Monday, August 3, 2026
31.5 C
Hyderabad

పాకిస్తాన్ ద్వంద్వ నీతి!|EDITORIAL

భారత-పాకిస్తాన్ సంబంధాలు ఉద్రిక్తతలతో కూడుకుని ఉంటాయి. ఇప్పటికే రెండు దేశాల మధ్య యుద్ధాలు కూడా జరిగాయి. పాక్ అదే పనిగా చేస్తున్న సరిహద్దు ఉల్లంఘనలు, ఉగ్రవాద ప్రోత్సాహం, ఆక్రమిత కశ్మీర్ వంటి అంశాలు దాయాదుల మధ్య సంబంధాలను పూర్తిగా దెబ్బతీశాయి. పహల్గాం సంఘటన తర్వాత ఉత్పన్నమైన యుద్ధం కారణంగా పాకిస్తాన్ బాగా దెబ్బతింది. కాళ్ళ బేరానికి వచ్చి, బతిమిలాడుకుంటే పాక్ అభ్యర్థనను మన్నించి భారత్ యుద్ధ విరమణకు ఒప్పుకుంది. చావు తప్పి కళ్ళు లొట్టబోయిన పాక్ తన దుర్బుద్ధిని వీడలేకపోతున్నది. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నది. అమెరికా అండ చూసుకుని విర్రవీగుతున్నది.
పాక్ ఉగ్రదాడుల నేపథ్యంలో పాకిస్తాన్ కు సింధు జలాలను నిలిపేస్తూ భారత్ నిర్ణయించింది. ఓ వైపు పాక్ ఆర్మీ చీఫ్ అసిఫ్ మునీర్, మాజీ మంత్రి బిలావల్ భుట్టోలు బెదిరింపులకు దిగుతున్నారు. మరోవైపు తమకు సింధూ జలాలను విడుదల చేయాలని ఆ దేశ విదేశాంగ శాఖ భారత్ ను వేడుకుంటోంది. పాక్ విదేశాంగ శాఖ భారత్ కు ఈ మేరకు ఓ అభ్యర్థనను పంపింది. సింధూ జలాల ఒప్పందాన్ని నమ్మకంగా, న్యాయ బద్ధంగా కొనసాగించాలని కోరుతున్నది.

మరోవైపు పాక్ ఆర్మీ చీఫ్ భారత్ పై నోరు పారేసుకున్నారు. అణు హెచ్చరికలు చేశారు. ‘భారత్ అనేది హై వేపై వస్తున్న మెర్సీడెస్ కారు లాంటిది. కానీ, పాక్ మాత్రం కంకరతో నిండిన ఓ డంప్ లారీ లాంటిది. ఒక వేళ కారు వచ్చి లారీని ఢీ కొంటే ఎవరికి నష్టం? ’ అని పేర్కొన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. పిరికి పంద బెదిరింపులు, సింధు నీటిని నిలిపివేస్తే యుద్ధం తప్ప మరో గత్యంతరం లేదని ఉత్తర ప్రగల్బాల ఉత్తుత్తి పిచ్చి హెచ్చరికలు చేస్తున్నది. మరోవైపు సింధు జలాలను విడుదల చేయాలని అభ్యర్థిస్తున్నది.

భారత్‌పై యుద్ధ హెచ్చరికలు పాక్ ప్రజల్లో జాతీయ భావాలను రగిలించడానికి ఉపయోగపడుతున్నా, వాస్తవ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, వనరుల కొరత, ముఖ్యంగా నీటి సమస్యను ఎదుర్కొంటోంది. పాక్‌లోని వ్యవసాయం పూర్తిగా సింధు నదీ పరివాహక ప్రాంతంపై ఆధారపడి ఉంది. సింధు, జీలం, చెనాబ్ నదులు భారత ఉపఖండంలోని హిమాలయాల నుంచి ఉద్భవించి పాకిస్తాన్ వైపు ప్రవహిస్తాయి. 1960లో భారత్-పాక్‌ల మధ్య సింధు జలాల ఒప్పందం కుదిరింది. ఈ నదుల నీటి వినియోగానికి స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. భారత్ తూర్పు నదులైన రవి, బియాస్, సట్లెజ్‌ను వినియోగించుకోగా, పాక్‌కు పశ్చిమ నదులైన సింధు, జీలం, చెనాబ్ నీటిని వినియోగించే హక్కు లభించింది. ఈ ఒప్పందం వల్ల పాక్ వ్యవసాయం సాగదీసుకోగలిగింది. అయితే, గత కొన్నేళ్లుగా వాతావరణ మార్పులు, మంచు కరుగుదల తగ్గడం, వర్షపాతం లోపం వంటి కారణాల వల్ల ఈ నదులలో నీటి ప్రవాహం తగ్గిపోతోంది. ఇప్పటికే 15శాతం నీరు తగ్గింది. 21శాతం తగ్గుతుందని పాక్ అంచనా వేసింది. పంటలు పండకపోతే తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తే ప్రమాదం పాక్ కు పొంచి ఉంది.

