Tuesday, September 1, 2026
26.2 C
Hyderabad

సింధు నాగరికత|ADUGU|SPECIAL|COMPITITIVE|EXAMS

నాగరికత మరియు సంస్కృతికి తేడా

నాగరికత
పూర్తిగా అభివృద్ధి చెందిన మరియు ఉన్నతమైన జీవనాన్ని గడిపినట్లయితే మరియు ప్రజలు పట్టణ, శాస్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రణాళికాబద్ధంగా ఉంటే దానిని నాగరికత అంటారు.

సంస్కృతి
సంస్కృతి అనేది ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. అది పట్టణాల్లో జీవించేవారికి మరియు గ్రామీణ, టండ్రా, అడవుల్లో గుంపులుగుంపుగా నివసించే వారందరూ ఏ రకమైన జీవన విధానాన్ని అవలంబించిన దానిని సంస్కృతిగానే పరిగణించవచ్చు.

సింధు నాగరికతను నాగరికత అని అనడానికి  కారణం

సింధు నాగరికత నాటి ప్రజలు ఉన్నతమైన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ప్రణాళికాబద్ధంగా జీవించారు.అందుకే దీనిని నాగరికతగా పరిగణిస్తారు.

భారతదేశంలోని తొలి నాగరికత మరియు ప్రపంచంలోని అత్యంత ప్రాచీన నాగరికతల్లో సింధు నాగరికత ఒకటి. క్రీ.పూ.2500 నుండి క్రీ.పూ.1500 వరకు ఈ నాగరికత కొనసాగిందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మొట్టమొదటిసారిగా 1826లో మ్యాసన్ అనే పురావస్తు శాస్త్రవేత్త సింధు నాగరికత అవశేషాలను సింధూ నది తీర ప్రాంతంలో కనుగొన్నాడు.

సింధు నాగరికతకు గల వివిధ పేర్లు

ఈ నాగరికత సింధూ నది లోయ ప్రాంతంలో కేంద్రీకృతం కావడం వల్ల దీనిని సింధు నాగరికత అంటారు.

హరప్పా నాగరికత:
సింధు నాగరికత నాటి అవశేషాలు మొట్టమొదటగా హరప్పా ప్రాంతంలో బయల్పడ్డాయి కాబట్టి దీనిని హరప్పా నాగరికత అని కూడా అంటారు.

సంధియుగ నాగరికత:
సింధు ప్రజలు ఉపయోగించిన లిపిని నేటికీ ఎవరూ చదవలేకపోవడంతో దీనిని సంధియుగం అని కూడా అంటారు. నట్వర్ జా మరియు రాజారావు లాంటి పండితులు సింధు లిపిని చదవడానికి ప్రయత్నించి విఫలమయ్యారు.

కాంస్య యుగ నాగరికత:
భారతదేశంలో సింధు  ప్రజలు కాంస్యమును మొదటిసారిగా ఉపయోగించారు. కాబట్టి దీనిని కాంస్య యుగ నాగరికత అని అంటారు.
కాంస్యం: రాగి తగరంల మిశ్రమం.

సమకాలీన నాగరికతలు

సింధు నాగరికత కాలంలో ప్రపంచంలో మరో మూడు నాగరికతలు కూడా ఉన్నాయి.

1) మెసపటోనియా నాగరికత:
ఇది ప్రస్తుత ఇరాక్ లో టైగ్రీస్ నది లోయల్లో కొనసాగింది. సింధు ప్రజలు ఈ నాగరికతతో సాంస్కృతిక, వాణిజ్య సంబంధాలను కొనసాగించారని ఖచ్చితమైన ఆధారాలున్నాయి.
ఇరాక్ పూర్వనామం మెసపటోనియా.

2) ఈజిప్ట్ నాగరికత:
ఈ నాగరికత ఆఫ్రికా ఖండంలోని నైలు నది లోయలో అభివృద్ధి చెందింది. సింధు ప్రజలు ఈజిప్ట్ ప్రజలతో సంబంధాలు కొనసాగించారని ఆధారాలు లేవు.

3) చైనా నాగరికత:
చైనాలోని హోయాంగ్ హో నది లోయలో ఈ నాగరికత అభివృద్ధి చెందింది.

సింధు నాగరికత ఆవిర్భావం

సింధు నాగరికత ఆవిర్భావం గురించి పండితులు ఖచ్చితమైన సమాచారాన్ని ఇవ్వలేకపోతున్నారు. పురావస్తు శాస్త్రవేత్తలు కూడా తవ్వకాల్లో బయల్పడిన వాస్తు అవశేషాల ద్వారా ఊహాగానాల మీద సిద్ధాంతాలను రచించి మనకు తెలియజేస్తున్నారు.

