Monday, August 10, 2026
27.5 C
Hyderabad

సట్టుబండల సదువుతో సంపూర్ణ అక్షరాస్యత సాధ్యమేనా!?|EDITORIAL

అక్షరాస్యత అంటే వ్యక్తి చదవగలగడం, రాయగలగడం, ప్రాథమిక లెక్కలలో చక్కగా వ్యవహరించగలగడం. కానీ ‘సంపూర్ణ అక్షరాస్యత’ అంటే కేవలం అక్షరాల పరిచయం మాత్రమే కాదు. అది వ్యక్తి చైతన్యం, సంఘంలో విజ్ఞానంతో పాల్గొనగల సామర్థ్యం, ప్రాథమిక విద్యను మించిన జీవిత నైపుణ్యాలు కలిగి ఉండటమని అర్థం.

భారతదేశం సహా అనేక రాష్ట్రాలు అక్షరాస్యతలో పురోగతిని సాధించినప్పటికీ, అది సంపూర్ణ స్థాయికి చేరలేకపోయింది. దేశంలో 2024 నాటికి అక్షరాస్యత రేటు 77శాతంగా ఉండగా, తెలంగాణలో 72శాతం పైనే ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో, మహిళలలో, ఆదివాసీ గిరిజన సమాజాల్లో, అక్షరాస్యత స్థాయి చాలా తక్కువగా ఉంది.

ప్రతి ఏటా సెప్టెంబర్‌ 8వ తేదీని ’అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం’గా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. నవంబర్‌ 17, 1965లో యునెస్కో సభ్యదేశాల విద్యాశాఖ మంత్రుల మహాసభ అనంతరం అక్షరాస్యత దినోత్సవాన్ని ప్రకటించగా, 1966 నుండి జరుపుకుంటున్నాం. ఉన్నతమైన జీవనానికి, విద్య, విజ్ఞానం ఎంతో అవసరం. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలతో పోలిస్తే అక్షరాస్యత విషయంలో భారతదేశం వెనుకబడి వున్నట్లే. అనేక రాష్టాల్రు సగటు అక్షరాస్యతా శాతానికి దూరంగా ఉన్నాయి. ప్రపంచ నిరక్షరాస్యుల్లో సగం మంది మనదేశంలోనే ఉండటం విచారకరం.
దేశంలో సర్వ శిక్షా అభియాన్, మధ్యాహ్న భోజన పథకం, బేటీ బచావో – బేటీ పడావో వంటి కార్యక్రమాలు అమలవుతున్నాయి. గతంలో వయోజన విద్యకు ప్రాధాన్య ఇచ్చేవారు. ఈ మధ్య అది కనిపించడం లేదు. ప్రతి ఒక్కరిని అక్షరాస్యులను చేయాలన్న సంకల్పం మేరకు గ్రామ స్థాయిలో సర్వేచేసి పిల్లలను బలవంతంగా స్కూళ్లకు చేర్చారు. అలాగే పనిప్రదేశాల్లో బాలకార్మికులను లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేవారు అవేవీ ఇప్పుడు పెద్దగా అమలు కావడం లేదు. పలు వైఫల్యాల కారణంగా అక్షరాస్యతను సాధించడంలో మనం విఫలం అవుతున్నాం.

ప్రభుత్వాలు పెద్ద మొత్తంలో నిధులను ఖర్చు చేస్తున్నా, వాటి వినియోగం లోపిస్తున్నది. నిర్దిష్ట లక్ష్యాలు లేకపోవడం, మధ్యంతర సమీక్షలు, విశ్లేషణల కొరత, వ్యవస్థాపిత అవినీతి, పాఠశాలల నిర్మాణం నుంచి ఉపాధ్యాయ నియామకాల వరకు ప్రతిచోటా కనిపిస్తోంది. బడుల్లో బోధన జరిగే తీరుపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాఠ్యాంశాలు స్థానికత లోపించి. అర్థవంతంగా ఉండకపోవడం, ఉపాధ్యాయుల నైపుణ్యం లోపించడం, ఉపకరణాల కొరత వంటి ఆటంకాలు కనిపిస్తున్నాయి. పేద కుటుంబాల పిల్లలు ఇప్పటికీ పనులకే వెళ్ళిపోతున్నారు. బాల కార్మిక వ్యవస్థలో చిక్కుకొని ఇంకా కొందరు చదువుకు దూరంగా ఉండే పరిస్థితులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా గిరిజన, దళిత సమాజాలలో విద్యపై అవగాహన లేకపోవడమే కాక, ఆధునిక విద్యను ‘అవాంఛిత భారంగా’ భావించే ధోరణి కనిపిస్తోంది. విద్యా మాధ్యమం అంటే బోధనా భాష అడ్డంకిగా మారుతోంది. విద్యార్థులు మాతృభాషలో అయితేనే చదువుకోగలరు. సులువుగా అర్థం చేసుగలరు. బాలికల విద్యలో ఇంకా ఉన్న సామాజిక ఆంక్షలు, బాల్య వివాహాలు, భద్రతా భయాలు వంటి అంశాలు సంపూర్ణ అక్షరాస్యతను దూరంగా ఉంచుతున్నాయి. అక్షరాస్యతలో లింగ వ్యత్యాసం ఒక సవాల్ గా నిలుస్తోంది.

