Sunday, June 14, 2026
28.9 C
Hyderabad

పాకిస్తాన్ ద్వంద్వ నీతి!|EDITORIAL

భారత-పాకిస్తాన్ సంబంధాలు ఉద్రిక్తతలతో కూడుకుని ఉంటాయి. ఇప్పటికే రెండు దేశాల మధ్య యుద్ధాలు కూడా జరిగాయి. పాక్ అదే పనిగా చేస్తున్న సరిహద్దు ఉల్లంఘనలు, ఉగ్రవాద ప్రోత్సాహం, ఆక్రమిత కశ్మీర్ వంటి అంశాలు దాయాదుల మధ్య సంబంధాలను పూర్తిగా దెబ్బతీశాయి. పహల్గాం సంఘటన తర్వాత ఉత్పన్నమైన యుద్ధం కారణంగా పాకిస్తాన్ బాగా దెబ్బతింది. కాళ్ళ బేరానికి వచ్చి, బతిమిలాడుకుంటే పాక్ అభ్యర్థనను మన్నించి భారత్ యుద్ధ విరమణకు ఒప్పుకుంది. చావు తప్పి కళ్ళు లొట్టబోయిన పాక్ తన దుర్బుద్ధిని వీడలేకపోతున్నది. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నది. అమెరికా అండ చూసుకుని విర్రవీగుతున్నది.
పాక్ ఉగ్రదాడుల నేపథ్యంలో పాకిస్తాన్ కు సింధు జలాలను నిలిపేస్తూ భారత్ నిర్ణయించింది. ఓ వైపు పాక్ ఆర్మీ చీఫ్ అసిఫ్ మునీర్, మాజీ మంత్రి బిలావల్ భుట్టోలు బెదిరింపులకు దిగుతున్నారు. మరోవైపు తమకు సింధూ జలాలను విడుదల చేయాలని ఆ దేశ విదేశాంగ శాఖ భారత్ ను వేడుకుంటోంది. పాక్ విదేశాంగ శాఖ భారత్ కు ఈ మేరకు ఓ అభ్యర్థనను పంపింది. సింధూ జలాల ఒప్పందాన్ని నమ్మకంగా, న్యాయ బద్ధంగా కొనసాగించాలని కోరుతున్నది.

మరోవైపు పాక్ ఆర్మీ చీఫ్ భారత్ పై నోరు పారేసుకున్నారు. అణు హెచ్చరికలు చేశారు. ‘భారత్ అనేది హై వేపై వస్తున్న మెర్సీడెస్ కారు లాంటిది. కానీ, పాక్ మాత్రం కంకరతో నిండిన ఓ డంప్ లారీ లాంటిది. ఒక వేళ కారు వచ్చి లారీని ఢీ కొంటే ఎవరికి నష్టం? ’ అని పేర్కొన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. పిరికి పంద బెదిరింపులు, సింధు నీటిని నిలిపివేస్తే యుద్ధం తప్ప మరో గత్యంతరం లేదని ఉత్తర ప్రగల్బాల ఉత్తుత్తి పిచ్చి హెచ్చరికలు చేస్తున్నది. మరోవైపు సింధు జలాలను విడుదల చేయాలని అభ్యర్థిస్తున్నది.

భారత్‌పై యుద్ధ హెచ్చరికలు పాక్ ప్రజల్లో జాతీయ భావాలను రగిలించడానికి ఉపయోగపడుతున్నా, వాస్తవ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, వనరుల కొరత, ముఖ్యంగా నీటి సమస్యను ఎదుర్కొంటోంది. పాక్‌లోని వ్యవసాయం పూర్తిగా సింధు నదీ పరివాహక ప్రాంతంపై ఆధారపడి ఉంది. సింధు, జీలం, చెనాబ్ నదులు భారత ఉపఖండంలోని హిమాలయాల నుంచి ఉద్భవించి పాకిస్తాన్ వైపు ప్రవహిస్తాయి. 1960లో భారత్-పాక్‌ల మధ్య సింధు జలాల ఒప్పందం కుదిరింది. ఈ నదుల నీటి వినియోగానికి స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. భారత్ తూర్పు నదులైన రవి, బియాస్, సట్లెజ్‌ను వినియోగించుకోగా, పాక్‌కు పశ్చిమ నదులైన సింధు, జీలం, చెనాబ్ నీటిని వినియోగించే హక్కు లభించింది. ఈ ఒప్పందం వల్ల పాక్ వ్యవసాయం సాగదీసుకోగలిగింది. అయితే, గత కొన్నేళ్లుగా వాతావరణ మార్పులు, మంచు కరుగుదల తగ్గడం, వర్షపాతం లోపం వంటి కారణాల వల్ల ఈ నదులలో నీటి ప్రవాహం తగ్గిపోతోంది. ఇప్పటికే 15శాతం నీరు తగ్గింది. 21శాతం తగ్గుతుందని పాక్ అంచనా వేసింది. పంటలు పండకపోతే తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తే ప్రమాదం పాక్ కు పొంచి ఉంది.