పండితుల అభిప్రాయాలు

ఎ) ఘోష్ మరియు శంకాలియా ప్రకారం ఈ సంస్కృతి క్రీ.పూ.3000లో అభివృద్ధి చెందింది అని, నవీన శిలాయుగ మరియు తామ్ర శిలాయుగ సంస్కృతులు గణనీయంగా అభివృద్ధి చెంది సింధు నాగరికతకు బాటలు వేసాయి. వీరి ప్రకారం సింధు ప్రజలు సింధు మరియు సరస్వతి ప్రాంతాల్లో అభివృద్ధి చెందిందిగా చెప్పవచ్చు. నవీన శిలాయుగానికి చెందిన మెహర్ గర్ లో లభించిన టెర్రకోటా బొమ్మలు స్టీటైట్ తో చేసిన ముద్రికలు ఈ ప్రాంతంలోనే లభించాయి. దీనిని బట్టి సింధు నాగరికత పూర్తిగా స్వదేశీయమైనది అని అర్థమవుతుంది.

బి) వీలర్ ప్రకారం సింధు ప్రజలు విదేశీయులు. నాగరికత అనే భావన మెసపటోనియాలో పుట్టి సింధు ప్రాంతానికి వలస వచ్చి ప్రత్యేక నాగరికతను అభివృద్ధి చేసుకొని సింధు నాగరికతగా పరికల్పన చేశారు. నగర జీవితాన్ని గడపడం, స్నానవాటికలు, ధాన్యాగారాలు మరియు మాతృదేవతను పూజించడం ఈ రెండు నాగరికతల్లో ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి. కానీ ఆధునిక చరిత్రాకారులు ఈ అభిప్రాయాన్ని తిరస్కరిస్తున్నారు ఎందుకనగా సింధు నాగరికతలో కనిపించే శాస్త్రీయమైన పట్టణ నిర్మాణం, ఉన్నతమైన జీవనం మెసపటోనియా నాగరికతలో కనిపించడంలేదు.

సి) రఫిక్ మొఘల్ ప్రకారం సింధు నాగరికత బలూచిస్తాన్ నుండి సింధు లోయకు వలస వచ్చి తామర శిలాయుగాన్ని ఆధునీకరించుకొని నాగరికతగా చేసుకున్నారు. సింధు ప్రజలు లింగాలను, ఎద్దును పూజించడం, కోటలు నిర్మించుకోవడం బలూచిస్తాన్ కి చెందిన జోబ్, కుల్లి సంస్కృతుల్లో కూడా ఉందని ఈయన అభిప్రాయం. కానీ పండితులు దీనిని విశ్వసించడంలేదు.

✓సింధు నాగరికత ప్రజలు ఈ నాలుగు జాతులకు చెందినవారని ఒక బలమైన ఊహ:

1) మంగోలాయిడ్ జాతి: మోహేంజోదారోలో లభించిన గడ్డపు మనిషి బొమ్మలో మంగోలాయిడ్ జాతి లక్షణాలు కనిపిస్తున్నాయి.

2) మెడిటరేనియన్ జాతి: ఈ ప్రాంతంలో అధిక సంఖ్యాకులు ద్రావిడ భాష మాట్లాడడం వలన సింధు ప్రజలను ద్రావిడ ప్రజలు నీ కూడా అంటారు. (మెడిటరేనియన్ అనేది జాతిపదం. ద్రావిడ అనేది భాష.)

3) ఆల్ఫినాయిడ్ జాతి: పురావస్తు తవ్వకాల్లో ఈ జాతికి సంబంధించిన అవశేషాలు లభ్యమయ్యాయి.

4) ఆస్ట్రోలాయిడ్ జాతి: మోహేంజోదారోలో లభించిన కాంస్యంతో చేసిన నాట్యగత్తె విగ్రహంలో ఈ జాతి లక్షణాలు కనిపిస్తున్నాయి.

“నాట్యకారిణి” సింధు లోయ నాగరికత యొక్క కళా నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తూ, దక్షిణ ఆసియా చరిత్రలో ఒక ముఖ్యమైన భాగంగా కొనసాగుతోంది.

