Friday, July 17, 2026
27.3 C
Hyderabad

సింధు నాగరికత|ADUGU|SPECIAL|COMPITITIVE|EXAMS

నాగరికత మరియు సంస్కృతికి తేడా

నాగరికత
పూర్తిగా అభివృద్ధి చెందిన మరియు ఉన్నతమైన జీవనాన్ని గడిపినట్లయితే మరియు ప్రజలు పట్టణ, శాస్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రణాళికాబద్ధంగా ఉంటే దానిని నాగరికత అంటారు.

సంస్కృతి
సంస్కృతి అనేది ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. అది పట్టణాల్లో జీవించేవారికి మరియు గ్రామీణ, టండ్రా, అడవుల్లో గుంపులుగుంపుగా నివసించే వారందరూ ఏ రకమైన జీవన విధానాన్ని అవలంబించిన దానిని సంస్కృతిగానే పరిగణించవచ్చు.

సింధు నాగరికతను నాగరికత అని అనడానికి  కారణం

సింధు నాగరికత నాటి ప్రజలు ఉన్నతమైన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ప్రణాళికాబద్ధంగా జీవించారు.అందుకే దీనిని నాగరికతగా పరిగణిస్తారు.

భారతదేశంలోని తొలి నాగరికత మరియు ప్రపంచంలోని అత్యంత ప్రాచీన నాగరికతల్లో సింధు నాగరికత ఒకటి. క్రీ.పూ.2500 నుండి క్రీ.పూ.1500 వరకు ఈ నాగరికత కొనసాగిందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మొట్టమొదటిసారిగా 1826లో మ్యాసన్ అనే పురావస్తు శాస్త్రవేత్త సింధు నాగరికత అవశేషాలను సింధూ నది తీర ప్రాంతంలో కనుగొన్నాడు.

సింధు నాగరికతకు గల వివిధ పేర్లు

ఈ నాగరికత సింధూ నది లోయ ప్రాంతంలో కేంద్రీకృతం కావడం వల్ల దీనిని సింధు నాగరికత అంటారు.

హరప్పా నాగరికత:
సింధు నాగరికత నాటి అవశేషాలు మొట్టమొదటగా హరప్పా ప్రాంతంలో బయల్పడ్డాయి కాబట్టి దీనిని హరప్పా నాగరికత అని కూడా అంటారు.

సంధియుగ నాగరికత:
సింధు ప్రజలు ఉపయోగించిన లిపిని నేటికీ ఎవరూ చదవలేకపోవడంతో దీనిని సంధియుగం అని కూడా అంటారు. నట్వర్ జా మరియు రాజారావు లాంటి పండితులు సింధు లిపిని చదవడానికి ప్రయత్నించి విఫలమయ్యారు.

కాంస్య యుగ నాగరికత:
భారతదేశంలో సింధు  ప్రజలు కాంస్యమును మొదటిసారిగా ఉపయోగించారు. కాబట్టి దీనిని కాంస్య యుగ నాగరికత అని అంటారు.
కాంస్యం: రాగి తగరంల మిశ్రమం.

సమకాలీన నాగరికతలు

సింధు నాగరికత కాలంలో ప్రపంచంలో మరో మూడు నాగరికతలు కూడా ఉన్నాయి.

1) మెసపటోనియా నాగరికత:
ఇది ప్రస్తుత ఇరాక్ లో టైగ్రీస్ నది లోయల్లో కొనసాగింది. సింధు ప్రజలు ఈ నాగరికతతో సాంస్కృతిక, వాణిజ్య సంబంధాలను కొనసాగించారని ఖచ్చితమైన ఆధారాలున్నాయి.
ఇరాక్ పూర్వనామం మెసపటోనియా.

2) ఈజిప్ట్ నాగరికత:
ఈ నాగరికత ఆఫ్రికా ఖండంలోని నైలు నది లోయలో అభివృద్ధి చెందింది. సింధు ప్రజలు ఈజిప్ట్ ప్రజలతో సంబంధాలు కొనసాగించారని ఆధారాలు లేవు.

3) చైనా నాగరికత:
చైనాలోని హోయాంగ్ హో నది లోయలో ఈ నాగరికత అభివృద్ధి చెందింది.

