నిర్మించడం మన అందరి బాధ్యత. అదే ఆయనకు అందించే గొప్ప నివాళి.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ భారత చరిత్రలో ఒక అపూర్వ శక్తి. అనేక రంగాలలో ఆయన దేశానికి చేసిన సేవలు అజరామరాలు. భారత రాజ్యాంగ నిర్మాత, ప్రముఖ న్యాయవాది, ఆర్థికవేత్త, సంఘ, సమాజ సంస్కర్త. అంటరానితనం, కుల నిర్మూలన కోసం పోరాడిన ఆయన, స్వతంత్ర భారతదేశపు మొదటి న్యాయశాఖ మంత్రి. 1990లో భారత ప్రభుత్వం ఆయనకు అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ను మరణానంతరం ప్రదానం చేసింది.

అంబేద్కర్1891 ఏప్రిల్ 14న మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా అంబావాడే గ్రామంలో, రాంజీ సక్పాల్-భీమాబాయి దంపతుల 14వ సంతానంగా జన్మించారు. కొలంబియా విశ్వవిద్యాలయం, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి డాక్టరేట్ పట్టాలు పొందారు. భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. అందుకే ఆయనను “భారత రాజ్యాంగ శిల్పి” అని పిలుస్తారు. దళితుల సామాజిక, రాజకీయ హక్కుల కోసం ‘బహిష్కృత హితకారిణి సభ’ను స్థాపించారు. మహద్ సత్యాగ్రహం వంటి కార్యక్రమాల ద్వారా అస్పృశ్యతకు వ్యతిరేకంగా పోరాడారు. చరమాంకంలో బౌద్ధ మతాన్ని స్వీకరించారు, ఆయనతో పాటు వేలాది మంది దళితులు బౌద్ధంలోకి మారారు. అంబేద్కర్, తన బాల్యం నుంచే కులవివక్షను అనుభవించారు. అయితే ఆ అనుభవాలే ఆయనను సమానత్వం కోసం పోరాడే మహానాయకుడిగా తీర్చిదిద్దాయి.

అంబేద్కర్ ఆశయాలలో ప్రధానమైనది అస్పృశ్యత నిర్మూలన. సమాజంలో ఒక వర్గాన్ని తక్కువగా చూడటం, అంటరాని వారుగా దూరం పెట్టడం అనేది మానవత్వానికి విరుద్ధమని ఆయన గట్టిగా నమ్మారు. దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు సమాన హక్కులు పొందాలంటే విద్యే ప్రధాన ఆయుధమని భావించారు. అందుకే “శోధించు, సంఘటితం అవ్వు, పోరాడు” అనే సిద్ధాంతంతో అణగారిన వర్గాల్లో చైతన్యం నింపారు.

1927లో మహద్ సత్యాగ్రహం ద్వారా దళితులకు సామాన్య నీటి వనరులను వినియోగించే హక్కును సాధించడం ఆయన పోరాట పటిమకు నిదర్శనం. అలాగే విద్య, ఉపాధి, దేవాలయ ప్రవేశం వంటి అనేక అంశాలలో సమాన హక్కుల కోసం నిరంతరం కృషి చేశారు. అంబేద్కర్ కేవలం ఒక వర్గానికే పరిమితమైన నాయకుడు కాదు. సమాజంలోని అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేసిన దూరదృష్టి గల నాయకుడు.

భారతదేశం స్వాతంత్ర్యం సాధించిన తరువాత, అంబేద్కర్ దేశపు తొలి న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ముఖ్యంగా భారత రాజ్యాంగ రూపకల్పనలో ఆయన పోషించిన పాత్ర అపారమైనది. విభిన్న భాషలు, మతాలు, సంస్కృతులు కలిసిన భారత దేశంలో సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం అనే మూల సూత్రాలను రాజ్యాంగంలో ప్రతిష్టించి, దేశ భవిష్యత్తుకు బలమైన పునాది వేశారు. ఈ రోజు భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా నిలబడటానికి ఆయన రచించిన రాజ్యాంగమే ప్రధాన ఆధారం.

