Friday, March 13, 2026
24.7 C
Hyderabad

ఆర్థిక దివాళాపై ప్రభుత్వాల మౌనం ఇంకెన్నాళ్ళు!?|EDITORIAL

ప్రపంచ దేశదేశాల నుండి పల్లెలతో నిండి ఉన్న మనదేశం, రాష్ట్రాల వరకు ఆర్థిక వ్యవస్థలన్నీ అత్యంత విచారకరంగా ఉన్నాయి. గడిచిన కొన్ని దశాబ్దాలలో ఎన్నడూ లేనంతగా అప్పుల్లోనో, దివాళాలోనే ఉన్నాయి. అవాంఛనీయ ఆర్థిక దుర్భర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రభుత్వాలు, ప్రభుత్వరంగ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్లు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. వాటిలో చాలావరకు దివాళా దశకు చేరుకున్నాయి. సరిదిద్దాల్సిన ప్రభుత్వాలు వీటిపై స్పందిచడం లేదు. ఆ ప్రభుత్వాలు, పాలకులే ఆర్థిక సంక్షోభాలకు కారణమవడం విచారకరం.

ఆర్థిక పాలన, పరిపాలనా వ్యవస్థలో అసమానతలు, అసమతౌల్యతలు, అక్రమాలను, పాలనా వైఫల్యాలను ప్రతిబింబిస్తున్నాయి. ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థలు, బ్యాంకులు, ప్రైవేట్ కంపెనీలు తమ ఆర్థిక బాధ్యతలను నిర్వహించలేకపోతే, అది కేవలం వాటి పరాజయం మాత్రమే కాదు. అది మొత్తం సమాజం, ప్రజలు, రాష్ట్రం, దేశం, ప్రజాస్వామిక వ్యవస్థ మొత్తం ఓటమి కిందే లెక్క. ప్రభుత్వ సంస్థలు, విమానయాన సంస్థలు, విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, ప్రాంతీయ రవాణా సంస్థలు, బ్యాంకులు, పరిశ్రమలు, కొర్పొరేట్ సంస్థలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాల్లో కూరుకుపోతున్నాయి. నష్టాల్లో ఉంటూ, వేతనాలకే దిక్కులేని స్థితిలో ఉన్నా, పాలకులు మౌనం పాటించడం ప్రజల్లో అనుమానాలు, అసహనాన్ని కలిగిస్తున్నాయి.

ప్రభుత్వ రంగ సంస్థల ఆర్థిక లెక్కల్లో పారదర్శకత లేకపోవడం, ఆడిట్ నివేదికలను ప్రజల ముందు ఉంచకపోవడం మనకు కనిపిస్తోంది. కొన్ని ప్రభుత్వాలు అర్థవంతమైన వ్యయ నియంత్రణను పాటించక పోగా, దుబారాలు చేస్తున్నాయి. ప్రజావసరాలను, ఆర్థిక వ్యవస్థ మంచిచెడులు పట్టించుకోకుండా, పెద్ద ప్రాజెక్టులపై మరీ ఎక్కువ ఖర్చు చేయడం మూలంగా అప్పుల భారం పెరిగింది. మరోవైపు ఆర్థిక లావాదేవీలు, నిజ పరిస్థితిని ప్రజల ముందు పెట్టకుండా, ఎక్కడ తమ అవినీతి, దుబారా, అక్రమాలు బయటపడతాయోనన్న భయం, ప్రజల్లో తమ నమ్మకం పోతుందన్న అనుమానంతో పాలకులు అసలు సమస్యను పరిష్కరించడానికంటే దాని నుంచి ప్రజలు, మీడియా దృష్టి మళ్లించడానికే ఎక్కువ ప్రయత్నిస్తున్నారు. ఉదాహరణకు మిషన్ భగీరథ పథకంపై అప్పులు తెచ్చేప్పుడు ప్రజలకు నీటిని సరఫరా చేసి, డబ్బులు వసూలు చేసి కడతామన్న ప్రభుత్వమే, ప్రజలకు ఉచితంగా నీరిస్తున్నామని ఇచ్చేసి, అసలు విషయాన్ని మరుగున పడేసింది. చివరకు ఆ అప్పు ప్రజలకు భారంగా మిగిలింది. ప్రజలకు ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ, నిర్వహణ, ఖర్చు, ఆస్తులు, అప్పులు వంటి ప్రక్రియల గురించి ప్రజలకు పెద్దగా అవగాహన లేకపోవడం వల్ల పాలకులు ఆడింది ఆటగా, పాడింది పాటగా మారతోంది. అందుకే ఈ భారీ లోటు బడ్జెట్ లు. ఎక్కడి నుంచే డబ్బులు వస్తాయని ఊహించి, కాకిలెక్కలతో మిగులు, అధిక కేటాయింపులు చూపించి, చివరకు ఎవరికీ ఏమివ్వకుండా చిప్ప చేతికిచ్చి, ఆదాయానికి మించిన ఖర్చులు, అప్పులు, వడ్డీలు చూపిస్తున్నారు నేటి పాలకులు.

