Thursday, September 17, 2026
30.5 C
Hyderabad

పాకిస్తాన్ ద్వంద్వ నీతి!|EDITORIAL

భారత-పాకిస్తాన్ సంబంధాలు ఉద్రిక్తతలతో కూడుకుని ఉంటాయి. ఇప్పటికే రెండు దేశాల మధ్య యుద్ధాలు కూడా జరిగాయి. పాక్ అదే పనిగా చేస్తున్న సరిహద్దు ఉల్లంఘనలు, ఉగ్రవాద ప్రోత్సాహం, ఆక్రమిత కశ్మీర్ వంటి అంశాలు దాయాదుల మధ్య సంబంధాలను పూర్తిగా దెబ్బతీశాయి. పహల్గాం సంఘటన తర్వాత ఉత్పన్నమైన యుద్ధం కారణంగా పాకిస్తాన్ బాగా దెబ్బతింది. కాళ్ళ బేరానికి వచ్చి, బతిమిలాడుకుంటే పాక్ అభ్యర్థనను మన్నించి భారత్ యుద్ధ విరమణకు ఒప్పుకుంది. చావు తప్పి కళ్ళు లొట్టబోయిన పాక్ తన దుర్బుద్ధిని వీడలేకపోతున్నది. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నది. అమెరికా అండ చూసుకుని విర్రవీగుతున్నది.
పాక్ ఉగ్రదాడుల నేపథ్యంలో పాకిస్తాన్ కు సింధు జలాలను నిలిపేస్తూ భారత్ నిర్ణయించింది. ఓ వైపు పాక్ ఆర్మీ చీఫ్ అసిఫ్ మునీర్, మాజీ మంత్రి బిలావల్ భుట్టోలు బెదిరింపులకు దిగుతున్నారు. మరోవైపు తమకు సింధూ జలాలను విడుదల చేయాలని ఆ దేశ విదేశాంగ శాఖ భారత్ ను వేడుకుంటోంది. పాక్ విదేశాంగ శాఖ భారత్ కు ఈ మేరకు ఓ అభ్యర్థనను పంపింది. సింధూ జలాల ఒప్పందాన్ని నమ్మకంగా, న్యాయ బద్ధంగా కొనసాగించాలని కోరుతున్నది.

మరోవైపు పాక్ ఆర్మీ చీఫ్ భారత్ పై నోరు పారేసుకున్నారు. అణు హెచ్చరికలు చేశారు. ‘భారత్ అనేది హై వేపై వస్తున్న మెర్సీడెస్ కారు లాంటిది. కానీ, పాక్ మాత్రం కంకరతో నిండిన ఓ డంప్ లారీ లాంటిది. ఒక వేళ కారు వచ్చి లారీని ఢీ కొంటే ఎవరికి నష్టం? ’ అని పేర్కొన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. పిరికి పంద బెదిరింపులు, సింధు నీటిని నిలిపివేస్తే యుద్ధం తప్ప మరో గత్యంతరం లేదని ఉత్తర ప్రగల్బాల ఉత్తుత్తి పిచ్చి హెచ్చరికలు చేస్తున్నది. మరోవైపు సింధు జలాలను విడుదల చేయాలని అభ్యర్థిస్తున్నది.

భారత్‌పై యుద్ధ హెచ్చరికలు పాక్ ప్రజల్లో జాతీయ భావాలను రగిలించడానికి ఉపయోగపడుతున్నా, వాస్తవ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, వనరుల కొరత, ముఖ్యంగా నీటి సమస్యను ఎదుర్కొంటోంది. పాక్‌లోని వ్యవసాయం పూర్తిగా సింధు నదీ పరివాహక ప్రాంతంపై ఆధారపడి ఉంది. సింధు, జీలం, చెనాబ్ నదులు భారత ఉపఖండంలోని హిమాలయాల నుంచి ఉద్భవించి పాకిస్తాన్ వైపు ప్రవహిస్తాయి. 1960లో భారత్-పాక్‌ల మధ్య సింధు జలాల ఒప్పందం కుదిరింది. ఈ నదుల నీటి వినియోగానికి స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. భారత్ తూర్పు నదులైన రవి, బియాస్, సట్లెజ్‌ను వినియోగించుకోగా, పాక్‌కు పశ్చిమ నదులైన సింధు, జీలం, చెనాబ్ నీటిని వినియోగించే హక్కు లభించింది. ఈ ఒప్పందం వల్ల పాక్ వ్యవసాయం సాగదీసుకోగలిగింది. అయితే, గత కొన్నేళ్లుగా వాతావరణ మార్పులు, మంచు కరుగుదల తగ్గడం, వర్షపాతం లోపం వంటి కారణాల వల్ల ఈ నదులలో నీటి ప్రవాహం తగ్గిపోతోంది. ఇప్పటికే 15శాతం నీరు తగ్గింది. 21శాతం తగ్గుతుందని పాక్ అంచనా వేసింది. పంటలు పండకపోతే తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తే ప్రమాదం పాక్ కు పొంచి ఉంది.