సింధు నాగరికత ఆవిర్భావం

సింధు నాగరికత ఆవిర్భావం గురించి పండితులు ఖచ్చితమైన సమాచారాన్ని ఇవ్వలేకపోతున్నారు. పురావస్తు శాస్త్రవేత్తలు కూడా తవ్వకాల్లో బయల్పడిన వాస్తు అవశేషాల ద్వారా ఊహాగానాల మీద సిద్ధాంతాలను రచించి మనకు తెలియజేస్తున్నారు.

పండితుల అభిప్రాయాలు

ఎ) ఘోష్ మరియు శంకాలియా ప్రకారం ఈ సంస్కృతి క్రీ.పూ.3000లో అభివృద్ధి చెందింది అని, నవీన శిలాయుగ మరియు తామ్ర శిలాయుగ సంస్కృతులు గణనీయంగా అభివృద్ధి చెంది సింధు నాగరికతకు బాటలు వేసాయి. వీరి ప్రకారం సింధు ప్రజలు సింధు మరియు సరస్వతి ప్రాంతాల్లో అభివృద్ధి చెందిందిగా చెప్పవచ్చు. నవీన శిలాయుగానికి చెందిన మెహర్ గర్ లో లభించిన టెర్రకోటా బొమ్మలు స్టీటైట్ తో చేసిన ముద్రికలు ఈ ప్రాంతంలోనే లభించాయి. దీనిని బట్టి సింధు నాగరికత పూర్తిగా స్వదేశీయమైనది అని అర్థమవుతుంది.

బి) వీలర్ ప్రకారం సింధు ప్రజలు విదేశీయులు. నాగరికత అనే భావన మెసపటోనియాలో పుట్టి సింధు ప్రాంతానికి వలస వచ్చి ప్రత్యేక నాగరికతను అభివృద్ధి చేసుకొని సింధు నాగరికతగా పరికల్పన చేశారు. నగర జీవితాన్ని గడపడం, స్నానవాటికలు, ధాన్యాగారాలు మరియు మాతృదేవతను పూజించడం ఈ రెండు నాగరికతల్లో ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి. కానీ ఆధునిక చరిత్రాకారులు ఈ అభిప్రాయాన్ని తిరస్కరిస్తున్నారు ఎందుకనగా సింధు నాగరికతలో కనిపించే శాస్త్రీయమైన పట్టణ నిర్మాణం, ఉన్నతమైన జీవనం మెసపటోనియా నాగరికతలో కనిపించడంలేదు.

సి) రఫిక్ మొఘల్ ప్రకారం సింధు నాగరికత బలూచిస్తాన్ నుండి సింధు లోయకు వలస వచ్చి తామర శిలాయుగాన్ని ఆధునీకరించుకొని నాగరికతగా చేసుకున్నారు. సింధు ప్రజలు లింగాలను, ఎద్దును పూజించడం, కోటలు నిర్మించుకోవడం బలూచిస్తాన్ కి చెందిన జోబ్, కుల్లి సంస్కృతుల్లో కూడా ఉందని ఈయన అభిప్రాయం. కానీ పండితులు దీనిని విశ్వసించడంలేదు.

✓సింధు నాగరికత ప్రజలు ఈ నాలుగు జాతులకు చెందినవారని ఒక బలమైన ఊహ:

1) మంగోలాయిడ్ జాతి: మోహేంజోదారోలో లభించిన గడ్డపు మనిషి బొమ్మలో మంగోలాయిడ్ జాతి లక్షణాలు కనిపిస్తున్నాయి.

2) మెడిటరేనియన్ జాతి: ఈ ప్రాంతంలో అధిక సంఖ్యాకులు ద్రావిడ భాష మాట్లాడడం వలన సింధు ప్రజలను ద్రావిడ ప్రజలు నీ కూడా అంటారు. (మెడిటరేనియన్ అనేది జాతిపదం. ద్రావిడ అనేది భాష.)

3) ఆల్ఫినాయిడ్ జాతి: పురావస్తు తవ్వకాల్లో ఈ జాతికి సంబంధించిన అవశేషాలు లభ్యమయ్యాయి.

4) ఆస్ట్రోలాయిడ్ జాతి: మోహేంజోదారోలో లభించిన కాంస్యంతో చేసిన నాట్యగత్తె విగ్రహంలో ఈ జాతి లక్షణాలు కనిపిస్తున్నాయి.