ఇటీవల పాక్ ప్రభుత్వం, నీటి మేనేజ్మెంట్ సంస్థలు భారత్‌తో నీటి పంపిణీపై పునరాలోచన కోరుతూ పలు సమావేశాలు జరిపాయి. వారు భారత్ నుంచి సాంకేతిక సహాయం, సమాచారం, కొన్ని సందర్భాల్లో అదనపు నీటి విడుదలకూ అభ్యర్థించారు. ఇదే సమయంలో, వారి సైనిక నాయకత్వం మీడియా ముందు “భారత్‌తో ఏ క్షణమైనా యుద్ధానికి సిద్ధం” అనే ప్రకటనలు చేస్తోంది. ఈ రెండు విభిన్న ధోరణులు పాక్‌లోని ద్వంద్వ వైఖరిని బయటపెడుతున్నాయి.

భారత్ పక్షాన చూస్తే, సింధు జలాల ఒప్పందం ఇప్పటికీ గౌరవప్రదంగానే అమలు అవుతోంది. భారత్ తన భాగం నీటిని మాత్రమే వినియోగించి, మిగతా నీటిని ఒప్పందం ప్రకారం పాక్ వైపు వదులుతోంది. అంతర్జాతీయంగా కూడా భారత్ ఈ ఒప్పందాన్ని పాటిస్తున్న బాధ్యతాయుత దేశంగా గుర్తింపు పొందింది. కానీ పాక్ మాత్రం తరచుగా భారత్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తూ, నీటిని ఆయుధంగా వాడుతున్నట్లు ప్రచారం చేస్తోంది. ఇది వారి అంతర్గత రాజకీయ ప్రయోజనాలకు, ప్రజల దృష్టి మళ్లించడానికి చేసే ప్రయత్నంగా కనిపిస్తున్నది.

నిజానికి పాక్ ఆర్థిక దుస్థితి, అంతర్జాతీయ రుణ భారం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రజల్లో అసంతృప్తిని పెంచాయి. ఈ అసంతృప్తిని కట్టడి చేయడానికి వారి నాయకులు యుద్ధ ప్రకటనలు చేసి జాతీయవాద వాదాన్ని పెంచుతున్నారు. అయితే వ్యవసాయం, తాగునీటి అవసరాల కోసం భారత్ సహకారాన్ని కోరడం, పాక్ పరిస్థితి ఎంత బలహీనంగా ఉందో సూచిస్తోంది. యుద్ధం ద్వారా ఏ సమస్యలూ పరిష్కరించబడవు. పైగా, నీటిలాంటి ప్రాణాధార వనరులో భారత్‌పై ఆధారపడే దేశం, యుద్ధాన్ని సవాలు చేయడం వ్యూహపరంగా, రాజకీయపరంగా అతి తెలివి, అవివేకానికి నిదర్శనం.

ఈ నేపథ్యంలో, పాక్ నాయకత్వం తాత్కాలిక రాజకీయ లాభాల కోసం యుద్ధ హెచ్చరికలు చేయకుండా, ప్రజల అసలు సమస్యలపై దృష్టి పెట్టడం ఆ దేశానికి అవసరం. నీటి సంక్షోభం వాతావరణ మార్పుల ప్రభావంతో మరింత తీవ్రమవుతుంది. కాబట్టి భారత్‌తో సహకారం, నది నిర్వహణలో సాంకేతిక మార్పులు, నీటి సంరక్షణ విధానాలు, అంతర్గత మౌలిక సదుపాయాల మెరుగుదల వంటి దీర్ఘకాలిక పరిష్కారాలే వారికి ఉపయోగకరంగా ఉంటాయి.

