Trending News
Friday, March 6, 2026
35.9 C
Hyderabad
Trending News

కలమెత్తిన ‘అడుగు’..! గళమెత్తిన ‘బడుగు’!!

అడుగు ఎఫెక్ట్

వరంగల్ మిల్లు సమస్యను శాసనమండలిలో ప్రస్తావించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ

అజంజాహీ మిల్లు కార్మిక భవన స్థల కబ్జాని కట్టడి చేయాలి

స్థల పరిరక్షణకై ప్రభుత్వానికి బస్వరాజు సారయ్య విజ్నప్తి

రాజ్యసభ సభ్యుడిగా డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ ఎంపీ నిధులు

తప్పుడు దస్తావేజులతో ఇంటి, వ్యవసాయ భూమిగా రిజిస్ట్రేషన్లు!

2016లోనే వ్యవసాయ భూమిగా మ్యుటేషన్!?

గత ప్రభుత్వ హయాంలోనే దర్జాగా బడా వ్యాపారి కబ్జా!

మాజీ ఎమ్మెల్యేతో రెవిన్యూ, మున్సిపల్ అధికారులు కుమ్మక్కు!

ఇప్పటి హన్మకొండ కలెక్టరే అప్పటి కమిషనర్ గా అనుమతుల జిమ్మిక్కు!?

మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి స్వయంగా షాపింగ్ కాంప్లెక్స్ కి శంకుస్థాపన!

కార్మిక లోకం ప్రభుత్వ జోక్యాన్ని అర్ధిస్తోంది!

సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తారని ఎదురుచూస్తోంది!

‘అడుగు’ కలమెత్తితే, ‘బడుగు’ గళమెత్తాడు. కార్మికుల కుటుంబాలు కదం తొక్కితే, ప్రజా సంఘాలు పదం కలిపాయి. ప్రతిపక్షాలు అఖిలపక్షమై ఏకపక్షమయ్యాయి. స్వపక్షంలోనే విపక్షం నిరసన స్వరమెత్తింది. శాసన మండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య గళమెత్తాడు. కాసం మోసానికి కార్మికులు కకావికళమయ్యారు. గరళమైన అజంజాహీ మిల్లు కార్మిక భవన స్థల కబ్జాపై ఉద్యమ గళాలన్నీ యుగళమై పిడికిలెత్తాయి. దర్జాగా కబ్జాకు గురైన అజంజాహీ మిల్లు కార్మిక భవన స్థలం ప్రజా ఉమ్మడి ఉద్యమానికి వేదికైంది. కోట్ల రూపాయల విలువైన భూమి పరిరక్షణ కోసం లక్ష సంతకాల సేకరణ లక్ష్యం ఇంకా కొనసాగుతోంది. తమ ఆర్తనాదం అరణ్యరోదనై, సకల కార్మిక లోకం ప్రభుత్వ జోక్యాన్ని అర్ధిస్తోంది. సబ్బండ వర్గాల సమాజం ఆ స్థల పరిరక్షణ కోసం నిరీక్షిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డిగారే స్వయంగా స్పందిస్తారని ఎదురుచూస్తోంది! మరి సీఎం గారు స్పందిస్తారా? కార్మిక లోక నిరీక్షణ ఫలిస్తుందా?

చారిత్రక వరంగల్ అజంజాహీ మిల్లు కార్మిక భవన స్థల వివాదం అసెంబ్లీ దాకా వెళ్ళింది. అందరి దృష్టి ఇప్పుడు కార్మిక భవన స్థల కబ్జాపై మళ్ళింది. మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యే స్వయంగా గళమెత్తారు. తెలంగాణ అసెంబ్లీ 3వ సమావేశం, 5వ సెషన్, 3వ రోజు శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సారయ్య వరంగల్ అజంజాహీ మిల్లు కార్మిక భవన స్థల కబ్జా వ్యవహారాన్ని లేవనెత్తారు. అధ్యక్షా అంటూ ఆయన చారిత్రక మిల్లు సమస్య మొత్తాన్ని సూక్ష్మంలో మోక్షంగా వివరించారు. మండలి చైర్మన్ ద్వారా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు.

