Trending News
Friday, March 6, 2026
35.9 C
Hyderabad
Trending News

పాకిస్తాన్ ద్వంద్వ నీతి!|EDITORIAL

భారత-పాకిస్తాన్ సంబంధాలు ఉద్రిక్తతలతో కూడుకుని ఉంటాయి. ఇప్పటికే రెండు దేశాల మధ్య యుద్ధాలు కూడా జరిగాయి. పాక్ అదే పనిగా చేస్తున్న సరిహద్దు ఉల్లంఘనలు, ఉగ్రవాద ప్రోత్సాహం, ఆక్రమిత కశ్మీర్ వంటి అంశాలు దాయాదుల మధ్య సంబంధాలను పూర్తిగా దెబ్బతీశాయి. పహల్గాం సంఘటన తర్వాత ఉత్పన్నమైన యుద్ధం కారణంగా పాకిస్తాన్ బాగా దెబ్బతింది. కాళ్ళ బేరానికి వచ్చి, బతిమిలాడుకుంటే పాక్ అభ్యర్థనను మన్నించి భారత్ యుద్ధ విరమణకు ఒప్పుకుంది. చావు తప్పి కళ్ళు లొట్టబోయిన పాక్ తన దుర్బుద్ధిని వీడలేకపోతున్నది. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నది. అమెరికా అండ చూసుకుని విర్రవీగుతున్నది.
పాక్ ఉగ్రదాడుల నేపథ్యంలో పాకిస్తాన్ కు సింధు జలాలను నిలిపేస్తూ భారత్ నిర్ణయించింది. ఓ వైపు పాక్ ఆర్మీ చీఫ్ అసిఫ్ మునీర్, మాజీ మంత్రి బిలావల్ భుట్టోలు బెదిరింపులకు దిగుతున్నారు. మరోవైపు తమకు సింధూ జలాలను విడుదల చేయాలని ఆ దేశ విదేశాంగ శాఖ భారత్ ను వేడుకుంటోంది. పాక్ విదేశాంగ శాఖ భారత్ కు ఈ మేరకు ఓ అభ్యర్థనను పంపింది. సింధూ జలాల ఒప్పందాన్ని నమ్మకంగా, న్యాయ బద్ధంగా కొనసాగించాలని కోరుతున్నది.

మరోవైపు పాక్ ఆర్మీ చీఫ్ భారత్ పై నోరు పారేసుకున్నారు. అణు హెచ్చరికలు చేశారు. ‘భారత్ అనేది హై వేపై వస్తున్న మెర్సీడెస్ కారు లాంటిది. కానీ, పాక్ మాత్రం కంకరతో నిండిన ఓ డంప్ లారీ లాంటిది. ఒక వేళ కారు వచ్చి లారీని ఢీ కొంటే ఎవరికి నష్టం? ’ అని పేర్కొన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. పిరికి పంద బెదిరింపులు, సింధు నీటిని నిలిపివేస్తే యుద్ధం తప్ప మరో గత్యంతరం లేదని ఉత్తర ప్రగల్బాల ఉత్తుత్తి పిచ్చి హెచ్చరికలు చేస్తున్నది. మరోవైపు సింధు జలాలను విడుదల చేయాలని అభ్యర్థిస్తున్నది.

భారత్‌పై యుద్ధ హెచ్చరికలు పాక్ ప్రజల్లో జాతీయ భావాలను రగిలించడానికి ఉపయోగపడుతున్నా, వాస్తవ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, వనరుల కొరత, ముఖ్యంగా నీటి సమస్యను ఎదుర్కొంటోంది. పాక్‌లోని వ్యవసాయం పూర్తిగా సింధు నదీ పరివాహక ప్రాంతంపై ఆధారపడి ఉంది. సింధు, జీలం, చెనాబ్ నదులు భారత ఉపఖండంలోని హిమాలయాల నుంచి ఉద్భవించి పాకిస్తాన్ వైపు ప్రవహిస్తాయి. 1960లో భారత్-పాక్‌ల మధ్య సింధు జలాల ఒప్పందం కుదిరింది. ఈ నదుల నీటి వినియోగానికి స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. భారత్ తూర్పు నదులైన రవి, బియాస్, సట్లెజ్‌ను వినియోగించుకోగా, పాక్‌కు పశ్చిమ నదులైన సింధు, జీలం, చెనాబ్ నీటిని వినియోగించే హక్కు లభించింది. ఈ ఒప్పందం వల్ల పాక్ వ్యవసాయం సాగదీసుకోగలిగింది. అయితే, గత కొన్నేళ్లుగా వాతావరణ మార్పులు, మంచు కరుగుదల తగ్గడం, వర్షపాతం లోపం వంటి కారణాల వల్ల ఈ నదులలో నీటి ప్రవాహం తగ్గిపోతోంది. ఇప్పటికే 15శాతం నీరు తగ్గింది. 21శాతం తగ్గుతుందని పాక్ అంచనా వేసింది. పంటలు పండకపోతే తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తే ప్రమాదం పాక్ కు పొంచి ఉంది.

