Tuesday, August 4, 2026
29.8 C
Hyderabad

ఆర్థిక దివాళాపై ప్రభుత్వాల మౌనం ఇంకెన్నాళ్ళు!?|EDITORIAL

ప్రపంచ దేశదేశాల నుండి పల్లెలతో నిండి ఉన్న మనదేశం, రాష్ట్రాల వరకు ఆర్థిక వ్యవస్థలన్నీ అత్యంత విచారకరంగా ఉన్నాయి. గడిచిన కొన్ని దశాబ్దాలలో ఎన్నడూ లేనంతగా అప్పుల్లోనో, దివాళాలోనే ఉన్నాయి. అవాంఛనీయ ఆర్థిక దుర్భర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రభుత్వాలు, ప్రభుత్వరంగ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్లు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. వాటిలో చాలావరకు దివాళా దశకు చేరుకున్నాయి. సరిదిద్దాల్సిన ప్రభుత్వాలు వీటిపై స్పందిచడం లేదు. ఆ ప్రభుత్వాలు, పాలకులే ఆర్థిక సంక్షోభాలకు కారణమవడం విచారకరం.

ఆర్థిక పాలన, పరిపాలనా వ్యవస్థలో అసమానతలు, అసమతౌల్యతలు, అక్రమాలను, పాలనా వైఫల్యాలను ప్రతిబింబిస్తున్నాయి. ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థలు, బ్యాంకులు, ప్రైవేట్ కంపెనీలు తమ ఆర్థిక బాధ్యతలను నిర్వహించలేకపోతే, అది కేవలం వాటి పరాజయం మాత్రమే కాదు. అది మొత్తం సమాజం, ప్రజలు, రాష్ట్రం, దేశం, ప్రజాస్వామిక వ్యవస్థ మొత్తం ఓటమి కిందే లెక్క. ప్రభుత్వ సంస్థలు, విమానయాన సంస్థలు, విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, ప్రాంతీయ రవాణా సంస్థలు, బ్యాంకులు, పరిశ్రమలు, కొర్పొరేట్ సంస్థలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాల్లో కూరుకుపోతున్నాయి. నష్టాల్లో ఉంటూ, వేతనాలకే దిక్కులేని స్థితిలో ఉన్నా, పాలకులు మౌనం పాటించడం ప్రజల్లో అనుమానాలు, అసహనాన్ని కలిగిస్తున్నాయి.

ప్రభుత్వ రంగ సంస్థల ఆర్థిక లెక్కల్లో పారదర్శకత లేకపోవడం, ఆడిట్ నివేదికలను ప్రజల ముందు ఉంచకపోవడం మనకు కనిపిస్తోంది. కొన్ని ప్రభుత్వాలు అర్థవంతమైన వ్యయ నియంత్రణను పాటించక పోగా, దుబారాలు చేస్తున్నాయి. ప్రజావసరాలను, ఆర్థిక వ్యవస్థ మంచిచెడులు పట్టించుకోకుండా, పెద్ద ప్రాజెక్టులపై మరీ ఎక్కువ ఖర్చు చేయడం మూలంగా అప్పుల భారం పెరిగింది. మరోవైపు ఆర్థిక లావాదేవీలు, నిజ పరిస్థితిని ప్రజల ముందు పెట్టకుండా, ఎక్కడ తమ అవినీతి, దుబారా, అక్రమాలు బయటపడతాయోనన్న భయం, ప్రజల్లో తమ నమ్మకం పోతుందన్న అనుమానంతో పాలకులు అసలు సమస్యను పరిష్కరించడానికంటే దాని నుంచి ప్రజలు, మీడియా దృష్టి మళ్లించడానికే ఎక్కువ ప్రయత్నిస్తున్నారు. ఉదాహరణకు మిషన్ భగీరథ పథకంపై అప్పులు తెచ్చేప్పుడు ప్రజలకు నీటిని సరఫరా చేసి, డబ్బులు వసూలు చేసి కడతామన్న ప్రభుత్వమే, ప్రజలకు ఉచితంగా నీరిస్తున్నామని ఇచ్చేసి, అసలు విషయాన్ని మరుగున పడేసింది. చివరకు ఆ అప్పు ప్రజలకు భారంగా మిగిలింది. ప్రజలకు ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ, నిర్వహణ, ఖర్చు, ఆస్తులు, అప్పులు వంటి ప్రక్రియల గురించి ప్రజలకు పెద్దగా అవగాహన లేకపోవడం వల్ల పాలకులు ఆడింది ఆటగా, పాడింది పాటగా మారతోంది. అందుకే ఈ భారీ లోటు బడ్జెట్ లు. ఎక్కడి నుంచే డబ్బులు వస్తాయని ఊహించి, కాకిలెక్కలతో మిగులు, అధిక కేటాయింపులు చూపించి, చివరకు ఎవరికీ ఏమివ్వకుండా చిప్ప చేతికిచ్చి, ఆదాయానికి మించిన ఖర్చులు, అప్పులు, వడ్డీలు చూపిస్తున్నారు నేటి పాలకులు.