ఇక ఈ నష్టాల బడ్జెట్ లు ప్రభావాలు కేవలం సర్కార్ కో, ఆయా సంస్థలకో పరిమితం కావు. అవి ఉద్యోగ, ఉపాధి రంగాలతోపాటు, వేతనాలు కూడా ఇవ్వలేని దైన్యం దాపురిస్తుంది. అధిక వ్యయం, పన్నుల భారం, సేవలలో నాణ్యత లోపం, అనేక అభివ్రుద్ధి పనులకు ఆర్థిక అడ్డంకులు వంటి రూపాల్లో ప్రత్యక్షంగా సామాన్య ప్రజలపై పడతాయి.

అమెరికా, జర్మనీ, జపాన్ వంటి అభివ్రుద్ధి చెందిన దేశాలు ఇలాంటి ఆర్థిక సంక్షోభాలు సంభవించినప్పుడు న్యాయ విచారణలు చేపట్టడం, వాస్తవాలను ప్రజల ముందు పెట్టడం, ప్రత్యామ్నాయ మార్గాలను వెతకడం, వంటి చర్యలకు పూనుకుంటున్నాయి తప్పితే, మన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మాదిరిగా మౌనం పాటించడం లేదు. నెపాలు అన్యులపై నెట్టడం లేదు. నీతి లేని రాజకీయాల, నిజాయితీలేని రాజకీయాలు చేయడంలేదు. ఇది ప్రజలకు, ప్రజాస్వామ్యానికి, దేశానికి కూడా అంత మంచిది కాదు. దేశ, రాష్ట్రాల అంతర్గత, బహిర్గత సంక్షోభాలకు దారి తీసే ప్రమాదం ఉంది.

ఈ అంశాలపై మీడియా పాత్ర కూడా సంశయాత్మకంగానే కనిపిస్తోంది. పార్టీలకే మీడియా సంస్థలుండటం, మీడియా సంస్థలు పార్టీల వారీగా అనుకూలంగా, వ్యతిరేకంగా విడివిడిగా ఉండటం వల్ల వాస్తవాంశాలు కాకుండా, ఆయా పార్టీల అనుకూలాంశాలుగా వార్తా కథనాలు వస్తున్నాయి. దీంతో మీడియా తమకవసరమైన మేర తప్ప, అప్రమత్తంగా ఉండకపోవడం, కొన్నిసార్లు తప్పుడు వార్తలే రాయడం, సృష్టించడం, మౌనం పాటించడం వల్ల ప్రజలకు కన్ఫ్యూజన్ ఏర్పడుతోంది. సమస్య తాలూకు తీవ్రత అర్థం కావడం లేదు. మీడియా సంస్ధలు ప్రజా ప్రయోజనాలకంటే, స్వప్రయోజనాలకే మొగ్గు చూపడం వంటివి ప్రజాస్వామ్యానికి పెద్ద దెబ్బగా మారింది.

పారదర్శకంగా పరిపాలన ఉండాలి. ప్రభుత్వ రంగ సంస్థల ఆర్థిక లెక్కలను ఓపెన్ డేటా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రజలకి అందుబాటులో ఉంచాలి. ప్రభుత్వాలకు జవాబుదారితనం ఉండాలి. పాలనా వైఫల్యాలపై నిజాయితీగా న్యాయ విచారణలు జరిపించాలి. ఆర్థిక పరిపుష్టి ఉన్నసంస్థలతో నష్ట సంస్థలను అనుసంధానించాలి. ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేట్ మేనేజ్మెంట్ తరహాలో నైపుణ్యంగా, జవాబుదారితనంతో పని చేసే వ్యవస్థను రూపొందించాలి. ఆర్థిక సంస్కరణలను ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించాలి. పాలకులు ఏకస్వామ్యంగా నడుపుతోన్న ప్రస్తుత ప్రజాస్వామిక వ్యవస్థలో ఆర్థిక నష్టాలకు, అసహనాలకు గురయ్యే ప్రజలు తిరుబాటు చేస్తారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. లేదంటే తగిన శాస్తి తప్పదు.

Latest News

ముగిసిన యువకుడి అంత్యక్రియలు|PALAKURTHI

పుత్రశోకంలో కన్నతల్లి కన్నీటి వీడ్కోలు ఘన నివాళులు అర్పించిన పాలకుర్తి విధి ఆడిన వింత నాటకంలో ఒక కన్నతల్లికి అంతకన్నా దౌర్భాగ్య స్థితి మరొకటి ఉండదు. కొడుకే లోకమని, తనే తన సర్వస్వమని బతికిన ఆ...