ఇటీవల పాక్ ప్రభుత్వం, నీటి మేనేజ్మెంట్ సంస్థలు భారత్‌తో నీటి పంపిణీపై పునరాలోచన కోరుతూ పలు సమావేశాలు జరిపాయి. వారు భారత్ నుంచి సాంకేతిక సహాయం, సమాచారం, కొన్ని సందర్భాల్లో అదనపు నీటి విడుదలకూ అభ్యర్థించారు. ఇదే సమయంలో, వారి సైనిక నాయకత్వం మీడియా ముందు “భారత్‌తో ఏ క్షణమైనా యుద్ధానికి సిద్ధం” అనే ప్రకటనలు చేస్తోంది. ఈ రెండు విభిన్న ధోరణులు పాక్‌లోని ద్వంద్వ వైఖరిని బయటపెడుతున్నాయి.

భారత్ పక్షాన చూస్తే, సింధు జలాల ఒప్పందం ఇప్పటికీ గౌరవప్రదంగానే అమలు అవుతోంది. భారత్ తన భాగం నీటిని మాత్రమే వినియోగించి, మిగతా నీటిని ఒప్పందం ప్రకారం పాక్ వైపు వదులుతోంది. అంతర్జాతీయంగా కూడా భారత్ ఈ ఒప్పందాన్ని పాటిస్తున్న బాధ్యతాయుత దేశంగా గుర్తింపు పొందింది. కానీ పాక్ మాత్రం తరచుగా భారత్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తూ, నీటిని ఆయుధంగా వాడుతున్నట్లు ప్రచారం చేస్తోంది. ఇది వారి అంతర్గత రాజకీయ ప్రయోజనాలకు, ప్రజల దృష్టి మళ్లించడానికి చేసే ప్రయత్నంగా కనిపిస్తున్నది.

నిజానికి పాక్ ఆర్థిక దుస్థితి, అంతర్జాతీయ రుణ భారం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రజల్లో అసంతృప్తిని పెంచాయి. ఈ అసంతృప్తిని కట్టడి చేయడానికి వారి నాయకులు యుద్ధ ప్రకటనలు చేసి జాతీయవాద వాదాన్ని పెంచుతున్నారు. అయితే వ్యవసాయం, తాగునీటి అవసరాల కోసం భారత్ సహకారాన్ని కోరడం, పాక్ పరిస్థితి ఎంత బలహీనంగా ఉందో సూచిస్తోంది. యుద్ధం ద్వారా ఏ సమస్యలూ పరిష్కరించబడవు. పైగా, నీటిలాంటి ప్రాణాధార వనరులో భారత్‌పై ఆధారపడే దేశం, యుద్ధాన్ని సవాలు చేయడం వ్యూహపరంగా, రాజకీయపరంగా అతి తెలివి, అవివేకానికి నిదర్శనం.

ఈ నేపథ్యంలో, పాక్ నాయకత్వం తాత్కాలిక రాజకీయ లాభాల కోసం యుద్ధ హెచ్చరికలు చేయకుండా, ప్రజల అసలు సమస్యలపై దృష్టి పెట్టడం ఆ దేశానికి అవసరం. నీటి సంక్షోభం వాతావరణ మార్పుల ప్రభావంతో మరింత తీవ్రమవుతుంది. కాబట్టి భారత్‌తో సహకారం, నది నిర్వహణలో సాంకేతిక మార్పులు, నీటి సంరక్షణ విధానాలు, అంతర్గత మౌలిక సదుపాయాల మెరుగుదల వంటి దీర్ఘకాలిక పరిష్కారాలే వారికి ఉపయోగకరంగా ఉంటాయి.

మొత్తంగా, పాక్ ప్రస్తుత వైఖరి అంతర్జాతీయ వేదికపై ద్వంద్వ నీతిగా కనిపిస్తోంది. ఒకవైపు యుద్ధ బెదిరింపులు, మరోవైపు నీటి కోసం అభ్యర్థనలు ఈ విరుద్ధ స్వరాలు వారి రాజకీయ బలహీనత, ఆర్థిక క్షీణతను వెల్లడిస్తున్నాయి. భారత్‌కు వ్యతిరేకంగా నిరంతరంగా శత్రుత్వ ధోరణి ప్రదర్శించడం కంటే, పరస్పర సహకారంతో సమస్యలను పరిష్కరించడమొక్కటే రెండు దేశాల ప్రజలకు శాంతి, అభివృద్ధిని అందించగల మంచి మార్గం.

Latest News

పురుగుల బెడదకు.. బెల్లం పానకం శిట్కా!?|ADUGU TRENDS

పంటలకు పట్టే పురుగులు రైతులకు శాపంగ మారుతానయి. ఇగ గవాటిని సంపడానికి పురుగుల మందులు కొట్టాలె. కర్సు బాగైతది. మల్ల గా మందులతోటి పురుగులు సత్తలేవు. పంటల దిగుబడొత్తలేదు. ఎరువులు, పురుగుల మందులెక్కువై...