ఇటీవల పాక్ ప్రభుత్వం, నీటి మేనేజ్మెంట్ సంస్థలు భారత్‌తో నీటి పంపిణీపై పునరాలోచన కోరుతూ పలు సమావేశాలు జరిపాయి. వారు భారత్ నుంచి సాంకేతిక సహాయం, సమాచారం, కొన్ని సందర్భాల్లో అదనపు నీటి విడుదలకూ అభ్యర్థించారు. ఇదే సమయంలో, వారి సైనిక నాయకత్వం మీడియా ముందు “భారత్‌తో ఏ క్షణమైనా యుద్ధానికి సిద్ధం” అనే ప్రకటనలు చేస్తోంది. ఈ రెండు విభిన్న ధోరణులు పాక్‌లోని ద్వంద్వ వైఖరిని బయటపెడుతున్నాయి.

భారత్ పక్షాన చూస్తే, సింధు జలాల ఒప్పందం ఇప్పటికీ గౌరవప్రదంగానే అమలు అవుతోంది. భారత్ తన భాగం నీటిని మాత్రమే వినియోగించి, మిగతా నీటిని ఒప్పందం ప్రకారం పాక్ వైపు వదులుతోంది. అంతర్జాతీయంగా కూడా భారత్ ఈ ఒప్పందాన్ని పాటిస్తున్న బాధ్యతాయుత దేశంగా గుర్తింపు పొందింది. కానీ పాక్ మాత్రం తరచుగా భారత్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తూ, నీటిని ఆయుధంగా వాడుతున్నట్లు ప్రచారం చేస్తోంది. ఇది వారి అంతర్గత రాజకీయ ప్రయోజనాలకు, ప్రజల దృష్టి మళ్లించడానికి చేసే ప్రయత్నంగా కనిపిస్తున్నది.

నిజానికి పాక్ ఆర్థిక దుస్థితి, అంతర్జాతీయ రుణ భారం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రజల్లో అసంతృప్తిని పెంచాయి. ఈ అసంతృప్తిని కట్టడి చేయడానికి వారి నాయకులు యుద్ధ ప్రకటనలు చేసి జాతీయవాద వాదాన్ని పెంచుతున్నారు. అయితే వ్యవసాయం, తాగునీటి అవసరాల కోసం భారత్ సహకారాన్ని కోరడం, పాక్ పరిస్థితి ఎంత బలహీనంగా ఉందో సూచిస్తోంది. యుద్ధం ద్వారా ఏ సమస్యలూ పరిష్కరించబడవు. పైగా, నీటిలాంటి ప్రాణాధార వనరులో భారత్‌పై ఆధారపడే దేశం, యుద్ధాన్ని సవాలు చేయడం వ్యూహపరంగా, రాజకీయపరంగా అతి తెలివి, అవివేకానికి నిదర్శనం.

ఈ నేపథ్యంలో, పాక్ నాయకత్వం తాత్కాలిక రాజకీయ లాభాల కోసం యుద్ధ హెచ్చరికలు చేయకుండా, ప్రజల అసలు సమస్యలపై దృష్టి పెట్టడం ఆ దేశానికి అవసరం. నీటి సంక్షోభం వాతావరణ మార్పుల ప్రభావంతో మరింత తీవ్రమవుతుంది. కాబట్టి భారత్‌తో సహకారం, నది నిర్వహణలో సాంకేతిక మార్పులు, నీటి సంరక్షణ విధానాలు, అంతర్గత మౌలిక సదుపాయాల మెరుగుదల వంటి దీర్ఘకాలిక పరిష్కారాలే వారికి ఉపయోగకరంగా ఉంటాయి.

మొత్తంగా, పాక్ ప్రస్తుత వైఖరి అంతర్జాతీయ వేదికపై ద్వంద్వ నీతిగా కనిపిస్తోంది. ఒకవైపు యుద్ధ బెదిరింపులు, మరోవైపు నీటి కోసం అభ్యర్థనలు ఈ విరుద్ధ స్వరాలు వారి రాజకీయ బలహీనత, ఆర్థిక క్షీణతను వెల్లడిస్తున్నాయి. భారత్‌కు వ్యతిరేకంగా నిరంతరంగా శత్రుత్వ ధోరణి ప్రదర్శించడం కంటే, పరస్పర సహకారంతో సమస్యలను పరిష్కరించడమొక్కటే రెండు దేశాల ప్రజలకు శాంతి, అభివృద్ధిని అందించగల మంచి మార్గం.

Latest News

అత్యధిక బ్లడ్ డోనర్ మోటివేటర్ డా. రాజేశ్వర్ రావు|INTERNATIONAL|BLOOD|DONORS

రక్తదాన సేవలకు గుర్తింపుగా గవర్నర్ సత్కారం|BLOOD DONATION|GOVERNOR హైదరాబాద్, జూన్ 14 (అడుగు న్యూస్): రక్తదానం పట్ల సమాజంలో విస్తృత ప్రచారం, చైతన్యం కలిగిస్తూ, స్వచ్ఛంద రక్త దానాన్ని విశేషంగా ప్రోత్సహిస్తూ, విశిష్ట సేవలందిస్తున్న ...