గాలి మోటర్ల.. గా అత్తగారింటికి!?|ADUGU TRENDS

అత్తగారింటికి దారేది? అంటే గాల్లో తేలినట్లు ఏకంగా గాలి మోటర్లనే తీసుకపోయి, సూసెటోల్ల గుండె పేలినట్టు శేసిండో పెండ్లి కొడుకు. గీ మద్దెల పండ్లిల్లకు ఇరగమరగ కర్సు సేత్తాండ్లు. ఎంత ఎక్కువ కర్సు శేస్తే,...

సాగు బాగుకు ఇదే సరైన సమయం!|EDITORIAL

ప్రపంచ రాజకీయ పరిణామాలు, పశ్చిమాసియాలో యుద్ధాలు, అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థను ప్రగాఢంగా ప్రభావితం చేస్తున్నాయి. ఎగుమతులు, దిగుమతులు తీవ్ర అంతరాయానికి గురవుతున్నాయి. ఈ సమయాన్ని భారత్ తన ఆహార భద్రత, వ్యవసాయ రంగాన్ని...

13-03-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి దశమి రాత్రి తెల్ల 05.47 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 01.02 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం వ్యతీపాత ఉదయం 08.53 వరకు ఉపరి వరీయాన్ కరణం వణజి సాయంత్రం...

‘పునర్జన్మ’ ప్రాప్తి…! జీవ ‘కారుణ్య’ విముక్తి!!|ADUGU|SPECIAL STORY

-‘బ్రెయిన్ డెడ్’ కు ‘కామా’, ‘కోమా’కు ‘ఫుల్ స్టాప్’!!!|BRAIN DEAD|COMA జీవితం విచిత్రం. పుట్టుక వరమైతే, మరణం శాపం. అనివార్యం. ఇందుకు ఈ రెండు ఘటనలే నిదర్శనం. బ్రెయిన్ ‘డెడ్’ అయిన మహిళ, ఒక్క...

రూపాయికే బూట్లు!?|ADUGU TRENDS

శిత్తం శివుని మీద.. భక్తి శెప్పుల మీద అన్నరు. గీ సామెతను చపల చిత్తానికి వాడినప్పటికీ, పాదరచ్చలు... మన ఆరోగ్యానికి కూడా రచ్చణే! గందుకే గవాటిని మనం యేసుకుంటం. ఇగ బూట్లైతే పాదాలకు...

‘జల్ జీవన్ మిషన్’ తో నీటి సమస్యలు సమసేనా!?|EDITORIAL

నీటి సమస్య వనరుల లభ్యత, వినియోగ విధానం, దుర్వినియోగం, సమర్థవంతమైన నిర్వహణలపై ఆధారపడింది. గ్రామీణ భారతావనికి ప్రతి ఇంటికి నల్లాల ద్వారా మంచినీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘జల్ జీవన్ మిషన్’...

12-03-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి నవమి రాత్రి తెల్ల 04.10 వరకు ఉపరి దశమి నక్షత్రం మూల రాత్రి 10.51 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం సిద్ది ఉదయం 08.20 వరకు ఉపరి వ్యతీపాత కరణం తైతుల పగలు...

ప్లాస్టిక్ ఇటికెలతోటి ఇల్లు!?|ADUGU TRENDS

గీ అన్న ఇకమతు సూత్తే, బుర్ర గిర్రున తిరుగుతది. ఇగిప్పుడు అంతా ప్లాస్టిక్ మయమే అయింది. పుట్టిన కానుండి, గిట్టేదాక, గా ప్లాస్టిక్ లేకుండ పనైతలేదు. ఎంత ముప్పని శెప్పినా, నీల్ల కానుంచి...

గ్యాస్ ట్రబుల్స్-ప్రత్యామ్నాయ మార్గాలు|EDITORIAL

ప్రపంచంతోపాటు, భారతదేశంలో వంటగ్యాస్‌-ఎల్పీజీ వినియోగం గత రెండు దశాబ్దాల్లో విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు నగరాలకే పరిమితమైన ఈ ఇంధనం ఇప్పుడు గ్రామాలకు కూడా విస్తరించింది. వంట కోసం ఇంధనంగా ఎల్పీజీ వినియోగం పెరగడం...

11-03-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి అష్టమి రాత్రి 02.14 వరకు ఉపరి నవమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 08.20 వరకు ఉపరి మూల యోగం వజ్ర ఉదయం 08.00 వరకు ఉపరి సిద్ది కరణం బాలవ పగలు 01.12...

లైటర్ లేకుండనే గ్యాస్ స్టౌని ఎలిగిచ్చుడు!?|ADUGU TRENDS

ఉపాయాలున్నోడు ఊరేగుతడట. గట్లనే ఉంది గీ పొల్లగాని తెలివి. నిప్పులేందే పొగే గాదుల్లా. మంట గూడ రాదు కదా? మరీ గీయన గా నిప్పునే తెలివిగ ఎలిగిచ్చి గ్యాస్ స్టౌకి మంట పుట్టిచ్చిండు. గా...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News