Monday, August 10, 2026
29.8 C
Hyderabad

సింధు నాగరికత|ADUGU|SPECIAL|COMPITITIVE|EXAMS

నాగరికత మరియు సంస్కృతికి తేడా

నాగరికత
పూర్తిగా అభివృద్ధి చెందిన మరియు ఉన్నతమైన జీవనాన్ని గడిపినట్లయితే మరియు ప్రజలు పట్టణ, శాస్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రణాళికాబద్ధంగా ఉంటే దానిని నాగరికత అంటారు.

సంస్కృతి
సంస్కృతి అనేది ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. అది పట్టణాల్లో జీవించేవారికి మరియు గ్రామీణ, టండ్రా, అడవుల్లో గుంపులుగుంపుగా నివసించే వారందరూ ఏ రకమైన జీవన విధానాన్ని అవలంబించిన దానిని సంస్కృతిగానే పరిగణించవచ్చు.

సింధు నాగరికతను నాగరికత అని అనడానికి  కారణం

సింధు నాగరికత నాటి ప్రజలు ఉన్నతమైన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ప్రణాళికాబద్ధంగా జీవించారు.అందుకే దీనిని నాగరికతగా పరిగణిస్తారు.

భారతదేశంలోని తొలి నాగరికత మరియు ప్రపంచంలోని అత్యంత ప్రాచీన నాగరికతల్లో సింధు నాగరికత ఒకటి. క్రీ.పూ.2500 నుండి క్రీ.పూ.1500 వరకు ఈ నాగరికత కొనసాగిందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మొట్టమొదటిసారిగా 1826లో మ్యాసన్ అనే పురావస్తు శాస్త్రవేత్త సింధు నాగరికత అవశేషాలను సింధూ నది తీర ప్రాంతంలో కనుగొన్నాడు.

సింధు నాగరికతకు గల వివిధ పేర్లు

ఈ నాగరికత సింధూ నది లోయ ప్రాంతంలో కేంద్రీకృతం కావడం వల్ల దీనిని సింధు నాగరికత అంటారు.

హరప్పా నాగరికత:
సింధు నాగరికత నాటి అవశేషాలు మొట్టమొదటగా హరప్పా ప్రాంతంలో బయల్పడ్డాయి కాబట్టి దీనిని హరప్పా నాగరికత అని కూడా అంటారు.

సంధియుగ నాగరికత:
సింధు ప్రజలు ఉపయోగించిన లిపిని నేటికీ ఎవరూ చదవలేకపోవడంతో దీనిని సంధియుగం అని కూడా అంటారు. నట్వర్ జా మరియు రాజారావు లాంటి పండితులు సింధు లిపిని చదవడానికి ప్రయత్నించి విఫలమయ్యారు.

కాంస్య యుగ నాగరికత:
భారతదేశంలో సింధు  ప్రజలు కాంస్యమును మొదటిసారిగా ఉపయోగించారు. కాబట్టి దీనిని కాంస్య యుగ నాగరికత అని అంటారు.
కాంస్యం: రాగి తగరంల మిశ్రమం.

సమకాలీన నాగరికతలు

సింధు నాగరికత కాలంలో ప్రపంచంలో మరో మూడు నాగరికతలు కూడా ఉన్నాయి.

1) మెసపటోనియా నాగరికత:
ఇది ప్రస్తుత ఇరాక్ లో టైగ్రీస్ నది లోయల్లో కొనసాగింది. సింధు ప్రజలు ఈ నాగరికతతో సాంస్కృతిక, వాణిజ్య సంబంధాలను కొనసాగించారని ఖచ్చితమైన ఆధారాలున్నాయి.
ఇరాక్ పూర్వనామం మెసపటోనియా.

2) ఈజిప్ట్ నాగరికత:
ఈ నాగరికత ఆఫ్రికా ఖండంలోని నైలు నది లోయలో అభివృద్ధి చెందింది. సింధు ప్రజలు ఈజిప్ట్ ప్రజలతో సంబంధాలు కొనసాగించారని ఆధారాలు లేవు.

3) చైనా నాగరికత:
చైనాలోని హోయాంగ్ హో నది లోయలో ఈ నాగరికత అభివృద్ధి చెందింది.