అధ్యక్షా!
1934లోనే వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలో అజం జాహీ మిల్స్ ప్రారంభమైంది. ఈ మిల్లుకు కు 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మొదటి కుమారుడు ప్రిన్స్ అజామ్ జాహ్ పేరు పెట్టారు. 200 ఎకరాలకు పైగా భూములతో ఏర్పాటైన ఈ మిల్లు దేశంలో అతిపెద్ద వస్త్ర పరిశ్రమలలో ఒకటి. స్వాతంత్య్రానికి ముందు, ఈ మిల్లు 10 వేల మందికి పైగా ఉపాధిని కల్పించింది. ఈ మిల్లు సైరన్ వరంగల్, చుట్టుపక్కల గ్రామాల నివాసితులకు ఉదయం వేక్-అప్ కాల్‌గా వచ్చేది. 1974లో బెంగళూరుకు చెందిన నేషనల్ టెక్స్‌టైల్ కార్పోరేషన్ ఈ కంపెనీని స్వాధీనం చేసుకుంది.1980 చివరి వరకు ఆరు దశాబ్దాలకు పైగా పనిచేసిన ఈ మిల్లును, 1990ల ప్రారంభంలో మూసివేశారు. 2008లో కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ (కుడా)కి ఈ భూమి ఇవ్వగా, దాన్ని ప్లాట్లుగా తయారుచేసి విక్రయించారు. మిల్లులో పనిచేసి రిటైర్డ్ ఉద్యోగులకు ఒక్కొక్కరికి 200 గజాల చొప్పున స్థలాలు కేటాయించారు. ప్రస్తుతం 30 ఎకరాలు మాత్రమే మిగిలింది. వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 1984నాటి పాపర్టీ ట్యాక్స్ అసెస్ మెంట్ (ఆస్తి పన్ను విధింపు) రికార్డుల సర్టిఫై కాపీని తేదీ: 06-01-2025న అధికారికంగా తీసుకోవడం జరిగింది. శిథిలావస్థలో ఉన్న అప్పటి అసెస్మెంట్ బిల్లును పరిశీలించగా, 1984లో అప్పటి వరంగల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ పాపర్టీ ట్యాక్స్ అసెస్ మెంట్ (ఆస్తి పన్ను విధింపు) ప్రకారం ఎజె మిల్స్ స్టాఫ్ బిల్డింగ్ పేరున రకరకాల పద్దుల సవరింపులతో రూ.135.55 పై.ల పన్ను విధించినట్లుగా ఉంది. మొత్తానికి 1984 నాటి రికార్డుల ప్రకారమే అంటే 41 ఏళ్ళ క్రితమే అది అప్పటి వరంగల్ మున్సిపాలిటీలో ఒక ఇంటి నెంబర్ కలిగి ఉండటమేగాక, ఆ భవనానికి ఆస్తి పన్ను కింద పన్ను కట్టినట్లుగా కూడా రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. 80 ఏళ్ళుగా కార్మికుల పోరాటాలకు వేదికగా నిల్చిన కార్మిక భవనానికి, మున్సిపాలిటీ ఇంటి నెంబర్ కలిగివున్నప్పటికీ 2016లో అప్పటి వరంగల్ ఎమ్మార్వో వ్యవసాయ భూమిగా మ్యుటేషన్ చేశారు. వరంగల్ అజం జాహి మిల్లుతో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్ కు అవినాభావ సంబంధం ఉంది. కార్మికులు వీఆర్ఎస్ తీసుకొని విశ్రాంత ఉద్యోగులుగా జీవితాన్ని గడుపుతున్న క్రమంలో వారికి అజంజాహి మిల్లు భూముల్లోనే స్థలాలు ఇప్పించడంలో బండ ప్రకాష్ కృషి చేశారు. అదే అనుబంధంతో ఎంపీగా రూ.20 లక్షలు నిధులు ఇచ్చారు. దఫా దఫాలుగా నిధులు ఇస్తానని ముందుకు వచ్చారు. ప్రొసీడింగ్ నెంబర్ 26/ఎంపీ లాడ్స్/బిపి/వరంగల్ అర్బన్/2018-19, తేది:12/02/2020 తో అప్పటి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ప్రోసీడింగ్ ఇచ్చారు. కానీ, కార్మిక భవనాన్ని కట్టనివ్వలేదు.