“నాట్యకారిణి” సింధు లోయ నాగరికత యొక్క కళా నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తూ, దక్షిణ ఆసియా చరిత్రలో ఒక ముఖ్యమైన భాగంగా కొనసాగుతోంది.

ఈ వివాదం 9వ తరగతి కోసం కొత్తగా ప్రవేశపెట్టిన ‘మధురిమ’ అనే కళా విద్యా పాఠ్యపుస్తకానికి సంబంధించినది. మొహెంజో-దారోలో కనుగొనబడిన ‘నాట్యకారిణి’ శిల్పం, ప్రాచీన సింధు లోయ నాగరికతకు చెందిన అత్యంత ప్రసిద్ధ కళాఖండాలలో ఒకటి. 4,000 సంవత్సరాల క్రితం రూపొందించబడిన ఈ కంచు విగ్రహం, తొలి కళాత్మక విజయానికి ఒక ముఖ్యమైన ఉదాహరణగా పరిగణించబడుతుంది.

అయితే, కొత్త పాఠ్యపుస్తకంలో ఉపయోగించిన చిత్రం అసలు శిల్పానికి భిన్నంగా ఉంది. అసలు బొమ్మకు మొండెం నగ్నంగా ఉండగా, ప్రచురించిన చిత్రంలో మొండెం భుజాల నుండి కిందికి నీడతో చూపబడింది.కళల చరిత్ర” అనే శీర్షిక గల ప్రారంభ అధ్యాయంలో సవరించిన చిత్రం కనిపించింది. అసలు శిల్పం దాని అసలైన రూపంలో విస్తృతంగా గుర్తింపు పొంది, ప్రపంచవ్యాప్తంగా చరిత్ర, పురావస్తు శాస్త్రం మరియు కళా ప్రచురణలలో తరచుగా ప్రస్తావించబడుతున్నందున, ఈ మార్పు దృష్టిని ఆకర్షించింది.

అంతకుముందు, NCERT డైరెక్టర్ దినేష్ ప్రసాద్ సక్లానీ NDTVతో మాట్లాడుతూ, “మొండెం భాగాన్ని కప్పి ఉంచడం వెనుక నిర్దిష్ట కారణం ఏమీ లేదు. పాఠ్యపుస్తకాల రూపకల్పనకు బాధ్యత వహించే కళలు మరియు విద్య విభాగానికి ఈ విషయాన్ని నివేదించడం జరిగింది” అని చెప్పారు.

సింధు నాగరికత ప్రధాన పట్టణాలు

పురావస్తు శాస్త్రవేత్తలు సుమారు 200 పైగా ప్రధాన పట్టణాలను సింధు నాగరికతలో భాగంగా కనుగొన్నారు. సింధు నాగరికత పట్టణ నాగరికత. వాటిలో ముఖ్య నగరాలు హరప్పా (పాకిస్తాన్), మోహెంజోదారో (పాకిస్తాన్), ఛాన్సుధారో(పాకిస్తాన్), లోథాల్ (గుజరాత్), కాళీబంగన్(రాజస్థాన్), బన్వాలి(హర్యానా) మొదలగునవి.

– బానోత్ కళ్యాణ్ 

Latest News

కరువు కోరలు!|Fangs of drought

ఇప్పటికి 33శాతమే వర్షం నమోదు!! రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రం అడుగంటుతున్న జలాశయాలు జీవ నదుల్లోనూ జల జీవమే లేదు రిజర్వాయర్లలోనూ ఇదే పరిస్థితి సాగుకు తొందరొద్దంటున్న నిపుణులు ప్రత్యామ్నాయ పంటలపై కార్యాచరణ 20వ తేదీ తర్వాత పత్తి విత్తనాలేయొద్దు బోరుబావుల కింద వరి...

మొక్క నాటుండ్రి.. డిస్కౌంట్లు పొందుండ్రి!?|ADUGU TRENDS

పర్యావరణానికి మూలం మొక్కే. గా మొక్కే చెట్టై, మహా మానై మనల్ని రచ్చిత్తది. గీ భూమి, వాతావరణం మొత్తం గా మొక్కల మీదనే ఆధారపడ్డది. కనీ, మనమేం చేత్తానం? ఏడికాడికి శెట్లని తెగ...