సింధు నాగరికత ఆవిర్భావం

సింధు నాగరికత ఆవిర్భావం గురించి పండితులు ఖచ్చితమైన సమాచారాన్ని ఇవ్వలేకపోతున్నారు. పురావస్తు శాస్త్రవేత్తలు కూడా తవ్వకాల్లో బయల్పడిన వాస్తు అవశేషాల ద్వారా ఊహాగానాల మీద సిద్ధాంతాలను రచించి మనకు తెలియజేస్తున్నారు.

పండితుల అభిప్రాయాలు

ఎ) ఘోష్ మరియు శంకాలియా ప్రకారం ఈ సంస్కృతి క్రీ.పూ.3000లో అభివృద్ధి చెందింది అని, నవీన శిలాయుగ మరియు తామ్ర శిలాయుగ సంస్కృతులు గణనీయంగా అభివృద్ధి చెంది సింధు నాగరికతకు బాటలు వేసాయి. వీరి ప్రకారం సింధు ప్రజలు సింధు మరియు సరస్వతి ప్రాంతాల్లో అభివృద్ధి చెందిందిగా చెప్పవచ్చు. నవీన శిలాయుగానికి చెందిన మెహర్ గర్ లో లభించిన టెర్రకోటా బొమ్మలు స్టీటైట్ తో చేసిన ముద్రికలు ఈ ప్రాంతంలోనే లభించాయి. దీనిని బట్టి సింధు నాగరికత పూర్తిగా స్వదేశీయమైనది అని అర్థమవుతుంది.

బి) వీలర్ ప్రకారం సింధు ప్రజలు విదేశీయులు. నాగరికత అనే భావన మెసపటోనియాలో పుట్టి సింధు ప్రాంతానికి వలస వచ్చి ప్రత్యేక నాగరికతను అభివృద్ధి చేసుకొని సింధు నాగరికతగా పరికల్పన చేశారు. నగర జీవితాన్ని గడపడం, స్నానవాటికలు, ధాన్యాగారాలు మరియు మాతృదేవతను పూజించడం ఈ రెండు నాగరికతల్లో ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి. కానీ ఆధునిక చరిత్రాకారులు ఈ అభిప్రాయాన్ని తిరస్కరిస్తున్నారు ఎందుకనగా సింధు నాగరికతలో కనిపించే శాస్త్రీయమైన పట్టణ నిర్మాణం, ఉన్నతమైన జీవనం మెసపటోనియా నాగరికతలో కనిపించడంలేదు.

సి) రఫిక్ మొఘల్ ప్రకారం సింధు నాగరికత బలూచిస్తాన్ నుండి సింధు లోయకు వలస వచ్చి తామర శిలాయుగాన్ని ఆధునీకరించుకొని నాగరికతగా చేసుకున్నారు. సింధు ప్రజలు లింగాలను, ఎద్దును పూజించడం, కోటలు నిర్మించుకోవడం బలూచిస్తాన్ కి చెందిన జోబ్, కుల్లి సంస్కృతుల్లో కూడా ఉందని ఈయన అభిప్రాయం. కానీ పండితులు దీనిని విశ్వసించడంలేదు.

✓సింధు నాగరికత ప్రజలు ఈ నాలుగు జాతులకు చెందినవారని ఒక బలమైన ఊహ:

1) మంగోలాయిడ్ జాతి: మోహేంజోదారోలో లభించిన గడ్డపు మనిషి బొమ్మలో మంగోలాయిడ్ జాతి లక్షణాలు కనిపిస్తున్నాయి.

2) మెడిటరేనియన్ జాతి: ఈ ప్రాంతంలో అధిక సంఖ్యాకులు ద్రావిడ భాష మాట్లాడడం వలన సింధు ప్రజలను ద్రావిడ ప్రజలు నీ కూడా అంటారు. (మెడిటరేనియన్ అనేది జాతిపదం. ద్రావిడ అనేది భాష.)

3) ఆల్ఫినాయిడ్ జాతి: పురావస్తు తవ్వకాల్లో ఈ జాతికి సంబంధించిన అవశేషాలు లభ్యమయ్యాయి.

4) ఆస్ట్రోలాయిడ్ జాతి: మోహేంజోదారోలో లభించిన కాంస్యంతో చేసిన నాట్యగత్తె విగ్రహంలో ఈ జాతి లక్షణాలు కనిపిస్తున్నాయి.