భారతదేశంలో సర్వ శిక్షా అభియాన్, మధ్యాహ్న భోజన పథకం, బేటీ బచావో – బేటీ పడావో వంటి కార్యక్రమాలు ఉన్నా, అవి ప్రగతికి కారణమయ్యాయో, లేక ప్రజలకు మరొక సంక్షేమ పథకంగా మిగిలిపోయాయో అన్నది ప్రశ్నార్థకమే. అనేక పాఠశాలలు విద్యార్థుల లెక్కల కోసం ‘ఒకడినీ వదలొద్దు’ అన్న నినాదాన్ని మాత్రమే అనుసరిస్తున్నాయి, బోధనను గాలిక వదిలేస్తున్నాయి.

విద్యా వ్యవస్థను కేవలం పాఠశాల స్థాయిలో కాక, సామాజిక స్థాయిలోనూ ఆధునీకరించాలి. ఉపాధ్యాయుల శిక్షణ, పాఠ్యాంశాల్లో స్థానికతకు ప్రాధాన్యత ఇవ్వడం, భాషను విద్యార్థులకి అర్థమయ్యేలా మార్చడం అవసరం. సమాజం మొత్తంగా విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రచారం జరగాలి. ఇది కేవలం ప్రభుత్వ బాధ్యత కాదు, ప్రతి పౌరుడి బాధ్యత కావాలి. డిజిటల్ విద్యను సామాన్యులకు అందుబాటులోకి తేవాలి. డిజిటల్ విభజనను అధిగమించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్, విద్యా పరికరాలు అందించాలి. బాలికల విద్య, గిరిజన సమాజాల అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలి. జాతీయ నూతన విద్యా – ఎన్ఇపి-2020 – విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి.

ప్రపంచ నిరక్షరాస్యు ల్లో సగం మంది మనదేశంలోనే ఉండటం విచారకరం. స్థిరమైన ఆర్థికాభివృద్ధి సాధించాలంటే దేశంలో 80 శాతం అక్షరాస్యత సాధించాల్సిన అవసరం ఉంది. ప్రధానగా విద్యారంగం పట్ట కేంద్ర, రాష్టాల్రు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ బడ్జెట్ కేటాయింపులను తగ్గించేస్తున్నాయి. జనాభాకు అనుగుణంగా విద్యారంగానికి నిధులు ఇవ్వాలి. ప్రైవేటు, కార్పొరేట్ విద్యపై ప్రభుత్వ అజమాయిషీ కొరవడింది. దీంతో వాటి ఫీజులుం, దోపిడీ కొనసాగుతూనే ఉంది. తెలంగాణలో కెజి టూ పిజి విద్యకు ప్రణాళిక పట్టాలకెక్కడం లేదు. ఏపీలో జగనన్న ‘విద్యా కానుక’ తప్ప స్కూళ్ల బలోపేతం జరగలేదు. ప్రభుత్వ రంగంలో ప్రాథమిక విద్యకు బలమైన పునాదులు పడాలి. అలాగేకార్పోరేట్‌ దోపిడీని అరికటటాలి. అప్పుడే విద్యారంగం విస్తృతం కాగలదు. సామాన్యుడి నుంచి, రాజకీయనాయకుల, అధికారుల పిల్లలంతా ఒకే విద్యావిధానంలో చదవాలన్న ఆకాంక్ష అమలు కావడం లేదు. విద్యాభివృద్దిలో కులరహిత హాస్టళ్లు ఉండకూడదు. కామన్‌ ఎడ్యుకేషన్‌ అన్నది సమాజాంలో అంతరాలను తొలగిస్తుంది. చదువుకుంటే నిరుద్యోగిగా మిగిలిపోతున్న ప్రస్తుత తరుణంలోచదువుతు తగ్గ ఉపాధి దక్కేలా చేయాలి. చిత్తశుద్ధి ఉంటే తప్ప విద్యారంగాన్ని మార్చలేం. అందరికీ విద్య అన్నది ప్రాథమిక హక్కుగా ఉన్నా, ఆచరణలో సాధ్యం కావడంలేదు. దీనిని ఆచరణలోకి తీసుకుని వచ్చేలా చర్యలు తీసుకుంటే తప్ప సంపూర్ణ అక్షరాస్యత సాధ్యం కాదు.

Latest News

ఆగస్టు 10, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి ద్వాదశి ఉదయం 06.13 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం ఆరుద్ర ఉదయం 11.53 వరకు ఉపరి పునర్వసు యోగం వజ్ర రాత్రి 11.10 వరకు ఉపరి సిద్ది కరణం తైతుల ఉదయం 06.13 వరకు ఉపరి...