‘ఢీ’లిమిటేషన్ రాజకీయాలు!?|EDITORIAL

డీలిమిటేషన్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ సంస్కరణలలో ఒకటిగా నిలవనుంది. ఇది కేవలం సీట్ల సంఖ్య మార్చే ప్రక్రియ కాదు, భవిష్యత్ రాజకీయ ప్రాబల్య సమీకరణాలను నిర్ణయించే కీలక ఘట్టం....

జూలై 17, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం దక్షిణాయణం ప్రారంభం తిధి తదియ ఉదయం 09.54 వరకు ఉపరి చవితి నక్షత్రం మఖ రాత్రి 10.51 వరకు ఉపరి పుబ్బ యోగం సిద్ది ఉదయం 05.00 వరకు ఉపరి వ్యతీపాత కరణం గరజి ఉదయం 09.54...

‘ప్రభంజన’ పథం ప్రజ్వరిల్లాలి|ESSAY|SPECIAL

జూలై 16, 2025. సరిగ్గా ఏడాది క్రితం జర్నలిస్టు, వక్త, కవి, రచయిత, మేధావి, అభ్యుదయవాది, వివేకశీలి, చైతన్యవంతుడు, నిరంతర పోరాట శీలి అయిన ప్రొఫెసర్ యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ పరమపదించారు....

రోడ్లకు కూడా ఆపరేషన్లు!?|ADUGU TRENDS

గిప్పటి దాకా మనం మనుసులకు, జంతువులకు ఆపరేషన్లు సేసుడే సూసినం. కనీ, గీ యింతను ఎక్కడా సూడలే.! గా బిహార్ రాస్ట్రంల కొత్తగ, ఎక్కడా లేని లెక్కల, రోడ్లకు కూడా ఆపరేషన్లు సేత్తాండ్రు....

నదుల అనుసంధానమే జల భద్రతకు శాశ్వత మార్గం!|EDITORIAL

ఎల్‌నినో ప్రభావాన్ని ఆపడం మన చేతుల్లో లేదు. కానీ, దాని వల్ల కలిగే నష్టాన్ని శాస్త్రీయ ప్రణాళికలు, సమర్థమైన జల నిర్వహణ, నదుల అనుసంధానం, నీటి సంరక్షణ, వాతావరణ అనుకూల వ్యవసాయం ద్వారా...

జూలై 16, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం పూరి జగన్నాధ రధోత్సవం తిధి శు విదియ ఉదయం 11.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఆశ్లేష రాత్రి 11.40 వరకు ఉపరి మఖ యోగం వజ్ర ఉదయం 08.20 వరకు ఉపరి సిద్ది కరణం కౌలవ...

ఆషాఢమాసం రహస్యాలు|ASHADAM|SECRETS

ఆచారాలు, శాస్త్రం, సంప్రదాయాల వెనుక నిజాలు ఆషాఢమాసం విశేషాలు – ఆధ్యాత్మికత, ప్రకృతి, సంప్రదాయాలు, కుటుంబ బంధాల వెనుక అసలు కథ ప్రతి ఆచారం వెనుక ఒక అర్థం... ప్రతి సంప్రదాయం వెనుక ఒక జీవన...

ఉడుతా మిడతా!?|ADUGU TRENDS

మనం మన సుట్టుముట్టు ఉడుతల్ని సూత్తనే ఉంటం. పొలాలల్ల, రోడ్ల మీద అటిటుపోతనే ఉంటయి. సిడెం సేపట్లనే కనబడ్తయి, ఆడ్తయి. ఉరుకుతయి. ఎన్కట గా రాముడికి వారధి కట్టుట్ల గీ ఉడుత సాయం...

ఓటర్ల సవరణకు శాశ్వత పరిష్కారం లేదా!?|EDITORIAL

గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు, పట్టణాల్లో వార్డు కార్యాలయాలు, మీ సేవ వంటి పౌర సేవా కేంద్రాలను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తే ప్రజలకు సౌలభ్యం పెరుగుతుంది. బీఎల్‌వోలపై పూర్తిగా ఆధారపడకుండా బహుళస్థాయి ధ్రువీకరణ...

జూలై 15, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి శు పాడ్యమి మధ్యాహ్నం 01.43 వరకు ఉపరి విదియ నక్షత్రం పుష్యమి రాత్రి 12.45 వరకు ఉపరి ఆశ్లేష యోగం హర్షణ ఉదయం 11.02 వరకు ఉపరి వజ్ర కరణం బవ మధ్యాహ్నం 01.42...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News