“నాట్యకారిణి” సింధు లోయ నాగరికత యొక్క కళా నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తూ, దక్షిణ ఆసియా చరిత్రలో ఒక ముఖ్యమైన భాగంగా కొనసాగుతోంది.

ఈ వివాదం 9వ తరగతి కోసం కొత్తగా ప్రవేశపెట్టిన ‘మధురిమ’ అనే కళా విద్యా పాఠ్యపుస్తకానికి సంబంధించినది. మొహెంజో-దారోలో కనుగొనబడిన ‘నాట్యకారిణి’ శిల్పం, ప్రాచీన సింధు లోయ నాగరికతకు చెందిన అత్యంత ప్రసిద్ధ కళాఖండాలలో ఒకటి. 4,000 సంవత్సరాల క్రితం రూపొందించబడిన ఈ కంచు విగ్రహం, తొలి కళాత్మక విజయానికి ఒక ముఖ్యమైన ఉదాహరణగా పరిగణించబడుతుంది.

అయితే, కొత్త పాఠ్యపుస్తకంలో ఉపయోగించిన చిత్రం అసలు శిల్పానికి భిన్నంగా ఉంది. అసలు బొమ్మకు మొండెం నగ్నంగా ఉండగా, ప్రచురించిన చిత్రంలో మొండెం భుజాల నుండి కిందికి నీడతో చూపబడింది.కళల చరిత్ర” అనే శీర్షిక గల ప్రారంభ అధ్యాయంలో సవరించిన చిత్రం కనిపించింది. అసలు శిల్పం దాని అసలైన రూపంలో విస్తృతంగా గుర్తింపు పొంది, ప్రపంచవ్యాప్తంగా చరిత్ర, పురావస్తు శాస్త్రం మరియు కళా ప్రచురణలలో తరచుగా ప్రస్తావించబడుతున్నందున, ఈ మార్పు దృష్టిని ఆకర్షించింది.

అంతకుముందు, NCERT డైరెక్టర్ దినేష్ ప్రసాద్ సక్లానీ NDTVతో మాట్లాడుతూ, “మొండెం భాగాన్ని కప్పి ఉంచడం వెనుక నిర్దిష్ట కారణం ఏమీ లేదు. పాఠ్యపుస్తకాల రూపకల్పనకు బాధ్యత వహించే కళలు మరియు విద్య విభాగానికి ఈ విషయాన్ని నివేదించడం జరిగింది” అని చెప్పారు.

సింధు నాగరికత ప్రధాన పట్టణాలు

పురావస్తు శాస్త్రవేత్తలు సుమారు 200 పైగా ప్రధాన పట్టణాలను సింధు నాగరికతలో భాగంగా కనుగొన్నారు. సింధు నాగరికత పట్టణ నాగరికత. వాటిలో ముఖ్య నగరాలు హరప్పా (పాకిస్తాన్), మోహెంజోదారో (పాకిస్తాన్), ఛాన్సుధారో(పాకిస్తాన్), లోథాల్ (గుజరాత్), కాళీబంగన్(రాజస్థాన్), బన్వాలి(హర్యానా) మొదలగునవి.

– బానోత్ కళ్యాణ్ 

Latest News

ఆగస్టు 10, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి ద్వాదశి ఉదయం 06.13 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం ఆరుద్ర ఉదయం 11.53 వరకు ఉపరి పునర్వసు యోగం వజ్ర రాత్రి 11.10 వరకు ఉపరి సిద్ది కరణం తైతుల ఉదయం 06.13 వరకు ఉపరి...

బోనాలు – చరిత్ర, సంస్కృతి, సంప్రదాయం|BONALU|HISTORY|CULTURE

చారిత్రక, పురావస్తు, శాసన, సాహిత్య ఆధారాల విశ్లేషణ ప్రకారం బోనం సమర్పించే ఆచారం ఆషాఢ మాసంలో తెలంగాణతో పాటు దక్షిణ భారతదేశంలోని అనేక గ్రామాల్లో గ్రామదేవతారాధనలో అంతర్భాగంగా కొనసాగుతోంది. వర్షాకాలం ప్రారంభ దశలో...