అధ్యక్షా!
తప్పుడు దస్తావేజులు సృష్టించి, వ్యవసాయ భూమిగా, ఇంటి స్థలంగా రెండు వేర్వేరు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. కార్మిక భవనం ఉన్నచోట బహుళ అంతస్తుల వ్యాపార భవనానికి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అప్పటి కమిషనర్ అనుమతులు ఇచ్చారు. దీనికి అప్పటి స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేషన్ అధికారులు రెవెన్యూ అధికారులు కుమ్మక్కయ్యారు. మంత్రి కొండ సురేఖ భర్త కొండా మురళి స్వయంగా ఆ బహుళ అంతస్తుల భవనానికి శంకుస్థాపన చేశారు. తర్వాత ఆ విషయం తనకు తెలియదని బుకాయించారు. రాజకీయ నాయకుల సలహాతోనే సదర్ వ్యాపారి కోర్టుకు వెళ్లారు. మిల్లు కార్మికుల కుటుంబాల వారసులు, ప్రజా సంఘాలు, అఖిలపక్ష నాయకులు అంతా కలిసికట్టుగా అజం జాహి మిల్లు కార్మిక భవన పరిరక్షణ కోసం ఉద్యమించారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. అజంజాహీ మిల్లు కార్మిక భవన స్థలాన్ని పరిరక్షించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. కార్మిక లోకం ప్రభుత్వ జోక్యాన్ని అర్ధిస్తోంది! సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తారని ఎదురుచూస్తోంది!

https://youtu.be/Lre0j7leeqw?feature=shared

Latest News

పురుగుల బెడదకు.. బెల్లం పానకం శిట్కా!?|ADUGU TRENDS

పంటలకు పట్టే పురుగులు రైతులకు శాపంగ మారుతానయి. ఇగ గవాటిని సంపడానికి పురుగుల మందులు కొట్టాలె. కర్సు బాగైతది. మల్ల గా మందులతోటి పురుగులు సత్తలేవు. పంటల దిగుబడొత్తలేదు. ఎరువులు, పురుగుల మందులెక్కువై...

మూసీ ప్రక్షాళనపై ముసురుకుంటున్న వివాదాలు!|EDITORIAL

అభివృద్ధి పథకాలు ప్రజావసరాలు తీర్చడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయా? అసలా పథకాలు ప్రజల కోసమే అమలవుతున్నాయా? పేదలు, అట్టడుగు వర్గాలు నివసించే ప్రాంతాల్లో చేపట్టే ప్రాజెక్టులు తరచూ నిర్వాసిత సమస్యలకు...

06-03-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి తదియ సాయంత్రం 05.20 వరకు ఉపరి చవితి నక్షత్రం హస్త ఉదయం 09.15 వరకు ఉపరి చిత్త యోగం గండ ఉదయం 07.05 వరకు ఉపరి వృద్ధి కరణం భద్ర సాయంత్రం 05.22...

ఓలి రంగుల్లెక్క మెరపకాయెల రాసులు!?|ADUGU TRENDS

మెరపకాయెను కూడ కూరగాయల్లెక్కనే పండిత్తరు. మనం తినే బువ్వకు కారం, రుసిని ఇత్తది. గిదీన్ని మన తెలంగాణ, ఏపీల్నే గదేనుల్ల.. గుంటూరు, వరంగల్ ల ఇరగమరగ పండిత్తరు. గీ మెరపకాయెల ఉండే 'క్యాప్సైసిన్'...