ఇక ఈ నష్టాల బడ్జెట్ లు ప్రభావాలు కేవలం సర్కార్ కో, ఆయా సంస్థలకో పరిమితం కావు. అవి ఉద్యోగ, ఉపాధి రంగాలతోపాటు, వేతనాలు కూడా ఇవ్వలేని దైన్యం దాపురిస్తుంది. అధిక వ్యయం, పన్నుల భారం, సేవలలో నాణ్యత లోపం, అనేక అభివ్రుద్ధి పనులకు ఆర్థిక అడ్డంకులు వంటి రూపాల్లో ప్రత్యక్షంగా సామాన్య ప్రజలపై పడతాయి.

అమెరికా, జర్మనీ, జపాన్ వంటి అభివ్రుద్ధి చెందిన దేశాలు ఇలాంటి ఆర్థిక సంక్షోభాలు సంభవించినప్పుడు న్యాయ విచారణలు చేపట్టడం, వాస్తవాలను ప్రజల ముందు పెట్టడం, ప్రత్యామ్నాయ మార్గాలను వెతకడం, వంటి చర్యలకు పూనుకుంటున్నాయి తప్పితే, మన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మాదిరిగా మౌనం పాటించడం లేదు. నెపాలు అన్యులపై నెట్టడం లేదు. నీతి లేని రాజకీయాల, నిజాయితీలేని రాజకీయాలు చేయడంలేదు. ఇది ప్రజలకు, ప్రజాస్వామ్యానికి, దేశానికి కూడా అంత మంచిది కాదు. దేశ, రాష్ట్రాల అంతర్గత, బహిర్గత సంక్షోభాలకు దారి తీసే ప్రమాదం ఉంది.

ఈ అంశాలపై మీడియా పాత్ర కూడా సంశయాత్మకంగానే కనిపిస్తోంది. పార్టీలకే మీడియా సంస్థలుండటం, మీడియా సంస్థలు పార్టీల వారీగా అనుకూలంగా, వ్యతిరేకంగా విడివిడిగా ఉండటం వల్ల వాస్తవాంశాలు కాకుండా, ఆయా పార్టీల అనుకూలాంశాలుగా వార్తా కథనాలు వస్తున్నాయి. దీంతో మీడియా తమకవసరమైన మేర తప్ప, అప్రమత్తంగా ఉండకపోవడం, కొన్నిసార్లు తప్పుడు వార్తలే రాయడం, సృష్టించడం, మౌనం పాటించడం వల్ల ప్రజలకు కన్ఫ్యూజన్ ఏర్పడుతోంది. సమస్య తాలూకు తీవ్రత అర్థం కావడం లేదు. మీడియా సంస్ధలు ప్రజా ప్రయోజనాలకంటే, స్వప్రయోజనాలకే మొగ్గు చూపడం వంటివి ప్రజాస్వామ్యానికి పెద్ద దెబ్బగా మారింది.

పారదర్శకంగా పరిపాలన ఉండాలి. ప్రభుత్వ రంగ సంస్థల ఆర్థిక లెక్కలను ఓపెన్ డేటా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రజలకి అందుబాటులో ఉంచాలి. ప్రభుత్వాలకు జవాబుదారితనం ఉండాలి. పాలనా వైఫల్యాలపై నిజాయితీగా న్యాయ విచారణలు జరిపించాలి. ఆర్థిక పరిపుష్టి ఉన్నసంస్థలతో నష్ట సంస్థలను అనుసంధానించాలి. ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేట్ మేనేజ్మెంట్ తరహాలో నైపుణ్యంగా, జవాబుదారితనంతో పని చేసే వ్యవస్థను రూపొందించాలి. ఆర్థిక సంస్కరణలను ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించాలి. పాలకులు ఏకస్వామ్యంగా నడుపుతోన్న ప్రస్తుత ప్రజాస్వామిక వ్యవస్థలో ఆర్థిక నష్టాలకు, అసహనాలకు గురయ్యే ప్రజలు తిరుబాటు చేస్తారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. లేదంటే తగిన శాస్తి తప్పదు.