ఇటీవల పాక్ ప్రభుత్వం, నీటి మేనేజ్మెంట్ సంస్థలు భారత్‌తో నీటి పంపిణీపై పునరాలోచన కోరుతూ పలు సమావేశాలు జరిపాయి. వారు భారత్ నుంచి సాంకేతిక సహాయం, సమాచారం, కొన్ని సందర్భాల్లో అదనపు నీటి విడుదలకూ అభ్యర్థించారు. ఇదే సమయంలో, వారి సైనిక నాయకత్వం మీడియా ముందు “భారత్‌తో ఏ క్షణమైనా యుద్ధానికి సిద్ధం” అనే ప్రకటనలు చేస్తోంది. ఈ రెండు విభిన్న ధోరణులు పాక్‌లోని ద్వంద్వ వైఖరిని బయటపెడుతున్నాయి.

భారత్ పక్షాన చూస్తే, సింధు జలాల ఒప్పందం ఇప్పటికీ గౌరవప్రదంగానే అమలు అవుతోంది. భారత్ తన భాగం నీటిని మాత్రమే వినియోగించి, మిగతా నీటిని ఒప్పందం ప్రకారం పాక్ వైపు వదులుతోంది. అంతర్జాతీయంగా కూడా భారత్ ఈ ఒప్పందాన్ని పాటిస్తున్న బాధ్యతాయుత దేశంగా గుర్తింపు పొందింది. కానీ పాక్ మాత్రం తరచుగా భారత్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తూ, నీటిని ఆయుధంగా వాడుతున్నట్లు ప్రచారం చేస్తోంది. ఇది వారి అంతర్గత రాజకీయ ప్రయోజనాలకు, ప్రజల దృష్టి మళ్లించడానికి చేసే ప్రయత్నంగా కనిపిస్తున్నది.

నిజానికి పాక్ ఆర్థిక దుస్థితి, అంతర్జాతీయ రుణ భారం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రజల్లో అసంతృప్తిని పెంచాయి. ఈ అసంతృప్తిని కట్టడి చేయడానికి వారి నాయకులు యుద్ధ ప్రకటనలు చేసి జాతీయవాద వాదాన్ని పెంచుతున్నారు. అయితే వ్యవసాయం, తాగునీటి అవసరాల కోసం భారత్ సహకారాన్ని కోరడం, పాక్ పరిస్థితి ఎంత బలహీనంగా ఉందో సూచిస్తోంది. యుద్ధం ద్వారా ఏ సమస్యలూ పరిష్కరించబడవు. పైగా, నీటిలాంటి ప్రాణాధార వనరులో భారత్‌పై ఆధారపడే దేశం, యుద్ధాన్ని సవాలు చేయడం వ్యూహపరంగా, రాజకీయపరంగా అతి తెలివి, అవివేకానికి నిదర్శనం.

ఈ నేపథ్యంలో, పాక్ నాయకత్వం తాత్కాలిక రాజకీయ లాభాల కోసం యుద్ధ హెచ్చరికలు చేయకుండా, ప్రజల అసలు సమస్యలపై దృష్టి పెట్టడం ఆ దేశానికి అవసరం. నీటి సంక్షోభం వాతావరణ మార్పుల ప్రభావంతో మరింత తీవ్రమవుతుంది. కాబట్టి భారత్‌తో సహకారం, నది నిర్వహణలో సాంకేతిక మార్పులు, నీటి సంరక్షణ విధానాలు, అంతర్గత మౌలిక సదుపాయాల మెరుగుదల వంటి దీర్ఘకాలిక పరిష్కారాలే వారికి ఉపయోగకరంగా ఉంటాయి.

మొత్తంగా, పాక్ ప్రస్తుత వైఖరి అంతర్జాతీయ వేదికపై ద్వంద్వ నీతిగా కనిపిస్తోంది. ఒకవైపు యుద్ధ బెదిరింపులు, మరోవైపు నీటి కోసం అభ్యర్థనలు ఈ విరుద్ధ స్వరాలు వారి రాజకీయ బలహీనత, ఆర్థిక క్షీణతను వెల్లడిస్తున్నాయి. భారత్‌కు వ్యతిరేకంగా నిరంతరంగా శత్రుత్వ ధోరణి ప్రదర్శించడం కంటే, పరస్పర సహకారంతో సమస్యలను పరిష్కరించడమొక్కటే రెండు దేశాల ప్రజలకు శాంతి, అభివృద్ధిని అందించగల మంచి మార్గం.

Latest News

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News