అంబేద్కర్ మహిళల హక్కుల పరిరక్షణకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. మహిళలకు సమాన వేతనం, గర్భధారణ సమయంలో సెలవులు, ఆస్తి హక్కులు వంటి అంశాలలో ఆయన చేసిన కృషి విశేషం. అలాగే కార్మికుల పని గంటలను 12 గంటల నుండి 8 గంటలకు పరిమితం చేయాలనే ఆలోచన ఆయన సమానత్వ దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది.

అమెరికాలో విద్యాభ్యాసం సమయంలో ఆయన అనుభవించిన స్వేచ్ఛ, సమానత్వం ఆయన ఆలోచనలకు మరింత విస్తృత దృక్పథాన్ని ఇచ్చింది. అక్కడి సమాజంలో కుల, మత వివక్షత లేకుండా అందరికీ సమాన అవకాశాలు ఉండడం ఆయనను ప్రభావితం చేసింది. ఆ అనుభవాలను భారతదేశంలో అమలు చేయాలనే సంకల్పంతో ఆయన నిరంతరం కృషి చేశారు.

అయితే అంబేద్కర్ ఆశయాలు నేటి సమాజంలో పూర్తిగా ఆచరణలోకి వచ్చాయని చెప్పలేం. ఇంకా అనేక ప్రాంతాల్లో కుల వివక్ష, అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసేంత మాత్రాన ఆయనకు నిజమైన గౌరవం ఇచ్చినట్టుకాదు. ఆయన చూపిన మార్గాన్ని అనుసరించడం, సమానత్వం కోసం కృషి చేయడం, ప్రతి ఒక్కరికీ విద్య అందించే ప్రయత్నం చేయడం ద్వారానే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్టవుతుంది.

ప్రస్తుతం పాలకులు, ప్రజలు అంబేద్కర్ ఆశయాలను సీరియస్‌గా ఆలోచించాల్సిన సమయమిది. సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణలో ఆయన చూపిన దారిని అనుసరించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన పేరును ఉపయోగించడం కాకుండా, ఆయన సిద్ధాంతాలను కార్యరూపంలోకి తీసుకురావడం ముఖ్యం.

మొత్తానికి, అంబేద్కర్ కేవలం ఒక వ్యక్తి కాదు. ఒక ఆలోచన. ఒక ఆచరణ. ఒక ఉద్యమం. ఆ ఆలోచన సమాజంలో ప్రతిఫలించాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలి. అంబేద్కర్ కలలు కన్న సమానత్వ భారతాన్ని నిర్మించడం మన అందరి బాధ్యత. అదే ఆయనకు అందించే గొప్ప నివాళి.

Latest News

నచ్చత్రాల ఇల్లు!|ADUGU TRENDS

ఆకాసంల నచ్ఛత్రాలన్నీ మన ఇంటిమీదకే వత్తే ఎట్లుంటది!? గట్లనే ఓ ఇల్లు కట్టుకుంటే ఇంకెట్లుంటది!? మబ్బుల్ల తేలాడినట్లే ఉంటది కదా? ఇది కలేం కాదుల్లా? దాన్ని నిజం చేసేటట్లు ఇప్పుడు ఇండ్లు కడతుండ్రు.!...

టీఎంసీ భవితవ్యమేంటి?!|EDITORIAL

టీఎంసీలో గందరగోళానికి బీజేపీ కారణమా? బెంగాల్ లో కాంగ్రెస్‌కు పునరుజ్జీవం లభిస్తుందా? కాంగ్రెస్ లో టీఎంసీ విలీనంపై వస్తున్న ఊహాగానాలు నిజమేనా? రాజకీయాల్లో ఏ పార్టీకైనా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నంత కాలమే మనుగడ....