Latest News

ఆగస్టు 04, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి రాత్రి 07.06 వరకు ఉపరి సప్తమి నక్షత్రం రేవతి రాత్రి 08.09 వరకు ఉపరి అశ్విని యోగం ధృతి రాత్రి 06.53 వరకు ఉపరి శూల కరణం గరజి ఉదయం 07.45...

గీ అవుడియ అదిరింది!?|ADUGU TRENDS

ఒక అవుడియ జీవితాన్నే మారుస్తదంటే గిదేనేమో మరి! ఏదైనా ఆలోశన శేత్తే, ఏదో ఒకటి జర్గుతది. లేకపోతే ఊదు కాలది పిల్లి గూడ లేవది? గది సరే గనీ గా పిల్లగాడు శేసిందేంటో...

అధికారం రాగానే హామీలు హుష్ కాకీ!?

ప్రజలు ఇప్పుడు రాజకీయ పార్టీల ప్రకటనలను కాకుండా వాటి పనితీరును కొలుస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కాలపరిమితి నిర్ణయించి, వాటి అమలుపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి శ్వేతపత్రం విడుదల చేయడం...

ఆగస్టు 03, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి రాత్రి 08.18 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 08.37 వరకు ఉపరి రేవతి యోగం సుకర్మ రాత్రి 08.54 వరకు ఉపరి ధృతి కరణం కౌలవ ఉదయం 08.40...

అవుమల్లా! కడుపుల బిడ్డ స్పందిత్తదా!?|ADUGU TRENDS

తల్లి గర్భంల ఉండంగనే బిడ్డలకి బయటియి యినబడ్తయా? గవాటికి గా పిల్లలు గూడ స్పందిత్తరా? యెన్కటికి కడుపుల ఉండంగనే అర్జునుడి కొడుకు అభిమన్యుడు పద్మవ్యూహంలకెట్ల పోవాల్నో తెలుసుకున్నడట. గిది నిజమో కాదో కనీ,...

ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ గా భోగాపురం!?|EDITORIAL

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఒక కొత్త అవకాశాన్ని తెరిచింది. ఈ అవకాశాన్ని స్థిరమైన అభివృద్ధిగా మలచడం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్థానిక ప్రజల సమిష్టి కృషిపైనే ఆధారపడి ఉంటుంది. మౌలిక వసతుల...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 02 నుండి ఆగస్టు 08 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీరు చేపట్టే పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో...

యిధి యిసిత్రమైందంటే గిదే మరి!?|ADUGU TRENDS

యిధి శాల యిసిత్రమైంది. ఒకపాలి కలిసున్నోల్లను సిడెంల యిడదీత్తది. యిడిపోయినోల్లని శిటికెల కలిపేత్తది. గసొంటిదే గీ ముచ్చట. గదేందో సూద్దాం పాండ్రి. తమిళనాడు రాస్ట్రం విరుదు నగర్ జిల్లా తిరుచూలి పూమాలై పట్టీకి శెందిన...

పోలీసింగ్ పై పార్లమెంటులో సమీక్షేది!?|EDITORIAL

పార్లమెంట్ వరుసగా వాయిదాలు పడుతూ స్తంభిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ప్రతిష్ఠంభనల వల్ల ఉభయ సభల్లో కీలక అంశాలపై అసలు చర్చే జరగడం లేదు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు కూడా అత్యవసరం....

ఆగస్టు 01, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ తదియ రాత్రి 09.20 వరకు ఉపరి చవితి నక్షత్రం శతభిషం రాత్రి 08.09 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శోభ రాత్రి 11.43 వరకు ఉపరి అతిగండ కరణం వణజి ఉదయం 09.10...

తెలంగాణ ‘పెద్ద’న్న అస్తమయం!|TELANGANA|PEDDI SUDHARSHAN REDDY

ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు హనుమకొండలో గుండెపోటు మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు 5రోజులు మృత్యువుతో పోరాటం కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ...

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News