బరంతి ఇకమతు భలేగుందే!|ADUGU TRENDS

ఇల్లు కట్టుడంటే అట్లిట్ల కాదు. నెలలు, సంవత్సరాలు పడతయి. ఒక్కో కట్టడం దగ్గర ఒక్కో జాగర్త తీసుకోవాలె. లేకపోతే ఇల్లు గుల్లైతది. గట్ల ఇంటికి బరంతి నింపుతం కద. గదాంట్ల మనమైతే ఏం...

భూమి పునరుద్ధరణకే ఎల్ నినో హెచ్చరిక!|EDITORIAL

ఎల్‌నినోను కేవలం ప్రకృతి వైపరీత్యంగా మాత్రమే చూడడం సరైంది కాదు. వాతావరణ మార్పులు, అటవీ నిర్మూలనం, భూమి క్షీణత, ప్లాస్టిక్ కాలుష్యం, జలవనరుల నాశనం వంటి మానవ చర్యలు కూడా ఈ సంక్షోభాలను...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూన్ 14 నుండి జూన్ 21 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీలో కొత్త ఉత్సాహం పెరుగుతుంది. పనుల విషయంలో ముందడుగు వేయడానికి మంచి అవకాశాలు కనిపిస్తాయి. కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం...

మియా జాకీ మాయ!|ADUGU TRENDS

పండంటే మామిడి పండే! పండ్లండ్ల మధురమైన పండ్లంటే కూడా మామిడి పండ్లే!! గందుకే గా పండ్లకు గంత గిరాకీ. గీ పండ్లల్ల మస్తు గిరాకీ ఉన్న పండ్లు మియా జాకీ రకమట. గీ...

బడే భవిష్యత్తుకు పునాది?!|EDITORIAL

దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది. ఒక మంచి పాఠశాల కేవలం విద్యార్థిని మాత్రమే కాదు, కుటుంబాలని, గ్రామాలని, సమాజాన్ని మార్చగలదు. అందుకే విద్యను వ్యయంగా కాకుండా పెట్టుబడిగా చూడాలి. నీతి ఆయోగ్...

జూన్ 13, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం మాస శివరాత్రి శని త్రయోదశి తిధి బ త్రయోదశి మధ్యాహ్నం 01.55 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం కృత్తిక రాత్రి 12.17 వరకు ఉపరి రోహిణి యోగం సుకర్మ సాయంత్రం 04.30 వరకు ఉపరి ధృతి కరణం వణజి...

నచ్చత్రాల ఇల్లు!|ADUGU TRENDS

ఆకాసంల నచ్ఛత్రాలన్నీ మన ఇంటిమీదకే వత్తే ఎట్లుంటది!? గట్లనే ఓ ఇల్లు కట్టుకుంటే ఇంకెట్లుంటది!? మబ్బుల్ల తేలాడినట్లే ఉంటది కదా? ఇది కలేం కాదుల్లా? దాన్ని నిజం చేసేటట్లు ఇప్పుడు ఇండ్లు కడతుండ్రు.!...

టీఎంసీ భవితవ్యమేంటి?!|EDITORIAL

టీఎంసీలో గందరగోళానికి బీజేపీ కారణమా? బెంగాల్ లో కాంగ్రెస్‌కు పునరుజ్జీవం లభిస్తుందా? కాంగ్రెస్ లో టీఎంసీ విలీనంపై వస్తున్న ఊహాగానాలు నిజమేనా? రాజకీయాల్లో ఏ పార్టీకైనా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నంత కాలమే మనుగడ....

జూన్ 12, శుక్రవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి సాయంత్రం 04.06 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం భరణి రాత్రి 01.46 వరకు ఉపరి కృత్తిక యోగం అతిగండ రాత్రి 07.20 వరకు ఉపరి సుకర్మ కరణం తైతుల సాయంత్రం 04.06...

గీ కోతి మనుసులకే ఆదర్శం!|ADUGU TRENDS

నిజం కాకపోయినా, కోతి నుండే మనిసి వచ్చాడంటరు. కోతులకు మనుసులకు గంత పోలికన్నట్లు. గా కోతుల బుద్ధులు, శేట్టలు మనుసులకు కూడా ఉంటయి. కొందరిల బయట పడ్తయి. మరికొందరిల బయట పడయి గంతే....

నిరంతరాయ ప్రధానిగా మోదీ రికార్డు!|EDITORIAL

మోదీ, నెహ్రూ రికార్డును అధిగమించడం కేవలం ఒక గణాంక ఘట్టం మాత్రమే కాదు. ఇది భారత ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ద్వారా వరుసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చిన నాయకుడి రాజకీయ ప్రయాణానికి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News