జూన్ 12, శుక్రవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి సాయంత్రం 04.06 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం భరణి రాత్రి 01.46 వరకు ఉపరి కృత్తిక యోగం అతిగండ రాత్రి 07.20 వరకు ఉపరి సుకర్మ కరణం తైతుల సాయంత్రం 04.06...

గీ కోతి మనుసులకే ఆదర్శం!|ADUGU TRENDS

నిజం కాకపోయినా, కోతి నుండే మనిసి వచ్చాడంటరు. కోతులకు మనుసులకు గంత పోలికన్నట్లు. గా కోతుల బుద్ధులు, శేట్టలు మనుసులకు కూడా ఉంటయి. కొందరిల బయట పడ్తయి. మరికొందరిల బయట పడయి గంతే....

నిరంతరాయ ప్రధానిగా మోదీ రికార్డు!|EDITORIAL

మోదీ, నెహ్రూ రికార్డును అధిగమించడం కేవలం ఒక గణాంక ఘట్టం మాత్రమే కాదు. ఇది భారత ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ద్వారా వరుసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చిన నాయకుడి రాజకీయ ప్రయాణానికి...

జూన్ 11-గురువారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి సాయంత్రం 06.03 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం అశ్విని రాత్రి తెల్ల 03.02 వరకు ఉపరి భరణి యోగం శోభ రాత్రి 10.00 వరకు ఉపరి అతిగండ కరణం బవ ఉదయం...

శెట్టు కిందే ఊరు!|ADUGU TRENDS

ఎండా కాలమొస్తే మనమేం శేత్తానం? ప్యాన్లు, ప్రిజ్జీలు, కూలర్లు, ఏసీలను సిద్ధం చేసుకుంటానం. మండే కాలం వత్తాందనంగనే గవాటన్నింటినీ మరమ్మతులు చేసి పెట్టుకుంటానం. ఎండ మండుతనే ఉండె, కరెంటు కాల్తనే ఉండె. ఇగ...

ట్రంప్ కు బోస్టన్ తీర్పు దెబ్బ!|EDITORIAL

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలస విధానాలపై, హెచ్-1బీ వీసాలపై విధించిన లక్ష డాలర్ల ఫీజును బోస్టన్ ఫెడరల్ కోర్టు చట్టవిరుద్ధమని ప్రకటించింది. ఆ తీర్పు భారతీయ వృత్తి నిపుణులకు తక్షణ ఊరటనిచ్చినా, అంతిమ...

జూన్ 10-బుధవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ దశమి రాత్రి 07.41 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం రేవతి రాత్రి తెల్ల 04.00 వరకు ఉపరి అశ్విని యోగం సౌభాగ్య రాత్రి 12.20 వరకు ఉపరి శోభ కరణం వణజి ఉదయం...

సేఫ్టీ డోర్లు!|ADUGU TRENDS

భద్రతకే భద్రత లేని రోజులియి.! మరైతే మనమెంత భద్రంగుండాలె? మనమెంత జాగర్త పడ్డా దోసేటోడు కొత్త కొత్త దారుల్ల దోస్తనే ఉన్నడు. కట్టం లేకుండా మన సొక్కం మన గాబుల్ల, జేబుల్ల నిండాలె....

దేశానికి ముప్పుగా డ్రగ్స్ దందా!|EDITORIAL

యువతను మాదక ద్రవ్యాల మహమ్మారి నుంచి కాపాడటం కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు. అది సమాజం మొత్తం నిర్వర్తించాల్సిన సామూహిక కర్తవ్యం. నేడు అప్రమత్తంగా వ్యవహరిస్తేనే రేపటి తరాన్ని ఆరోగ్యవంతమైన, సురక్షితమైన...

09-06-2026, మంగళవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 సంకల్ప తిథి: కృష్ణ-నవమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-నవమి తిథి : కృష్ణ-నవమి తె. ఝా 2:35 వరకు...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News