ఈ వివాదం 9వ తరగతి కోసం కొత్తగా ప్రవేశపెట్టిన ‘మధురిమ’ అనే కళా విద్యా పాఠ్యపుస్తకానికి సంబంధించినది. మొహెంజో-దారోలో కనుగొనబడిన ‘నాట్యకారిణి’ శిల్పం, ప్రాచీన సింధు లోయ నాగరికతకు చెందిన అత్యంత ప్రసిద్ధ కళాఖండాలలో ఒకటి. 4,000 సంవత్సరాల క్రితం రూపొందించబడిన ఈ కంచు విగ్రహం, తొలి కళాత్మక విజయానికి ఒక ముఖ్యమైన ఉదాహరణగా పరిగణించబడుతుంది.

అయితే, కొత్త పాఠ్యపుస్తకంలో ఉపయోగించిన చిత్రం అసలు శిల్పానికి భిన్నంగా ఉంది. అసలు బొమ్మకు మొండెం నగ్నంగా ఉండగా, ప్రచురించిన చిత్రంలో మొండెం భుజాల నుండి కిందికి నీడతో చూపబడింది.కళల చరిత్ర” అనే శీర్షిక గల ప్రారంభ అధ్యాయంలో సవరించిన చిత్రం కనిపించింది. అసలు శిల్పం దాని అసలైన రూపంలో విస్తృతంగా గుర్తింపు పొంది, ప్రపంచవ్యాప్తంగా చరిత్ర, పురావస్తు శాస్త్రం మరియు కళా ప్రచురణలలో తరచుగా ప్రస్తావించబడుతున్నందున, ఈ మార్పు దృష్టిని ఆకర్షించింది.

అంతకుముందు, NCERT డైరెక్టర్ దినేష్ ప్రసాద్ సక్లానీ NDTVతో మాట్లాడుతూ, “మొండెం భాగాన్ని కప్పి ఉంచడం వెనుక నిర్దిష్ట కారణం ఏమీ లేదు. పాఠ్యపుస్తకాల రూపకల్పనకు బాధ్యత వహించే కళలు మరియు విద్య విభాగానికి ఈ విషయాన్ని నివేదించడం జరిగింది” అని చెప్పారు.

సింధు నాగరికత ప్రధాన పట్టణాలు

పురావస్తు శాస్త్రవేత్తలు సుమారు 200 పైగా ప్రధాన పట్టణాలను సింధు నాగరికతలో భాగంగా కనుగొన్నారు. సింధు నాగరికత పట్టణ నాగరికత. వాటిలో ముఖ్య నగరాలు హరప్పా (పాకిస్తాన్), మోహెంజోదారో (పాకిస్తాన్), ఛాన్సుధారో(పాకిస్తాన్), లోథాల్ (గుజరాత్), కాళీబంగన్(రాజస్థాన్), బన్వాలి(హర్యానా) మొదలగునవి.

– బానోత్ కళ్యాణ్ 

Latest News

ఆన్ లైన్లనే మనువు… అచ్చింతలు!?|ADUGU TRENDS

పెండ్లిల్లు సొర్గంల నిర్ణయిత్తరట. ఎవలితో? ఎక్కడ? ఎప్పుడు? ఎట్ల జరగాల్నో? గాడనే తేలుత్తరట. గవాటి సంగతేమో! గనీ, గీ మద్దెల భూమ్మీద మనువులు మాత్రం మానవులే నిర్ణయిత్తాండ్రు. గా అమెరిక అధ్యచ్చుడు ట్రంపు...

చల్లని హిమాలయాల్లో విస్ఫోటక వాటర్ బాంబ్స్!|EDITORIAL

ముప్పు పర్వత ప్రాంతాలకే పరిమితం కాదు. సిక్కిం లేదా నేపాల్ హిమాలయాల్లో పెద్ద స్థాయిలో జీఎల్ఓఎఫ్ సంభవిస్తే కోసి, గండక్, తీస్తా వంటి నదుల ద్వారా వరదనీరు దిగువ మైదాన ప్రాంతాలకు చేరే...

సెప్టెంబర్ 01, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తిధి చవితి ఉదయం 07.10 వరకు ఉపరి పంచమి నక్షత్రం అశ్విని రాత్రి 03.17 వరకు ఉపరి భరణి యోగం వృద్ధి రాత్రి 01.14 వరకు ఉపరి ధ్రువ కరణం బాలవ ఉదయం 07.12 వరకు ఉపరి కౌలవ రాహుకాలం...