బోనాలు – చరిత్ర, సంస్కృతి, సంప్రదాయం|BONALU|HISTORY|CULTURE

చారిత్రక, పురావస్తు, శాసన, సాహిత్య ఆధారాల విశ్లేషణ ప్రకారం బోనం సమర్పించే ఆచారం ఆషాఢ మాసంలో తెలంగాణతో పాటు దక్షిణ భారతదేశంలోని అనేక గ్రామాల్లో గ్రామదేవతారాధనలో అంతర్భాగంగా కొనసాగుతోంది. వర్షాకాలం ప్రారంభ దశలో...

కల్లుకు శిల్లు.. సీసీ కెమెరా!?|ADUGU TRENDS

యెన్కటికి దొంగకు శెప్పే లాభమన్నరు. దోసుకుంటోనికి శెప్పైనా, తప్పైనా ఒకటే. పడదలే సూసుకుంటడు. గట్లనే గీ మద్దెల దొంగలు తమ రూటు మార్సుకున్నరు. కంటికి కనుకు లేకుండా ఇంటికి కన్నాలేసుడు అసొంటివి మానేసిండ్రు....

రాహుల్ ముందున్న మార్గాలివే!?|EDITORIAL

రాహుల్‌ ముందున్నది ‘బొద్దింకలను బుట్టలో వేసుకోవడం’ కాదు. యువత నమ్మకాన్ని సంపాదించడం. ఆ నమ్మకం ఒక్క ఆందోళనతో రాదు. నిరంతర పోరాటం, స్పష్టమైన విధానాలు, ప్రత్యామ్నాయ పాలనా నమూనా, విశ్వసనీయ నాయకత్వం కావాలి....

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 09 నుండి ఆగస్టు 15 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశివారికి అనుకూలమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. మీ పనితీరుకు ఉన్నతాధికారుల...

నవ్వినోల్లే నోర్లెల్లబెట్టిండ్రు!?|ADUGU TRENDS

సంకల్పించాలె కనీ, కాని పని ఉంటదా? ఉండనే ఉండదని నిరూపించిండు గీ పెద్దాయినె. నల్గురు సూసి నవ్వినా, నా పని నేను శేసుక పోతానని, శేసి సూపిండు. గీయినె పేరు హీలియో డా సల్వా....

క్యా బోల్తే… పాలక్!?|EDITORIAL

దేశ భవిష్యత్తు యువతే. ఆ యువత ప్రశ్నిస్తే వినాలి, సూచిస్తే ఆలోచించాలి, సమస్యలు చెబితే పరిష్కరించాలి. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే అధికారానికి సమాంతరంగా జవాబుదారీతనాన్ని పెంపొందించే స్వతంత్ర ప్రజా వేదికలు అవసరం. ప్రజల...

ఆగస్టు 08, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి దశమి ఉదయం 11.09 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం రోహిణీ మధ్యాహ్నం 03.15 వరకు ఉపరి మృగశిర యోగం ధ్రువ ఉదయం 08.20 వరకు ఉపరి వ్యాఘాత కరణం భద్ర ఉదయం 11.09 వరకు ఉపరి...

ఇగిప్పుడు ‘సావు’కొచ్చింది!?|ADUGU TRENDS

మన ఊర్లల్ల ఎవ్వలన్న కాలం శేసిండ్రంటేనే సూసొత్తం. కనికరం సూపి తలో సెయ్యేత్తం. దిక్కూమొక్కూలేనోల్లతై మనమే తలా ఇంతేసుకుని గాయింత ఇగ గా కట్టెల్లేసొత్తం. కానీ, తలకొరివి పెట్టాల్సిన కన్న బిడ్డలే కడసారి...

శ్రద్ధేది? శుద్ధ దండగ!?|EDITORIAL

2025 వర్షాకాల సమావేశాల్లో నిర్ణయించిన సమయంలో లోక్‌సభ కేవలం 29%, రాజ్యసభ 34% మాత్రమే పనిచేశాయి. ప్రశ్నోత్తరాల సమయంలో లోక్‌సభలో కేవలం 23%, రాజ్యసభలో 6% మాత్రమే పని జరిగింది. అదే సమావేశాల్లో14...

ఆగస్టు 07, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి నవమి మధ్యాహ్నం 01.29 వరకు ఉపరి దశమి నక్షత్రం కృత్తిక సాయంత్రం 04.48 వరకు ఉపరి రోహిణీ యోగం వృద్ధి ఉదయం 11.17 వరకు ఉపరి ధ్రువ కరణం గరజి మధ్యాహ్నం 01.29 వరకు ఉపరి...

మౌర్య పూర్వయుగం|ADUGU SPECIAL|HISTORY|COMPITITIVE EXAMS

క్రీ.పూ.650 నుండి క్రీ.పూ.250 మధ్య ఉన్న కాలాన్ని మౌర్యుల పూర్వయుగం లేదా బుద్ధుని యుగం లేదా షోడశ మహాజనపాదాల యుగం అని అంటారు. ఈ కాలంలో గౌతమ బుద్ధుడు ముఖ్య పురుషుడు కాబట్టి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News