మూసీ ప్రక్షాళనపై ముసురుకుంటున్న వివాదాలు!|EDITORIAL

అభివృద్ధి పథకాలు ప్రజావసరాలు తీర్చడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయా? అసలా పథకాలు ప్రజల కోసమే అమలవుతున్నాయా? పేదలు, అట్టడుగు వర్గాలు నివసించే ప్రాంతాల్లో చేపట్టే ప్రాజెక్టులు తరచూ నిర్వాసిత సమస్యలకు...

06-03-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి తదియ సాయంత్రం 05.20 వరకు ఉపరి చవితి నక్షత్రం హస్త ఉదయం 09.15 వరకు ఉపరి చిత్త యోగం గండ ఉదయం 07.05 వరకు ఉపరి వృద్ధి కరణం భద్ర సాయంత్రం 05.22...

ఓలి రంగుల్లెక్క మెరపకాయెల రాసులు!?|ADUGU TRENDS

మెరపకాయెను కూడ కూరగాయల్లెక్కనే పండిత్తరు. మనం తినే బువ్వకు కారం, రుసిని ఇత్తది. గిదీన్ని మన తెలంగాణ, ఏపీల్నే గదేనుల్ల.. గుంటూరు, వరంగల్ ల ఇరగమరగ పండిత్తరు. గీ మెరపకాయెల ఉండే 'క్యాప్సైసిన్'...

స్వయం సమృద్ధే ఈ సంక్షోభానికి విరుగుడు!|EDITORIAL

వరుస యుద్ధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. కరోనా మొత్తం భూమినే అతలాకుతలం చేస్తే, ఇప్పుడు మధ్యప్రాచ్యంలో యుద్ధాలు, ఉద్రిక్తతల వల్ల మరోసారి చమురు సంక్షోభం ముంచుకొచ్చింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా జోక్యం...

05-03-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి విదియ సాయంత్రం 04.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఉత్తర ఉదయం 08.11 వరకు ఉపరి హస్త యోగం శుల ఉదయం 07.49 వరకు ఉపరి గండ కరణం గరజి సాయంత్రం 04.39...

బర్నర్ల మురికిని తీసే ఇకమతు!?|ADUGU TRENDS

మన ఆడోల్లు ఎంత ఇకమతులు పడ్డా అరవై పది దినాలకు గా గ్యాస్ స్టౌ బర్నర్లు మురికి పడతనే ఉంటయి. గ వాటిని కడగాల్నంటే మస్తు తిప్పలైతది. అల్కగ గా బర్నర్ల మురికిని...

హార్ముజ్ జలసంధి ఆర్థిక సంక్షోభంలో ప్రపంచం!|EDITORIAL

ఇరాన్–అమెరికా–ఇజ్రాయిల్ మధ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అనిశ్చితి అంచులపై నిలిపింది. ఇది కేవలం యుద్ధ దేశాలకే పరిమితం కాదు. ప్రపంచ ఇంధన భద్రతకు కీలక నాడి హార్ముజ్ జలసంధి చుట్టూ ముప్పు...

04-03-2026 బుధవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి బ.పాడ్యమి సాయంత్రం 04.29 వరకు ఉపరి విదియ నక్షత్రం పుబ్బ ఉదయం 07.30 వరకు ఉపరి ఉత్తర యోగం ధృతి ఉదయం 08.58 వరకు ఉపరి శుల కరణం కౌలవ సాయంత్రం 04.29...

వచన సాహిత్యం ప్రజల సాహిత్యం!|ESSAY

ಓಂ శ్రీ గురు బసవ లింగాయ నమః! శరణు శరణార్థి! బీదర్ పట్టణం బసవగిరిలోని బసవ సేవా ప్రతిష్ఠాన వారి ఆధ్వర్యంలో 2026 జనవరి 30, 31 మరియు ఫిబ్రవరి 1 తేదీలలో...

దుర్గంథాన్ని పోగొట్టే సుగంథం!?|ADUGU TRENDS

ఎన్కటేమో గనీ, ఇగిప్పుడైతే నీల్లకు ప్లాటిక్, స్టీలు, రాగి సీసాలే వాడుతాండ్రు. ప్రిజ్జులనే కాదుల్లా, యేడికిపోయినా, గవాటినే తీస్కపొతాండ్రు, లేకపోతే కొనుక్కుని తాగుతాండ్రు. గనీ గవి వాడంగ, వాడంగ... దుర్వాసన వేస్తయి. దుర్గంథం...

విపత్కర ఇరాన్ కు వివేకంతోనే విజయం!|EDITORIAL

అమెరికా–ఇరాన్ విభేదాలు, ఇజ్రాయెల్ భద్రతా ఆందోళనలు, ప్రాంతీయ అభద్రతా భావ రాజకీయాలు ప్రపంచాన్ని అప్రమత్తం చేస్తున్నాయి. యుద్ధ వాతావరణం సృష్టించడం సులువు కానీ, దాని ఫలితాలను భరించడం మాత్రం దేశాలకు, ప్రజలకు మాత్రం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News