ఆగస్టు 31, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం సంకట హరచతుర్థి తిధి తదియ ఉదయం 08.20 వరకు ఉపరి చవితి నక్షత్రం రేవతి రాత్రి తెల్ల 04.01 వరకు ఉపరి అశ్విని యోగం గండ రాత్రి 03.29 వరకు ఉపరి వృద్ధి కరణం భద్ర ఉదయం 08.20...

అమ్మ.. నాన్న… ఓ కూతురు!|KONDA FAMILY|CONGRESS|CM|REVANTH REDDY

కొండా ఫ్యామిలీ@వివాదాలు ఎందులోనూ ఇమడరు మరెందులోనూ పొసగరు ఎవరినీ అంగీకరించరు వారెవరికీ అంగీకారంగా ఉండరు వారిది ఇష్టానుసారం.. వారికి లేదు అధిష్ఠానం.. లేనేలేదు విచారం! కొండంత ప్రచారం సొంత నియోజవర్గంలోనూ పార్టీ నేతలు, కార్యకర్తలతో విభేదాలు, కేసులు రాష్ట్ర రాజకీయాల్లో ‘అమ్మ! నాన్న!! ఓ...

గుప్తుల పూర్వయుగం|ADUGU DIGITAL MEDIA|SPECIAL|HISTORY|COMPITITIVE EXAMS

సుమారు 135 సంవత్సరాల మౌర్యుల పాలన తర్వాత భారత ఉపఖండంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడి మౌర్య సామ్రాజ్య పతనానికి కారణమైంది. మౌర్యులు బ్రాహ్మణులు కారని పండితులు తిరుగుబాటు చేయడం, అవైదిక మతాలైన బౌద్ధ, జైన...

గిది శేపా.. బంగారు తునకా!?|ADUGU TRENDS

పుస్తెలమ్మైనా పులస తినాల్నన్నరు. పులస శేపకున్న గిరాకీ అసొంటిది మరి. ఏటికి ఎదురీదుతూ పులసలు దొరికే అరుదైన కాలమిది. గా పులస శేప కోసం జనం ఎగబడ్తరు. ఎంత డబ్బైనా పెట్టి కొంటరు....

నేపాల్ లో సవాల్ గా సహాయక చర్యలు!|EDITORIAL

హిమాలయ ప్రాంతాల్లో వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు దేశాలు సిద్ధంగా ఉన్నాయా? అధిక ఉష్ణోగ్రతలు, మంచు కరుగుదల, హిమనదుల అస్థిరత, కొండచరియలు వంటి పరిణామాలు భవిష్యత్‌లో ఆకస్మిక వరదల ముప్పును పెంచే అవకాశం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 05 వరకు రాశి ఫలాలు మేష రాశి: ఈ వారం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. చేపట్టిన పనులను పట్టుదలతో పూర్తి చేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా మంచి...

ఉద్వాసనా? ఉపేక్షనా? రిటర్న్ గిఫ్ట్ ఏంటి?|ADUGU EXCLUSIVE

రాఖీతో రాజీ కుదిరేనా!?|RAKHI POURNAMI చర్యలకే మొగ్గు చూపేనా? కొండా వివాదం ఎటువైపు?|KONDA SUREKHA|CM|REVANTH REDDY తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ చుట్టూ నెలకొన్న తాజా వివాదాస్పద పరిణామాలు పార్టీలో క్రమశిక్షణ, వ్యక్తిగత రాజకీయ సంబంధాలు,...

గీ ఈడియ సూత్తే గుండె కరగాలె!?|ADUGU TRENDS

రాఖీలను తోడబుట్టినోల్లకే కాదుల్లా. సోదర భావంతోటి ఎవ్వలకైనా కట్టొచ్చు. గట్లనే ఓ బడి పిల్ల, ఎవ్వలూ లేక వాడవాడలకు తిరిగే ఓ అనాథకు రాఖీ కట్టింది. తనలోని మానవత్వాన్ని సాటుకుంది. యేడ జరిగిందో గనీ,...

కాంగ్రెస్‌లో కలుపు మొక్కలు!|EDITORIAL

ప్రజలు కోరుకునేది పార్టీ అంతర్గత రాజకీయ విమర్శలు కాదు, ఫలితాలు. మంత్రులు తమ శాఖలపై దృష్టి పెట్టాలి. ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపై మాట్లాడాలి. పార్టీ నేతలు ముఖ్యమంత్రి నాయకత్వాన్ని బలహీనపరిచే బహిరంగ పోరాటాలకు...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News