కల్లుకు శిల్లు.. సీసీ కెమెరా!?|ADUGU TRENDS

యెన్కటికి దొంగకు శెప్పే లాభమన్నరు. దోసుకుంటోనికి శెప్పైనా, తప్పైనా ఒకటే. పడదలే సూసుకుంటడు. గట్లనే గీ మద్దెల దొంగలు తమ రూటు మార్సుకున్నరు. కంటికి కనుకు లేకుండా ఇంటికి కన్నాలేసుడు అసొంటివి మానేసిండ్రు....

రాహుల్ ముందున్న మార్గాలివే!?|EDITORIAL

రాహుల్‌ ముందున్నది ‘బొద్దింకలను బుట్టలో వేసుకోవడం’ కాదు. యువత నమ్మకాన్ని సంపాదించడం. ఆ నమ్మకం ఒక్క ఆందోళనతో రాదు. నిరంతర పోరాటం, స్పష్టమైన విధానాలు, ప్రత్యామ్నాయ పాలనా నమూనా, విశ్వసనీయ నాయకత్వం కావాలి....

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 09 నుండి ఆగస్టు 15 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశివారికి అనుకూలమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. మీ పనితీరుకు ఉన్నతాధికారుల...

నవ్వినోల్లే నోర్లెల్లబెట్టిండ్రు!?|ADUGU TRENDS

సంకల్పించాలె కనీ, కాని పని ఉంటదా? ఉండనే ఉండదని నిరూపించిండు గీ పెద్దాయినె. నల్గురు సూసి నవ్వినా, నా పని నేను శేసుక పోతానని, శేసి సూపిండు. గీయినె పేరు హీలియో డా సల్వా....

క్యా బోల్తే… పాలక్!?|EDITORIAL

దేశ భవిష్యత్తు యువతే. ఆ యువత ప్రశ్నిస్తే వినాలి, సూచిస్తే ఆలోచించాలి, సమస్యలు చెబితే పరిష్కరించాలి. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే అధికారానికి సమాంతరంగా జవాబుదారీతనాన్ని పెంపొందించే స్వతంత్ర ప్రజా వేదికలు అవసరం. ప్రజల...

ఆగస్టు 08, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి దశమి ఉదయం 11.09 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం రోహిణీ మధ్యాహ్నం 03.15 వరకు ఉపరి మృగశిర యోగం ధ్రువ ఉదయం 08.20 వరకు ఉపరి వ్యాఘాత కరణం భద్ర ఉదయం 11.09 వరకు ఉపరి...

ఇగిప్పుడు ‘సావు’కొచ్చింది!?|ADUGU TRENDS

మన ఊర్లల్ల ఎవ్వలన్న కాలం శేసిండ్రంటేనే సూసొత్తం. కనికరం సూపి తలో సెయ్యేత్తం. దిక్కూమొక్కూలేనోల్లతై మనమే తలా ఇంతేసుకుని గాయింత ఇగ గా కట్టెల్లేసొత్తం. కానీ, తలకొరివి పెట్టాల్సిన కన్న బిడ్డలే కడసారి...

శ్రద్ధేది? శుద్ధ దండగ!?|EDITORIAL

2025 వర్షాకాల సమావేశాల్లో నిర్ణయించిన సమయంలో లోక్‌సభ కేవలం 29%, రాజ్యసభ 34% మాత్రమే పనిచేశాయి. ప్రశ్నోత్తరాల సమయంలో లోక్‌సభలో కేవలం 23%, రాజ్యసభలో 6% మాత్రమే పని జరిగింది. అదే సమావేశాల్లో14...

ఆగస్టు 07, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి నవమి మధ్యాహ్నం 01.29 వరకు ఉపరి దశమి నక్షత్రం కృత్తిక సాయంత్రం 04.48 వరకు ఉపరి రోహిణీ యోగం వృద్ధి ఉదయం 11.17 వరకు ఉపరి ధ్రువ కరణం గరజి మధ్యాహ్నం 01.29 వరకు ఉపరి...

మౌర్య పూర్వయుగం|ADUGU SPECIAL|HISTORY|COMPITITIVE EXAMS

క్రీ.పూ.650 నుండి క్రీ.పూ.250 మధ్య ఉన్న కాలాన్ని మౌర్యుల పూర్వయుగం లేదా బుద్ధుని యుగం లేదా షోడశ మహాజనపాదాల యుగం అని అంటారు. ఈ కాలంలో గౌతమ బుద్ధుడు ముఖ్య పురుషుడు కాబట్టి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News