స్వయం సమృద్ధే ఈ సంక్షోభానికి విరుగుడు!|EDITORIAL

వరుస యుద్ధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. కరోనా మొత్తం భూమినే అతలాకుతలం చేస్తే, ఇప్పుడు మధ్యప్రాచ్యంలో యుద్ధాలు, ఉద్రిక్తతల వల్ల మరోసారి చమురు సంక్షోభం ముంచుకొచ్చింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా జోక్యం...

05-03-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి విదియ సాయంత్రం 04.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఉత్తర ఉదయం 08.11 వరకు ఉపరి హస్త యోగం శుల ఉదయం 07.49 వరకు ఉపరి గండ కరణం గరజి సాయంత్రం 04.39...

బర్నర్ల మురికిని తీసే ఇకమతు!?|ADUGU TRENDS

మన ఆడోల్లు ఎంత ఇకమతులు పడ్డా అరవై పది దినాలకు గా గ్యాస్ స్టౌ బర్నర్లు మురికి పడతనే ఉంటయి. గ వాటిని కడగాల్నంటే మస్తు తిప్పలైతది. అల్కగ గా బర్నర్ల మురికిని...

హార్ముజ్ జలసంధి ఆర్థిక సంక్షోభంలో ప్రపంచం!|EDITORIAL

ఇరాన్–అమెరికా–ఇజ్రాయిల్ మధ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అనిశ్చితి అంచులపై నిలిపింది. ఇది కేవలం యుద్ధ దేశాలకే పరిమితం కాదు. ప్రపంచ ఇంధన భద్రతకు కీలక నాడి హార్ముజ్ జలసంధి చుట్టూ ముప్పు...

04-03-2026 బుధవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి బ.పాడ్యమి సాయంత్రం 04.29 వరకు ఉపరి విదియ నక్షత్రం పుబ్బ ఉదయం 07.30 వరకు ఉపరి ఉత్తర యోగం ధృతి ఉదయం 08.58 వరకు ఉపరి శుల కరణం కౌలవ సాయంత్రం 04.29...

వచన సాహిత్యం ప్రజల సాహిత్యం!|ESSAY

ಓಂ శ్రీ గురు బసవ లింగాయ నమః! శరణు శరణార్థి! బీదర్ పట్టణం బసవగిరిలోని బసవ సేవా ప్రతిష్ఠాన వారి ఆధ్వర్యంలో 2026 జనవరి 30, 31 మరియు ఫిబ్రవరి 1 తేదీలలో...

దుర్గంథాన్ని పోగొట్టే సుగంథం!?|ADUGU TRENDS

ఎన్కటేమో గనీ, ఇగిప్పుడైతే నీల్లకు ప్లాటిక్, స్టీలు, రాగి సీసాలే వాడుతాండ్రు. ప్రిజ్జులనే కాదుల్లా, యేడికిపోయినా, గవాటినే తీస్కపొతాండ్రు, లేకపోతే కొనుక్కుని తాగుతాండ్రు. గనీ గవి వాడంగ, వాడంగ... దుర్వాసన వేస్తయి. దుర్గంథం...

విపత్కర ఇరాన్ కు వివేకంతోనే విజయం!|EDITORIAL

అమెరికా–ఇరాన్ విభేదాలు, ఇజ్రాయెల్ భద్రతా ఆందోళనలు, ప్రాంతీయ అభద్రతా భావ రాజకీయాలు ప్రపంచాన్ని అప్రమత్తం చేస్తున్నాయి. యుద్ధ వాతావరణం సృష్టించడం సులువు కానీ, దాని ఫలితాలను భరించడం మాత్రం దేశాలకు, ప్రజలకు మాత్రం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News