మొత్తంగా, పాక్ ప్రస్తుత వైఖరి అంతర్జాతీయ వేదికపై ద్వంద్వ నీతిగా కనిపిస్తోంది. ఒకవైపు యుద్ధ బెదిరింపులు, మరోవైపు నీటి కోసం అభ్యర్థనలు ఈ విరుద్ధ స్వరాలు వారి రాజకీయ బలహీనత, ఆర్థిక క్షీణతను వెల్లడిస్తున్నాయి. భారత్‌కు వ్యతిరేకంగా నిరంతరంగా శత్రుత్వ ధోరణి ప్రదర్శించడం కంటే, పరస్పర సహకారంతో సమస్యలను పరిష్కరించడమొక్కటే రెండు దేశాల ప్రజలకు శాంతి, అభివృద్ధిని అందించగల మంచి మార్గం.

Latest News

ఆగస్టు 03, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి రాత్రి 08.18 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 08.37 వరకు ఉపరి రేవతి యోగం సుకర్మ రాత్రి 08.54 వరకు ఉపరి ధృతి కరణం కౌలవ ఉదయం 08.40...

అవుమల్లా! కడుపుల బిడ్డ స్పందిత్తదా!?|ADUGU TRENDS

తల్లి గర్భంల ఉండంగనే బిడ్డలకి బయటియి యినబడ్తయా? గవాటికి గా పిల్లలు గూడ స్పందిత్తరా? యెన్కటికి కడుపుల ఉండంగనే అర్జునుడి కొడుకు అభిమన్యుడు పద్మవ్యూహంలకెట్ల పోవాల్నో తెలుసుకున్నడట. గిది నిజమో కాదో కనీ,...

ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ గా భోగాపురం!?|EDITORIAL

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఒక కొత్త అవకాశాన్ని తెరిచింది. ఈ అవకాశాన్ని స్థిరమైన అభివృద్ధిగా మలచడం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్థానిక ప్రజల సమిష్టి కృషిపైనే ఆధారపడి ఉంటుంది. మౌలిక వసతుల...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 02 నుండి ఆగస్టు 08 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీరు చేపట్టే పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో...

యిధి యిసిత్రమైందంటే గిదే మరి!?|ADUGU TRENDS

యిధి శాల యిసిత్రమైంది. ఒకపాలి కలిసున్నోల్లను సిడెంల యిడదీత్తది. యిడిపోయినోల్లని శిటికెల కలిపేత్తది. గసొంటిదే గీ ముచ్చట. గదేందో సూద్దాం పాండ్రి. తమిళనాడు రాస్ట్రం విరుదు నగర్ జిల్లా తిరుచూలి పూమాలై పట్టీకి శెందిన...

పోలీసింగ్ పై పార్లమెంటులో సమీక్షేది!?|EDITORIAL

పార్లమెంట్ వరుసగా వాయిదాలు పడుతూ స్తంభిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ప్రతిష్ఠంభనల వల్ల ఉభయ సభల్లో కీలక అంశాలపై అసలు చర్చే జరగడం లేదు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు కూడా అత్యవసరం....

ఆగస్టు 01, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ తదియ రాత్రి 09.20 వరకు ఉపరి చవితి నక్షత్రం శతభిషం రాత్రి 08.09 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శోభ రాత్రి 11.43 వరకు ఉపరి అతిగండ కరణం వణజి ఉదయం 09.10...

తెలంగాణ ‘పెద్ద’న్న అస్తమయం!|TELANGANA|PEDDI SUDHARSHAN REDDY

ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు హనుమకొండలో గుండెపోటు మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు 5రోజులు మృత్యువుతో పోరాటం కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ...

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమవుతోందా!?|EDITORIAL

ప్రతిపక్షం బలహీనంగా ఉంటే ప్రజాస్వామ్యం కూడా బలహీనపడుతుంది. అధికార పక్షం తప్పులను ఎత్తిచూపే శక్తి లేకపోతే ప్రభుత్వ జవాబుదారీతనం తగ్గుతుంది. అందుకే, కాంగ్రెస్ బలపడటం కేవలం ఆ పార్టీ అవసరం మాత్రమే కాదు....

జూలై 31, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ విదియ రాత్రి 09.03 వరకు ఉపరి తదియ నక్షత్రం ధనిష్ఠ రాత్రి 07.09 వరకు ఉపరి శతభిషం యోగం సౌభాగ్య రాత్రి 12.33 వరకు ఉపరి శోభ కరణం తైతుల ఉదయం 08.40...

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News