Tuesday, June 9, 2026
26.6 C
Hyderabad

రాజకీయ చదరంగంలో అధికారులు పావులా?|POLITICS|ESSAY

రాజకీయ చదరంగంలో అధికారులు పావులా? ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ప్రతిష్టితమైనప్పటికీ, దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు కొన్ని సవాళ్ళు ఎదురవుతున్నాయి. ఈ సవాళ్ళు, ముఖ్యంగా రాజకీయ పార్టీల అధికార పోరాటాల మధ్య అధికారుల పాత్ర మరింత సంక్లిష్టంగా మారుతోంది. అధికారుల సమర్థతను, పారదర్శకతను, నిబద్ధతను నిర్లక్ష్యం చేయడం ప్రజాస్వామ్య విధానంలో సరైనది కాదు. ఇది రాజకీయ చదరంగంలో అధికారులను బలిపశువులా మార్చే పరిస్థితులను కల్పిస్తోంది. దీంతో ప్రజాస్వామ్య విలువలకు విఘాతం ఏర్పడుతోంది. టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ రాసిన వ్యాసం

రాజకీయ చదరంగంలో అధికారులు పావులా?

భారతదేశం, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ప్రతిష్టితమైనప్పటికీ, ప్రజాస్వామ్య వ్యవస్థకు కొన్ని సవాళ్ళు ఎదురవుతున్నాయి. ఈ సవాళ్ళు, ముఖ్యంగా రాజకీయ పార్టీల అధికార పోరాటాల మధ్య అధికారుల పాత్ర మరింత సంక్లిష్టంగా మారుతోంది. అధికారుల సమర్థతను, పారదర్శకతను, నిబద్ధతను నిర్లక్ష్యం చేయడం ప్రజాస్వామ్య విధానంలో సరైనది కాదు. ఇది రాజకీయ చదరంగంలో అధికారులను బలిపశువులా మార్చే పరిస్థితులను కల్పిస్తోంది. దీంతో ప్రజాస్వామ్య విలువలకు విఘాతం ఏర్పడుతోంది.
భారతదేశం నాటి రాచరికాల నుంచి రూపాంతరం చెంది, ఇవాళ ప్రజాస్వామ్య పాలనలో విరాజిల్లుతోంది. ఈ వ్యవస్థలో ప్రజలే నిర్ణేతలుగా ఉన్నప్పటికీ ఇబ్బందులు తప్పడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు తమ స్వార్థాల కోసం అధికారులను బలిపశువుల వలె మారుస్తున్న దుస్థితి ఏర్పడింది. ప్రజాస్వామ్యంలో పార్టీల ఆధిపత్య పోరు కారణంగా, రాజకీయ వత్తిళ్లకు గురవడం మాత్రమే కాకుండా, అధికారులపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వివక్ష కొనసాగుతోంది.
ప్రభుత్వంలోని ప్రతి అధికారికీ నిర్దిష్టమైన నియమాలు, నిబంధనలు ఉన్నాయి. అధికారులు తప్పు చేసినట్లయితే, వారికీ అవసరమైన శిక్షలు, తగిన శాఖాపరమైన చర్యలు తప్పకుండా ఉండాలి. అయితే, రాజకీయ తగాదాలు, స్వార్థపు ధోరణుతో అధికారులపై కక్ష సాధించడం అనేది ప్రభుత్వానికి పాలనకు మేలు చేకూర్చదు. రాజకీయ స్వార్థంతో అధికారులకు పోస్టింగులు కేటాయించడం, వారి పనితీరును నిర్లక్ష్యం చేయడం అనేది చివరకు రాజకీయ సంస్కృతినే దెబ్బతీస్తుంది. అధికారులకు పోస్టింగులు పారదర్శకంగా ఉండాలి. రాజకీయ కక్షలు, ప్రభావాలకతీతంగా అధికారులకు పోస్టింగులివ్వాలి. ఇలా జరిగితే, ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత శక్తివంతంగా పని చేస్తుంది.
ప్రస్తుత ప్రభుత్వ విధానంలో విభాగాల ఆధారంగా, ప్రాంతీయ భేదాలు లేదా సామాజిక వర్గాల దృష్టి కోణంలో అధికారులను నియమించడం ఎంతవరకు సరైనది? చాలా చోట్ల ఇది అవినీతికి, అక్రమాలకు దారితీస్తుంది. పోస్టింగులలో సమానత్వం, పారదర్శకత అవసరం. స్వేచ్ఛ, సమానత్వం పాటిస్తేనే అధికారులు ప్రజాస్వామ్య పరిరక్షకులుగా మారుతారు.

ప్రజల పన్నులు, ప్రజల శ్రమ మీద ఆధారపడి ప్రభుత్వాలు నడుస్తాయి. సమానత, సామాజిక, ప్రాంతీయ న్యాయాలు పాటించపోతే తిరుగుబాట్లు మొదలవుతాయి. ఇవి మాటలతో కాకుండా, కఠినమైన, ప్రజాస్వామ్య పద్ధతుల అమలుతోనే సాధ్యం.
రాజకీయ నాయకులు, అధికారులు ప్రజల కోసం కట్టుబడి పనిచేస్తూ, స్వార్థం లేకుండా ప్రభుత్వ విధానాలు అమలు చేస్తే, ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత శక్తివంతంగా మారుతింది. పోస్టింగులు, అధికారుల నియామకాలు పారదర్శకంగా, న్యాయపరంగా సాగితే, ప్రజాస్వామ్యలో మనం కోరుకున్న సమతుల్యత సాధ్యమవుతుంది.

– బండి సుధాకర్ గౌడ్
టీపీసీసీ అధికార ప్రతినిధి, 99123 71755

Latest News

సేఫ్టీ డోర్లు!|ADUGU TRENDS

భద్రతకే భద్రత లేని రోజులియి.! మరైతే మనమెంత భద్రంగుండాలె? మనమెంత జాగర్త పడ్డా దోసేటోడు కొత్త కొత్త దారుల్ల దోస్తనే ఉన్నడు. కట్టం లేకుండా మన సొక్కం మన గాబుల్ల, జేబుల్ల నిండాలె....

దేశానికి ముప్పుగా డ్రగ్స్ దందా!|EDITORIAL

యువతను మాదక ద్రవ్యాల మహమ్మారి నుంచి కాపాడటం కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు. అది సమాజం మొత్తం నిర్వర్తించాల్సిన సామూహిక కర్తవ్యం. నేడు అప్రమత్తంగా వ్యవహరిస్తేనే రేపటి తరాన్ని ఆరోగ్యవంతమైన, సురక్షితమైన...

09-06-2026, మంగళవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 సంకల్ప తిథి: కృష్ణ-నవమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-నవమి తిథి : కృష్ణ-నవమి తె. ఝా 2:35 వరకు...

08-06-2026, సోమవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 సంకల్ప తిథి: కృష్ణ-అష్టమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-అష్టమి తిథి : కృష్ణ-అష్టమి తె. ఝా 3:24 వరకు...

ప్రొఫెసర్ వ్యాఖ్యలు-పోస్టు మార్టం|JANASENA|PROF.NAGESHWAR|PSPK

స్థానిక బీజేపీ నాయకత్వం నుంచి కాని పనిని జాతీయ పార్టీ నెత్తికెత్తుకుందా? అందుకే జన సేనాని పవన్ ని తెలంగాణపైకి ఉసి గొల్పిందా? ఈ స్కెచ్ లో భాగంగానే జగన్ ను అరెస్ట్...

మందా? ‘మజా’కా!?|ADUGU TRENDS

ఎనకటికి ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే, సుట్టకు అగ్గి కావాలని మరొకడేడిసిండట! గీ ముచ్చట గట్లనే ఉన్నది. రోజులు మారినా, గా సామెతల అర్థాలు మారట్లేదు. గీ సామెతసొంటి ముచ్చటే గా చిత్తూరు జిల్లా...

ఆర్థిక మోసాలకు అడ్డుకట్టలే లేవా!?|EDITORIAL

చిన్న మోసగాళ్లనే కాదు, పెద్ద కార్పొరేట్ సంస్థలు, ప్రభావశీల వ్యక్తులు చేసిన అక్రమాలపై కూడా సమానంగా చర్యలు తీసుకోవాలి. చట్టం ముందు అందరూ సమానమనే నమ్మకం ఏర్పడినప్పుడే ఆర్థిక క్రమశిక్షణ బలపడుతుంది. లేకపోతే...

ఈ రోజు/ వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూన్ 07 నుండి జూన్ 13 వరకు వారఫలాలు: మేషం: ఈ వారం కుటుంబ వ్యవహారాల్లో కొంత ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సౌహార్దంగా వ్యవహరించడం మంచిది. వ్యాపారవేత్తలు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా...

రెండోసారి రాజ్యసభకు సానా…|AP|TDP|RAJYASABHA|SANA SATHISH BABU

బాబుకు ధన్యవాదాలు తెలిపిన సతీష్ బాబు|CHANDRABABU|CM రాష్ట్ర రాజకీయాల్లో, సామాజిక సేవలో, క్రీడా రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, తెలుగుదేశం పార్టీ నేత సానా సతీష్ బాబు రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా...

ఏపీ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు|AP|RAJYASABHA|TDP|JANASENA|BJP

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారిన రాజ్యసభ స్థానాల భర్తీ ప్రక్రియ తుది ఘట్టానికి చేరుకుంది. రాష్ట్రం నుండి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు గాను అధికార కూటమిలో అభ్యర్థుల ఎంపిక...

గడ్డి కావాలా, బాబూ..!|ADUGU TRENDS

పసువులకే కాదు, కాస బుద్ధి తక్కువున్నోల్లకు గడ్డి పెడతం.! గడ్డంటే గడ్డి కాదు కనీ, తిట్లన్నట్లు.!! గడ్డి మేసి ఆవు పాలిస్తుంది, పాలుతాగి మినిసి విషమవుతాడు అంటాడు ఆత్రేయ. మరి ఆవు మేసే...

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత!|EDITORIAL

పర్యావరణ దినోత్సవం ఒక ఉత్సవం మాత్రమే కాదు. ప్రకృతిని కాపాడుకోవాలనే సామూహిక సంకల్పానికి ప్రతీక. పర్యావరణాన్ని రక్షించడం అంటే మానవజాతి భవిష్యత్తును రక్షించడమే. నేటి నిర్లక్ష్యం రేపటి విపత్తుకు దారితీయవచ్చు. అందుకే ప్రకృతి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News